-
పరిహారం చెల్లించాలని డిమాండ్
మల్కన్గిరి: రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఉపాధ్యాయుడు, ఎన్నికల ప్రొసీడింగ్ అధికారి ఇంద్రజిత్ కిర్సనీ కుటుంబానికి పరిహారం చెల్లించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. మల్కన్గిరి జిల్లా మత్తిలి సమితి వద్ద మంగళవారం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇంద్రజిత్ కిర్సనీ ప్రాణాలు కోల్పోయారు. ఈయన కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ సచిన్ పవార్కు బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు తారక్ మండాల్, సంఘ ప్రతినిధులు రంజిన్ నాయిక్, ప్రదిప్ కుమార్ దోలాయి తదితరులు పాల్గొన్నారు. -
గుడ్డు బిల్లుల్లోఇదేం తీరు?
శ్రీకాకుళం: జిల్లా ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించేందుకు సర్వశిక్షా అభయాన్లో కొందరు ఉద్యోగులు స్కెచ్ వేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నిత్యావసర సరకులు, మాంసం, గుడ్లు సరఫరా చేసేందుకు ముందుగా టెండర్లు నిర్వహిస్తారు. టెండర్ రోజున ఖరారు చేసిన ధరలకే సంవత్సరం పొడవునా సరఫరా చేయాల్సి ఉంటుంది. రేటు పెరిగినా, తగ్గినా ఇందులో మార్పు ఉండదు. దీనిలో భాగంగా గుడ్డు ధర పేపరు ధరకు సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఇందుకు భిన్నంగా కొన్ని నెలల నుంచి గుడ్డు ధర రూ.6.30 పైసలకు బిల్లు దాఖలు చేస్తున్నారు. బిల్లులు దాఖలు చేసే నాటికి గుడ్డు ధర రూ. 5.50పైసలు ఉండగా అదనంగా 80పైసలు చెల్లిస్తూ వస్తున్నారు. కేజీబీవీల నుంచి రూ.6.30పైసలకు బిల్లులు వస్తుండగా ఆ మేరకు చెల్లింపులు కూడా జరిగిపోయాయి. ఎస్ఎస్ఏలోని అధికారుల సూచ నల మేరకే బిల్లులు దాఖలు చేస్తున్నట్లు ఎస్వోలు చెబుతున్నారు. కాగా అదనపు చెల్లింపుల విషయం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఆయన వివరణ కోరడంతో రెండు రోజులుగా ఎస్వోలపై ఎస్ఎస్ఏలోని కొందరు ఉద్యోగులు ఒత్తిడి తెస్తూ పేపరు ధరకే బిల్లులు దాఖలు చేస్తున్నట్లు లిఖితపూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఎస్వోలు ‘సాక్షి’కి తెలిపారు. బిల్లులు దాఖలు చేసినదానికి విరుద్ధంగా లేఖలు ఇస్తే తాము తప్పు చేసినట్లు అవుతుందనిర, తమను హెచ్చరిస్తూ వ్యాఖ్యానాలు చేస్తున్నారని, వాయిస్ మెసేజ్లు కూడా పెడుతున్నారని వాపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో లేఖలు ఇవ్వకూడదని బుధవారం జరిగిన ఎస్వోల రహ స్య సమావేశంలో నిర్ణయించుకున్నట్లు భోగట్టా. ఇదిలా ఉంటే నిత్యావసర సరకుల సరఫరా కాంట్రాక్ట్ కూడా కాంట్రాక్ట్ పొందిన వ్యక్తి కాకుండా వేరొకరు సరఫరా చేస్తున్నట్లు, అవి నాశిరకంగా ఉంటున్నట్లు ఎస్వోలు చెబుతున్నారు. అయితే బిల్లులు మాత్రం కాంట్రాక్ట్ పొందిన సంస్థ నుంచే దాఖలు అవుతుండడంతో వారికి బిల్లులు చెల్లిస్తున్నారు. రికవరీ చేస్తాం.. ఈ విషయాన్ని అకౌంట్ సెక్షన్ సూపరింటెండెంట్ పద్మావతి వద్ద ప్రస్తావించగా గుడ్డు ధర అదనంగా చెల్లించడం వాస్తవమేనన్నారు. వారి నుంచి రికవరీ చేస్తామన్నారు. బిల్లుకు విరుద్ధంగా ఎస్వోలను లేఖలు అడగడం నిజమేనని, ఎఫ్ఏవో సూచనల మేరకే ఎస్వోలకు వాయిస్ మెసేజ్ పెట్టామన్నారు. నిత్యావసర సరకుల కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారో, ఎవరు సరఫరా చేస్తున్నారో తనకు తెలియదని పేర్కొన్నారు. ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించేందుకు కొందరు ఎస్ఎస్ఏ ఉద్యోగుల స్కెచ్ డైట్ బిల్లులకు భిన్నంగా లేఖలు ఇవ్వాలని కేజీబీవీ ఎస్వోలపై ఒత్తిడి -
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
● పిల్లలను బావులు, చెరువుల్లో ఈత కొట్టేందుకు పంపించకండి. అవసరమైతే మీరే స్వయంగా వారికి తోడుగా వెళ్లండి. ● ద్విచక్రవాహనాలు నడపమని వారి చేతికి తాళాలు ఇవ్వవద్దు. వారికి తాళాలు కనిపించకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోండి. మొబైల్ ఫోన్లు, ట్యాబ్లు వారి చేతికి ఇవ్వకపోవడం ఉత్తమం. ● స్నేహితులతో కలిసి దూరప్రాంతాలకు పంపకండి. ● మధ్యాహ్న సమయంలో ఆరుబయట ఆడుకోవడానికి అనుమతించకండి. ఉదయం , సాయంత్రం వేళల్లో మాత్రమే ఆడుకోవడానికి పంపించడం మేలు. ● ఇంట్లో పెద్దలతో వారు ఎక్కువ సమయం గడిపేలా చూడండి. వీలైనంత వరకు మన సంప్రదాయాలను నేర్పించాలి. ● రామాయణం, మహాభారతం, ఇతిహాస కథలు చెప్పే వారి వద్దకు పిల్లల్ని పంపించండి. ● పిల్లలు ఆడుకోవడానికి సమయం నిర్ణయించండి. వేసవికాలంలో పిల్లలు ఆడుకునేందుకు నిర్దిష్టమైన టైం టేబుల్ ను రూపొందించండి. అప్పుడు పిల్లలు టైం టేబుల్ ప్రకారం ఆడుకునే వీలుంది. అదే పనిగా ఎండల్లో ఆడుకోకుండా నీడ పట్టునే ఉంటారు. ముఖ్యంగా పిల్లలు టీవీ ఎక్కువ సమయం చూడకుండా వారిని ఫిజికల్ గేమ్స్ వైపు మోటివేట్ చేస్తే మంచిది. ● పిల్లలకు ఉదయం యోగా, సాయంత్రం కరాటే, డ్రాయింగ్, నృత్యం, స్విమ్మింగ్, క్రికెట్, చెస్, వంటి వాటిలో శిక్షణ ఇప్పించడం వల్ల వారు బోర్ ఫీల్ అవ్వరు. ● వేసవికాలంలో పిల్లలు అల్లరి చేస్తున్నారని వారికి మీ స్మార్ట్ ఫోన్ ఇచ్చి ఆరోగ్యాన్ని పాడు చేయకండి. ● మొబైల్ ఫోన్ బదులు మంచి కథల పుస్తకాలు, డ్రాయింగ్ పుస్తకాలు కొనివ్వండి. వారిలో సృజనాత్మకతను వెలికి తీసేలాబొమ్మలు వేయించండి. లేదా ఇతర కళలను నేర్పించండి. -
దోపిడీ దొంగల హల్చల్
కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా బీజేడి నాయకుడు సునీల్ సాహు లక్ష్యంగా దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. బుధవారం వేకువజామున అతని స్వగ్రామం డొంగ్రుబజలో ఉన్న ఇంటిపై తుపాకీలతో దాడులకు తెగబడ్డారు. ఇంటి తలుపులు విరగ్గొడుతూ చొరబడ్డారు. ఇంటిలో ఎవరూ లేకపోవడంతో బీరువాలు పగలుగొట్టి ఫైల్స్ చిందరవందరగా పడివేశారు. అదే ఇంటిలో వేరే పోర్సన్లో అద్దెకు ఉంటున్న రోహిత్ బెహరా ఇంట్లోకి చొరబడ్డారు. ఆ ఇంట్లో పిల్లల తలపై తుపాకులు గురిపెట్టి సునీల్ కోసం వాకబు చేశారు. అయితే సునీల్ నబరంగ్పూర్ పట్టణంలో ఉన్నారని, తాము అద్దెకు ఉంటున్నామని ఆ కుటుంబీకులు తెలియజేశారు. అనంతరం వారి ఇంట్లో బీరువాలు తనిఖీ చేసి సుమారు రూ.7 లక్షలు విలువ చేసే నగలు అపహరించుకుపోయారు. ఉదయం వరకు భయంతో రోహిత్ కుటుంబీకులు ఇంట్లోనే ఉండిపోయారు. అనంతరం గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. నబరంగ్పూర్ ఐఐసీ సంబిత్ బెహరా నేతృత్వంలో బలగాలు సంఘటన స్ధలానికి చేరుకున్నాయి. సునీల్ సాహు సైతం స్వగ్రామానికి చేరుకున్నారు. దర్యాప్తు ప్రారంభం ఏడుగురు దొంగల దాడిలో పాల్గొన్నారని పోలీసులు గుర్తించారు. పోలీసు జాగిలాలను తెప్పించి దర్యాప్తు చేస్తున్నారు. సునీల్ సాహుకి పట్టణంలో రాకీ సాన్ పేరుతో హోటల్, ఫంక్షన్ హాల్, అనేక వ్యాపారాలు ఉన్నాయి. గతంలో ఒకసారి దోపిడి దొంగలు సునీల్ని అపహరించుకుపోయారు. సుమారు నెల రోజులు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. అతని కుటుంబ సభ్యులు దొంగలతో చర్చలు జరిపి విడిపించుకున్నారు. అనంతరం ప్రభుత్వం సునీల్కి గన్మెన్ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో సునీల్ సాహు అధికార పార్టీకి ఆర్థికంగా కీలకంగా వ్యవహరించారు. 13వ తేదీ రాత్రి వరకు సునీల్ స్వగ్రామంలోనే ఉంటూ ఎన్నికలు పర్యవేక్షించారు. అతనిపై దాడిచేస్తే పెద్ద ఎత్తున లబ్ధి పొందవచ్చుననే ఉద్దేశంతో ఈ దాడి జరిగిందనే ఊహాగానాలు జరుగుతున్నాయి. కానీ సునీల్ తన మకాం నబరంగ్పూర్కి మార్చడంతో దొంగల అంచనా తప్పింది. -
మూతపడిన పేపరుమిల్లు!
ముడిసరుకు కొరత● కార్మికుల ఆందోళన జయపురం: జయపురం సమీపంలోని గగణాపూర్ సేవా పేపరుమిల్లులో పేపరు ఉత్పాదన మరోసారి నిలిచి పోయింది. ముడిసరుకు కొరత కారణంగా ఉత్పాదన ఆగిపోయినట్లు తెలిసింది. మిల్లులో ఉత్పాదన నిలిచి పోవటంతో శ్రామికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మిల్లులో ఇటువంటి పరిస్థితిలు తరచూ జరుగుతూనే ఉన్నాయని.. అందుకు అనేక కారణాలను యాజమాన్యం చూపుతోందని శ్రామికులు ఆరోపిస్తున్నారు. పేపరుమిల్లులో ఉత్పత్తి కోసం రెండు మిషన్లు ఉన్నాయి. ఒక్కో మిషన్ సామర్ధ్యం 100 మెట్రిక్ టన్నులు. కాగా ఒక మిషన్ మాత్రమే పనిచేస్తుందని.. అందువలన నెలకు మూడు వేల టన్నుల పేపరు ఉత్పత్తి అవుతున్నదని వారు వెల్లడించారు. ముడిసరుకు లేక పోవటంతో ఉత్పత్తి నిలిచి పోవటంతో తమకు జీతాలు కూడా యాజమాన్యం చెల్లించలేదని, ఇప్పటికే తమకు ఐదు నెలల జీతాలు యాజమాన్యం బకాయి ఉన్నట్టు కార్మికులు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో మిల్లులో ఉత్పత్తి ప్రారంభించాలని, బకాయి జీతాలు చెల్లించాలని కోరుతున్నారు. -
బీభత్సం
జయపురం పట్టణాన్ని ఈదురుగాలులు వణికించాయి. కాలవైశాఖి నేపథ్యంలో మంగళవారం సాయంత్రం గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్లు, కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. హోర్డింగులు, ఇళ్ల పైకప్పులు గాలుల ధాటికి ఎగిరిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నెహ్రూనగర్లో మోకాలిలోతు నీరు ప్రవహించడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో సరఫరా లేక అంధకారంలో మగ్గిపోయారు. బుధవారం ఉదయం మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి సిద్దార్ధ పట్నాయక్ సిబ్బందితో చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై పడిన హోర్డింగ్లు, చెట్ల కొమ్మలు తొలగించారు. – జయపురం రహదారిపై కూలిన చెట్టు -
మో బూత్ యాప్ ఆవిష్కరణ
భువనేశ్వర్: ఓటింగ్ ప్రక్రియ క్రమబద్ధీకరణ నేపథ్యంలో ఖుర్దా జిల్లా ప్రజలకు సులభతరం చేయడానికి మో బూత్ మొబైల్ యాప్ను రూపొందించారు. ఒడిశా ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) నికుంజ బిహారి ధొలొ బుధవారం ఈ యాప్ని ప్రారంభించారు. ఓటర్లు తమ నిర్దేశిత పోలింగ్ స్టేషన్ గుర్తించడంలో మో బూత్ యాప్ సహాయపడుతుంది. ఓటరుకు సంబంధించిన పోలింగు బూత్లో బారులు తీరిన ఓటర్ల రద్దీ స్థితిగతుల్ని తెలియజేస్తుంది. తదనుగుణంగా ఓటరు పోలింగు కేంద్రానికి వెళ్లే సమయం నిర్ధారించుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఖుర్దా జిల్లా అధికార యంత్రాంగం ఈ యాప్ని ఆవిష్కరించింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ వెర్షన్న్లో మో బూత్ యాప్ అందుబాటులో ఉంది. త్వరలో ఐఓఎస్ మాడ్యూల్లో కూడా అందుబాటులోకి రానుంది. మండల స్థాయి అధికారులు (బీఎల్ఓ), సెక్టార్ ఆఫీసర్లతో సహా ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమైన వివిధ సిబ్బందికి ఈ యాప్ బహు విధాలుగా ప్రయోజనకరం అవుతుందని సీఈఓ తెలిపారు. ప్రధానంగా ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్ల రద్దీని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు దోహదపడుతుందని చెప్పారు. సెక్టార్ అధికారులు పోలింగ్ పార్టీ ఆగమన స్థితి, మాక్ పోల్, వాస్తవ పోల్ పురోగతి, పోలింగ్ పూర్తి స్థితి వంటి కీలకమైన డేటాను పర్యవేక్షించగలుగుతారని పేర్కొన్నారు. పారదర్శకత, సమర్ధవంతమైన క్యూ నిర్వహణను మెరుగుపరుస్తుందన్నారు. ఈవీఎంలో లోపాలు, శాంతిభద్రతల సమస్యలను పరిష్కరించడంలో సెక్టార్ అధికారులకు చేయూతగా పని చేస్తుందని చెప్పారు. దీనిలో సెంట్రల్ డ్యాష్బోర్డ్ జిల్లా అధికారులు, సెక్టార్ ఆఫీసర్లకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. -
మాజీ మంత్రి డొంబురుధర్ ఉలక కన్నుమూత
రాయగడ: మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డొంబురుధర్ ఉలక (87) మంగళవారం రాత్రి భువనేశ్వర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈయన కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జిల్లాలోని బిసంకట్క్ శాసనసభ నియోజకవర్గం నుంచి 1974, 1977, 1995, 2004, 2009లో వరుసగా విజయం సాధించారు. ఒకసారి రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా సేవలు అందించారు. ఈయనకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మూడో కొడుకు నీలమాధవ ఉలక బిసంకటక్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పొటీ చేశారు. డొంబురు మృతిపై పలువురు తమ సంతాపాన్ని ప్రకటించారు. డొంబురుధర్ ఉలక మృతికి సంతాపం పర్లాకిమిడి: మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డొంబురుధర్ ఉలక మృతికి గజపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, బిజయ పట్నాయక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బసంత పండా సంతాపం తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు రాయగడ: జిల్లాలోని కొలనార సమితి కర్లకొన గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో జనార్ధన్ పట్నాయక్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల విధులను నిర్వహించేందుకు గుణుపూర్ వెళ్లిన ఆయన, విధుల అనంతరం తిరిగి తన స్వగ్రామైన రామనగుడకు మంగళవారం బైక్పై బయల్దేరాడు. ఈ క్రమంలో కర్లకొన గ్రామ సమీపంలో బైకు అదుపుతప్పడంతో కిందపడిపోయాడు. దీంతో తీవ్రగాయాలకు గురైన అతడిని అక్కడివారు కొలనార ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం బరంపురం తరలించారు. అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి కొరాపుట్/మల్కన్గిరి: అనుమానాస్పద స్థితిలో నవ వధువు అగ్నికి ఆహుతైన విషాదకర ఘటన కొరాపుట్ జిల్లాలో జరిగింది. మల్కన్గిరి జిల్లా బెంగాలి క్యాంప్ ఎంపీ–10కి చెందిన గగన్ మండల్ కుమార్తె శివాని సింగ్(21)ని పుజారిపుట్ గ్రామానికి చెందిన చెందిన ప్రభాస్సింగ్తో ఈ ఏడాది మార్చి 12న వివాహం జరిగింది. కొద్దిరోజులయ్యాక అత్తారింట్లో వరకట్న వేధింపులు మొదలయ్యాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి బెంగాలి క్యాంపులోని తన నివాసంలో శివాని అనుమానాస్పద స్థితిలో మంటలు అంటుకున్నాయి. వెంటనే ఆశా కిరణ్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందింది. వరకట్నం వేధింపులు వల్లే తమ కుమార్తె చనిపోయిందని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రభాస్సింగ్ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు రాయగడ: జిల్లాలోని కోమట్లపేట సమీపంలో బుధవారం బైక్, మినీ ట్రక్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక కస్తూరీనగర్ రెండో లైన్లో నివాసముంటున్న సహజాద్ అలాం వెల్డింగ్ పనులు చేసుకుని జీవనోపాధి పొందుతున్నాడు. బుధవారం ఉదయం జేకేపూర్లోని ఒక ఇంట్లో వెల్డింగ్ పనులు చేసేందుకు బయలుదేరాడు. కోమట్లపేట వచ్చే సరికి ఆవు అడ్డంగా రావడంతో తప్పించబోయే క్రమంలో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మినీ ట్రక్ను బలంగా ఢీకొన్నాడు. తీవ్ర గాయాల పాలైన అలాంను చందిలి పొలీసులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం తరలించారు. పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్నికలు మాకొద్దు..!
● అవిభక్త కొరాపుట్ జిల్లాలో పలు గ్రామస్తుల నిర్ణయం జయపురం: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచాయి. అయినా నేటికి అవిభక్త కొరాపుట్ జిల్లాలోని అనేక గ్రామాలు కనీస మౌలిక సౌకర్యాలకు నోచుకోలేదు. ఇప్పటివరకూ పట్టించుకోని ప్రజలు ఇప్పుడు కఠిన నిర్ణయానికి వచ్చారు. తాము వేసిన ఓట్లతో అందలమెక్కే పాలకులు తమ హక్కులను కాలరాస్తున్నారని, కనీస సౌకర్యాలు కల్పించటంలేదని వారు గ్రహించారు. అందుకే ఈ నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించి. ఏఏ గ్రామస్తులు బహిష్కరించారంటే.. తమ గ్రామానికి రోడ్లు వేయాలని, మంచినీటిని సమకూర్చాలని డిమాండ్ చేస్తూ దసమంతపూర్ సమితి లుల్లా పంచాయతీ పదుగుడ గ్రామ ప్రజలు ఎంతో కాలంగా అధికారులకు విన్నవించుకుంటున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రజలు ఎన్నికలు బహిష్కరించారు. ఆ గ్రామంలో 90 ఆదివాసీ కుటుంబాలకు చెందిన 450 మంది నివసిస్తున్నారు. వారిలో 176 మంది ఓటర్లు ఉన్నారు. వారి కోసం ఒక పోలింగ్ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికలు బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు. విషయం తెలుసుకున్న దసమంతపూర్ బీడీవో మిలన్ కుమార్ ఝంకార్ గ్రామానికి వెళ్లి ప్రజలకు నచ్చ చెప్పినా వారు వినలేదు. తమ గ్రామానికి రోడ్డు, మంచినీటి సౌకర్యం కల్పించినప్పుడే ఓటు హక్కును వినియోగించుకుంటామని భీస్మించడంతో అదికారులు వెనుదిరిగారు. నందపూర్ సమితిలో.. నందపూర్ సమితి రయిసింగ్ పంచాయతీ దేవసొండిగుడ గ్రామస్తులు కూడా ఎన్నికలు బహిష్కరించారు. తమ గ్రామానికి రోడ్డు వేయాలని, బాసికీ నదిపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఎన్నికలు బహిష్కరించారు. అంతేకాకుండా గ్రామ మార్గానికి అడ్డంగా వెదురులతో దడికట్టి తమ డిమాండ్లతో కూడిన బ్యానర్ కట్టారు. నారాయణపట్న సమితిలో.. నారాయణపట్న సమితిలో నాలుగు గ్రామాల ప్రజలు తమకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించలేదంటూ ఎన్నికలు బహిష్కరించారు. అయితే విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో గ్రామాలకు వెళ్లి.. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించినట్లు సమాచారం. అలాగే నవర్డపూర్ జిల్లాలో కూడా పలుగ్రామాల ప్రజలు ఎన్నికలు బహిష్కరించారు. తెంతులికుంటీ, లమతాగుడ, ఖుండియగుడ గ్రామస్తులు సైతం ఎన్నికలు బహిష్కరించారు. తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయా గ్రామస్తులు వాపోయారు. ఈ గ్రామాల్లో 609 మంది ఓటర్లు ఓటు వేయలేదు. అలాగే రాయిఘర్ సమితిలోని ఖుడుకో పంచాయతీ పరిధిలోని 17 గ్రామాల్లో ఉన్న 2,100 మంది ఓటర్లు సమస్యలు పరిష్కరించనందుకు నిరసనగా ఎన్నికలు బహిష్కరించారు. -
అంగన్వాడీ వర్కర్ను హత్య చేస్తానని బెదిరింపు
జయపురం: బాల్య వివాహాన్ని అడ్డుకున్న తనను హత్య చేస్తామని ఒక యువకుడు బెదిరించాడని అంగన్వాడీ వర్కర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక నుంచి అంగన్వాడీ వర్కర్లు బాల్య వివాహాలను అడ్డుకోవడం, అవగాహన కల్పించడం జరగదని స్పష్టం చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు.. ఏప్రిల్ 24వ తేదీన బొయిపరిగుడ సమితి మహుళి గ్రామ పంచాయతీలోని ఒక గ్రామంలో బాల్య వివాహం జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిన బపాణిగుడ అంగన్వాడీ వర్కర్ సంధ్యారాణి పండకు సమాచారం అందింది. దీంతో ఆమె బొయిపరిగుడ సీడీపీవో, అంగన్వాడీ సూపర్వైజర్, స్థానిక సర్పంచ్, స్థానిక పోలీసులు, ఏఎన్ఎం తదితరులకు సమాచారం అందించింది. వారందరూ కలిసి ఆ గ్రామానికి చేరుకున్నారు. వివాహం జరుపుతున్న యువతికి 18 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు అని నిర్ధారించుకున్నారు. అధికారులు, గ్రామ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి బాల్య వివాహం నేరమని తెలియజేశారు. అందుకు అందరూ అంగీకరించి వివాహాన్ని ఆపివేసి మైనర్ బాలికను ఆమె తల్లిదండ్రుల ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాత వివాహం చేసేందుకు ఉభయవర్గాలు అంగీకరించారు. అయితే ఈనెల 13వ తేదీన అంగన్వాడీ వర్కర్ పాఢీ ఎలక్షన్ డ్యూటీలో భాగంగా బొయిపరిగుడ వచ్చింది. ఎన్నికల విధిలో ఉన్న సమయంలో ఒక యువకుడు ఆమె వద్దకు వచ్చి నీవు నా వివాహం ఆపుతావా, అని నిన్ను చంపుతానని హెచ్చరించాడు. దీంతో ఆమె ఈ విషయాన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్కు తెలిపింది. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈ విషయం పోలీసులకు తెలియజేశారు. పోలీసులు వచ్చేసరికి ఆ యువకుడు పరారయ్యాడు. మంగళవారం ఆమె తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, జరిగిన విషయాన్ని అంగన్వాడీ వర్కర్ల సంఘానికి తెలియజేసింది. అందుకు స్పందించిన బొయిపరిగుడ అంగన్వాడీ వర్కర్ల సంఘం నేతలతో బొయిపరిగుడ పోలీసుస్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసింది. -
స్ట్రాంగ్ రూమ్ భద్రత పరిశీలన
పార్వతీపురం: ఉద్యాన కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా ఏర్పాట్లను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిషాంత్కుమార్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్లకు కల్పించిన మూడంచెల భద్రత, బందోబస్తును పరిశీలించారు. మొదటి స్థాయిలో స్థాని క పోలీసులు, రెండవ స్థాయిలో రాష్ట్ర సాయుధ బలగాలు, మూడవ స్థాయిలో కేంద్ర సాయుధ బలగాల పహారా ఏర్పాటు చేశారు. రేయింబవళ్లు పహారాతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అప్రమత్తంగా ఉండాలని భద్రతా అధికారులకు ఎస్పీ సూచించారు. భద్రతా ఏర్పాట్ల తనిఖీ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, అరకు పార్లమెంటరీ నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి ఎస్.ఎస్.శోబిక, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, సాలూరు శాసన సభ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి సి.విష్ణుచరణ్, అదనపు ఎస్పీ డా.ఓ.దిలీప్ కిరణ్, అధికారులు పాల్గొన్నారు. -
గిరిశిఖర గ్రామాల్లో దోమల నివారణ చర్యలు
గుమ్మలక్ష్మీపురం: గిరిశిఖర గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారీ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. గుమ్మలక్ష్మీపురం మండలంలోని కీసరి, కీసరి గూడలలో దోమల నివారణ మందు పిచికారీని జిల్లా మలేరియా నివారణ అధికారి (డీఎంఓ) డాక్టర్ టి.జగన్మోహనరావు పరిశీలించారు. గ్రామంలో ప్రతీ ఇంటిలోనూ దోమల నివారణ మందును సక్రమంగా పిచికారీ చేస్తున్నది, లేనిదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. దోమల సంహారిణి ఏసీఎమ్5% రసాయనం కలిపే మోతాదు, స్ప్రే చేసిన గదులను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. స్ప్రేయింగ్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. దోమతెరల వినియోగంపై అక్కడి ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో జ్వర లక్షణాలతో ఎవరైనా ఉన్నారా అన్న విషయంపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఏఎంఓ డి.సూర్యనారాయణ, సబ్ యూనిట్ అధికారి మోహనరావు, పంచాయతీ కార్యదర్శి పి.లక్ష్మి, మలేరియా సాంకేతిక సూపర్వైజర్ అప్పలనాయుడు, సూపర్వైజర్ శ్రీనివాసరావు, హెల్త్ అసిస్టెంట్ రాధా కృష్ణ, ఏఎన్ఎం ప్రభావతి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తత తప్పనిసరి
పాలకొండ రూరల్: ప్రస్తుత వేసవి చివరలో కురిసే అడపా దడపా వర్షాల కారణంగా గొర్రెల్లో వచ్చిన సీజనల్, సాధారణ వ్యాధులు వాటి నివారణ చర్యలపై పాడిరైతు లు, పెంపకందారులు అవగాహన పెంచుకోవాలని పశు సంవర్థకశాఖ సహాయ సంచాలకుడు (ఎ.డి) ప్రభా మాణిక్యరావు అన్నారు. లేనిపక్షంలో జీవాలు మృత్యువాత పడే అవకాశం ఉందన్నారు. వివిధ రకాల క్రిమి, కీటకాల వల్ల వ్యాధులు సంక్రమిస్తా యని తెలిపారు. గొర్రెల పెంపకందారులు సరైన సమయంలో సమస్యలు గుర్తించి, వైద్యుల సూచన లు పాటించాలన్నారు. ఈ మేరకు సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సూక్ష్మజీవుల ద్వారా... సూక్ష్మజీవుల వల్ల చిటుకు వ్యాధి(ఈటీ), అంత్రాక్స్ లేదా నల్లజాడ్యం, ఊపరితిత్తుల్లో నెమ్ము లేదా నెమోనియో, పొగాళ్లు లేదా బురద పుండ్లు, మితు వకాళ్లు, గొంతువాపు వ్యాధుల సంభవిస్తాయి. గాలి కుంటు, నీలి నాలిక, బొబ్బరోగం, అమ్మతల్లి, నోటి పుండ్లు వంటివి వైరస్ ద్వారా ఒకదాని నుంచి ఇంకొకదానికి చేరి మందకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. తేలికపాటి వర్షాలు కురిసేటప్పుడు క్లాస్ట్రీడియం జాతి సూక్ష్మజీవుల వల్ల ఎక్కువ ప్రమాదం చోటు చేసుకుంటుంది. బలిష్టంగా, ఆరోగ్యంగా ఉండే గొర్రెలు ఒక్కసారిగా ఎగిరిపడి కొట్టుకుని మర ణించడం.. కడుపును కాళ్లతో తన్నడం.. కడుపు ఉబ్బడం.. నల్లగా దుర్వాసన వచ్చే పారుడు.. నోటి నుంచి నురగ రావడం.. ఫిట్స్ వంటి లక్షణాల ద్వా రా ఈ రోగాలను గుర్తించవచ్చు. ఈ సమస్యలకు చికిత్స అందించే క్రమంలో వైద్యుల సలహా మేరకు రోగ పరిస్థితిని బట్టి ఆక్సిట్రెట్ సైక్లిన్ మందును 5 నుంచి 10 మిల్లీగ్రాములు ఒక కిలో బరువుకు లెక్కకట్టి గొర్రెలకు అందించాలి. 50 మిల్లీగ్రాముల పొటాషియం పర్మాంగనేట్ 100 ఎం.ఎల్ నీటిలో కలిపి తాగించాలి. రోగనివారణకు అవసరమగు టీకాలు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రభు త్వ పశువైద్య కేంద్రాల్లో ఈ టీకాలను ఉచితంగా అందిస్తారు. మూడు మాసాల వయస్సు నిండిన గొర్రెపిల్లలకు తప్పనిసరిగా నట్టల నివారణ మందు ఇవ్వాలని, మొదటి టీకా ఇచ్చిన 15 రోజుల తర్వాత బూస్టర్డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి ఏటా మే నెల మొదటి వారంలో క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. -
వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ
విజయనగరం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం రామనారాయణంలో వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించా రు. బెంగళూరుకు చెందిన ప్రముఖ రచయితలు శ్రీరామ చక్రధర్, శారద దీప్తి శిక్షణ కార్యక్రమానికి హాజరైన చిన్నారులు, పెద్దలకు వ్యక్తిత్వ వికాస సూత్రాలను వివరించారు. మనిషి ఉన్నత స్థాయికి ఎదగడానికి అవసరమయ్యే వ్యక్తిత్వం, గుణగణాలను వివరించారు. శిక్షణ శిబిరానికి 200 మంది హాజరు కాగా ఆలయ అర్చకులు చాణక్య, హర్షలు శాంతి మంత్రాలు, ఆశీర్వచనాలు అందించారు. కార్యక్రమంలో ఎన్సీఎస్ ట్రస్టీలు నారాయణం శ్రీనివాస్, నీరజవల్లి దంపతులు, చీఫ్ ఆడిటర్ బాలాజీ, ఉమాదేవి దంపతులు, జాహ్నవి, తదితరులు పాల్గొన్నారు. ఆర్బీకేలో చోరీమక్కువ: మండలంలోని కాశీపట్నం పంచాయతీలో గల రైతుభరోసా కేంద్రంలో జరిగిన చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఎస్సై పి.నరసింహమూర్తి బుధవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాశీపట్నం గ్రామంలో ఆర్అండ్బీ రహదారి సమీపంలోని ఆర్బీకేలో విధులు నిర్వహిస్తున్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గొట్టాపు సతీష్కుమార్ ఈనెల 10వతేదీన విధులు నిర్వహించి, రైతుభరోసాకేంద్రం తలుపులకు తాళాలు వేసి వెళ్లిపోయా రు. మళ్లీ ఈనెల 14వతేదీన ఆర్బీకేలో విధులు నిర్వహించేందుకు వచ్చిన ఆయన తలుపులు తీ సి, చూడగా టీవీ, కంప్యూటర్ మానిటర్, ప్రింటర్ను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. దీంతో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ సతీ ష్కుమార్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నిరంతర సాధన అవసరం
రాయగడ: సమాజానికి మంచి కథనాలు అందించాలంటే ప్రతీ రచయిత, కవి నిరంతరం సాధన చేయాల్సిన అవసరం ఉంటుందని కదాంబిని ఒడియా మాస పత్రిక సంపాదకురాలు డాక్టర్ ఇతి సామంత అభిప్రాయపడ్డారు. పత్రిక ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో స్థానిక సాయి ఇంటర్నేషనల్లో సోమవారం సాయంత్రం వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ రచయిత, కవి తన కలానికి పదును పెడుతూ ఉండాలని సూచించారు. మంచి రచనలు సమాజ శ్రేయస్సుకు దోహదపడతాయని పేర్కొన్నారు. మెరుగైన సమాజాన్ని ఆవిష్కరించాలంటే అందుకు ప్రతీ ఒక్కరి బాధ్యతగా గుర్తించాలన్నారు. కదాంబిని మాస పత్రిక ఏర్పాటు సమయంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. క్రమేపీ పాఠకుల ఆదరాభిమానాలు పెరగడంతో పత్రిక రంగంలో తనదైన స్థాయిని సంపాదించుకోగలిగిందని తెలియజేశారు. కొత్త రచనలు, కొత్త ఆలోచనలతో ఉన్న ప్రతీ అంశం పాఠకునికి చదివింపజేస్తుందన్నారు. తమ రచన, కవితల్లో సమాజానికి ఒక మంచి సందేశాత్మకంగా ఉండేలా తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త డాక్టర్ డీకే మహంతి, ఒడిశా సాహిత్య అకాడమీ సభ్యులు సుశాంత్ నాయక్, ప్రముఖ కళాకారిణి, గాయని, నటి అనురాధ పాణిగ్రహి తదితరులు పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్ట్, కదాంబిని పత్రిక రచయిత అమూల్యరత్న సాహు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. -
బరంపురంలో ఉద్రిక్తత
బరంపురం: నగరంలో జరిగిన ఎన్నికల్లో భాగంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుకున్నాయి. బరంపురం లోక్సభ బీజేపీ అభ్యర్థి డా.ప్రదీప్ పాణిగ్రాహిపై, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మేయర్ శివశంకర్ దాస్ అలియాస్ పింకు దాస్ దాడిచేసి గాయపరిచాడు. దీంతో ప్రదీప్ పాణిగ్రాహి గాయలతో స్థానిక ఎంకేసీజీ మెడికల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హింసాత్మక ఘటనలపై విషయం తెలుసుకున్న బరంపురం ఎస్పీ సార్ధక్ సడంగి ఆదేశంతో గుసానినువాగం పోలీసుస్టేషన్ అధికారులు శివశంకర్ దాస్ను అరెస్టు చేశారు. దీంతో ఆయన మద్దతుదారులు ఆందోళన దిగారు. ఆయనను బరంపురం జిల్లా కోర్టుకి తరలించి సబ్ కోర్టులో హాజరుపరిచారు. బెయిల్ దొర్కకపోవడంతో బరంపురం సర్కిల్ జైలుకి తరలించారు. -
పరిచయం పెంచుకొని.. పాపను విడిచి
రాయగడ: రైలులో ప్రయాణించిన ఒక మహిళ పక్కనే తనతో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికురాలితో మాటామాటా కలిపి పరిచయం పెంచుకొని, చివరకు గమ్యం స్థానం చేరేసరికి పాపను విడిచి పరారైంది. మునిగుడలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని చంద్రపూర్ ప్రాంతానికి చెందిన అనంత్ క్రొటింగ్ అనే మహిళ మంగవారం ఏదో పనిమీద రాయగడ వచ్చారు. పనులు ముగించుకున్న అనంతరం తిరిగి తన స్వగ్రామానికి వెళ్లేందుకు రాయగడలో ట్రైన్ ఎక్కింది. జనరల్ కంపార్ట్మెంట్లో కూర్చుంది. పక్కనే మరో మహిళ చంటి పాపతో ప్రయాణం చేస్తోంది. కొద్దిదూరం ప్రయాణం చేసిన తర్వాత వారి మధ్య మాటామాటా కలిసి పరిచయం పెరిగింది. అనంతరం మునిగడు రైల్వేస్టేషన్లో ఇద్దరు మహిళలు దిగారు. ఇంతలో పాపను కాసేపు ఎత్తుకోండి టాయ్లెట్స్కు వెళ్లి వస్తానని చెప్పి పాపను క్రొటింగ్ అనే మహిళకు అప్పగించింది. పాపను ఎత్తుకున్న క్రొటింగ్ గంటలు తరబడినా ఎదురుచూసిన వాళ్ల అమ్మ రాలేదు. దీంతో కావాలనే పాపను విడిచిపెట్టాలని నిర్ణయించకున్నారని అర్థం చేసుకొని మునిగుడ పోలీసుస్టేషన్ను ఆశ్రయించింది. వెంటనే ఐఐసీ సౌదామిని బెహర వెంటనే స్పందించి జిల్లా శిశుసంరక్షణ కేంద్రం వారికి సమాచారం అందించారు. ప్రస్తుతం పాప శిశు సంరక్షణ కేంద్రంలో సురక్షితంగా ఉంది. అయితే పాపను ఎత్తుకుని ప్రయాణించిన మహిళ ఎవరు, ఎక్కడి నుంచి ప్రయాణించింది, పాపను విడిచిపెట్టి వెళ్లడంపై సమగ్ర దర్యాప్తు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు. రైల్వేస్టేషన్లో ఉన్న సీసీ కెమేరాల ఆధారంగా ఆ మహిళను గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేస్తామన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ప్రిసైడింగ్ అధికారి మృతి
మల్కన్గిరి: జిల్లాలోని మత్తిలి సమితి తప్పగూడ గ్రామం వద్ద మంగళవారం ఉదయం ఒక ప్రైవేటు బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో పోలింగ్ ప్రిసైడింగ్ అధికారి ఇంద్రజిత్ కిర్సనీ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఇంద్రజిత్ కిర్సనీ అనే వ్యక్తి చిత్రకొండ నియోజకవర్గం 122వ పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారిగా విధులు ముగించుకొని సోమవారం రాత్రి ఈవీఎం మెషిన్లు జిల్లా కేంద్రంలో అప్పగించారు. అనంతరం మల్కన్గిరిలో రాత్రి ఉండిపోయి మంగళవారం ఉదయం సొంత ఊరు అయినటువంటి ఖొయిర్పూట్ సమితి కదంగూడ పంచాయతీ ఖురిగూడ గ్రామానికి ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. అయితే మత్తిలి సమితి వద్ద ఒక ప్రైవేటు బస్సు వచ్చి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తోటి ఉపాధ్యాయులు అంబులెన్స్తో మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలియజేశారు. విషయం తెలిసిన వెంటనే చిత్రకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డొంబురు శీసా, ఇతర గ్రామస్తులు మత్తిలి ఆరోగ్య కేంద్రానికి చేరుకొని సంతాపం తెలిపారు. ఇంద్రజిత్ మల్కన్గిరి సమితి సీక్పల్లి ఉన్నత పాఠశాల హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నాడు. మత్తిలి పోలీసులు కేసు నమోద్ చేసి బస్సు డ్రైవర్ను అరెస్టు చేశారు. మృతదేహన్ని పోస్టుమార్టం అనంతరం మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
మల్కన్గిరి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో మంగళవారం సాయంత్రం ట్రాక్టర్, బైక్ ఢీకొని ఒకరు మృతి చెందారు. మల్కన్గిరికి చెందిన తాపాన్ మండాల్ (55) అనే వ్యక్తి కలిమెల సమితి ఎంవీ 18 స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో ఘటన జరిగింది. ఆస్పత్రి సమీపంలో ఒక ట్రాక్టర్ను మరో ట్రాక్టర్ తాడుకట్టి లాగుతున్న సమయంలో అటువైపు బైక్పై వస్తున్న తాపాన్ ఢీకొని కింద పడిపోయారు. వెంటనే గాయాలుపాలైన అతడిని ఆస్పత్రికి తరలించినా, అప్పటికే మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన మల్కన్గిరి ఐఐసీ రీగాన్ కీండో తన సిబ్బందితో వెళ్లి కేసు నమోద్ చేసి, కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు. ఓనర్ మణిశంకర్ తాపాన్ కుటుంబ సభ్యులకు నష్ట పరిహారం అందజేయాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
ఏపీఆర్జేసీలో సత్తాచాటిన విద్యార్థులు
కోటబొమ్మాళి: ఏపీఆర్జేసీ పరీక్ష ఫలితాల్లో కోటబొమ్మాళి మండలం ఊడికిలపాడు గ్రామానికి చెందిన సనపల ప్రఘ్నప్రియ 32వ ర్యాంకు సాధించింది. ప్రఘ్నప్రియ పదో తరగతి వరకూ కోటబొమ్మాళిలోని ఓ ప్రైవేటు హైస్కూల్లో చదివింది. తండ్రి రమేష్ ఆన్లైన్ కేంద్రం నడుపుతున్నాడు. తల్లి గృహిణి. ప్రఘ్నప్రియను స్థానిక ఎంఈఓ 1, 2లు ఎస్.అప్పలరాజు, ఎల్వీప్రతాప్ అభినందించారు. 48వ ర్యాంకు సరుబుజ్జిలి: ఏపీఆర్డీసీ ఫలితాల్లో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్థి కూరాకుల మహేష్ రాష్ట్రస్థాయిలో 48వ ర్యాంకు సాధించాడు. విద్యార్థి తల్లిదండ్రులు కూలి పనులు చేసుకొని తన కుమారుడిని చదివించారు. విద్యార్థికి ర్యాంకు దక్కడంపై ప్రిన్సిపాల్ రాబిల్లి భూషణరావు, అధ్యాపకులు అభినందన తెలిపారు. సారవకోట విద్యార్థులు సారవకోట: ఏపీఆర్జేసీ పరీక్ష ఫలితాలలో మండలంలోని పలువురు విద్యార్థినులు సత్తా చాటారు. సారవకోట నవతేజ పాఠశాలకు చెందిన ముగ్గురు బాలికలు ఉత్తమ ర్యాంకులు సాధించారు. వీరిలో బుడితి యమునకు బైపీసీలో 192వ ర్యాంకు, సూరపు శ్రావణికి ఎంపీసీలో 271వ ర్యాంకు, రగుతు భవ్యశ్రీకి ఎంపీసీలో 521వ ర్యాంకులు వచ్చాయి. -
బుధవారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2024
జలపాతంలో పడి ఇద్దరు మృతి కొరాపుట్: జిల్లాలోని పొట్టంగి సమితి సమీపంలో గాలిగబ్దర్ జలపాతంలో జారిపడి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పట్టణంలోని పీహెచ్డీ కాలనీకి చెందిన ఆశిష్ కుమార్ పండా (24), జన్నిగుడకి చెందిన నిత్యేష్ కుమార్ దాస్ (24)లు స్నానానికి జలపాతం వద్దకి వెళ్లారు. అక్కడ వారు జలపాతంలో జారిపడి మృతి చెందారు. అగ్నిమాపక బృందాలు, పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రాంతంలో తరుచూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూన్ 17 నుంచి ఉత్సవాలు రాయగడ: స్థానిక ప్రజల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటూ భైరవీధిలో కొలువైన బురదల పోలమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు జూన్ 17 నుంచి ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజుల పాటుగా నిర్వహించనున్న ఈ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటయ్యింది. కమిటీ అధ్యక్షుడిగా పతివాడ శ్రీనివాస్రావు, వర్కింగ్ ప్రెసిడెంటుగా కింతలి శ్రీనివాస్రావు, ఉపాధ్యక్షుడిగా ఎద్దు శ్రీహరి, కార్యదర్శిగా బార్జి శేషగిరి, కోశాధికారిగా బి.సర్వేశ్వరరావులు నియమితులయ్యారు. ప్రతీ ఏడాదిలా ఈసారి కూడా అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తామని కమిటీ అధ్యక్షుడు పతివాడ శ్రీనివాస్రావు తెలియజేశారు. సురక్షితంగా చేరిన పోలింగ్ సిబ్బంది భువనేశ్వర్: రాష్ట్రంలో తొలి విడత పోలింగ్ సోమవారం శాంతియుతంగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ నిర్వహణ కోసం భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు కొండకోన ప్రాంతాల్లో సైతం పోలింగ్ సౌకర్యాలు కల్పించారు. ఆయా ప్రాంతాలకు అనుబంధ యంత్రాంగం లాంచి, హెలికాఫ్టర్ వంటి వాహనాల్లో చేరి పోలింగు ప్రక్రియ విజయవంతం చేశారు. వీరంతా సురక్షితంగా గమ్యం చేరినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం వర్గాలు తెలిపాయి. స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంలు బరంపురం: గంజాం జిల్లాలో తొలి విడత పోలింగ్ అనంతరం ఈవీఎంలను పటిష్ట భద్రత మధ్య స్థానిక ఐఐటీ ఇన్స్టిట్యూట్లోని స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనుండడంతో అప్పటివరకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. భువనేశ్వర్: రాష్ట్రంలో తొలి దశ ఎన్నికలు పురస్కరించుకుని పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ప్రధానంగా దక్షిణ ఒడిశా పరిధిలో దళిత ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో తొలిదశ పోలింగ్ ముగిసింది. ఇక్కడ బిజూ జనతా దళ్ తన పూర్వ వైభవం చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే ఈసారి బీజేడీకి భంగపాటు తప్పదని బీజేపీ చెబుతోంది. తొలిదశలో 4 లోక్సభ నియోజకవర్గాలతో పాటు అనుబంధ 28 శాసనసభ స్థానాల్లో పోలింగ్ పూర్తయ్యింది. 4 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కలహండి, కొరాపుట్లు మాత్రం పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మిగిలిన 2 స్థానాలు బరంపురం, నవరంగ్పూర్ నుంచి బీజేడీ వరుసగా 3 సార్లు లోక్సభ స్థానాలను గెలుచుకుంది. తాజా ఎన్నికల్లోనూ ఈ రెండు స్థానాలను కై వసం చేసుకోవడం తథ్యమని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. తొలి దశలో ఓటింగ్ జరిగిన 28 అసెంబ్లీ స్థానాల్లో 2019లో బీజేడీ 20 సీట్లు (71 శాతం) గెలుచుకోగా, 4 సీట్లు (14 శాతం) బీజేపీ, 3 సీట్లు కాంగ్రెస్ (10.71 శాతం), 1 స్వతంత్ర అభ్యర్థి చేజిక్కించుకున్నారు. కలహండి కింగ్ ఎవరో..? కలహండి లోక్సభ ఒక స్వింగ్ స్థానం. 2009లో కలహండి లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. 2014లో బీజేడీ గెలిచింది మరియు 2019లో బీజేపీ గెలిచింది. ఈసారి బీజేపీ, బీజేడీ మధ్య ప్రధాన పోరు కనిపిస్తోంది. కలహండి లోక్సభ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో, 5 సీట్లు బీజేడీ 2019లో గెలుచుకుంది. వీటిలో ధరమ్గఢ్, జునాగఢ్, లంజిగఢ్, నొర్లా మరియు నువాపడా ఉన్నాయి. మిగిలిన 2 స్థానాలను కాంగ్రెసు, బీజేపీ చెరొకటి కై వసం చేసుకున్నాయి. ఖరియార్లో కాంగ్రెస్, భవానీపట్న అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ గెలుచుకున్నాయి. కలహండి లోక్సభ స్థానం పట్ల ఉత్కంఠ బిగుసుకుని ఉంది. ఈసారి బీజేపీ, బీజేడీ హోరాహోరీగా తలపడ్డాయి. ఈ స్థానం చేజిక్కించుకోవడం ఉభయ పక్షాలు ప్రతిష్టాత్మంగా పరిగణిస్తున్నాయి. ఆసక్తికరంగా కొరాపుట్ కొరాపుట్ లోక్సభ స్థానం గతంలో కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేది. 1972 నుంచి 1998 వరకు గిరిధర్ గొమాంగో వరుసగా 8 సార్లు గెలిచారు. 1999లో కాంగ్రెస్ నుంచి ఆయన భార్య హేమా గొమాంగో గెలిపొందగా, 2004లో గిరిధర్ గొమాంగో మళ్లీ గెలిపొందారు. 2009 మరియు 2014లో బీజేడీ వరుసగా 2 సార్లు ఈ స్థానాన్ని గెలుచుకుంది. అయితే 2019లో కాంగ్రెస్కు చెందిన సప్తగిరి ఉలాకా విజయం సాధించారు. ఈసారి కాంగ్రెస్, బీజేడీ మధ్యే ప్రధాన పోరు నెలకొంది. 2019లో కొరాపుట్ లోక్సభ స్థానంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 2019లో బీజేడీ 5, కాంగ్రెస్ 1 మరియు 1 స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. ఇక్కడ బీజేపీ ఖాతా తెరవలేకపోయింది. బిసంకటక్, గుణుపురం, కొరాపుట్, లక్ష్మీపూర్, పొట్టంగి అసెంబ్లీ స్థానాలను బీజేడీ గెలుచుకుంది. జయపురం నుంచి కాంగ్రెస్, రాయగడ నుంచి స్వతంత్రులు గెలిపొందారు. మళ్లీ బీజేడీ కై వసమేనా..? సోమవారం ముగిసిన తొలి విడత పోలింగ్లో మిగతా 2 లోక్సభ స్థానాలు బరంపురం, నవరంగపూర్ స్థానాల్లో బిజూ జనతా దళ్ 2009 నుంచి వరుసగా 3 సార్లు విజేతగా నిలిచింది. ఈసారి ఈ రెండు ప్రాంతాల్లో బీజేపీ కోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోరాహోరీగా ప్రచారం చేశారు. అంతే కాకుండా నవీన్ పట్నాయక్ నేతృత్వంలో బీజేడీ తీరుని తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ ప్రభావం తాజా ఎన్నికలపై ఎంతవరకు ఉంటుందో వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. బీజేపీ వర్గీయులు మాత్రం ఈసారి ఈ 2 స్థానాలు బీజేడీ చేతి నుంచి తమకు దక్కుతాయని గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే బీజేడీ కూడా తమ పట్టుని సడలించే సత్తా ఏ వర్గానికి లేదని నమ్మకంగా ఉంది. న్యూస్రీల్ పోలింగ్ సరళిపై ఉత్కంఠ బీజేడీ, బీజేపీ మధ్య ద్విముఖ పోటీ పీఎం మోదీ, సీఎం నవీన్ ప్రభావంపై ఆసక్తికర చర్చ 2019లో జరిగిన గత ఎన్నికల పోలింగ్ కంటే సోమవారం ముగిసిన తొలి దశ పోలింగ్లో కీలకమైన లోక్సభ స్థానాల్లో పోలింగ్ శాతం తగ్గింది. బరంపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో గతసారి 65.9 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈసారి 63.34 శాతానికి పరిమితం అయింది. కలహండి లోక్స్థానం పరిధిలో పోలింగ్ పరిస్థితి ఇలానే దిగజారినట్లు ప్రాథమిక గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో 76.41 శాతం మంది ఓటు వేయగా, ఈసారి పోలింగు 75.71 శాతానికి పరిమితమైన తగ్గుముఖం పట్టింది. మిగిలిన 2 పార్లమెంటరీ నియోజకవర్గాలు కొరాపుట్ మరియు నవరంగపూర్ ప్రాంతాల్లో గతం కంటే పోలింగు స్వల్పంగా పుంజుకుంది. 2019 ఎన్నికల్లో కొరాపుట్ లోక్సభ స్థానంలో పోలింగ్ 75.34 శాతానికి పరిమితం కాగా, ఈసారి 76.98 శాతానికి పుంజుకుంది. నవరంగపూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో కూడ ఈసారి పోలింగ్ ఆశాజనకంగా సాగింది. ఈ ప్రాంతంలో గత సారి పోలింగు 79.52 శాతం రికార్డు కాగా, ఈసారి 80.22 శాతానికి పుంజుకుంది. ఈ 4 లోక్ సభ స్థానాల అనుబంధ 28 అసెంబ్లీ సెగ్మెంట్ల తొలి దశ ఎన్నికల్లో సమగ్ర పోలింగ్ పుంజుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బరంపురం, కలహండి, నవరంగపూర్, కొరాపుట్ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 28 శాసన సభ స్థానాల్లో సమగ్ర పోలింగ్ 73.29 శాతానికి పరిమితం కాగా, ఈసారి 73.97 శాతంగా రికార్డు అయింది. -
ఆహా.. తాటి ముంజెలు
ఇచ్ఛాపురం రూరల్: మండు వేసవిలో తాటి ముంజెలు నోరూరిస్తున్నాయి. వేసవిలో మాత్రమే దొరికే ఈ ప్రకృతి ప్రసాదం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అప్పుడే చెట్టుమీద నుంచి దింపే ముంజకాయలు స్వచ్ఛమైనవి, కల్తీ లేనివి, ఆరోగ్యమైనవి. ఈ పండు శరీరానికి కలిగించే చలువ వల్ల దీన్ని ‘ఐస్ యాపిల్’ అని కూడా అంటారు. ఉద్దానం ప్రాంతంలోని కొబ్బరి తోటల గట్లుపై, పంట పొలాల గట్లుపై ఈ చెట్లు విరివిగా పెరుగుతాయి. లేత తాటికాయల నుంచి అమ్మకందారులు నేర్పుగా ముంజలను వేరు చేసి వెదురు బుంగల్లో, తాటి కమ్మల్లో వేసి డజను యాభై రూపాయలు చొప్పున్న విక్రయిస్తున్నారు. -
వేసవి సెలవులకు వచ్చి..
కొత్తూరు: కొత్తూరు మండలం పారాపురం రిజర్వాయర్లో ప్రమాదవశాత్తు జారిపడి ఓ విద్యార్థి మృతి చెందాడు. బూర్జ మండలం బూర్జ గ్రామానికి చెందిన శ్రీరాంవలస విజయ, శ్రీహరిలకు ముగ్గురు పిల్లలు. విజయ కన్నవారిల్లు కొత్తూరు. వేసవి సెలవుల కోసం వారం రోజుల కిందట వీరు వచ్చారు. మంగళవారం సాయంత్రం హవీష్(14) తోటి పిల్లలతో కలిసి రిజర్వాయర్లో స్నానం చేద్దామని వెళ్లాడు. రిజర్వాయర్లోకి దిగుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి నీటిలో మునిగిపోయాడు. హవీష్ మునిగిపోవడంతో తోటి పిల్లలు సమీపంలో క్రికెట్ ఆడుతున్న యువకులకు చెప్పారు. వెంటనే వారు రిజర్వాయర్లోకి దిగి అడుగున ఉన్న హవీష్ను బయటకు తీశారు. వెంటనే అతడిని కొత్తూరు సీహెచ్సీకి తీసుకువెళ్లారు. అప్పటికే హవీష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు హవీష్ శ్రీకాకుళంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. మృతుడి తల్లి విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఏంఏ అహ్మద్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పాతపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తల్లిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. పారాపురం రిజర్వాయర్లో మునిగి బాలుడు మృతి వేసవి సెలవులకు వచ్చి మృతి చెందిన వైనం -
మెంటాడలో కొట్లాట
రణస్థలం: మెంటాడ గ్రామంలో రెండు గ్రామాల యువకుల మధ్య మద్యం మత్తులో జరిగిన గొడవ తీవ్ర ఉద్రికత్తలకు దారి తీసింది. జేఆర్ పురం పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలో మెంటాడ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం 1గంట సమయంలో విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని చింతపల్లి, మండలంలోని మెంటాడ గ్రామాలకు చెందిన యువకుల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల కొట్లాటలో గాయపడిన చింతపల్లి యువకులు గ్రామంలోనికి వెళ్లి మెంటాడ గ్రామస్తులు కొట్టారని చెప్పడంతో ఆ గ్రామానికి చెందిన సుమారు 100 మంది మెంటాడ గ్రామానికి వచ్చారు. రెండు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న జేఆర్ పురం సీఐ జి.రామచంద్రరావు సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ కొట్లాటలో మెంటాడకు చెందిన సాడి రమణ, పెంటయ్య, నూకలమ్మ గాయాలు కావడంతో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ కె.గోవిందరావు తెలిపారు. -
ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు
కాశీబుగ్గ: ఆగి ఉన్న ద్విచక్రవాహనాన్ని అత్యధిక వేగంతో ఢీకొట్టడంతో ముగ్గురు యువకులకు తీవ్రగాయాలైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వజ్రపుకొత్తూరు మండలం అనంతగిరి పంచాయతీ వెంకటాపురం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. సంతబొమ్మాళి మండలం గొదలాం గ్రామానికి చెందిన కొర్రాయి అశోక్, డొక్కరి కామరాజులు బైక్పై ఉండగా వెంకటాపురం జాతీయ రహదారిపై లొడగల భీమారావు, జనపాన వసంతరావు వారికి ఎదురుగా వచ్చి ఢీకొన్నారు. దీంతో అంతా రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. ప్రమాదంలో కొర్రాయి అశోక్కు కుడికాలు విరిగిపోగా, లొడగల భీమారావుకు, డొక్కరి కామరాజుకు తలలకు తీవ్ర గాయాలయ్యా యి. స్థానికులు స్పందించి ప్రమాద స్థలం నుంచి హుటాహుటిన వారిని ప్రభుత్వ అంబులెన్సులో పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. అత్యవసర వైద్యం అందించిన ఆస్పత్రి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యానికి టెక్కలి జిల్లా ఆస్పత్రికి ఇద్దరిని, శ్రీకాకుళం రిమ్స్కు ఇద్దరిని వేర్వేరు అంబులెన్స్లో తరలించారు. వజ్రపుకొత్తూరు పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
బెస్ట్ ఏఐ టూల్స్.. పీడీఎఫ్లోని ప్రశ్నలకు ఇట్టే సమాధానం
కళ్లతోనే మాయ చేస్తున్నగోల్డెన్ గర్ల్ని గుర్తు పట్టారా? వైరల్ వీడియో
పచ్చ కుట్రపై ఈసీ యాక్షన్
భర్తతో విడాకులు.. ట్రోల్స్ చేయడం దారుణమన్న సింగర్!
మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. ఇద్దరు భారతీయుల పాస్ పోర్టులు సీజ్
హైదరాబాద్: వర్షాలపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష
ఆమెతో బ్రేకప్కు కారణం అదే.. హీరామండి నటుడు!
TS TET Hall Ticket 2024: తెలంగాణ టెట్ హాల్టికెట్లు విడుదల..
Hyderabad Heavy Rains: హైదరాబాద్లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్ జాం (ఫొటోలు)
నమ్రతా భారీ వర్కౌట్స్ చూస్తే షాక్, ఫ్యాన్స్ ఫిదా!
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement