-
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే: సీఎం జగన్
సాక్షి, నెల్లూరు జిల్లా: ‘‘నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు. ఓ వైపు ఎన్డీఏలో కొనసాగుతూ మరో వైపు మైనార్టీలపై దొంగప్రేమ కురిపిస్తున్నాడు’’ అంటూ చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు సిటీ గాంధీ విగ్రహం సెంటర్లో బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మైనార్టీలకు ఎప్పటికీ అండగా ఉంటా.. తాము 4 శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.‘‘వెనుకబాటుకు గురైన వారి రిజర్వేషన్లు తొలగించడం కరెక్టేనా?. ఆరునూరైనా ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ముస్లింలకు మత ప్రాతిపదికన 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదు. వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్లు ఇవి. మళ్లీ ముస్లింల కోసం చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడు. చంద్రబాబు ఓ ముదిరిపోయిన తొండ. ఇది కాదా ఊసరవెల్లి రాజకీయం, ముస్లిం రిజర్వేషన్లకు చంద్రబాబు కట్టుబడి ఉన్నారా?’’ అంటూ సీఎం జగన్ నిలదీశారు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయిస్తాయని.. మరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతుందని సీఎం అన్నారు. బాబు మోసాలకు ఓడించేందుకు మీరంతా సిద్ధమా అంటూ పిలుపునిచ్చారు. లంచాలు, వివక్ష లేకుండా బటన్ నొక్కి డబ్బులు జమ చేస్తున్నాం. జగన్ పాలనలో అభివృద్ధి లేదని విష ప్రచారం చేస్తున్నారు.’’ అని సీఎం జగన్ ధ్వజమెత్తారు.‘‘కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం, ఇది కాదా అభివృద్ధి?. కొత్త 4 పోర్టులు నిర్మిస్తున్నాం, ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం.. ఇది కాదా అభివృద్ధి?. పిల్లలకు ట్యాబులు ఇస్తారని ఎవరైనా ఊహించారా?. క్వాలిటీ చదువులు అభివృద్ధి కాదా?. ఇంటి వద్దకే పెన్షన్, ఇంటి వద్దకే రేషన్. 14 ఏళ్లలో ఏరోజైనా ఇలాంటి అభివృద్ధి చేశారా?. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. 6వ తరగతి నుంచి డిజిటల్ బోధన, గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్తూ గ్రామ, వార్డు సచివాలయాలు. రైతులకు అండగా ఆర్బీకే వ్యవస్థను నెలకొల్పాం. ఉద్ధానం సమస్యను శాశ్వతంగా పరిష్కరించాం. 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు నెరవేర్చాం’’ అని సీఎం చెప్పారు.‘‘వెలిగొండలో రెండు టన్నెళ్లు పూర్తి చేశాం. ప్రకాశం జిల్లాకు నీళ్లు తరలిస్తాం. వెలిగొండ, శ్రీశైలం నుంచి నీళ్లు రాక ఫ్లోరైడ్తో జనం ఇబ్బంది పడుతుంటే ఏనాడైనా చంద్రబాబు పట్టించుకున్నాడా?. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్వన్గా నిలిచాం. మా పాలనలో రూ. 2లక్షల 70వేలు కోట్లను ప్రజల ఖాతాల్లో వేశాం. ఎంఎస్ఎంఈలకు తోడుగా ఉన్నాం. చంద్రబాబు హయాంలో రూ.32 వేల కోట్లు పెట్టబడులు వస్తే.. మీ బిడ్డ జగన్ హయాంలో రూ.లక్ష కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఈ అభివృద్ధి అంతా చంద్రబాబుకు కనిపించడం లేదా?’’ అంటూ సీఎం జగన్ దుయ్యబట్టారు. -
ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం
‘స్పందన’తో అక్రమాలు వెలుగులోకి గత ప్రభుత్వాల నేతలు, అధికారులు అండదండలతో చెలరేగిన మైనింగ్ అక్రమాలకు జగనన్నకు చెబుతాం కార్యక్రమం ద్వారా చెక్ పడిందనే చెప్పాలి. అక్రమ మైనింగ్ ద్వారా వేల కోట్లు దోచుకున్న డాన్ అక్రమాలపై గట్టుపల్లి గ్రాస్తులు జగనన్నకు చెబుదాంకు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు. ఎంపీపీ పదవి ఇస్తేనే.. రూ.వెయ్యి కోట్లకుపైగా కొల్లగొట్టాడు ● ఇక ఎమ్మెల్యే పదవిస్తే.. కావలినే కబళిస్తాడేమో! ● పాతికేళ్ల క్రితం అద్దె కట్టలేని స్థితి నుంచి రూ.వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి ● అక్రమ మైనింగ్తో ప్రకృతి సంపద దోపిడీ ● ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ● పదవి కోసం ప్రశాంతంగా ఉన్న కావలిలో చిచ్చుపెట్టేలా కుట్రలు ● డబ్బు, మద్యంతో యువతకు ఎర కావ్య కృష్ణారెడ్డి అలియాస్ దగుమాటి కృష్ణారెడ్డి.. జిల్లాలోనే మైనింగ్ మాఫియా డాన్గా ఎదిగాడు. తనకు భవిష్యత్ను ప్రసాదించిన పుట్టిన గడ్డనే విధ్వంసం చేసి రూ.వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ప్రకృతి ప్రసాదించిన ఉదయగిరి నుంచి సూళ్లూరుపేట వరకు కంకర రాయి, గ్రావెల్, ఇసుక వంటి సహజ వనరులను దోచేశాడు. ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా రియల్ వెంచర్లు వేసి విక్రయించి ప్రజలను నట్టేట ముంచేశాడు. ఒక్కసారి మండల ప్రజాపరిషత్ అధ్యక్ష పదవి ఇస్తేనే ఇదంతా చేయగలిగాడు. ఇక.. ఎమ్మెల్యే పదవిని ఇస్తే కావలి పరిస్థితి ఏమవుతుందోనని ఊహించుకుంటేనే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. కావలి: మైనింగ్ మాఫియా డాన్ కన్ను ఇప్పుడు కావలి మీద పడింది. అక్రమ మైనింగ్, క్రషర్లతో జలదంకి మండలంలో ఆయన సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ప్రశ్నించిన వారిని తన దండోపాయాలతో తొక్కేశాడు. రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె హార్బర్లు, పారిశ్రామికవాడల తో కనకపట్నంగా మారుతున్న కావలిని కబ్జా చేసేందుకు, ప్రశాంతతకు మారు పేరైన కావలిని తన అడ్డాగా చేసుకునేందుకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. డబ్బు, మందుతో యువతను, ఓటర్లను ప్రలోభపెట్టి గొడవలు సృష్టించడం ప్రారంభించాడు. సుమారు పాతికేళ్ల క్రితం కావ్య కృష్ణారెడ్డి కావలిలో అద్దె ఇంట్లో ఉంటూ కామర్స్ అధ్యాపకుడిగా జీవితాన్ని ఆరంభించారు. ఆర్థిక పరిస్థితులు చాలక అద్దె చెల్లించలేని స్థితిలో అధ్యాపక వృత్తిని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చాడు. అప్పటి రాజకీయ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని జలదంకి మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పదవిని అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్, క్వారీలతో కోట్లు కొల్లగొట్టడం ప్రారంభించాడు. రోడ్డు మెటల్ పేరుతో లీజుకు తీసుకున్న క్వారీలతో పాటు సమీపంలోని అనధికార భూముల్లో మెటల్ తవ్వేసి వందల కోట్ల రూపాయలు దోపిడీకి తెర తీశాడు. గడువు పూర్తయినా గనులను వదలకుండా సహజ వనరుల దోపిడీలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. నిబంధనలకు విరుద్ధంగా క్వారీ మైనింగ్ భూముల్లో స్టోన్ క్రషర్లు, కూలీల నివాసాలు, పెట్రోల్ బంకులు వంటివి ఏర్పాటు చేశాడు. జలదంకి మండలానికి చెందిన ఆ చోట నేత అనతికాలంలోనే మిడిల్ క్లాస్.. నుంచి వందల రూ.కోట్లు ఆర్జించి శ్రీమంతుడిగా ఎదిగాడు. స్టోన్ క్రషర్స్ పేరుతో.. గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ పేరుతో దగుమాటి వెంకటకృష్ణారెడ్డి, డి.కవిత పేర్లతో జలదంకి మండలం గట్టుపల్లిలో సర్వే నంబరు 1015లో 9.47 ఎకరాల భూమిని రోడ్డు మెటల్ తవ్వకానికి 10 ఏళ్ల కాల పరిమితితో (26.02.2008 నుంచి 25.02.2018) మైనింగ్ లీజు హక్కులు పొందారు. అదే మండలం అన్నవరంలో సర్వే నంబరు 851/2పీలో 5.36 ఎకరాల భూమిని రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ పేరుతో రోడ్డు మెటల్ తవ్వకానికి 10 ఏళ్ల కాల పరిమితితో (26.02.2008 నుంచి 25.02.2018) మైనింగ్ లీజు హక్కులు పొందారు. అయితే గట్టుపల్లి క్వారీలో టన్ను మెటల్ కూడా తవ్వకుండా అక్కడే క్రషర్లు, పెట్రోల్ బంకు, కూలీల నివాస భవనాలు, కార్యాలయం వంటివి ఏర్పాటు చేశాడు. ఈ క్వారీ నుంచి 28 వేల క్యూబిక్ మీటర్ల మెటల్ రవాణాకు పర్మిట్లు జారీ చేయడం విశేషం. ఈ క్వారీకి సంబంధించి పదేళ్ల లీజు కాలపరిమితి 2018 ఫిబ్రవరి 25వ తేదీ నాటికే పూర్తయితే 15 ఏళ్ల లీజు కాలపరిమితి పెంచమని ప్రతిపాదిస్తూ దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అది మైనింగ్ శాఖ వద్ద పరిశీలనలో ఉండడంతో ఆ లీజు కొనసాగుతూనే ఉంది. గట్టుపల్లి క్వారీ పక్కనే ఉన్న ఇతరులు, ప్రభుత్వానికి చెందిన భూముల్లో సుమారు 7 లక్షల క్యూబిక్ మీటర్ల మెటల్ను అక్రమంగా తవ్వేసినట్లు మైనింగ్శాఖ తనిఖీల్లో బట్టబయలు అయింది. అన్నవరం క్వారీకి లీజు గడువు పెంచమనే అభ్యర్థనను మైనింగ్ శాఖ తిరస్కరించింది. అన్నవరం క్వారీతో పాటు పక్కనే ఉన్న భూముల్లో కూడా అక్రమంగా మైనింగ్ చేపట్టి 5 లక్షల క్యూబిక్ మీటర్ల మెటల్ను దోచేసిన వైనం వెలుగు చూసింది. ఈ క్వారీ లీజు గడువు ముగిసినప్పటికీ ఈ ఐదేళ్లుగా గట్టుపల్లి క్వారీ పర్మిట్తోనే విచ్చలవిడిగా మైనింగ్ చేపట్టి మొత్తంగా 12 లక్షల క్యూబిక్ మీటర్ల మెటల్ను అక్రమంగా తవ్వినట్లు మైనింగ్ శాఖ లెక్కలు తేల్చింది. అక్రమంగా తవ్వేసిన మెటల్ విలువ ప్రభుత్వ పరంగా సుమారు రూ.200 కోట్లు ఉంటుందని, మార్కెట్ ధర ప్రకారం రూ.600 కోట్లు ఉంటుందని అంచనా. కావ్య కృష్ణారెడ్డి అక్రమాలపై స్థానికులు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడంతో అసలు విషయాలు బయటకు వచ్చాయి. వీటి ఆధారంగా సదరు వ్యక్తులు స్పందనలో ఫిర్యాదు చేయడంతో అసలు బాగోతం వెల్లడైంది. గుట్టు రట్టు చేసిన కరెంట్ బిల్లులు గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్, రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ పేరుతో తీసుకున్న లీజు క్వారీల్లో అక్రమ మైనింగ్ జరగలేదని తప్పించుకునేందుకు కావ్య కృష్ణారెడ్డి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. కరెంట్ బిల్లుల ఆధారంగా మైనింగ్ అధికారులు అక్రమ తవ్వకాల గుట్టును రట్టు చేశారు. క్రషర్లకు వినియోగించిన కరెంట్ బిల్లుల ఆధారంగా లెక్కలు తీయగా, 89 లక్షల యూనిట్లు వాడినట్లు తేలింది. టన్ను మెటల్ ప్రాసెస్ చేయడానికి 2.5 యూనిట్లు వినియోగం అవుతుందని లెక్కించి ఆ మేరకు 12 లక్షల క్యూబిక్ మీటర్ల మెటల్ను అక్రమంగా తవ్వేసినట్లు నిర్ధారించారు. విజయవాడ నుంచి వచ్చిన మైనింగ్ అధికారులు తనిఖీలు చేస్తే విస్తుబోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అనుమతులు లేకుండానే వేల కోట్ల విలువైన సహజ వనరులను దోచుకున్నట్లు గుర్తించి రూ.140 కోట్లు జరిమానా విధించారు. అయితే కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుని కాలక్షేపం చేస్తున్నాడు. గురు రాఘవేంద్ర కాంక్రీట్ మిక్సర్ ప్లాంట్లతో.. కావ్య కృష్ణారెడ్డి అక్రమాల దందా ఈనాటి కాదు. కొన్నేళ్ల క్రితమే నెల్లూరు పెన్నానది, నాయుడుపేటలోని స్వర్ణముఖి నది తీరంలో గురు రాఘవేంద్ర కాంక్రీట్ మిక్సర్ ప్లాంట్లు ఏర్పాట్లు చేసి కోట్లు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ఈ యూనిట్కు కంకర, సిమెంట్ కొనుగోలు చేసినా.. ఇసుకను మాత్రం నదీ తీరాల్లోనిదే వాడినట్లు సమాచారం. ఈ రెండు ప్లాంట్ల నుంచి అను నిత్యం వందల ట్యాంకర్ల కాంక్రీట్ మిక్సర్ వ్యాపారం జరుగుతోంది. గతంలో ఇసుక ఉచితంగా ఉండేది. దీంతో యథేచ్ఛగా రూపాయి ఖర్చు లేకుండా నదీ తీరాలను నాశనం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక నూతన ఇసుక పాలసీ అమల్లోకి వచ్చింది. ఇసుకకు ధర నిర్ణయించింది. అయితే గురు రాఘవేంద్ర కాంక్రీట్ మిక్సర్ ప్లాంట్లలో ఈ ఐదేళ్లలో ఎంత ఇసుక వినియోగించారు.. ఎక్కడ కొనుగోలు చేశారనే వివరాల్లోకి వెళ్తే ఇక్కడి అక్రమాలు కూడా బట్టబయలు అవుతాయి. ఈ రెండు క్రషన్ల వద్ద కరెంట్ వినియోగాన్ని లెక్కిస్తే మరి కొన్ని నిజాలు కూడా వెలుగు చూస్తాయి. నా పోరాటం ఫలించింది – గుమ్మలపాటి సుబ్బారావు, గట్టుపల్లి పంచాయితీ ఉప సర్పంచ్ గురు రాఘవేంద్ర స్టోన్ క్రషన్ యజమాని డీవీ కష్ణారెడ్డి ఏళ్ల కాలంగా సహజ వనరులను దోచుకుంటున్నాడు. మా గట్టుపల్లి పంచాయతీలో సహజ వనరులు దోచుకుంటున్నా ఒక్క రుపాయి కూడా పంచాయతీకి సీనరేజ్ చెల్లించేవాడు కాదు. అతని అక్రమాలపై తొమ్మిదేళ్లుగా పోరాటం చేస్తున్నందుకు మా కుటుంబంపై దాడులు చేయించాడు. పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నా తొమ్మిదేళ్ల పోరాటానికి జగనన్నకు చెబుతాం ద్వారా నా కల నెరవేరింది.– దివి నరేంద్ర చౌదరి, గట్టుపల్లి, జలదంకి మండలం గురు రాఽఘవేంద్ర స్టోన్ క్రషన్ ద్వారా కావ్య కృష్ణారెడ్డి గట్టుపల్లి పంచాయతీలో దోపిడీ చేస్తున్నారు. అనుమతులు లేకుండా సహజ వనరులను దోచుకుంటున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మైనింగ్ అక్రమాలపై చర్యలు తీసుకోవడం మాకు సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. -
నెల్లూరులో హోమ్ ఓటింగ్ ప్రారంభం
● తొలిరోజు 94 మంది ఓటర్లు వినియోగం నెల్లూరు (బారకాసు): భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు 85 ఏళ్లు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు హక్కు కల్పించే హోమ్ ఓటింగ్ ప్రక్రియ నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో శుక్రవారం ప్రారంభమైంది. ఇందు కోసం నమోదు చేసుకున్న వారి ఇళ్ల వద్దకు ప్రత్యేకంగా కేటాయించిన పలువురు అధికారులు, సిబ్బంది వెళ్లి వారి నుంచి ఓటు సేకరించే ప్రక్రియ చేపట్టారు. మొత్తం 153 మంది హోమ్ ఓటింగ్కు దరఖాస్తు చేసుకోగా తొలి రోజు 94 మంది తమ ఓటు హక్కును ఇంటి వద్దనే వినియోగించుకున్నారు. -
ప్రతి కుటుంబానికి సంక్షేమం
కోవూరు: జిల్లాలో వైఎస్సార్సీపీ కంచుకోట నియోజకవర్గాల్లో కోవూరు ఒకటి. మరోసారి అది నిరూపితం కానుందనే ప్రజాభిప్రాయం బలంగా వినిపిస్తోంది. 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి వైఎస్సార్ మరణం తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతుగా నిలిచారు. తన ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా వదులుకున్నారు. ఆ పార్టీ తరఫున ఉమ్మడి రాష్ట్రంలో రెండో ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్రను లిఖించారు. ‘అసెంబ్లీ టైగర్’గా ‘నల్లపరెడ్డి’ బ్రాండ్కు రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో గుర్తింపు ఉంది. దివంగత నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి జిల్లా రాజకీయాలను శాసించారు. ఆయన రాజకీయ వారసుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి రాజకీయ ఆరంగేట్రం నుంచి ఇప్పటి వరకు ఎనిమిది సార్లు పోటీ చేసి ఆరు సార్లు విజయకేతనం ఎగుర వేశారు. కోవూరు ప్రజల ఆత్మబంధువుగా మారారు. ఆయన రెండు దఫాలు ఓటమి పాలైనా అత్యంత స్వల్ప ఓట్ల తేడానే ఓడిపోయారు. 2012 ఉప ఎన్నికల్లో 14.64 శాతం ఆధిక్యం 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ప్రసన్నకుమార్రెడ్డి ఆర్థికంగా బలవంతులతో పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో పోల్ అయిన ఓట్లలో 42 శాతం ఓట్లతో ‘వైఎస్సార్సీపీ రెండో ఎమ్మెల్యే’గా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అదే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డికి 28.64 శాతం ఓట్లు వస్తే.. అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి 23.53 శాతం ఓట్లు వచ్చాయి. వైఎస్సార్సీపీ తన సమీప ప్రత్యర్థి టీడీపీ కంటే 14.64 శాతం ఓట్ల ఆధిక్యతను సాధించింది. 2014లో 0.3 శాతం ఓట్ల తేడాతో ఓటమి 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రసన్నకుమార్రెడ్డి అత్యంత స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అప్పటి వరకు ఆయన వెన్నంటే ఉన్న మండల స్థాయి లీడర్లంతా వెన్నుపోటు పొడిచి టీడీపీలోకి వెళ్లిపోయారు. ఆ ఎన్నికల్లో టీడీపీకి 44.9 శాతం ఓట్లు వస్తే.. వైఎస్సార్సీపీ అభ్యర్థి ప్రసన్నకుమార్రెడ్డికి 44.6 శాతం ఓట్లు వచ్చాయి. అందరూ వెన్నుపోటు పొడిచి వెళ్లినా.. అత్యంత ప్రజాదరణతో కేవలం 0.3 శాతం ఓట్లతో ప్రసన్నకుమార్రెడ్డి ఓటమి పాలయ్యారు. 2019లో 19.41 శాతం ఆధిక్యత 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో పోల్ అయిన ఓట్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ప్రసన్నకుమార్రెడ్డికి 56.55 శాతం ఓట్లు లభించగా, టీడీపీ అభ్యర్థి పోలంరెడ్డికి కేవలం 37.14 శాతం ఓట్లు పడ్డాయి. ఈ లెక్కన వైఎస్సార్సీపీ 19.41 శాతం ఓట్ల ఆధిక్యతను సాధించింది. 2012 ఉప ఎన్నికల్లో టీడీపీపై 14.64 శాతం ఓట్ల ఆధిక్యం 2014 ఎన్నికల్లో కేవలం 0.3 శాతం ఓట్ల తేడాతో ఓటమి 2019 ఎన్నికల్లో టీడీపీపై 19.41 శాతం తేడాతో విజయం ఈ దఫా ఎన్నికల్లో ఈ శాతం మరింతగా పెరిగే అవకాశంగడిచిన ఐదేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధితో గతంలో వైఎస్సార్సీపీకి ఓటు వేయని వారు సైతం ఈ దఫా ఎన్నికల్లో కచ్చితంగా వేస్తారనే ధీమాతో ఆ పార్టీ ఉంది. గత ఎన్నికల్లోనే వైఎస్సార్సీపీని చేరుకోలేనంతగా టీడీపీ కంటే 19.41 ఓట్ల శాతం తేడా ఉందని, ఈ దఫా ఎన్నికల్లో ఇది మరింతగా పెరిగి అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చెబితే చేస్తాడనే నమ్మకం ప్రజల్లో ఉంది. చంద్రబాబు ఎన్నికల కోసమే హామీలిస్తాడనే అభిప్రాయం బలంగా ఉంది. తాజాగా ప్రకటించిన రెండు పార్టీల మేనిఫెస్టోలను పోల్చుకుంటున్న ప్రజలు ఈ దఫా కూడా వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి. -
No Headline
కోవూరులో మళ్లీ ప్రసన్న వదనం వికసించనుంది. గడిచిన ఎన్నికల ఫలితాలు, తాజా రాజకీయ పరిణామాలు ఎన్నికల ముందే ఫలితాలు చెబుతున్నాయి. శత్రువును సైతం ‘అన్నా.. అని ఆప్యాయతగా పిలిచే వ్యక్తిత్వం ఆయన ఆభరణం. కష్టంలో వస్తే.. కరిగిపోయి అభయహస్తం అందించే దయా గుణం ఆయన సొంతం. అందుకే ఆయన్ను కోవూరు తన గుండెల్లో దాచుకుంది. కోవూరు అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సార్లు పోటీ చేసిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆరు దఫాలు అప్రతిహత విజయాన్ని అందుకున్నారు. మరోసారి వైఎస్సార్సీపీ జెండా ఎగరవేయడానికి ప్రజలు ‘సిద్ధం’ అంటున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement