-
మారిన రాజకీయ పరిస్థితులు..
అప్పటికి ఇప్పటికీ రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహించారు. అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా దండే విఠల్ను ప్రకటించినప్పటికీ పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తూ ఇదే పార్టీలో ఉన్న సారంగాపూర్ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి కూడా నామినేషన్ వేశాడు. ఉపసంహరణ విషయంలో అప్పుడు మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ పత్తిరెడ్డి దిగిరాలేదు. ఇదిలా ఉంటే ఆరోజు 24 మందిలో 22 మంది నామినేషన్ ఉపసంహరించుకున్నారని ఎన్నికల అధికారులు ప్రకటించారు. అందులో పత్తిరెడ్డి కూడా ఉన్నట్టు కూడా తెలిపారు. అయితే తన ప్రమేయం లేకుండానే ఫోర్జరీ సంతకాలతో తన నామినేషన్ను బీఆర్ఎస్ నేతలు ఉపసంహరింపజేశారని ఆయన ఆరోపించాడు. దీనిపై హైకోర్టును ఆశ్రయించాడు. తాజాగా తీర్పు వెలబడింది. కాగా ప్రస్తుతం మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి ఇద్దరూ కాంగ్రెస్లోనే ఉండటం గమనార్హం. -
ఆదాయపన్ను రద్దుకు కృషి
● కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తాం ● పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణకాసిపేట: సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేర్చి ఆదాయపన్ను రద్దు కృషి చేస్తానని పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తెలిపారు. శుక్రవారం మందమర్రి ఏరియా కాసిపేట గనిపై ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్యలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను కార్మికులు తిప్పికొట్టాలన్నారు. దేశ సంపదను కార్పొరేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ మతతత్వ రాజకీయాలు చేస్తున్న నరేంద్ర మోదీ, బీజేపీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేష్, సీపీఐ నాయకులు చిప్ప నర్సయ్య, మిట్టపల్లి వెంకటస్వామి, అక్బర్ఆలీ, సత్యనారాయణ, వెంకటస్వామి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్, మాజీ జెడ్పీటీసీ రౌతు సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కూలి పెంచుతాం మండలంలోని పల్లంగూడ, గుర్వాపూర్ గ్రామ పంచాయతీల్లో ఉపాధిహామీ కూలీలను కలిసి ఎమ్మెల్యే వినోద్, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో వచ్చిన వెంటనే ఉపాధిహామీ కూలీలకు రోజువారీ కూలి రూ.400 పెంచనున్నట్లు తెలిపారు. భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. -
ఆర్టీసీ ఉద్యోగులకు ఆరోగ్యపరీక్షలు
● రెండు జిల్లాల్లో 616 మందికి పరీక్షలు ● మెరుగైన వైద్యానికి ఏడుగురుకి సిఫారసు మంచిర్యాలఅర్బన్: పని ఒత్తిడి, అవిశ్రాంతితో ఆర్టీ సీ ఉద్యోగులు, సిబ్బంది ఆందోళనకు గురవుతున్నా రు. వీరి అనారోగ్య పరిస్థితులను గమనించిన ఆర్టీ సీ యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించింది. ప్ర యాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలంటే వారందరూ ఆరోగ్యంగా ఉండాలని భావించింది. టీఎస్ఆర్టీసీ గ్రాండ్ హెల్త్ చాలెంజ్లో భాగంగా మంచిర్యాల డిపోలో ఏప్రిల్ 18నుంచి 25వరకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మధుమేహం, రక్తపోటు, ఈసీజీ, కంటిపరీక్షలు, గుండె తదితర 17రకాల పరీక్షలు చేశారు. మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 647మంది ఉద్యోగులు, సి బ్బందిలో 616మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో గుండె సంబంధిత వ్యాధులు, ఇతర జబ్బులతో బాధపడుతున్న ఏడుగురు కార్మికులకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాలకు రెఫర్ చేశారు. పని ఒత్తిడిలో.. నిత్యం పని ఒత్తిడిలో ఉండడంతో ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గిపోయే అవకాశాలున్న నేపథ్యంలో డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందికి పరీక్షలు నిర్వహించింది. బస్సు నడిపే ప్రతీ డ్రైవర్కు గంట తర్వాత 15నిమిషాలు విశ్రాంతి ఇవ్వాలని చట్టం చెబుతోంది. కనీస సమ యం, విశ్రాంతి ఇవ్వడం లేదు. ఇదివరకు స్పెషల్ ఆఫ్ నడిచే బస్సులను డే అవుట్గా మార్చడం వల్ల కార్మికులు నష్టపోతున్నారు. స్పెషల్ ఆఫ్ బస్సులు నడిపితే మరుసటి రోజు విశ్రాంతి ఇచ్చేవారు. ఇ ప్పుడు డే అవుట్లో కూడా అదనంగా డ్యూటీ చే సిన గంటలను సాంకేతిక కారణాలు చూపుతూ కు దిస్తున్నారు. సెలవుల పొజిషన్ లేదంటూ దాట వేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని బస్సుల్లో ఒక్క చోట బస్సు నిలపడం తర్వాత స్టీరింగ్ పట్టుకుంటే గమ్యస్థానానికి చేరడం జరుగుతుంది. కొంతమందికి విశ్రాంతి ఉన్నా చాలామందికి వెంటనే తిరుగు ప్రయాణం చేస్తున్నారు. ఇలా డ్యూటీ చేసుకుని వచ్చిన వెంటనే మళ్లీ విధులకు వెళ్తున్న సందర్భాలు అనేకం. బస్సుల్లో కూర్చునే సీట్లు అనువుగా లేకపోవడంతో అనేకమంది వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఆయా ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేసి నైట్ హాల్ట్ చేసే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు విశ్రాంతి ఎక్కడ తీసుకోవాలో అర్థంకాని ప్రశ్నే. దీంతో నిద్రలేమి, ఒత్తిడికి గురవుతూ అనారోగ్యం పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రాథమిక దశలోనే డ్రైవర్లు, సిబ్బంది ఆరోగ్య వివరాలు తెలుసుకునేందుకు టీఎస్ ఆర్టీసీ గ్రాండ్ హెల్త్ చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు చేపట్టారు. తీవ్ర సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి మెరుగైన వైద్య చికిత్సలకు సిఫారసు చేశారు. -
మాజీ సీఎం హామీ నెరవేర్చలేదని నిరసన
మంచిర్యాలటౌన్: మంచిర్యాల–అంతర్గాం మధ్య గోదావరినదిపై వంతెన నిర్మాణానికి 2018లో సీఎం హోదాలో ఇచ్చిన హామీని కేసీఆర్ నెరవేర్చలేదని, శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాలకు వస్తుండడంపై గోదావరి వంతెన సాధన సమితి సభ్యులు శుక్రవారం స్థానిక కాలేజీ రోడ్డులోని గోదావరి నది వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు తులా మధుసూదన్రావు మాట్లాడుతూ కేసీఆర్ జిల్లాకు ఏం చేశారని లోక్సభ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తున్నారని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాట ఇచ్చి తప్పారని, మందమర్రిలో లెదర్పార్కు ఏర్పాటు హామీలకే పరిమితమైందని పేర్కొన్నారు. గత వర్షాకాలం వరదల్లో మంచిర్యాల నీట మునిగినా, పంటలు నష్టపోయినా పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. జిల్లా ప్రజలు కేసీఆర్ మాటలను నమ్మే పరిస్థితి లేదని, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నల్ల నాగేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు పట్టింపులకు పోకుండా టెండర్లు పూర్తయిన వంతెన నిర్మాణ పనులను ప్రారంభించేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలకుంట్ల మల్లయ్య, బానోతు దాస్య, ఐ.శివకుమార్ పాల్గొన్నారు. -
మంచిర్యాలలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
నస్పూర్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మంచిర్యాలలో రోడ్ నిర్వహించనున్న నేపథ్యంలో రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పట్టణ సీఐ బన్సీలాల్ ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ట్రాఫిక్ మళ్లింపు ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ● చెన్నూర్, గోదావరిఖని, జైపూర్ నుంచి బెల్లంపల్లికి వెళ్లాల్సిన వాహనాలు శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం జంక్షన్ నుంచి నేషనల్ హైవే మీదుగా వెళ్లాలి. ● లక్సెట్టిపేట, హాజీపూర్ వైపు నుంచి బెల్లంపల్లి, శ్రీరాంపూర్, సీసీసీ నస్పూర్, జైపూర్, గోదావరిఖని వైపునకు వెళ్లాల్సిన వాహనాలు వయా బైపాస్ రోడ్డు గద్దె రాగడి, క్యాతన్పల్లి మీదుగా నేషనల్ హైవే ద్వారా వెళ్లాలి. ● బెల్లంపల్లి, మందమర్రి వైపు నుంచి గోదావరిఖని వైపు వెళ్లాల్సిన వాహనాలు మంచిర్యాల పట్టణం మీదుగా కాకుండా నేషనల్ హైవే మీదుగా వెళ్లాలి. ● మంచిర్యాల నుంచి సీసీసీ నస్పూర్, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, గోదావరిఖని వైపునకు వెళ్లాల్సిన వాహనాలు గద్దెరాగడి క్యాతన్పల్లి మీదుగా నేషనల్ హైవే పై నుంచి వెళ్లాలి. ● మంచిర్యాల నుంచి హాజీపూర్, లక్సెట్టిపేట వైపునకు వెళ్లాల్సిన వాహనాలు లక్ష్మీ థియేటర్ చౌరస్తా నుంచి బైపాస్ రోడ్డు మీదుగా వెళ్లాలి. ● సాధారణ ప్రయాణికులు, కార్లు, ఆటోలు, బైకులు బెల్లంపల్లి చౌరస్తా నుంచి ఐబీ వైపునకు, పాత మంచిర్యాల వైపు నుంచి ఐబీ వైపునకు, సీసీసీ నస్పూర్ వైపు నుంచి ఓవర్ బ్రిడ్జి వైపునకు అనుమతి లేదు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
టీడీపీపై ఎన్నికల సంఘం సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement