-
ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
తొర్రూరు: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, డిగ్రీ కళాశాలలోని పోలింగ్ బూత్లను ఎస్పీ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. కేంద్ర బలగాలతో మార్చ్ఫాస్ట్ నిర్వహించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా నగదు, మద్యం, కానుకల పంపిణీపై నిఘా ఉంచామన్నారు. పాత నేరస్తులు, రౌడీషీట్ ఉన్నవారిని బైండోవర్ చేశామన్నారు. సాధారణ పోలింగ్ కేంద్రంలో ఇద్దరు, సమస్యాత్మక కేంద్రంలో నలుగురు, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఆరుగురు పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో సీఐ సంజీవ, ఎస్సైలు జగదీశ్, పిల్లల రాజు, సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ కురవి: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలతో పాటు రికార్డులను పరిశీలించారు. ఎస్సై, సిబ్బందితో మాట్లాడారు. స్టేషన్కు వచ్చిన వారితో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. ప్రశాంత పోలింగ్ నిర్వహణకు చర్యలు పెద్దవంగర: ప్రశాంత్ పోలింగ్ నిర్వహణకు చర్యలు తీసుకుంటున్న ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలి పారు. శుక్రవారం మండల కేంద్రంలోని పో లీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
మౌలిక వసతులు కల్పించాలి
మరిపెడ/మరిపెడ రూరల్: ప్రతి పోలింగ్ బూత్లో ఓటర్ల కోసం మౌలిక వసతులు కల్పించాలని కేంద్ర ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రచిత్రాజ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం మరిపెడ మండలం కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో పర్యటించి పోలింగ్ బూత్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని పోలింగ్ బూత్ల్లో కనీస సదుపాయాలు కల్పించి ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తొర్రూరు ఆర్డీఓ నర్సింహారావు, మరిపెడ తహసీల్దార్ సైదులు, ఆర్ఐ నంద, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికలకు సహకరించాలి దంతాలపల్లి: లోక్సభ ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలని జనరల్ అబ్జర్వర్ రచిత్రాజ్ అన్నారు. మండల కేంద్రంతో పాటు మండలంలోని దాట్ల, బీరిశెట్టిగూడెం, పెద్దముప్పారం గ్రామాల్లో శ్రువారం ఎన్నికల బూత్లను పరిశీలించారు. ఎన్నికల ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. ఎన్నికల పోలింగ్పై అవగాహన కలిపించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.కార్యక్రమంలో తొర్రూరు ఆర్డ్డీఓ నర్సింహారావు, డీఎస్పీ సురేష్, తహసీల్దార్ తెల్ల శ్రీనువాస్రావు, సీఐ సంజీవ, ఎస్సై కరుణాకర్, వివిధ గ్రామాల పంచాయతీ కార్యాదర్శులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రచిత్ రాజ్ -
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి
ములుగు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వంద శాతం ప్రసవాలు జరిగేలా చూడాలని అడిషనల్ కలెక్టర్(స్థానిక సంస్థలు) శ్రీజ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రి, వెంకటాపురం(కె) కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యాధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీనెల పని తీరును, గర్భిణులు, బాలింతలకు ఇచ్చే సేవలను మెరుగుపరచాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించకూడదన్నారు. క్లిష్టతరమైన గర్భిణుల జాబితా తయారు చేసుకుని వారి పట్ల సానుకూలంగా మెదలాలని, పక్కా ప్రణాళిక రూపొందించుకొని రవాణా సౌకర్యాల ఏర్పాట్లను ముందస్తుగా సిద్ధం చేసుకోవాలన్నారు. ఏఎన్ఎంలు, ఆశకార్యకర్తలు సమన్వయంతో మెదలాలన్నారు. ప్రతీ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ప్రసవానికి చేరువలో ఉన్నవారి వివరాలను ప్రదర్శించాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేయాలని, మాతా శిశు సంరక్షణపై పర్యవేక్షణ చేయాలన్నారు. క్షయ రహిత సమాజానికి కృషి చేయాలి క్షయ రహిత సమాజాన్ని నిర్మించేందుకు వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని అడిషనల్ కలెక్టర్ శ్రీజ అన్నారు. కలెక్టరేట్లో క్షయవ్యాధిపై సమీక్ష చేశారు. తెలంగాణ డయాగ్రస్టిక్ హబ్ల ద్వారా రోగ నిర్ధారణ టెస్టులు చేపించాలన్నారు. వెంకటాపురం(కె) ఆస్పత్రి సమస్యలపై ఆరా తీశారు. ఏటూరునాగారం ఆస్పత్రిలో దంత, సీ్త్ర వైద్యం, పల్మనాలజీ, పిడియాట్రిక్ట్, ఫిజియోథెరఫీ, అనస్తీషియా వైద్య నిపుణుల సేవలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. ప్రతీ రివ్యూ మీటింగ్కు వైద్యులు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య, ములుగు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్, ఏటూరునాగారం సూపరింటెండెంట్ సురేష్, తదితరులు పాల్గొన్నారు. ఏఎన్ఎంలు, ఆశలు సమన్వయంతో మెలగాలి అడిషనల్ కలెక్టర్ శ్రీజ -
ఇసుక క్వారీల్లో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం
మంగపేట: ఏజెన్సీ ప్రాంతం మంగపేట మండలంలోని ఇసుక క్వారీల్లో రైజింగ్ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సమాచార హక్కు చట్టం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్ వాగబోయిన సాంబశివరావు అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ మండలంలోని గోదావరి ఇసుక క్వారీలకు అనుమతి పొందిన ఆదివాసీ గిరిజన సొసైటీలను చేజిక్కించుకుని బినామీలుగా ఇసుక క్వారీలు నిర్వహిస్తున్న రైజింగ్ కాంట్రాక్టర్లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నారన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ఐటీడీఏ పీఓ స్పందించి కూలీలు, ట్రాక్టర్లతో కాకుండా యంత్రాలతో ఇసుకను తరలించిన రైజింగ్ కాంట్రాక్టర్లపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమ మద్యం స్వాధీనం ఏటూరునాగారం: లోక్సభ ఎన్నికల్లో భాగంగా గుడుంబా, అక్రమ మద్యం నివారించేందుకు తనిఖీలు చేపట్టినట్లు ఎకై ్సజ్ సీఐ రామకృష్ణ తెలిపారు. శుక్రవారం మంగపేట మండలం చుంచుపల్లి, మొట్లగూడెం, శనిగకుంట, నర్సింహసాగర్ గ్రామాల్లో ఎకై ్సజ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారి ఇళ్ల నుంచి 20 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకొని వాసం కృష్ణ, డేరంగుల పద్మ, అన్నాల వెంకన్న, దాట్ల నర్సింగరావుపై కేసు నమోదు చేశామన్నారు. స్వాధీనం చేసుకున్న మద్యంను ఎకై ్సజ్ కార్యాలయానికి తరలించినట్లు సీఐ తెలిపారు. తనిఖీల్లో నవీన్, నాగరాజు, వీరన్న, శ్రీనివాస్, ప్రణవ్, సిబ్బంది ఉన్నారు. రైస్ మిల్ జప్తు ములుగు: జిల్లా కేంద్రంలో జీవంతరావుపల్లికి వెళ్లే మార్గంలోని సాయి సహస్ర రైస్ టెక్ మిల్లును శుక్రవారం సివిల్ సప్లయీస్ అధి కారులు జప్తు చేశారు. 2019–20 సంవత్సరానికి గానూ రూ.12 కోట్ల విలువ గల బియ్యాన్ని ప్రభుత్వానికి అందించాల్సిన ఉండగా నాలుగు సంవత్సరాలుగా స్వలాభం కోసం వ్యాపారం చేసుకుంటూ ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఎన్ని సార్లు నోటీసులు ఇ చ్చినా స్పందించకుండా దిక్కరిస్తున్న కారణంగా అధికారులు మిల్లుకు వెళ్లి స్టాక్లో ఉన్న బియ్యం, ధాన్యంను జప్తు చేశారు. రైతులు సా యి సహస్ర మిల్లుకు ధాన్యం అమ్మి మోసపోకూడదని అధికారులు రైతులకు సూచించారు. సర్టిఫికెట్ల మంజూరులో అధికారుల నిర్లక్ష్యం ములుగు రూరల్: జనన ధ్రువీకరణ పత్రాల మంజూరులో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని భారత ప్రజా తంత్ర యువజన సమాఖ్య సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఏఓకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్ మాట్లాడుతూ పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రం లేకపోవడంతో ఉన్నత చదువుల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. పుట్టినప్పుడు ఆస్పత్రి సిబ్బంది ఆన్లైన్ చేయకపోవడంతో ప్రస్తుతం వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. బర్త్ సర్టిఫికెట్ కోసం ప్రభుత్వ ఉద్యోగుల వాగ్మూలంతో పాటు వివిధ సర్టిఫికెట్స్ జత చేసి తహసీల్దార్ కార్యాలయంలో అందజేస్తే సంబంధిత అధికారులు నెలల తరబడి తిప్పుకుంటున్నారన్నారు. ఉన్నతాధికారులు స్పందించి బాధిత కుటుంబాలకు జనన ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొడపాక చంటి, రజీనికాంత్, కన్నయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు. రామచిలుకకు వడదెబ్బ! భూపాలపల్లి రూరల్: పట్టణంలో కారల్ మార్క్స్ కాలనీలో శుక్రవారం మధ్యాహ్నం ఎండవేడిమిని తట్టుకోలేక ఓ రామచిలుక రోడ్డుపై పడిపోయింది. గమనించిన స్థానికులు రామచిలుకను చేరదీసి, నీటిని తాగించారు. కాసేపు చల్లటి వాతావరణంలో ఉండేలా చూశారు. దీంతో కోలుకున్న రామచిలుక తోటిరామచిలుకల చెంతకు రెట్టించిన ఉత్సాహంతో ఎగిరిపోయింది. -
హోం ఓటింగ్ షురూ
ములుగు/ఏటూరునాగారం: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటు నమోదు ప్రక్రియను ప్రారంభించనట్లు జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు. ములుగు నియోజకవర్గంలో ఫారం 12 డి ద్వారా 85 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు ఓటర్లు మొత్తం 78 మంది పోస్టల్ బ్యాలెట్ మంజూరు చేయగా శుక్రవారం 44 మంది ఓటర్లు ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ప్రక్రియ 8వ తేదీ వరకు నిర్వహించనున్నారు. కాగా మే 13న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఉన్న ఓటర్లకు పూర్తి స్థాయిలో పోల్ చిటీలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు జిల్లాలోని బీఎల్ఓలు ఎండను సైతం లెక్కచేయకుండా పోల్ చిటీలను పంపిణీ చేస్తున్నారు. పోల్ చిటీలో పోలింగ్ స్టేషన్ అడ్రస్, వరుస సంఖ్యతోపాటు రూట్ మ్యాప్ కూడా పొందుపర్చారు. అలాగే నియోజకవర్గంలో 9 మండలాల్లో 307 పోలింగ్ స్టేషన్లో 2,33,191 మంది ఓటర్లు ఉన్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. అందులో ములుగు జిల్లా కేంద్రంలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రత్యేకంగా ఒక మహిళా పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. దీనిలో కేవలం మహిళలు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. తొలిరోజు 44 మంది సద్వినియోగం జిల్లాలో 78 మంది వృద్ధులు, దివ్యాంగులు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement