-
ఆరోగ్యమస్తు
జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష వివరాలు ● జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు – 480 ● పరీక్షలు చేయించుకున్న రోగులు – 1.15,122 ● వివిధ శస్త్ర చికిత్సలకు రిఫర్ చేసిన రోగుల సంఖ్య – 563 ● కంటి వెలుగు ప్రోగ్రామ్లో కళ్లజోళ్ల పంపిణీ – 41,411 ● క్యాటరాక్ట్ శస్త్ర చికిత్సలు – 2,017 ● సురక్ష వైద్య శిబిరాల్లో స్క్రీనింగ్ చేసిన కంటి రోగులు – 9,380 ● ఎన్సీడీ సర్వే ద్వారా హైపర్ టెన్షన్ రోగులు – 1,63,889 ● డయాబిటిస్ (సుగర్) రోగులు – 1,07,053 ● డయాబిటిస్, హైపర్ టెన్షన్ రోగులు – 70,491 ఫ్యామిలీ డాక్టర్ ద్వారా... వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ – 452 వైద్యం పొందిన గర్భిణులు – 11,738 బాలింతలు – 2,061 రక్తహీనత ఉన్న గర్భిణులు – 263●● పేదల వైద్యానికి పెద్ద పీట ● ఆరోగ్యశ్రీకి తోడు మరెన్నో పథకాల అమలు ● సుస్తీ చేస్తే అందుబాటులో ఫ్యామిలీ డాక్టర్ ● రోగమొస్తే చేతిలో రూ.25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ● జగనన్న ఆరోగ్య సురక్షతో అందరికీ వైద్య పరీక్షలు ● నిర్మాణంలో ప్రభుత్వ వైద్య కళాశాల ● బోధనా ఆస్పత్రిగా మారనున్న అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి అమలాపురం టౌన్: పేద ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పథకాలు ప్రవేశ పెట్టి, చిత్తశుద్ధితో అమలు చేయడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో మరిన్ని రోగాలను చేర్చి, చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని పెంచి రోగమొస్తే ప్రభుత్వం అంగా ఉందనే ధైర్యం కల్పించారని చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ, జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ఇలా పలు పథకాలు ప్రజల ఆరోగ్యానికి అండగా నిలుస్తున్నాయి. దీనికితోడు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి దీర్ఘకాల రోగులకు సాయం అందిస్తున్నారు. వైద్య ఖర్చులు ఎంతైనా చెల్లిస్తున్నారు. ఇది జిల్లాలోని ఎందరికో ఆరోగ్య అభయాన్ని ఇచ్చింది. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే రూ.25 లక్షలు చేతిలో ఉన్నట్టే.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పేదల ఆరోగ్య పెన్నిధి ఆరోగ్యశ్రీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మరింతగా మెరుగులు దిద్దింది. ఈ పథకంలో ఇప్పటికే ఉన్న 1,059 వైద్య సేవలను (రోగాలను) 3,257కి ఒకేసారి పెంచింది. ముఖ్యంగా ఎవరైనా రోగి ఆరోగ్యశ్రీ ద్వారా నెట్వర్క్ ఆస్పత్రికి వెళితే రూ.5 లక్షల వరకూ వైద్య ఖర్చుల పరిమితి ఉండేది. అయితే ఇప్పుడు ఆ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.25 లక్షలకు పెంచింది. అంటే ఆరోగ్యశ్రీ కార్డు చేతిలో ఉంటే రూ.25 లక్షలతో చేతిలో ఉన్న ఏటీఎం కార్డుతో సమానం. ఆరోగ్యశ్రీ పథకం కొత్త ఫీచర్లతో జిల్లాలో 5,32,517 అర్హులకు స్మార్ట్కార్డుల పంపిణీ జరిగింది. జిల్లాలో ఉన్న 18 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల ద్వారా గడచిన అయిదేళ్లలో 2.40 లక్షల మంది రోగులకు రూ.623 కోట్లకు పైగా ఈ పథకం కింద ప్రభుత్వం ఖర్చు చేసింది. త్వరలో అందుబాటులోకి ప్రభుత్వ వైద్య కళాశాల ఇంతకాలం ప్రైవేటు వైద్య కళాశాల, బోధనా ఆస్పత్రిపై ఆధారపడ్డ జిల్లా పేద ప్రజానీకానికి త్వరలోనే అమలాపురం సమీపంలో ప్రభుత్వం నిర్మిస్తున్న వైద్య కళాశాల అందుబాటులోకి రానుంది. 54 ఎకరాల విస్తీర్ణంలో రూ.450 కోట్లతో అమలాపురం రూరల్ మండలం కామనగరువు, సమనస గ్రామాల సరిహద్దుల్లో నిర్మితమవుతున్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులు దాదాపు 60 శాతం పూర్తయ్యాయి. బోధనా ఆస్పత్రిగా రూపాంతరం చెందుతున్న ఏరియా ఆస్పత్రి అమలాపురంలో కోనసీమ పేద ప్రజల పెద్దాసుపత్రిగా సేవలు అందిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి... ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా బోధనా ఆస్పత్రి కానుంది. 650 పడకల ఆస్పత్రిగా మారబోతోంది. ఇప్పటికే నాడు–నేడు పథకం కింద రూ.5.70 కోట్లతో ఏరియా ఆస్పత్రి భవనాన్ని, అన్ని వైద్య విభాగాలను ఆధునీకరించారు. ఈ సంవత్సరాంతానికి వైద్య కళాశాల, బోధనా ఆస్పత్రి జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రాణభిక్ష పెట్టిన వైనం దీర్ఘకాలిక రోగులు, వారి కుటుంబీకులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందుతున్న సాయం బాధితులకు ప్రాణభిక్ష పెడుతోంది. బాధితుల ఆరోగ్య సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళితే వెంటనే స్పందించి వారి వైద్యానికయ్యే ఖర్చు ఎంతో మొత్తమైనా సరే చెల్లిస్తూ వారిలో ధైర్యం నింపుతోంది. సీఎం సహాయ నిధి ఎందరో రోగులకు ఆరోగ్య ఆభయాన్ని ఇచ్చింది. అల్లవరం మండలం నక్కా రామేశ్వరానికి చెందిన చిన్నారి హనీ అరుదైన గాకర్స్ వ్యాధి బారిన పడినప్పుడు ఆ చిన్నారి వైద్యానికి ప్రభుత్వం రూ.కోటి కేటాయించింది. అతి ఖరీదైన ఇంజెక్షన్లు చేయించి హనీకి ప్రాణ భిక్ష పెట్టింది. తమ బిడ్డకు ప్రాణం పోసింది ప్రభుత్వమేనని తల్లిదండ్రులు కొప్పాడి రాంబాబు, నాగలక్ష్మి కృతజ్ఞతాపూర్వకంగా అందరికీ చెబుతున్నారు. నా బిడ్డను బతికించింది ప్రభుత్వమే అరుదైన వ్యాధితో బాధ పడుతున్న నా బిడ్డ హనీ నేడు బతికి ఉందంటే అది రాష్ట్ర ప్రభుత్వంపుణ్యమే. నా భర్త, కుమార్తె హనీ ప్రభుత్వం దృష్టికి మా బిడ్డ బాధ తెలియజేయడం వల్లే వైద్యానికి రూ.కోటి మంజూరైంది. ఈ రోజు మా పాప.. ప్రభుత్వం అందిస్తున్న వైద్యంతోనే ఆరోగ్యంగా, చలాకీగా తిరుగుతోంది. రూ.లక్షల్లో అయ్యే వైద్య ఖర్చులు భరించడం మా పేద కుటుంబం తరం కాదు. అందుకే మా కుటుంబ పాలిట ఈ ప్రభుత్వం ఆపద్బాంధవి అయింది. అంతేకాదు మా బిడ్డలకు కార్పొరేట్ స్థాయి విద్యను, నెలకు రూ.10 వేలు పింఛన్ ప్రభుత్వం అందిస్తోంది. – కొప్పాడి నాగలక్ష్మి, హనీ తల్లి, నక్కా రామేశ్వరం, అల్లవరం మండలం ఆ పేద గుండె బతికిందంటే ఆరోగ్యశ్రీ వల్లే నాకు గుండె వ్యాధి రాగానే వైద్యుణ్ణి సంప్రదించాను. గుండెకు ఆపరేషన్ అత్యవసరంగా చేయాలి అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్ చేయించుకున్నాను. దాదాపు రూ.లక్ష వ్యయంతో కూడిన ఆ ఆపరేషన్ను నేను ఉచితంగా పొందానంటే ఆరోగ్యశ్రీ వల్లే. రెండు నెలల కిందట ఆపరేషన్ చేయించుకున్నాను. నా ఆరోగ్యం బాగానే ఉంది. నేను బతికి ఉన్నానంటే ఆరోగ్యశ్రీయే కారణం. – నేతల సత్యనారాయణ, చిరుతపూడి, అంబాజీపేట మండలం -
పోస్టల్ బ్యాలెట్కు వేళాయె
పోలింగ్ సిబ్బందికి శిక్షణ ●● ఓటు హక్కు వినియోగించుకోనున్న 13,582 మంది ● అత్యవసర సర్వీసు ఓటర్లు 1,027 మంది ● హోమ్ ఓటింగ్కు 1,251 మంది దరఖాస్తు ● నేడు జిల్లావ్యాప్తంగా పోలింగ్ సిబ్బందికి రెండో విడత శిక్షణ రాయవరం: సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 13న జరగనున్నాయి. జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వహించనున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు ఓటు హక్కు ముందుగానే వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు వారు ఓటుహక్కును సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏడు ప్రత్యేక ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రతి ఉద్యోగ, ఉపాధ్యాయుడు తమ నియోజకవర్గ పరిధిలో ఓటు వేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. మొదటి విడత శిక్షణ పొందిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి ఓటుహక్కు కల్పించారు. ఒక జిల్లాలో పనిచేస్తూ ఇతర జిల్లాలోని నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకునే వారికి ప్రత్యేకంగా ఒక రోజు సెలవు ప్రకటించారు. శత శాతం నమోదయ్యేలా.. పోస్టల్ బ్యాలెట్ వినియోగంలో గతంలో జరిగిన పొరపాట్లకు ఏమాత్రం తావివ్వకుండా ఎన్నికల కమిషన్ ఈసారి ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో పోస్టల్ బ్యాలెట్ కోసం ఉద్యోగులు దరఖాస్తు చేసుకునేవారు. అవగాహన రాహిత్యంతో కొందరు, తమకు ఎందుకనే భావనతో కొందరు దరఖాస్తు చేసుకునేవారు కాదు. దరఖాస్తు చేసుకున్నా పోస్టల్ బ్యాలెట్ రాక పలువురు ఓటు హక్కు కోల్పోయిన సందర్భాలు గతంలో చోటు చేసుకున్నాయి. వీటన్నింటిని గుర్తించిన ఎన్నికల కమిషన్ ఈసారి ఎన్నికల శిక్షణకు ముందే ట్రైనింగ్ ఆర్డర్ కాపీతో పాటు ఉద్యోగుల వివరాలతో కూడిన ఫారం 12ను అందజేసింది. కోనసీమ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 13,582 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. వీరు శిక్షణ సమయంలో 12 ఫారంతో పాటు ఓటర్ గుర్తింపు కార్డు జిరాక్స్ ప్రతిని జత చేసి, వారు ఏ నియోజకవర్గ పరిధిలో ఓటు వేయాలనుకుంటున్నారు తెలియజేయాల్సి ఉంది. దీని ద్వారా పోస్టల్ బ్యాలెట్ జారీ చేయనుండడంతో ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగి ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. ప్రత్యేక ఏర్పాట్ల మధ్య... పోస్టల్ బ్యాలెట్ను ఈ నెల 5నుంచి 7వ తేదీ వరకు వినియోగించుకునే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించింది. పార్లమెంట్ పరిధిలోని ఏడు ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కంపార్ట్మెంట్లతో పాటు పోలింగ్ సిబ్బందిని నియమించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పా టు భద్రతా సిబ్బందిని కేటాయించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ వీలును బట్టి ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎక్కడ ఓటు హక్కు ఉందో అదే నియోజకవర్గ పరిధి లోని ఫెసిలిటేషన్ కేంద్రంలో వినియోగించుకోవచ్చు. హోమ్ ఓటింగ్కు ఏర్పాట్లు 85 ఏళ్ల వయసు పైబడిన వయోవృద్ధులు, 40 శాతానికి మించి వైకల్యమున్న దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసేలా ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. ఇందుకోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 85 ఏళ్ల వయసు పైబడిన వారు, 40 శాతం కంటే వైకల్యం కలిగిన దివ్యాంగులు 1,251 మంది ఉన్నారు. ఈసీ ఆదేశాల మేరకు వీరందరికీ బీఎల్ఓల ద్వారా 12డి ఫారాలు అందజేశారు. ఎన్నికల సిబ్బంది, పోలీస్ కానిస్టేబుల్, ఓ వీడియో గ్రాఫర్ వారిళ్ల వద్దకే వెళ్లి వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ఓటింగ్ కంపార్ట్మెంట్ ద్వారా ఓటు నమోదు చేయనున్నారు. అత్యవసర సర్వీసు ఓటర్లుగా 1,027 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. చాలామంది ఇంటి వద్ద ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు. ఉద్యోగులను తరలించే వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బందికి నేడు శిక్షణ జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గ కేంద్రాల పరిధిలో పోలింగ్ సిబ్బందికి రెండవ విడత శిక్షణ ఇవ్వనున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1,644 పోలింగ్ బూత్లకు రిజర్వు సిబ్బందితో పాటు 13,582 మంది సిబ్బందిని పోలింగ్ విధులకు నియమించారు. వీరందరికీ రెండవ విడత శిక్షణ శనివారం ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఇవ్వనున్నారు. పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓటర్లు, హోమ్ ఓటింగ్కు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు.. నియోజకవర్గం ఫారమ్–12 ఫారమ్12డి హోమ్ఓటింగ్ మొత్తం రామచంద్రపురం 2,373 155 65 2,593 ముమ్మిడివరం 1,741 172 172 2,085 అమలాపురం 2,174 193 109 2,476 రాజోలు 2,035 132 161 2,328 గన్నవరం 1,850 174 421 2,445 కొత్తపేట 1,459 128 63 1,650 మండపేట 1,950 73 260 2,283 మొత్తం 13,582 1,027 1,251 15,860 -
ఇంటెగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం పరిశీలన
అమలాపురం రూరల్: ఎన్నికల సీజర్ మేనేజ్మెంట్ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేసేందుకు సమాచార, నిఘా ఆధారిత ఎన్ఫోర్స్మెంట్ కీలకమని ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజేశ్వర్ గోయల్ పేర్కొన్నారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో కోనసీమ జిల్లాలో అమలాపురం లోక్సభ, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన సాధారణ పరిశీలకులు, రాజేశ్వర్ గోయల్, పరదీప్ కుమార్ శుక్రవారం కలెక్టరేట్లో ఇంటెగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించారు. సీ–విజిల్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఐటీ, బ్యాంకింగ్, కమర్షియల్ ట్యాక్స్, ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్, కస్టమ్స్ తదితర విభాగాల కార్యకలాపాలను పరిశీలించారు. ఓటరు హెల్ప్ లైన్ 1950, నేషనల్ గ్రీవెనన్స్ సర్వీస్ పోర్టల్, వాట్సప్, కాల్ సెంటర్, కంప్లయింట్ మేనేజ్మెంట్ సిస్టమ్, సీఈవో మెయిల్స్, సీ విజిల్స్ తదితరాల ద్వారా అందిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను రికార్డుల ఆధారంగా పరిశీలించారు. చెక్ పోస్టుల వద్ద నిఘా అమలు తీరుపై ఆరా తీశారు. స్టాటిక్ సర్వైలెన్న్స్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ క్షేత్ర స్థాయిలో పరిశీలనకు సంబంధించి ఆయా వాహనాలకు అమర్చిన జీపీఎస్ పరికరాల ద్వారా ఆయా వాహనాలు ఎక్కడ ఉన్నాయి. ఆయా నిఘాబృందాల కదలికలను పరిశీలించే కంట్రోల్ రూమ్ నిర్వహణ తీరును పరిశీలించారు. పోటీలోని అభ్యర్థుల రాజకీయ ప్రకటనలు, చెల్లింపు వార్తల రికార్డింగ్ విధానాలను పరిశీలించారు. రోజువారీ నివేదికల నిర్వహణ తీరును తనిఖీ చేశారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, ఐటీ బ్యాంకింగ్ కమర్షియల్ టాక్స్, సీజర్ మేనేజ్మెంట్ తదితర విభాగాల కార్యకలాపాలను రికార్డుల ద్వారా పరిశీలించి సిబ్బందికి ఉన్న అవగాహనపై సంతప్తిని వ్యక్తం చేశారు. వ్యయ పరిశీలకులు ఉమేష్ కుమార్, సుమిత్దాస్ గుప్తా, సీ విజిల్ యాప్ నోడల్ అధికారి వెంకటేశ్వర్లు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉద్యోగులు పాల్గొన్నారు. 6న ప్రధాని మోదీ సభ రాజమహేంద్రవరం సిటీ: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వేమగిరి వద్ద జాతీయ రహదారిని ఆనుకుని జరిగే విజయ శంఖారావం బహిరంగ సభలో పాల్గొంటారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు సభలో ప్రసంగిస్తారన్నారు. -
10 నుంచి పంట కాలువలకు నీటి సరఫరా నిలిపివేత
అమలాపురం రూరల్: గోదావరి డెల్టా పరిధిలో గల పంట కాలువలకు రబీ సీజన్ 2023–24కు సంబంధించి సాగునీటి సరఫరా ఈ నెల 10వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు నిలుపుదల చేస్తామని గోదావరి డెల్టా సిస్టం ధవళేశ్వరం చీఫ్ ఇంజినీర్ సతీష్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా ప్రధాన కాలువల పరిధిలో గల వరిపంట, తాగునీటి అవసరాలు చివరి స్థాయికి చేరుకున్నందున పంట కాలువలకు నీటి సరఫరా నిలిపివేస్తునట్లు తెలిపారు. ఈ వారం రోజులలో కాలువల పరివాహ ప్రాంతాలలో ఉన్న గ్రామాలకు చెందిన వారు వేసవి రక్షిత సమ్మర్ స్టోరేజ్ చెరువులను పూర్తి స్థాయిలో నింపుకోవాలని ఆయన ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. పవన్, చంద్రబాబు నట్టేట ముంచేస్తారు ● అబద్ధాలు చంద్రబాబుకు అలవాటే.. ● పవన్ను పిఠాపురంలో ఓడించాలి ● ముద్రగడ పిలుపు పిఠాపురం: పవన్ను, చంద్రబాబును నమ్మితే నట్టేట ముంచేస్తారని మాజీ మంత్రి వైఎస్సార్ సీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. పిఠాపురంలో ఎన్నికల ప్రచారంపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత, ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో శుక్రవారం ఆయన చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తప్పుడు హామీలతో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి సభ్యులు వస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎన్నికలయ్యేంత వరకే చంద్రబాబు జిమ్మిక్కుల మేనిఫెస్టో ఉంటుందని, ఎన్నికలయ్యాక దానిని మూసివేస్తారని చెప్పారు. సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రజలను మోసం చేసే మేనిఫెస్టోతో, ఊకదంపుడు ప్రసంగాలతో ప్రజలను మోసం చేయడానికి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అధికా రం కోసం అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా గడచిన ఐదేళ్లలో సీఎం వైఎస్ జగన్ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేశారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ను ఓడించాలని ముద్రగడ పిలుపునిచ్చారు. ఎంత మంది సినీ నటులు ప్రచారం చేసినా పిఠాపురం ప్రజలు ఇచ్చే తీర్పు మాత్రం వైఎస్సార్ సీపీకేనని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులకు, కార్యకర్తలకు ముద్రగడ పిలుపునిచ్చారు. వంగా గీత, ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ, పిఠాపురంలో వైఎస్సార్ సీపీ విజయం ఖాయమని అన్నారు. ప్రజలందరు వైఎస్సార్ సీపీనే కోరుకుంటున్నారన్నారు. ముద్రగడ నీతి నిజాయితీ కలిగిన నాయకుడని, ఆయన పదవుల కోసం పార్టీలోకి రాలేదని చెప్పారు. రెండు నెలలుగా పిఠాపురంలో వంగా గీత విజయం కోసం ముద్రగడ పూర్తి స్థాయిలో పని చేస్తున్నారన్నారు. -
విశ్వ బ్రాహ్మణులు, స్వర్ణకారుల సంక్షేమానికి పెద్ద పీట
అమలాపురం టౌన్: విశ్వ బ్రాహ్మణులు, స్వర్ణకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసి వారి అభ్యున్నతికి పాటు పడుతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ అన్నారు. అమలాపురంలోని విశ్వ బ్రాహ్మణ కమ్యూనిటీ హాలులో పట్టణ విశ్వ బ్రాహ్మణ, స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటైన సభలో మంత్రి విశ్వరూప్ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రాష్ట్ర సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టోజు సన్నయ్యదాసు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం తొలుత తమ సంఘం భవనం పై అంతస్తు నిర్మాణానికి మంత్రి విశ్వరూప్ రూ.10 లక్షలు నిధులు విడుదల చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే దిశగా, మంత్రి విశ్వరూప్ మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి మళ్లీ రాష్ట్ర మంత్రి అయ్యేలా పట్టణంలోని విశ్వ బ్రాహ్మణులు, స్వర్ణకారులు కృషి చేస్తామని సమావేశంలో పాల్గొన్న సంఘ ప్రతినిధులు తమ ప్రసంగాల్లో స్పష్టం చేశారు. మరో అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో విశ్వ బ్రాహ్మణులకు జరిగిన లబ్ధిని వివరించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర, జిల్లా, పట్టణ ప్రతినిధులు ర్యాలి రాజశేఖర్, దార్ల పాపయ్యాచారి, భరణకాన బాబు, తాళాబత్తుల లక్ష్మణరావు, కట్జోజు రాము ప్రసంగించారు. మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, వైస్ చైర్మన్ రుద్రరాజు నానిరాజు, పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ ఖాదర్, కౌన్సిలర్లు గొవ్వాల రాజేష్, చిట్టూరి పెదబాబు, దొమ్మేటి రాము, కౌన్సిల్ కో ఆప్షన్ సభ్యుడు వంకాయల కాశి, మద్దింశెట్టి ప్రసాద్ పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement