-
పచ్చ కుట్రపై ఈసీ యాక్షన్
సాక్షి, ఢిల్లీ: ఏపీలో ఎన్నికల అనంతరం హింసపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంది. హింసపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసింది. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని సిట్ను ఈసీ ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేసింది. పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీపై ఈసీ బదిలీ వేటు వేయగా, పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెన్షన్ చేసింది.పల్నాడు, అనంతపురం, తిరుపతి లోని 12 మంది సబ్బార్డినేట్ పోలీస్ అధికారులను సస్పెండ్ చేసిన ఈసీ.. శాఖపరమైన విచారణ చేపట్టాలని ఆదేశించింది. అల్లర్లకు పాల్పడిన వారిపై ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ఈసీ ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించిన ఈసీ.. 25 కంపెనీల పారా మిలటరీ బలగాలను కొనసాగించాలని పేర్కొంది.అనంతపురం: జేసీ వర్గానికి వత్తాసు పలికి..తాడిపత్రిలో జేసీ వర్గానికి వత్తాసు పలికిన అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ను ఈసీ సస్పెండ్ చేసింది. ఎన్నికల పోలింగ్ సమయంలో ఎస్పీ వివాదాస్పదంగా వ్యవహరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వందల మంది టీడీపీ కార్యకర్తలతో సంచరిస్తున్నా ఎస్పీ పట్టించుకోలేదు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడి చేసినా కానీ ఎస్పీ అమిత్ బర్దర్ సకాలంలో స్పందించలేదు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేసేలా ఎస్పీ ఆదేశాలను చేసిన ఎస్పీ.. ఎన్నికల వేళ రౌడీషీటర్లను కూడా బైండోవర్ చేయలేదు.తిరుపతి: సర్పంచ్ ఇంటికి టీడీపీ మూకలు నిప్పు.. స్పందించని ఎస్పీచంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన ఘర్షణలపై ఈసీ సీరియస్ అయ్యింది. తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్పై సస్పెన్షన్ వేటు వేసింది. చంద్రగిరి మండలం రామిరెడ్డిగారి పల్లి పంచాయితీ కూచి వారి పల్లి లో సర్పంచ్ కోటాల చంద్ర శేఖర్ రెడ్డి ఇంటిపై టీడీపీ మూకలు దాడి చేశారు. సర్పంచ్ ఇంటికి టీడీపీ శ్రేణులు నిప్పు పెట్టి.. దాడి చేసినా కానీ సకాలంలో ఎస్పీ స్పందించలేదు.కాగా, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరయ్యారు. రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తరువాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవటాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దీనిపై స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్.జవహర్రెడ్డి, డీజీపీ హరీశ్కుమార్ గుప్తాను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఢిల్లీ వెళ్లి ఈసీకి వివరణ ఇచ్చారు.పోలింగ్ అనంతరం పల్నాడు, కారంపూడి, చంద్రగిరి, తాడిపత్రిలో ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి హెచ్చరించినా స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించటాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ బాధ్యులపై చర్యలు చేపట్టింది. -
విశాఖలో జూన్ 9న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం: మంత్రి బొత్స
సాక్షి, విజయవాడ: సీఎం జగన్ విద్య, వైద్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జూన్ 9న విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ చేసేదే చెప్తారు.. మంచి జరిగే నిర్ణయాలనే తీసుకుంటారన్నారు.ప్రజలంతా మళ్లీ ముఖ్యమంత్రిగా జగనే ఉండాలని కోరుకున్నారు. టీడీపీ అసహనంతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. ఎన్నికల్లో సీఎం జగన్ కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. వైనాట్ 175 లక్ష్యానికి దగ్గరగా సీట్లు గెలవబోతున్నాం. మరోసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రావాలనే విధంగా ప్రజలు ఓటింగ్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని వర్గాలవారిని సమానంగా చూసిన వ్యక్తి సీఎం జగన్ ఎన్టీఆర్, వైఎస్సార్ హయాంలో వచ్చిన పాజిటివ్ వైబ్రేషన్స్ ఇప్పుడు మళ్లీ వస్తున్నాయి.’’ మంత్రి బొత్స చెప్పారు.‘‘మేము అధికారంలోకి రాగానే అందరూ తోక ముడుస్తారు. టీడీపీ అసహనంతో దాడులు చేసింది. మేము సంయమనం పాటిస్తున్నాం. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓట్లు వేయండని ధైర్యంగా చెప్పిన వ్యక్తి జగన్. గతంలో చంద్రబాబు హామీలు ఇచ్చి మాట తప్పారు. బాబుకు అధికారం ఇస్తే మళ్లీ కష్టాలు వస్తాయి.. మళ్లీ పెత్తందారులు వస్తారని ప్రజలు భయపడ్డారు. చంద్రబాబుది మేకపోతు గాంభీర్యం’’ అంటూ మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
సాక్షి, ఢిల్లీ: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భేష్ అన్న నీతి ఆయోగ్.. ఈ చట్టం తో రైతుల భూములు లాక్కునే పరిస్థితి ఉండదని స్పష్టం చేసింది. ఈ చట్టం వల్ల భూములన్నీ మరింత భద్రం అని.. భూములపై రైతులకు సర్వహక్కులు లభిస్తాయని పేర్కొంది.పటిష్టమైన భూ యాజమాన్య నిర్వహణకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని.. ఈ చట్టంతో భూ పరిపాలన మరింత సులువవుతుందన్న నీతి ఆయోగ్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారానికి చెక్ పెట్టింది. సాక్షి డిప్యూటీ ఇన్ పుట్ ఎడిటర్ వెంకటేష్ అడిగిన ఆర్టీఐ ప్రశ్నకు నీతి ఆయోగ్ సమాధానం పంపింది.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్” కు వ్యతిరేకంగా జరిగిన విస్తృత ప్రచారానికి నీతి అయోగ్ వివరణతో రైతుల్లో భరోసా, నమ్మకం పెరగనుంది. ఇక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై రైతుల అనుమానాలు తొలగనున్నాయి. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై రైతులను తప్పుదోవ పట్టించిన ప్రచారానికి చెల్లు చీటీ పడింది.అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే నీతి ఆయోగ్ సమాధానం పంపింది. నీతి ఆయోగ చైర్మనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కాగా, టీడీపీ-జనసేన కూటమి దుష్ప్రచారానికి ఇక చెక్ పడినట్లే.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్తో రైతులకు టైటిల్ పై పరిపూర్ణ హక్కుల లభిస్తాయని ఇప్పటికే సీఎం జగన్ స్పష్టం చేశారు. సీఎం జగన్ మాటనే బలపరుస్తూ నీతి ఆయోగ్ సమాధానం ఇచ్చింది. ఈ అంశంతో మరోసారి విశ్వసనీయతకు సీఎం జగన్ మారుపేరుగా నిలిచారు.కాగా, ఓటమి భయంతో చంద్రబాబు గ్యాంగ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై ప్రజల్లో లేనిపోని అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేసింది. చెప్పుకోవడానికి చంద్రబాబుకు ఏమీ లేక వైఎస్ జగన్పైన, ఆయన ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసి, ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగానే ప్రజల భూములపై వారికే హక్కులు కల్పించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం తెస్తున్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై నీచమైన ప్రచారానికి ఒడిగట్టింది. భూముల వ్యవస్థను సమూలంగా మార్చడం ద్వారా ప్రజలకు.. తద్వారా సమాజానికి, రాష్ట్రానికి ఎంతో మేలు చేసే ఈ చట్టాన్ని స్వలాభం కోసం వివాదాస్పదంగా మార్చింది.భూముల సమగ్ర సర్వే ద్వారా భూమి రికార్డులను ఆధునీకరించి వాటిపై ప్రజలకు శాశ్వత భూ హక్కులు కల్పించేదే ల్యాండ్ టైట్లింగ్ చట్టం. దీనివల్ల రికార్డుల భద్రత, రిజిస్ట్రేషన్లలో పారదర్శకత, ఆస్తుల రక్షణకు ప్రభుత్వ గ్యారంటీ లభిస్తాయి.ప్రస్తుతం భూమి హక్కులు అంటే కనీసం 30 రికార్డులు చూసుకోవాలి. అన్ని వివరాలూ స్పష్టంగా ఉన్నా, 30 పత్రాలు బాగున్నా ఏదో ఒక విధంగా కేసులు పెట్టే పరిస్థితి ఉంది. దీంతో ఏ భూమినైనా వివాదాస్పదంగా మార్చొచ్చు. వివాదంలో ఉన్న భూమిని తిరిగి భూ యజమాని తన పేరు మీదకు తెచ్చుకోవాలంటే కోర్టుకే వెళ్లాలి. ఏళ్లకు ఏళ్లు వేచి చూడాలి. కింది కోర్టు, పైకోర్టు అంటూ తిరగాలి. ఈ అవస్థలన్నింటినీ తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తీసుకువచ్చింది. -
గవర్నర్ను కలిసిన వైఎస్సార్సీపీ బృందం
సాక్షి, విజయవాడ: రాజ్ భవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ని మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ బృందం గురువారం కలిసింది. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత వైఎస్సార్సీపీపై టీడీపీ చేసిన దాడులపై గవర్నర్ అబ్దుల్ నజీర్కి ఫిర్యాదు చేశారు. పల్నాడు, అనంతపురం తదితర జిల్లాలలో పోలీసు అధికారుల వైఫల్యం పైనా వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది.పోలీస్ అధికారులను ఈసీ మార్చిన చోటే హింసాత్మక సంఘటనలు ఎక్కువ చోటుచేసుకున్నాయని వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే టీడీపీ కార్యకర్తలు హింసాత్మక ఘటనలకి దిగారని.. చంద్రబాబుతో పాటు ఘటనకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో వైఎస్సార్సీపీ పేర్కొంది. మంత్రి బొత్సతో పాటు గవర్నర్ని కలిసిన వారిలో మేరుగ నాగార్జున, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, మోపిదేవి వెంకట రమణ, కావలి మనోహర్ నాయుడు తదితరులు ఉన్నారు.బాబు ప్రోద్భలంతోనే టీడీపీ కార్యకర్తలు దాడులు: మంత్రి బొత్స బాబు ప్రోద్భలంతోనే టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగారు. బాబుతో పాటు హింసకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింస ఆందోళన రేపుతోంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసుల పనితీరుపై ఫిర్యాదు చేశాము. అబర్వర్ దీపక్ మిశ్రా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ వాళ్లు ఫిర్యాదు చేస్తే విచారణ లేకుండా చర్యలు తీసుకున్నారు. అబర్వర్ గా ఉన్న దీపక్ మిశ్రా పై న్యాయ విచారణ చేయాలి. ఎన్నికల సంఘం నుంచి రిపోర్ట్ తెచ్చుకుని దీపక్ మిశ్రాను మార్చాలని కోరాముదీపక్ మిశ్రా అధికారులను బెదిరిస్తున్నారు: పేర్ని నానిఉద్దేశ పూర్వకంగా దీపక్ మిశ్రాను ఏపీలో ఎన్నికల కోసం బీజేపీ-టీడీపీ తెచ్చింది. అతని వల్లే ఈ విధ్వంసం. రాష్ట్రంలో హింస జరుగుతున్న ప్రాంతాల్లో వారితో సీఎం జగన్ ఇప్పటికే మాట్లాడారు. సంయమనంతో ఉండాలని పార్టీ శ్రేణులకు జగన్ చెప్పారు. దీపక్ మిశ్రా విజయవాడ వచ్చిన దగ్గర నుంచి టీడీపీ సానుభూతి పరులైన రిటైర్డు అధికారులను కలిశారు. జిల్లా ఎస్పీలను కూడా మిశ్రా బెదిరిస్తున్నారు. పోలింగ్ పూర్తయినా కూడా దీపక్ మిశ్రా ఏపీ వదిలి వెళ్లటం లేదు. జిల్లాల్లో ఉన్న అందరూ అధికారులను లొంగ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీపక్ మిశ్రా స్థానంలో సర్వీస్లో ఉన్న అధికారిని ఏర్పాటు చేయాలని గవర్నర్ను కోరాము -
ఈసీ ముందుకు ఏపీ సీఎస్, డీజీపీ
సాక్షి, ఢిల్లీ: ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరయ్యారు. రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తరువాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవటాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దీనిపై స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్.జవహర్రెడ్డి, డీజీపీ హరీశ్కుమార్ గుప్తాను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఢిల్లీ వెళ్లి ఈసీకి వివరణ ఇచ్చారు.కాగా, పోలింగ్ అనంతరం పల్నాడు, కారంపూడి, చంద్రగిరి, తాడిపత్రిలో ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి హెచ్చరించినా స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించటాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. కొంత మంది పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని, ప్రేక్షక పాత్ర పోషించారని కేంద్ర పరిశీలకులు ఈసీకి నివేదిక ఇచ్చారు.సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి బందోబస్తు ఏర్పాట్లు చేసినా అక్కడ పోలీసు ఉన్నతాధికారులను ఈసీ హఠాత్తుగా బదిలీ చేయడంతోనే సమస్యలు ఉత్పన్నమైనట్లు అధికార యంత్రాంగం భావిస్తోంది. కొత్త అధికారులకు క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర అవగాహన లేకపోవడంతో కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. -
‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
ఏపీ రాజకీయ చరిత్రలోనే వైఎస్సార్సీపీ సరికొత్త చరిత్ర లిఖించబోతుంది. ‘ఫ్యాన్’ ప్రభంజనం సృష్టించబోతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనకు ప్రజలు జైకొట్టారు. ప్రతిపక్షాలు, పచ్చ బ్యాచ్ దిమ్మతిరిగిపోయే విధంగా ప్రజలు తీర్పునిచ్చినట్టు సీఎం జగన్ ప్రకటన చేశారు.సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టిన నాటి నుంచి ప్రజలే తనకు స్టార్ క్యాంపైనయిర్స్ అని చెప్పారు. తాను నమ్మకుంది ఆ దేవుడు, ప్రజలనేనని అన్ని వేదికలపైనా ప్రస్తావించారు. ఇక, సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందితేనే వైఎస్సార్సీపీకి ఓటు వేయాలని కోరారు. ఆయన మాటలు ప్రతీ ఒక్క కుటుంబాన్ని చేరుకున్నాయి. సీఎం జగన్ చేసిన సాయాన్ని ఎవరూ మరిచిపోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వం పట్ల, పాలన పట్ల నమ్మకం ఉంచారు.అందుకే 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకే భారీగా ఓట్లు వేశారు. రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరగడం కూడా ఇందుకు ఒక ఉదాహారణ. ఇక, 2019లో వచ్చిన సీట్ల కన్నా ఈసారి మరిన్ని ఎక్కువ సీట్లు వస్తాయని సీఎం జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, సీఎం జగన్ ఇప్పటి వరకు చేసిన ఏ ప్రకటన అయినా ఆచితూచి మాత్రమే చేశారు.పేదలు వర్సెస్ పెత్తందారులు అన్న ఎన్నికల నినాదాన్ని ముందుకు తీసుకెళ్లిన సీఎం జగన్.. ఈసారి వచ్చే ఫలితాలు ప్రభంజనం సృష్టిస్తాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా విజయంపై కచ్చితమైన సమాచారంతోనే ఆయన ఇలాంటి ప్రకటన చేశారని రాజకీయ వర్గాలు సైతం చెబుతున్నాయి. సీఎం జగన్ సంచలన ప్రకటనతో కూటమి నేతలు డీలా పడినట్టు తెలుస్తోంది.అయితే, ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా ప్రాక్టికల్గా ఉండే వ్యక్తి. ఆయన ఏ పని చేసినా పూర్తి పారదర్శకంగా ఉంటారు. వేర్వేరు సమీకరణాలు అన్నీ పరిశీలించి ముందడుగు వేస్తారు. ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల మార్పు సమయంలో కూడా కచ్చితమైన నిర్ణయాలే తీసుకున్నారు. ప్రతిపక్షాలు, సీఎం జగన్ అంటే గిట్టని వారు ఎన్ని కామెంట్స్ చేసినా ఆయన అవేవీ పట్టించుకోకుండా ముందుకుసాగారు. ఎంతో దమ్ము, ధైర్యంతో అభ్యర్థులను మార్చారు. ఒక నాయకుడిగా తన నాయకత్వం మీద, పార్టీ మీద, పాలన మీద ఉన్న నమ్మకాన్ని ఈ ప్రకటన సంకేతంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, ఏపీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ఫస్ట్ రియాక్షన్ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు టైట్ ఫైట్, ఎవరికి ఎడ్జ్ తెలియదన్నట్టుగా వార్తలు రాసుకొచ్చిన మీడియా సంస్థలు కూడా.. సీఎం జగన్ చేసిన ప్రకటన పట్ల షాక్ తిన్నాయి. ఒక నాయకుడు.. ఎంతో నమ్మకంగా చేసిన ఒక ధృడమైన ప్రకటన.. వైనాట్ 175 నినాదాన్ని చర్చనీయాంశం చేశాయి. -
కూటమిలో కొత్త ట్విస్ట్.. ఏపీ బీజేపీలో ఓటమి భయం!
ఏపీ బీజేపీలో ఓటమి భయం పట్టుకుంది. పోలింగ్ ముందు ఒక లెక్క.. పోలింగ్ తర్వాత మరో లెక్కతో బీజేపీ అంచనాలు పూర్తిగా రివర్స్ అయిపోయాయి. టీడీపీ, జనసేన నుంచి సరైన సహకారం లేకపోవడం, మరోవైపు సొంత పార్టీ సీనియర్ నేతలు దూరంగా ఉండటంతో ఘోర ఓటమి తప్పదనే భావన ఏపీ బీజేపీలో కనిపిస్తోంది.మొత్తంగా కూటమిలో చేరి పూర్తిగా నష్టపోయామనే భావనలో బీజేపీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే కాషాయపార్టీ నేతలెవరూ మీడియా ముందుకు రాలేని పరిస్ధితి. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర బీజేపీలో ప్రస్తుతం నిశ్శబ్ధ వాతావరణం కనిపిస్తోంది. పోలింగ్ తర్వాత ఎందుకు బీజేపీ నేతలందరూ సైలెంట్ అయ్యారు.ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత వింత పరిస్ఙితి కనిపిస్తోంది. పోలింగ్ ముందు వరకు ఉన్న ఉత్సాహం.. ఆ తర్వాత బీజేపీ నేతలలో కనిపించటం లేదు. కూటమిలో చేరి పూర్తిగా తప్పు చేశామనే భావన కమలనాథుల్లో కనిపిస్తోంది. టీడీపీ, జనసేనతో కూటమిగా జత కట్టిన బీజేపీ ఆరు ఎంపీ స్ధానాలకు, పది అసెంబ్లీ స్ధానాలకు పోటీ చేసింది. వాస్తవానికి కూటమిలో చేరడాన్ని ఏపీకి చెందిన బీజేపీ సీనియర్ల అంతా వ్యతిరేకించారు.రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కుమ్మక్కు రాజకీయాలతో రాజీ పడాల్సిన దుస్థితి బీజేపీకి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్ధితులలో కూటమిలో చేరిన తర్వాత సీట్లపై మొదట పెద్ద పంచాయితీనే నడిచింది. బీజేపీ పట్టున్న ఎనిమిది ఎంపీ స్ధానాలు, కనీసం 25 అసెంబ్లీ స్దానాలలో పోటీ చేయాలని సీనియర్లు ఒత్తిడి తెచ్చారు. అయితే చంద్రబాబుతో కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేసిన పురందేశ్వరి కేవలం ఆరు ఎంపీ, పది ఎమ్మెల్యే స్ధానాలతో సరిపెట్టింది. ఆ తర్వాత టిక్కెట్ల కేటాయింపులలో సీనియర్లకి ప్రాధాన్యత ఇవ్వాలని సీనియర్ నేతలు ఢిల్లీ వరకు వెళ్లారు.ఇక విశాఖ ఎంపీ స్ధానం కోసం రాజ్యసభ సభ్యులు జీవీఎల్ తీవ్రంగా ప్రయత్నించారు. గత రెండేళ్లగా అధిష్టానం ఆదేశాలతో జీవీఎల్ విశాఖలోనే ఇల్లు కొనుక్కుని అక్కడే ఉంటూ పార్టీ కోసం ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో జీవీఎల్కి వెన్నుపోటు పొడుస్తూ తన సోదరుడు బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కోసం పురందేశ్వరి విశాఖ సీటుని వదులుకున్నారు. ఇక విశాఖ దక్కకపోవడంతో కనీసం అనకాపల్లి అయినా దక్కుతుందని జీవీఎల్ భావించినా అక్కడా నిరాశే ఎదురైంది.ఇక, అనకాపల్లి సీటు కోసం ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్కు చుక్కెదురైంది. అలాగే ఏలూరు సీటు కోసం దశాబ్ధకాలంగా కష్టపడుతున్న తపనా చౌదరి ఎన్నో ఆశలు పెట్టుకుంటే కూటమి తరపున టీడీపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ బరిలోకి దిగారు. ఇక రాజమండ్రిలో పుట్టి నాలుగున్నర దశాబ్ధకాలంగా బీజేపీలో ఉన్న ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుని కాదని పురందేశ్వరి రాజమండ్రి నుంచి బరిలోకి దిగారు. అటు, హిందూపూర్ ఎంపీ లేదా కదిరి స్ధానం కోసం ప్రయత్నించిన విష్టు వర్ధన్ రెడ్డి వంటి నేతకు అవకాశాలు దక్కలేదు.ఇలా సొంత పార్టీని నమ్ముకుని దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్న నేతలను కాదనుకుని ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకి అవకాశం ఇవ్వడం కూడా బీజేపీలోనే అంతర్గత కుమ్ములాటలకి కారణమైంది. అనకాపల్లి ఎంపీ స్ధానాన్ని స్ధానిక నేతలకు కాకుండా టీడీపీ నుంచి గత ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన కడప జిల్లావాసి సీఎం రమేష్ను బరిలోకి దింపడం ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత పెంచిందని భావిస్తున్నారు. ఎన్నికల ముందు వరకు కూడా అనకాపల్లి సీటు తమదేనని డబ్బాలు కొట్టుకున్న నేతలు పోలింగ్ ముగిసిన తర్వాత చడీచప్పుడూ లేకుండా గప్ చుప్ అయ్యారు. లెక్కలు వేసుకున్న తర్వాత సీఎం రమేష్ను బరిలోకి దింపి తప్పు చేశామని బీజేపీ నేతలు భావిస్తున్నారట.అసలు అనకాపల్లి సీటు కాకుండా విశాక సీటు తీసుకుని ఉంటే గెలుపుపై ధీమా ఉండేదని కూడా ఇపుడు గగ్గోలు పెడుతున్నారట. ఇక విజయవాడ వెస్ట్ నుంచి బ్యాంకులని బురిడీ కొట్టించిన సుజన్ చౌదరిని రంగంలోకి దింపడం ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్ పంపేలా చేసిందంటున్నారు. ఇక్కడ సుజానా చౌదరి దింపడం వల్లే దెబ్బ పడిందని భావిస్తున్నారట.ఇక అనపర్తి, బద్వేలు లాంటి చోట్ల రాత్రికి రాత్రి టీడీపీ నేతలను బీజేపీలో చేర్చుకుని టిక్కెట్ ఇవ్వడంపైనా కాషాయ పార్టీ నేతలే అభ్యంతరం వ్యక్తం చేశారు. అనపర్తిలో మొదటగా మాజీ సైనికుడు శివరామకృష్ణంరాజుకి కేటాయించారు. ఆ తర్వాత సీటుని అనపర్తి టీడీపీ ఇన్చార్జ్ నల్లమిల్లి రామకృష్ణరెడ్డిని రాత్రికి రాత్రి తన కారులోనే స్వయంగా పురందేశ్వరి విజయవాడ బీజేపీ కార్యాలయానికి తీసుకొచ్చి పార్టీలో చేర్చుకుని అప్పటికపుడు టిక్కెట్ ప్రకటించారు. కేవలం తన గెలుపుకోసమే పురందేశ్వరి ఈ విధంగా చేశారని బీజేపీ సీనియర్లు మండిపడ్డారు. ఇలా చాలా వరకు సీట్ల ఎంపికలో పురందేశ్వరి.. టీడీపీకి సహకరించారు.ఇక, అనపర్తి అభ్యర్ధిగా బరిలోకి దిగిన టీడీపీ నేత నల్లమిల్లి కనీసం బీజేపీ కండువా కప్పుకోవడానికి కూడా ఇష్టపడకుండా పలుసార్లు ప్రచారం చేయడం కూడా బీజేపీని అయోమయానికి గురిచేసింది. ఇదే సమయంలో కమలదల సీనియర్లు జీవీఎల్, సోము వీర్రాజు, విష్ధువర్ధన్ రెడ్డి లాంటి వాళ్లు ఎక్కడా ప్రచారంలో కనిపించలేదు. సీనియర్ నేతలంతా కూడా జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొలేదని తెలుస్తోంది. ఇక ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్ షా, నడ్డా లాంటి అగ్రనేతలు ప్రచారం చేసినపుడు మాత్రం సభలలో కనిపించి సీనియర్లు మమా అనిపించారు. దీంతో, బీజేపీ పూర్తిగా ఆత్మ రక్షణలో పడింది. ఇలా వరుస తప్పిదాలతో అవకాశాలున్న చోట కూడా బీజేపీ విజయావకాశాలను జార విడుచుకుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, కొన్ని స్థానాల్లో బీజేసీకి క్రాస్ ఓటింగ్ భయం కూడా పట్టుకుంది.దీనికి తోడు బీజేపీ పోటీ చేసిన చోట టీడీపీ, జనసేన ఓటు పూర్తిగా బదిలీ కాకపోవడం కూడా కొంపముంచిందంటున్నారు. తమకు టికెట్ ఇవ్వకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. దీంతో, ఎన్నికలపై కమలనాథులు ఎవరూ మనస్పూర్తిగా పనిచేయలేదు. అంతేకాకుండా చంద్రబాబు అబద్దపు అలవుకాని హామీలతో రిలీజ్ చేసిన మేనిఫెస్టో కూడా కొంత కొంప ముంచిందంటున్నారు. ఈ మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ నేతలు ప్రచారం చేసినా ఓటర్లని ఆకట్టుకోలేకపోయామంటున్నారు. ఆఖరికి మేనిఫెస్టో విడుదల సమయంలో చంద్రబాబు ఇస్తున్న మేనిఫెస్టోని పట్టుకోవడానికి బీజేపీ ఇన్చార్జ్ ఇష్టపడలేదు.ఇదిలాఉండగా.. ఎన్నికల ప్రచార సమయంలో అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం ఎంపీ స్ధానాలతో పాటు మరో మూడు, నాలుగు అసెంబ్లీ స్ధానాలు తమకు గ్యారంటీ అని భావించినా పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రం తగిన అంచనాలకు రాలేకపోతున్నారు. అధికార పార్టీపై ఆశించిన స్ధాయిలో వ్యతిరేకత కనిపించకపోవడం, మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్లు వేయడంతో బీజేపీని ఓటమి భయం వెంటాడుతోంది. పోలింగ్ ముగిసి లెక్కలు వేసుకున్న తర్వాత కనీసం ఒక్క సీటు కూడా రాదేమోననే ఆందోళన కాషాయ పార్టీ నేతలలో కనిపిస్తోంది. ఈ క్రమంలో ఒక్క నాయకుడు కూడా మీడియా ముందుకు వచ్చి తాము గెలుస్తామని చెప్పలేకపోతున్నారనే టాక్ నడుస్తోంది. -
‘ఏపీలో వార్ వన్ సైడే.. YSRCPదే గెలుపు’
విశాఖపట్నం, సాక్షి: పోలింగ్ పర్సంటేజ్ పెరగడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమనే అభిప్రాయం తప్పని.. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలనే ఏపీలో ఓటర్లు పోటెత్తారని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అంటున్నారు. గురువారం విశాఖలో వైఎస్సార్సీపీ నేతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘ఎన్నికల్లో కష్టపడి పని చేసిన వైఎస్సార్సీపీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు. గ్రామీణ ఓటర్లు మన పార్టీ వైపే నిలబడ్డారు. అన్ని ప్రాంతాల్లో మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు. సీఎం జగన్ తో మాకు న్యాయం జరుగుతుందని ప్రజలు అభిప్రాయపడ్డారు. సంక్షేమం అభివృద్ధికే ప్రజలు ఓటేసి పట్టం కట్టబోతున్నారు.. ..గతంలో ఓటింగ్ పెరిగినప్పుడు కూడా ఉన్న ప్రభుత్వాలే గెలిచిన దాఖలాలు ఉన్నాయి. గతంలో.. మహాకూటమి జత కట్టిన సమయంలో దివంగత మహానేత వైఎస్సార్ ఘన విజయం సాధించారు. ఇప్పుడు కూడా సీఎం జగన్ విజయం సాధిస్తారు. గతంలో కంటే వైఎస్సార్సీపీకి ఎక్కువ సీట్లే వస్తాయి. .. అన్ని వర్గాల ప్రజలకు వైఎస్ఆర్సీపీ అండగా నిలబడింది. అందుకే వార్ వన్సైడ్ కాబోతోంది. ఏకపక్షంగా విజయం సాధించబోతున్నాం. వైఎస్ జగన్ మళ్లీ సీఎం కాబోతున్నారు. .. ప్రతిపక్ష పార్టీలు ప్రెస్టేషన్ లో గొడవలకు దిగుతున్నారు. ప్రతిపక్షాలు తాము చేస్తున్న అల్లర్లకు, హింసకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాకూడదు. కేంద్రంలో ఏ పార్టీకి, కూటమికి మెజారిటీ రాకూడదు. మన పార్టీల అవసరం వాళ్లకు పడాలి. పనికిమాలిన పార్టీల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు షర్మిలకు డిపాజిట్ వస్తుందో లేదో చూసుకోమనండి’’ అంటూ అమర్నాథ్ ప్రసంగించారు. -
CBN: టెన్షన్తో బాబుకి ముచ్చెమటలు!
ఏపీ శాసనసభ ఎన్నికలలో ఆయా రాజకీయ పార్టీల విజయావకాశాలపై ఎంత చర్చ జరుగుతున్నదో, అంతకన్నా ఎక్కువ చర్చ కొందరు ప్రధాన నేతల నియోజకవర్గాలపై కూడా జరుగుతోంది. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో మరోసారి ఆయన గెలుస్తారా?లేదా? అన్నది ఆసక్తికరంగా ఉంది. వైఎస్సార్సీపీ నేతలు ఈసారి తాము హిట్ కొడతామని చెబుతున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో తనను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. కాకపోతే ఆయన ఎన్నడూ అంత మెజార్టీతో గెలవలేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఆయన గెలుస్తారా?ఓడతారా అన్నది పక్కన పెడితే, ఈ ఎన్నికలలో ఆయనకు ముచ్చెమటలు పట్టాయన్నది మాత్రం వాస్తవం. అందుకే ఆయన పలు రకాల వ్యూహాలు అమలు చేశారని చెబుతున్నారు. అందులో ధనబలం కూడా ప్రముఖంగా ఉందన్న విశ్లేషణలు వస్తున్నాయి.కుప్పం నియోజకవర్గంలో టీడీపీ ఏకంగా ఓటుకు పదివేల రూపాయలు ఖర్చు చేయడానికి వెనుకాడలేదని కొందరు చెబుతున్నారు. వివిద నియోజకవర్గాలలో అన్ని పార్టీలు డబ్బు ఖర్చు చేసినా, కుప్పంలో చంద్రబాబు తరపున ఓట్ల కొనుగోలుకు వెచ్చించిన వ్యయం ఒక రికార్డుగా కొందరు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబునాయుడు కుప్పంలో వరసగా ఏడుసార్లు గెలిచి ఎనిమిదో సారి పోటీచేస్తున్నారు. అంతకుముందు చంద్రగిరిలో ఆయన ఒకసారి గెలిచి, మరోసారి ఓడిపోయారు. ఆ తర్వాత వ్యూహాత్మకంగా చిత్తూరు జిల్లాలో మారుమూల ఉండే, వెనుకబడిన ప్రాంతం అయిన కుప్పంను ఎంపిక చేసుకుని రాజకీయం చేస్తున్నారు. ఆయన ఇంతవరకు ఆ విషయంలో సఫలం అవుతున్నారు. అత్యధికంగా బీసీ వర్గాలు ఉండే కుప్పంను ఆయన తన కోటగా మార్చుకున్నారు. అభివృద్ది విషయంలో మాత్రం ఇప్పటికీ అంతంత మాత్రంగానే ఉంటుంది. అయినా చంద్రబాబు డబ్బు, దొంగ ఓట్లు ఇతర వ్యూహాల ద్వారా గెలుస్తూ వస్తున్నారు.సరిహద్దులోని తమిళనాడు, కర్నాటక గ్రామాలకు చెందినవారిని కూడా కుప్పం ఓటర్లుగా నమోదు చేయించి రాజకీయంగా లబ్ది పొందేవారని చెబుతారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండడం కూడా కలిసి వచ్చింది. గతంలో వైఎస్ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డికి కుప్పం బాధ్యతలు అప్పగించినా ప్రయోజనం లేకపోయింది. ఎవరో వీక్ అభ్యర్ధిని కాంగ్రెస్ కుప్పంలో పెట్టేలా చేసుకునేవారని అంటారు. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి కొంత మారింది. క్రమేపి ఆయన మెజార్టీని తగ్గించే పనిలో వైఎస్సార్సీపీ పడింది. రిటైర్డ్ ఐఏఎస్ చంద్రమౌళి కుప్పంలో ఈయనను ఢీకొట్టడానికి సిద్ధం అయ్యారు. కుప్పం నియోజకవర్గంలో కీలకమైన దొంగ ఓట్లను తొలగించడానికి ఆయన అహర్నిశలు కృషి చేశారు. సుమారు 17 వేల దొంగ ఓట్లను ఆయన తొలగించగలిగానని చెప్పేవారు. దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్యంతో మరణించారు.తదుపరి ఆయన కుమారుడు, వైఎస్సార్సీపీ అభ్యర్ధి భరత్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఇవ్వడమే కాకుండా, కుప్పం అభివృద్దిపై దృష్టి పెట్టారు. కుప్పంను మున్సిపాలిటీ చేయడం, రెవెన్యూ డివిజన్ చేయడం, స్కూళ్లు బాగు చేయడం, హంద్రీ-నీవా నీటిని విడుదల చేయడం వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలను కొంత ఆకట్టుకున్నారు. వైఎస్సార్సీపీ గట్టి కృషి ఫలితంగా స్థానిక ఎన్నికలలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబుకు అది షాక్ అయింది. దాంతో ఆయన అప్రమత్తం అయ్యారు. ఇంతకాలం ఏడాదికి ఒకటి, రెండుసార్లు కుప్పం వచ్చినా సరిపోయే పరిస్థితి పోయిందని చంద్రబాబు అర్థం చేసుకున్నారు. నెల, నెల రావడం ఆరంభించారు. అది సరిపోదని భావించి అక్కడ ఇల్లు నిర్మించుకుంటున్నట్లు కథ నడిపారు.అదే టైమ్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం నియోజకవర్గంలో పట్టు బిగించడం ఆరంభించారు. దాంతో చంద్రబాబుకు రాజకీయంగా ఊపిరి ఆడని పరిస్థితి కల్పించారు. ఈ నేపధ్యంలో ఎన్నికల నోటిఫికేషన్కు ముందు కొద్ది రోజులు అక్కడే ఉండి గడప, గడపకు వెళ్లడం చేశారు. కుప్పంలో రాజకీయం చేయడం ఆరంభించిన తర్వాత ఇలా ఓటర్ల ఇళ్లకు వెళ్లడం, ఆయా వర్గాలతో ప్రత్యేక సమావేశాలు పెట్టడం వంటివి ఈసారే చేశారు. గతంలో ఆయన తన ప్రతినిధులతో పనులు చేయించేవారు. అలాగే కుప్పం నుంచే కొంతమందిని పిలిపించుకుని హైదరాబాద్లోనో, ఉండవల్లిలోనో మాట్లాడి పంపించేవారు. ఆ పరిస్థితి మారి, ఎన్నికల సమయంలో స్వయంగా ఆయన భార్య భువనేశ్వరి కుప్పంలోనే ఉండి ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించవలసి వచ్చింది.తనకు లక్ష ఓట్ల మెజార్టీ రావాలని అప్పుడప్పుడు డైలాగులు చెప్పినా, ఆయనకు ఎప్పుడూ అంత ఆధిక్యత రాలేదు సరికదా! క్రమేపి తగ్గుతూ వచ్చింది. 2014లో నలభై ఎనిమిదివేల మెజార్టీ వస్తే 2019లో అది 30 వేలకు తగ్గింది. ఇప్పుడు దొంగ ఓట్లను మరింత తగ్గించగలగడంతో చంద్రబాబులో టెన్షన్ మొదలైంది. స్థానిక ఎన్నికలలో టీడీపీ కన్నా వైఎస్సార్సీపీకి చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయి. అదే ట్రెండ్ కొనసాగినా, ఆ ఓట్లను ప్రామాణికంగా తీసుకున్నా చంద్రబాబు ఓటమికి గురికాక తప్పదు. స్థానిక ఎన్నికలకు, శాసనసభ ఎన్నికల సరళికి కొంత తేడా ఉంటుంది. ఈ కారణంగానే ఇప్పుడు తిరిగి తన ఆధిపత్యం నిలబెట్టుకోవడం కోసం ఆయన శ్రమపడ్డారు. అయినా గెలుస్తారా? లేదా? అన్న సందేహం వ్యక్తం అవుతోంది.ఇక వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ భరత్ నిత్యం కుప్పంలోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. మంత్రి పెద్దిరెడ్డి అండతో అక్కడ నిరంతరం జనంలో తిరుగుతున్నారు. దాంతో వైఎస్సార్సీపీ గ్రాఫ్ పెరిగిందన్నది ఆ పార్టీ వాదన. అయితే చంద్రబాబుకు అక్కడ ఉన్న పట్టు అంత తేలికగా పోదని, ఆయా వర్గాలవారిని తనవైపు తిప్పుకోవడానికి చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఓటుకు పదివేల రూపాయల వరకు పంచవలసిన పరిస్థితి ఏర్పడిందంటే అక్కడ పోటీ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఓటింగ్ పూర్తి అయ్యాక కొన్ని సర్వేలలో చంద్రబాబు ఓడిపోయే అవకాశం కూడా ఉందని వార్తలు రావడం ఆయనకు, టీడీపీకి ఆందోళన కలిగించే అంశమే.స్థానిక ఎన్నికల తర్వాత ఒక దశలో కుప్పంతో పాటు మరో నియోజకవర్గాన్ని కూడా ఎంపిక చేసుకుంటారన్న ప్రచారం జరిగింది. కానీ అలా చేస్తే పార్టీకి నష్టం వస్తుందని భయపడ్డారు. రిస్కు ఉందని తెలిసినా అక్కడే పోటీ చేయక తప్పలేదు. టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ను అక్కడే ఉంచి రాజకీయం నడిపారు. గతంలో చంద్రబాబుకు కుప్పంలో ఎంత మెజార్టీ వస్తుందన్న చర్చ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు చంద్రబాబు గెలుస్తారా? లేదా? అనే చర్చ జరగడం విశేషమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం కానీ, వైఎస్సార్సీపీ కార్యక్రమాలు కానీ సఫలం అయ్యాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదే పెద్ద విజయంగా భావిస్తున్నారు.జగన్ అమలు చేసిన వివిద సంక్షేమ స్కీములు కుప్పంలో కూడా అమలు అయ్యాయి. దానివల్ల సుమారు రెండువేల కోట్ల మేర అక్కడి ప్రజలు లబ్దిపొందారు. కొన్ని వందల మందికి స్థలాలు ఇచ్చి, ఇళ్ళు కూడా నిర్మించారు. ఆ రకంగా బలహీనవర్గాలను వైఎస్సార్సీపీ బాగానే ఆకట్టుకుంది. దానికితోడు బీసీలలో రెండు బలమైన వర్గాలను వైఎస్సార్సీపీ తనవైపు తిప్పుకోగలిగింది.ఈ నేపథ్యంలో చంద్రబాబు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. తన హయాంలో జరగని పనులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతుండడం ఆయనకు ఇబ్బందిగా ఉంది. స్థానిక ఎన్నికలలో ఓటమితో నైతికంగా దెబ్బతిన్న చంద్రబాబుకు దొంగ ఓట్లు కూడా చాలావరకు వైదొలగడం గడ్డుగా మారింది. అయినప్పటికీ ఆయనకు ఉండే క్లౌట్ ఆయనకు ఉండవచ్చు. అందువల్లే చంద్రబాబు ఓడిపోతారని పలువురు చెబుతున్నా, ఒకవేళ చంద్రబాబు ఓడిపోకపోయినా, మెజార్టీ బాగా తగ్గిపోతుందని అంచనాలు ఉన్నాయి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
టీడీపీ నేత జేసీ ప్రభాకర్కు బిగ్ షాక్..
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి మరో షాక్ తగిలింది. జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఛార్జ్షీట్ నమోదు చేసింది. బీఎస్-IV వాహనాల మనీలాండరింగ్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ ఛార్జ్షీట్ను ఫైల్ చేసింది.ఈడీ ఛార్జ్షీట్లో భాగంగా.. హైదరాబాద్లోని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసుకు సంబంధించి 17 మంది నిందితులు, సంస్థలపై ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేసింది. బీఎస్-4 నిబంధనలకు అనుగుణంగా లేని వాహనాలను ఏప్రిల్ 1, 2017 నుంచి భారతదేశంలో విక్రయించరాదని, రిజిస్ట్రేషన్ చేయకూడదని 2017లో సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ జేసీ ప్రభాకర్ రెడ్డి, సీ. గోపాల్ రెడ్డితో పాటుగా పలువురు అశోక్ లేల్యాండ్ లిమిటెడ్ నుంచి బీఎస్-3 వాహనాలను కొనుగోలు చేశారు.ఈ క్రమంలో జటాధార ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్, సీ.గోపాల్ రెడ్డి అండ్ కో పేరుతో భారీ తగ్గింపుతో బీఎస్-3 వాహనాలను కొనుగోలు చేసి, మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నకిలీ పత్రాల ఆధారంగా బీఎస్-4 వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొంది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లలో ఎక్కువ కొనుగోళ్లు నాగాలాండ్లో జరుగగా.. కొన్ని కర్ణాటక, ఏపీలో కూడా జరిగాయని ఈడీ తెలిపింది.జటాధార ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 50 వాహనాలు, సి.గోపాల్ రెడ్డి పేరిట 104 వాహనాలు రిజిస్టర్ అయినట్లు ఈడీ విచారణలో తేలింది. ఈ వాహనాల్లో చాలా వరకు వాటిని బీఎస్-4 వాహనాలుగా ఉపయోగించడం ద్వారా వారి రవాణా వ్యాపారంలో వారు మరింత ఉపయోగించుకున్నారు. అలాంటి కొన్ని వాహనాలను బీఎస్-4 వాహనాలుగా చూపి విక్రయించారు. ఈ వాహనాలను సొంతం చేసుకోవడం, నడపడం, విక్రయించడం ద్వారా 38 కోట్ల రూపాయలు ఆర్జించినట్టు ఈడీ పేర్కొంది. అంతకుముందు, జేసీ ప్రభాకర్ రెడ్డి, సీ గోపాల్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులకు చెందిన 68 కోట్ల చరాస్తులు.. 28.6 కోట్ల రూపాయల స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. -
ఏపీలో ఓటేసుకునే స్వేచ్ఛ కూడా లేదా?
సాక్షి, నరసరావుపేట: ‘స్వతంత్రంగా ఓటేసుకునే హక్కు ఉండకూడదా... టీడీపీకి ఓటేయకుంటే గ్రామాలు విడిచిపెట్టి వెళ్లిపోవాలా... వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపడం నేరమా... మమ్మల్ని పోలీసులు ఎందుకు కాపాడటం లేదు...’ ఇదీ ఇప్పుడు గురజాల నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ప్రజల ఆవేదన. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేయలేదన్న అక్కసుతో మాచవరం మండలం కొత్త గణేశునిపాడులో టీడీపీ గూండాలు సోమవారం అరాచకం సృష్టించిన విషయం తెలిసిందే.ప్రాణాలను కాపాడుకునే క్రమంలో ఊరొదిలి వేరేచోట బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ‘సాక్షి’తో తమ గోడును వెళ్లబోసుకున్నారు. వైఎస్సార్సీపీకి ఓటేశామన్న కక్షతో సోమవారం రాత్రి 7 గంటల నుంచి సుమారు ఐదు గంటల పాటు గ్రామంలో అరాచకం సృష్టించారనీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలే లక్ష్యంగా వారు దాడిచేశారని తెలిపారు. ఇంత జరుగుతున్నా పోలీసులు తమకు రక్షణ కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం..ఎస్టీ వాడివి మాకు వ్యతిరేకంగా ఓటు వేస్తావా ఎంత ధైర్యంరా అంటూ మాపై టీడీపీ వాళ్లు దాడి చేశారు. భయంతో పొలాల్లోకి పరుగులు తీశాం. ఇళ్లల్లోకి చొరబడి వస్తువులు, ఆటోని ధ్వంసం చేశారు. ఆడవాళ్లు, పిల్లలు అనే కనికరం లేకుండా బూతులు తిడుతూ మావాళ్లను కొట్టారు. దిక్కుతోచని స్థితిలో బందువుల వద్ద తలదాచుకున్నాం.– కాండ్రకుంట హనుమంతుఊళ్లో ఉంటే చంపేస్తామంటున్నారు!జగనన్న పాలనలో మాకు మంచి జరిగింది కాబట్టే వైఎస్సార్సీపీకి ఓటేశాం. అందుకే మాపై కక్ష పెంచుకున్నారు. ఊళ్లో ఉంటే చంపుతామని బెదిరించారు. పోలీసులే రక్షణ కల్పించాలి.– దేవరపు రత్తయ్య బీసీ రజకటీడీపీకి ఓటేయకపోతే బతకనివ్వరా?పొలం పనులు చేసుకుంటూ బతికేవాళ్లం. మా జీవితాలు మారుస్తున్నాడన్న అభిమానంతో జగనన్నకి ఓటేశాం. దానికే మాపై దాడిచేసి, కులం పేరుతో దూషించారు. మా జేసీబీ, ట్రాక్టర్, బైకులు ధ్వంసం చేశారు. ఊళ్లో ఉంటే చంపుతారని భయమేసి భార్యా, పిల్లలతో పక్క ఊళ్లో ఉంటున్నాం. టీడీపీకి ఓటేయకపోతే ఊరొదిలి పోవాలా...– మేకల హనుమంతు, కొత్తగణేశునిపాడు -
జంగా ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్ సీనియర్ పొలిటీషియన్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి బిగ్ షాక్ తగిలింది. పార్టీ ఫిరాయింపు కారణంగా ఆయనపై అనర్హత వేటు వేశారు శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు. వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన జంగా.. ఆ తర్వాత టీడీపీలో చేరారు. దీంతో.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని వైఎస్సార్సీపీ కోరింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి అసెంబ్లీ సెక్రటరీ జనరల్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు విచారణ నిర్వహించారు. ఆయన నుంచి వివరణ తీసుకున్నారు. చివరకు.. ఎమ్మెల్సీగా కృష్ణమూర్తి అనర్హుడని పేర్కొంటూ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ బుధవారం అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. జంగా కృష్ణమూర్తి.. 2009 నుంచి 2019 మధ్య పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసింది. వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు మండలిలో విప్గా కూడా పని చేశారు. -
మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్
ఎన్టీఆర్, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం ఖాయమని, మళ్లీ అధికారంలోకి రాబోతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నాం ఐప్యాక్ ప్రతినిధులతో భేటీ అయిన సీఎం జగన్ ఎన్నికల ఫలితాల్ని అంచనా వేశారు. ‘‘మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాం. 2019లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచాం. ఈసారి గతంలో కంటే ఎక్కువ సీట్లే గెలుస్తాం. ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించబోతోంది. జూన్4వ తేదీన రాబోయే ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుంది. ఫలితాల తర్వాత దేశం మొత్తం మనవైపే చూస్తుంది. ‘‘ప్రశాంత్ కిషోర్ ఆలోచించలేనన్ని సీట్లు వస్తాయి. ప్రశాంత్ కిషోర్ చేసేది ఏమీ లేదు. అంతా టీమే చేస్తుంది. వచ్చే ప్రభుత్వంలో ఐదేళ్లపాటు ప్రజలకు ఇంకా ఎక్కువ మేలు చేద్దాం. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది’’ అని ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ అన్నారు.ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కోసం పొలిటికల్ కన్సల్టెన్సీగా ఐప్యాక్ పని చేసిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నాం బెంజిసర్కిల్లో ఉన్న ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(I-Pac) కార్యాలయానికి వెళ్లిన సీఎం జగన్.. సుమారు అరగంటపాటు అక్కడి ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఐ-ప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ టీం సభ్యులతో సెల్ఫీలు దిగుతూ కాసేపు సరదాగా గడిపారు. -
టీడీపీ గూండాగిరికి పోలీసుల వత్తాసు
సాక్షి, అమరావతి: యథేచ్ఛగా సాగుతున్న టీడీపీ శ్రేణుల దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసాన్ని అరికట్టేందుకు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా పక్కా పన్నాగంతో జరుగుతున్న దాడులను డీజీపీ హరీశ్కుమార్ గుప్తా దృష్టికి తెచ్చింది. పార్టీ నేతలు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, పేర్ని వెంకట్రామయ్య(నాని), లేళ్ల అప్పిరెడ్డి తదితరులు బుధవారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీని కలసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో టీడీపీ గూండాలు దాడులకు తెగబడిన 21 ఘటనలకు సంబంధించి పూర్తి ఆధారాలను అందచేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి టీడీపీ విధ్వంసం సృష్టించే పన్నాగాన్ని అమలు చేస్తోందన్నారు. వైఎస్సార్సీపీ నేతలు శాంతియుతంగా వ్యవహరిస్తున్నా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ దాడులకు దిగుతోందని తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హింసాత్మక ఘటనలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి కారకులపై కఠిన చర్యలు చేపట్టి వీటికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ నేతలు డీజీపీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు.దౌర్జన్యాలకు కొమ్ముకాసిన పోలీసులు: అంబటి టీడీపీ గూండాలు బరితెగించి దాడులకు పాల్పడుతుంటే పోలీసులు చోద్యం చూశారు. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసు అధికారులను ఈసీ హఠాత్తుగా బదిలీ చేసింది. వారిని మార్చిన తరువాత కూడా హింసాత్మక సంఘటనలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దీనికి ఈసీ ఏం సమాధానం చెబుతుంది? అవగాహనలేని డీజీపీ, డీఐజీలు, ఎస్పీలు, ఇతర అధికారులను నియమించడంతోనే హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. ఈసీ తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రం రావణ కాష్టంలా మారింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలు, పురందేశ్వరి సూచనల ప్రకారం ఈసీ అడ్డగోలుగా వ్యవహరించింది. అసలు పోలీసు వ్యవస్థ ఉందా? అనే సందేహం కలుగుతోంది. కొందరు పోలీసు అధికారులు టీడీపీతో కుమ్మక్కయ్యారు. టీడీపీ గూండాలు పోలింగ్ బూత్లలో దౌర్జన్యం చేస్తున్నా, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల ఇళ్లపై పడి దాడులు చేస్తున్నా పోలీసు యంత్రాంగం ఏమాత్రం అడ్డుకోలేకపోయింది. ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో పోలీసు యంత్రాంగం విఫలమైంది. వైఎస్సార్సీపీ నేతలను హౌస్ అరెస్ట్లు చేసిన పోలీసులు టీడీపీ శ్రేణులు స్వైర విహారం చేసినా కన్నెత్తి చూడలేదు. నన్ను హౌస్ అరెస్ట్ చేసి నా ప్రత్యర్థిని మాత్రం యథేచ్ఛగా తిరగనిచ్చారు. నా నియోజకవర్గంలో రీపోలింగ్ అవసరం లేదని ఈసీ ఎలా చెబుతుంది? వెబ్ కెమెరా రికార్డింగ్లను పరిశీలించకుండా ఏకపక్షంగా నిర్ణయాన్ని ఎలా ప్రకటిస్తుంది? ఇందుకు ఈసీ సమాధానం చెప్పాలి.దాడులు.. ఆపై కేసులు: పేర్ని నానిటీడీపీ పక్కా పన్నాగంతో దాడులకు పురిగొల్పుతోంది. కర్రలు, కత్తులు, రాడ్లు చేతబట్టుకుని పచ్చ ముఠాలు దాడులకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. దీన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై తిరిగి కేసులు బనాయించడం దారుణం. పోలింగ్ అనంతరం హింసకు పోలీసుల వైఫల్యమే కారణం. పల్నాడు ఎస్పీకి ఎన్నిసార్లు ఫోన్లు చేసినా పట్టించుకోలేదు. రిటైర్డ్ అధికారిని పోలీస్ పరిశీలకుడిగా ఈసీ నియమించడం ఏమిటి? ఆయనకు ఏం జవాబుదారీతనం ఉంటుంది? బీజేపీ, టీడీపీ నేతలకు సహకరించాలంటూ ఆయన పోలీసు అధికారులను బెదిరించారు. మా కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెడుతున్నారు. పురందేశ్వరి చెప్పిన విధంగా పోలీసు అధికారులను మార్చిన చోటే హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. పక్కా కుట్రతో పోలీసు అధికారులను బదిలీ చేసి టీడీపీ, బీజేపీ, జనసేన విధ్వంసానికి పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది. దీనికి పోలీసులతోపాటు ఈసీ కూడా సమాధానం చెప్పాలి. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల భద్రత కోసం ప్రజాస్వామ్యయుతంగా పోరాడతాం.చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు’రాష్ట్రంలో హింస, దాడులు, అల్లర్లలో ప్రధాన ముద్దాయి చంద్రబాబేనని, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, జోగి రమేష్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, నంబూరు శంకరరావు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి బుధవారం ఎన్నికల సంఘం కార్యాలయంలో ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనాను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. గొడవలకు సంబంధించిన ఆధారాలు అందజేశారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఇటీవల చేసిన హింసాకాండపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ముఖ్యంగా పల్నాడులో ఉద్దేశపూర్వకంగా, ప్లాన్ ప్రకారం దాడులు చేశారని తెలిపారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కూటమి పార్టీలకు కొమ్ముకాస్తున్నారని వారు వివరించారు. -
May 16th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 16th AP Elections 2024 News Political Updates6:25 PM, May 16th, 2024విజయవాడరాష్ట్ర ప్రజలంతా మళ్లీ వైఎస్ జగన్ రావాలని కోరుకున్నారు: మంత్రి బొత్సరాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మళ్లీ వైఎస్ జగనే రావాలని కోరుకున్న వైనం ఓటింగ్ లో స్పష్టంగా తెలిసిందిఎన్నికలలో నూతన ట్రెండ్ని వైఎస్ జగన్ తీసుకొచ్చారుఇచ్చిన హామీలని గత ఐదేళ్లలో హామీలు అమలు చేశాంవిద్య, వైద్యా రంగాలలో విప్లవాత్మకమైన సంస్కరణలు గత ఐదేళ్లలో జరిగాయిగత అయిదేళ్ల పాలన చూసి ఓటు వేయండని చరిత్రలో ఏ పార్టీ అడగలేదుప్రజలకి మేలు జరుగుతుందంటేనే సిఎం వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటారు...మళ్లీ వెనకడుగు వేయరుసిఎం పాలన చూసే ప్రజలు ఉవ్వెత్తున వచ్చి ఓటేశారుజూన్ 9 న విశాఖలో సిఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారుఅంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటున్నాం*ఒకటో తేధీన పెన్షన్ రావాలని వృద్దులు...మళ్లీ పథకాలు కొనసాగాలని మహిళలు కోరుకున్నారుటీడీపీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందిమా టార్గెట్ 175కి 175 సీట్లు... దానికి దగ్గరగానే రిజల్ట్ రాబోతోందిహింసని ప్రేరేపించకూడదనే మేము సంయమనం పాటిస్తున్నాంజగన్ లాంటి నాయకుడు లేకపోతే మంచి పాలన అందదని ఓట్లు వేశారుసిఎం జగన్ పాలనలో సామాజిక న్యాయం సమంగా పాటించడం చరిత్రలో ఎపుడూ జరగలేదు50 శాతంసీట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాంఇలాంటి సామాజిక న్యాయం జరిగిన పాలన గతంలో ఎపుడూ చూడలేదునాకు ఈ కారణం వల్ల ఓటేయండి అని చంద్రబాబు అడిగారానన్ను చూసి ఓటు వేయండని చంద్రబాబు అడిగారామా పాలన చూసి... మీకు మంచి జరిగితేనే ఓటు వేయండని సీఎం వైఎస్ జగన్ అడిగారుచంద్రబాబు గత పాలనచూసి ఎవరైనా నమ్ముతారాసీఎం వైఎస్ జగన్ అంటే చెప్పిందే చేస్తాడు...చేసేదే చెప్తాడు అని నమ్మకంసీఎం జగన్ పాలనలోనే ఆర్ధికంగా ఎదిగామని సామాన్యులు భావించబట్టే మాకు ఓటేసారుభూహక్కు చట్టం గురించి తప్పుడు వార్తలు రాశారుచంద్రబాబు కుయుక్తుల వల్లే పెన్షన్ ఆగాయిపోలింగ్ తర్వాత నుంచి డిబిటి స్కీమ్స్ కింద జమ అవుతాయని చెప్పాంచెప్పునట్టుగానే డిబిటి నిధులు విడుదలవుతున్నాయిఇదీ మా ప్రభుత్వ క్రెడిబిలిటీఅదే చంద్రబాబు అయితే ఎన్నికలు ముగిసాయి కాబట్టి తన తాబేదార్లకి , కాంట్రాలర్లకి ఇచ్చేవారు5:21 PM, May 16th, 2024అనంతపురం:తాడిపత్రిలో అల్లర్లు సృష్టించిన టీడీపీ నేతలపై కేసు నమోదుతాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సహా 526 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులుఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్లతో దాడికి పాల్పడిన టీడీపీ నేతలుపరారీలో టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిఇప్పటిదాకా 55 మందిని అరెస్టు చేసిన పోలీసులుఉరవకొండ కోర్టు లో నిందితులను హాజరుపరిచిన పోలీసులుజేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన వర్గీయులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసిన పోలీసులు5:15 PM, May 16th, 2024దీపక్ మిశ్రా వల్లే ఈ విధ్వంసం: మోపిదేవి వెంకట రమణపోలీసుల పక్షపాత ధోరణి వల్లే ఈ హింస జరుగుతోందిదీపక్ మిశ్రా కనుసన్నల్లో పోలీసులు ఉన్న చోట ఈ హింస జరుగుతుందిప్రశాంతంగా ఉన్న ఏపీ లో ఇలాంటి పరిస్థితులు రావటానికి కారణాలు దీపక్ మిశ్రాదీపక్ మిశ్రా పై చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరాం5:12 PM, May 16th, 2024ఎన్నికలు పక్షపతం లేకుండా ఏకపక్షంగా జరిగేలా ఎవరు చేశారో గవర్నర్కు తెలిపాం: పేర్ని నానిఉద్దేశ పూర్వకంగా బీజేపీ టీడీపీ దీపక్ మిశ్రాను ఏపీలో ఎన్నికల కోసం తెచ్చారుఅతని వల్లే ఈ విధ్వంసంరాష్ట్రంలో హింస జరుగుతున్న ప్రాంతాల్లో వారితో జగన్ ఇప్పటికే మాట్లాడారుసంయమనంతో ఉండాలని పార్టీ శ్రేణులకు జగన్ చెప్పారుహింసాత్మక చర్యలకు పాల్పడే వారిపై చర్యలు ఉంటాయని పార్టీ శ్రేణులకు జగన్ చెప్పారు అని గవర్నర్ కు తెలిపాం.దీపక్ మిశ్రా విజయవాడ వచ్చిన దగ్గర నుంచి టీడీపీ సానుభూతి పరులైన రిటైర్డు అధికారులను కలిశారుజిల్లా ఎస్పీలను కూడా మిశ్రా బెదిరిస్తున్నారుపోలింగ్ పూర్తయినా కూడా దీపక్ మిశ్రా ఏపీ వదిలి వెళ్లటం లేదుజిల్లాల్లో ఉన్న అందరూ అధికారులను లొంగ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారుదీపక్ మిశ్రా స్థానంలో సర్వీస్లో ఉన్న అధికారిని ఏర్పాటు చేయాలని గవర్నర్ను కోరాం 5:12 PM, May 16th, 2024పల్నాడు ఎస్పీ, ఐజీ త్రిపాఠి వంటి కొందరు అధికారులు ఎన్నికల వేల పచ్చ చొక్కాలు వేసుకున్నారు: మేరుగ నాగార్జునరాయలసీమ, పల్నాడులో పోలీసులను మార్చాలని కోరాంకౌంటింగ్ ఉన్న నేపథ్యంలో దీపక్ మిశ్రాను మార్చి దేశంలో ఏ అధికారి అయినా పర్లేదు అని గవర్నర్ను కోరాం 5:10 PM, May 16th, 2024పోలింగ్ తర్వాత జరుగుతున్న హింస ఆందోళన రేపుతోంది: మంత్రి బొత్సఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసుల పనితీరుపై ఫిర్యాదు చేశాముఅబర్వర్ దీపక్ మిశ్రా పక్ష పతంగా వ్యవహరిస్తున్నారుటీడీపీ వాళ్లు ఫిర్యాదు చేస్తే విచారణ లేకుండా చర్యలు తీసుకున్నారుఅబర్వర్ గా ఉన్న దీపక్ మిశ్రా పై న్యాయ విచారణ చేయాలిఎన్నికల సంఘం నుంచి రిపోర్ట్ తెచ్చుకుని దీపక్ మిశ్రాను మార్చాలని కోరాము 3:34 PM, May 16th, 2024ఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరైన ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తాఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై ఈసీ సీరియస్పల్నాడు, కారంచేడు, తాడిపత్రి, చంద్రగిరి, నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో చెలరేగిన హింసరాష్ట్రంలో ఐజీలు, ఎస్పీలు, సిఐలు మార్చిన చోట చెలరేగిన హింసపోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా పని తీరుపై ఆరోపణలుటీడీపీ నేతల సూచనలకు అనుగుణంగా దీపక్ మిశ్రా బదిలీలు చేశారని ఆరోపణఇదే అదునుగా భావించి దాడులకు పాల్పడ్డ టీడీపీ నేతలుపల్నాడు, తిరుపతి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో బీసీల ఇళ్లపై దాడులకు దిగిన టీడీపీ నేతలుతమకు ఓటు వేయలేదన్న అక్కసుతో దాడులకు పాల్పడిన టీడీపీ నాయకులు2:40 PM, May 16th, 2024ఈసీని కలవనున్న ఏపీ సీఎస్ జవహర్రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తాఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై వివరణ కోరిన ఈసీరాష్ట్రంలో ఐజీలు, ఎస్పీలు, సీఐలు మార్చిన చోట చెలరేగిన హింసపోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా పని తీరుపై ఆరోపణలుటీడీపీ నేతల సూచనలకు అనుగుణంగా దీపక్ మిశ్రా బదిలీలు చేశారని ఆరోపణఇదే అదునుగా భావించి దాడులకు పాల్పడ్డ టీడీపీ నేతలుపల్నాడు, తిరుపతి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో బీసీల ఇళ్లపై దాడులకు దిగిన టీడీపీ నేతలుతమకు ఓటు వేయలేదన్న అక్కసుతో దాడులకు పాల్పడిన టీడీపీ నాయకులు2:15 PM, May 16th, 2024ఎన్నికల ఫలితాల్లో చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్విజయవాడ..విజయవాడలో ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీసీఎం జగన్ కామెంట్స్..ఏపీలో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం ఖాయం. మనమే అధికారంలోకి రాబోతున్నాం. ఈసారి చరిత్ర సృష్టించబోతున్నాం. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత యావత్ దేశం మనవైపు చూస్తుంది. గతంలో కంటే ఎక్కువ అసెంబ్లీ, లోక్సభ స్థానాలు గెలవబోతున్నాం. ఒకరు ఊహించిన దానికంటే మనకు ఎక్కువ సీట్లు వస్తాయి. 2019లో 151 అసెంబ్లీ, 22 లోక్సభ స్థానాలు గెలిస్తే ఈసారి 151 అసెంబ్లీ సీట్లకు పైగా గెలవబోతున్నాం. అలాగే 22కు పైగా లోక్సభ స్థానాలు గెలుస్తాం. తద్వారా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తాం. వచ్చే ప్రభుత్వంలో ప్రజలకు మరింత మేలు చేద్దాం. రానున్న రోజుల్లో కూడా వైఎస్సార్సీపీ, ఐప్యాక్ ప్రయాణం ఇలాగే ముందుకు కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో ఏడాదిన్నరగా ఐ ప్యాక్ టీం అందించిన సేవలు వెలకట్టలేనిది. 1:50 PM, May 16th, 2024ఢిల్లీ చేరుకున్న సీఎస్, డీజీపీఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తామధ్యాహ్నం మూడు గంటలకు ఈసీ ముందు హాజరు కానున్న సీఎస్, డీజీపీఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై వివరణ కోరిన ఈసీ1:30 PM, May 16th, 2024పెదవేగి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తతఏలూరు జిల్లాపెదవేగి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తతహత్యాయత్నం కేసులో ఉన్న ముద్దాయిని టీడీపీ కార్యకర్త కావడంతో పోలీస్ స్టేషన్ నుండి బలవంతంగా తీసుకువెళ్లిన చింతమనేని ప్రభాకర్.మరోసారి బయటపడ్డ చింతమనేని ప్రభాకర్ గుండా గిరిపోలీసులు అడ్డుకోవడంతో చింతమనేని ప్రభాకర్తో పాటు వారి అనుచరులు పోలీసులపై దాడికి ప్రయత్నం.కొప్పులవారిగూడెం ఎలక్షన్ రోజున బూత్లో ప్రెసిడెంట్ సంజీవరావు కుమారుడు రవిపై దాడి చేసిన ముద్దాయి తాలూరి రాజశేఖర్పెదవేగి పీఎస్లో ఉన్న అతనిని చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యంగా లాక్కొని తన కారులో వేసుకొని తన అనుచరులతో పారిపోయాడు. హత్యాయత్నం చేసిన ముద్దాయిని చింతమనేని తీసుకువెళ్లిపోవటంతో పీఎస్ ఎదుట బైఠాయించి వైఎస్సార్సీపీ శ్రేణుల నిరసన. 12:50 PM, May 16th, 2024టీడీపీ అభ్యర్థి అనుచరుడి దౌర్జన్యం.నెల్లూరు..సామాన్యులపై కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి అనుచరుడు మురళి దౌర్జన్యం.డబ్బులు తీసుకుని తమకు ఓటు వేయలేదని.. డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగిన మురళి.కావ్య కృష్ణారెడ్డి డబ్బులు తీసుకొని రమ్మన్నాడంటూ ఫోన్ చేసి బెదిరించిన టీడీపీ నాయకుడు నున్నా మురళి.సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ నేత మురళి బెదిరింపుల ఆడియో.కావ్య కృష్ణారెడ్డి అనుచరుల బలవంతపు వసూళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఓటర్లు. 12:20 PM, May 16th, 2024గవర్నర్ను కలవనున్న వైఎస్సార్సీపీ బృందంతాడేపల్లి :సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలవనున్న వైఎస్సార్సీపీ బృందంపోలింగ్ అనంతరం చెలరేగిన హింసపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్న వైఎస్సార్సీపీ నేతలుసీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో గవర్నర్ను కలవనున్న నేతలుహింసకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరనున్న వైఎస్సార్సీపీ బృందం12:00 PM, May 16th, 2024అల్లర్లు సృష్టించిన టీడీపీ నేతలపై కేసు నమోదుఅనంతపురం:తాడిపత్రిలో అల్లర్లు సృష్టించిన టీడీపీ నేతలపై కేసు నమోదుతాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సహా 526 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులుఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్లతో దాడికి పాల్పడిన టీడీపీ నేతలుపరారీలో టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిఇప్పటిదాకా 55 మందిని అరెస్టు చేసిన పోలీసులుఉరవకొండ కోర్టులో నిందితులను హాజరుపరిచిన పోలీసులుజేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన వర్గీయులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసిన పోలీసులు11:45 AM, May 16th, 2024టీడీపీ నాయకుడి దాష్టీకంకృష్ణా జిల్లా..ఉంగుటూరు మండలం ఆత్కూరులో టీడీపీ నాయకుడు దాష్టీకంఫ్యాన్కు ఓటు వేసిందని మహిళను ట్రాక్టర్తో ఢీకొట్టిన టీడీపీ నాయకుడు ఏడుకొండలుఆత్కూరు గ్రామానికి చెందిన వేముల సంధ్యారాణికి తీవ్ర గాయాలు.సంధ్యారాణి రెండు కాళ్ళకు తీవ్ర గాయాలుపిన్నమనేని హాస్పిటల్కు తరలింపుహాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంధ్యారాణిని పరామర్శించిన వల్లభనేని వంశీఆత్కూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు 10:25 AM, May 16th, 2024ఎన్నికల హింసపై గవర్నర్కు ఫిర్యాదుఏపీలో ఎన్నికల హింసపై గవర్నర్కు వైఎస్సార్సీపీ ఫిర్యాదుఇవాళ సాయంత్రం రాజ్భవన్ వెళ్లనున్న వైఎస్సార్సీపీ బృందంమంత్రి బొత్స నేతృత్వంలో గవర్నర్ అబ్దుల్ నజీర్కు కలవనున్న వైఎస్సార్సీపీ బృందంపోలింగ్ సందర్భంగా టీడీపీ అరాచకాలపై, పోలీసులు వ్యవహరించిన తీరును గవర్నర్కు వివరించే అవకాశంహింసకు బాధ్యులైన వాళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని కోరనున్న వైఎస్సార్సీపీ నేతలు 9:40 AM, May 16th, 2024రాష్ట్రంలో డీబీటీ పథకాలకు నిధుల విడుదల..డీబీటీ పథకాలకు నిధుల విడుదల ప్రారంభంనిన్న ఒక్కరోజే ఆసరాకు రూ.1480,జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్మెంట్కు రూ.502 కోట్లు విడుదలమిగిలిన పథకలకూ విడుదల కానున్న నిధులురెండు మూడు రోజుల్లో నిధుల విడుదలను పూర్తిచేయనున్న ప్రభుత్వంటీడీపీ ఫిర్యాదులతో పోలింగ్కు ముందు డీబీటీ కింద నిధుల విడుదలను అడ్డుకున్న ఎన్నికల సంఘంఇదిగో అదిగో అంటూ పోలింగ్ సమయం వచ్చేంతవరకూ అనుమతిపై ఎటూ తేల్చని ఎన్నికల సంఘంఎన్నికల సంఘం తీరుపై హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వంఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయిలో హైకోర్టు ఆగ్రహంసమయం ముగిసిపోవడంతో పోలింగ్కు ముందు విడుదల కాని నిధులుపోలింగ్ ముగిసిన తర్వాత నిధుల విడుదల ప్రారంభం 9:00 AM, May 16th, 2024అనంతలో సెక్షన్ 144 కొనసాగింపు..అనంతపురం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగింపుఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ వినోద్ కుమార్ఎన్నికల సందర్భంగా అనంతలో టీడీపీ మూకలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పచ్చ మూకలు దాడులు చేశారు. 8:20 AM, May 16th, 2024ఎమ్మెల్సీ జాంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటువిజయవాడఫిరాయింపు ఎమ్మెల్సీ జాంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటుఅనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్న శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజుటీడీపీలో చేరిన జాంగా కృష్ణ మూర్తివైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకు విచారణ జరిపి అనర్హుడిగా ప్రకటించిన శాసన మండలి చైర్మన్ 7:45 AM, May 16th, 2024వైఎస్సార్సీపీ అనుకూల వర్గాలే టార్గెట్.. మహిళలపై పచ్చ మూకల దాష్టీకాలునర్సీపట్నంలో దుశ్శాసన పర్వం ఒంటరి మహిళను జుట్టు పట్టుకొని ఈడ్చి కాళ్లతో తన్నిన అయ్యన్న అనుచరులుకృష్ణా జిల్లాలో దమనకాండమహిళను ట్రాక్టర్తో తొక్కి చంపడానికి ప్రయత్నించిన టీడీపీ నేతమహిళలపై హత్యాయత్నాలు చేస్తున్నా ఏమీ పట్టనట్లు ఈసీ నిర్లిప్తత గ్రామాలు వీడి దూరంగా తలదాచుకుంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు చేష్టలుడిగి చూస్తున్న అధికార యంత్రాంగం ఓట్ల లెక్కింపు దాకా కొనసాగించేలా చంద్రబాబు పన్నాగం.. రాష్ట్రవ్యాప్తంగా దాడులకు పురిగొల్పుతూ భయానక వాతావరణం రాజకీయ ప్రత్యర్థులపై గ్రామాల్లో విచ్చలవిడిగా దాడులు.. కౌంటింగ్కు వైఎస్సార్సీపీ ఏజెంట్లను దూరంగా ఉంచడమే లక్ష్యం 7:20 AM, May 16th, 2024నేడు విజయవాడకు సీఎం జగన్ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విజయవాడకు రానున్నారు.ఈ సందర్భంగా బెంజి సర్కిల్లో ఉన్న ఐ-ప్యాక్ కార్యాలయాన్ని సందర్శించనున్నారు. సుమారు అర గంట పాటు ఐ-ప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ కానున్నారు. 7:00 AM, May 16th, 2024నేడు ఈసీఐని కలవనున్న ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాఎన్నికల అనంతరం జరిగిన హింసపై సీఎస్, డీజీపీని నివేదిక కోరిన ఈసీఐఈసీఐకి వాస్తవ పరిస్థితులు వివరించనున్న సీఎస్, డీజీపీఎన్నికల పోలింగ్కు కొద్దీ రోజులు ముందే డీజీపీ, ఐజీ, ఎస్పీలను మార్చిన ఎన్నికల కమిషన్అకస్మాత్తుగా పోలీస్ అధికారులను మార్చడంతో పెరిగిన హింసాత్మక ఘటనలుపల్నాడు ఎస్పీ, ఐజీ, డీజీపీని పోలింగ్కు ముందు మార్చిన ఈసీఐఈసీ ఆకస్మిక నిర్ణయాలతో హింస పెరిగిందని భావిస్తున్న అధికారులు 6:50 AM, May 16th, 2024ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదుటీడీపీ నేతలతో కుమ్మక్కై తెర వెనుక కథ నడిపినట్లు దీపక్ మిశ్రాపై సీఈవో, డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదుపోలింగ్ రోజు కూటమికి మద్దతుగా వ్యవహరించాలని పోలీసు అధికారులపై దీపక్ మిశ్రా ఒత్తిడి తెచ్చారన్న వైఎస్సార్సీపీపోలింగ్కు 3 రోజుల ముందు టీడీపీ నేత విష్ణువర్థన్ ఇచ్చిన పార్టీకి దీపక్ మిశ్రా హాజరైనట్లు గుర్తింపుఆ తర్వాత నుంచి పోలీస్ అధికారుల మార్పులపై అనుమానాలుమాచర్ల,గురజాలలో రాత్రికి రాత్రే సీఐలు, ఎస్ఐల మార్పులుచివరికి సీఎం జగన్పై జరిగిన హత్యాయత్నం కేసులో కూడా దీపక్ మిశ్రా జోక్యం చేసుకున్నారని వైఎస్సార్సీపీ ఫిర్యాదుఈ కేసులో ఏ2 నిందితుడిని అరెస్ట్చేయొద్దని విచారణ అధికారిపై దీపక్ మిశ్రా ఒత్తిడి తెచ్చారన్న వైఎస్సార్సీపీఆధారాలతో సహా డీజీపీ, ఈసీలకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ 6:40 AM, May 16th, 2024రిగ్గింగ్ చేయాలనే ఆలోచనతోనే దాడులకు తెగబడ్డారు: సజ్జల రామకృష్ణారెడ్డిటీడీపీ అరాచక శక్తులు పోలింగ్ సరిగ్గా జరగకుండా చేయాలని చూశాయిరిగ్గింగ్ చేయాలనీ, మా వారిని అడ్డుకోవాలనీ చూశారుటీడీపీ నేతలు చేసిన అరాచకాలపై ఈసీ, డీజీపీలకు ఫిర్యాదు చేశాంఎన్నికల సంఘం విధుల్లో కూడా టీడీపీ దూరిందిపురంధేశ్వరి ఎవరిపై ఫిర్యాదు చేశారో వారిని బదిలీ చేశారువారు కోరిన అధికారులను వేశారుమొత్తం 29 మంది అధికారులను ఉన్నట్టుండి ట్రాన్సఫర్ చేశారువిష్ణువర్ధనరావు అనే రిటైర్డ్ ఆఫీసర్ ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా వెళ్లారువిష్ణువర్ధన్ రావు టీడీపీ నేత సుజనాచౌదరికి దగ్గరి మనిషిఅలాంటి వ్యక్తి ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ వెళ్లితే ఇక ఎన్నికలు ప్రశాంతంగా ఎలా జరుగుతాయి?టీడీపీ ఆఫీసులో రూపు దిద్దుకున్న ప్లాన్ ని దీపక్ మిశ్రా ద్వారా ఈసీ అమలు చేసిందిరెడ్డి, ఎస్సీ, ఎస్టీ అధికారులు అందరినీ వరసపెట్టి ట్రాన్సఫర్ చేశారుఎవరిపై ఫిర్యాదు వచ్చినా విచారణ చేయకుండానే వెంటనే ట్రాన్సఫర్ చేశారుప్రకాశం, పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో అధికారులను మార్చారుఅక్కడే ఎక్కువ హింస చెలరేగిందిజరుగుతున్న దాడులన్నీ ఒన్ సైడే జరుగుతన్నాయిమంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా హౌస్ అరెస్టు చేశారుఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కుటుంబంపై దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదువెంటనే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని వెంటనే వెనక్కు పిలవాలిఎన్నికల కమిషన్ త్వరగా స్పందించి శాంతిభద్రతలను పరిరక్షించాలిసంక్షేమ పథకాల నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోందికౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చేసేందుకు కూడా టీడీపీ కుట్రలు పన్నుతోందికచ్చితంగా రెండోసారి జగన్ పాలన రాబోతోందిసీఎస్, డీజీపిని కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించటం అసాధారణంపోలింగ్ తర్వాత కూడా పరిపాలన జరగకుండా చేయటం ఏంటి?వీటన్నిటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాంపురంధేశ్వరి ఇచ్చిన లేఖల ప్రకారం ఈసీ పనిచేయటంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాంపోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని నియమించటం వెనుక కుట్ర ఉందిలేకపోతే రిటైర్డ్ ఆఫీసర్ ని పోలీసు అబ్జర్వర్ గా నియమించటం ఏంటి?ఉద్యోగంలో ఉన్న ఆఫీసర్ ని నియమిస్తే బాధ్యతతో వ్యవహరిస్తారురిటైర్డ్ అధికారిని నియమిస్తే బాధ్యత ఏం ఉంటుంది?ఓటర్లు తమ బాధ్యతగా తీసుకుని పోలింగులో పాల్గొన్నారు. 6:30 AM, May 16th, 2024మైదుకూరులో టీడీపీ గుండాల దాడివిశ్వనాథ పురానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త భూమిరెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డిపై హత్యాయత్నం ఎన్నికల రోజు పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చున్నాడని కోపంతో ఓబుల్ రెడ్డిపై దాడి చేసిన టీడీపీ గూండాలుదాడిలో తీవ్ర గాయాలు.. మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపుఆసుపత్రిలో ఓబుల్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి -
రెచ్చిపోతున్న పచ్చమూక పల్నాడులో ఆగని విధ్వంసం
సాక్షి, నరసరావుపేట: ఎన్నికలు ముగిసి మూడు రోజులైనా పల్నాడు జిల్లాలో టీడీపీ మూకల విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. ఓటమి ఖాయమని తేలిపోవడంతో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ మూకలు బుధవారం దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. టీడీపీ దాడుల నుంచి తప్పించుకొని గ్రామాలు వదిలివెళ్లిపోయిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులు ఇంకా ఇళ్లకు పూర్తిగా చేరుకోలేదు. తెలిసిన వారి ఇళ్లల్లో దూరప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. కుటుంబంలోని మహిళలు, పిల్లల బాగోగుల గురించి వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పోలీసులు రక్షణ కల్పిస్తే గ్రామాలకు తిరిగిరావాలని చూస్తున్నారు. మరోవైపు మాచర్ల, గురజాల, నరసరావుపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేశ్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. టీడీపీ మూక స్వైరవిహారం.. మాచవరం మండలం కొత్త గణేషునిపాడులో గ్రామం వదిలి వెళ్లిన ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులు ఇంకా గ్రామాలకు చేరలేదు. పోలీస్ పికెటింగ్ ఉన్నా మళ్లీ టీడీపీ మూకలు దాడులు చేస్తాయనే అభద్రతాభావంతో గ్రామానికి దూరంగా ఉంటున్నారు. పల్నాడు జిల్లాలో పలు ప్రాంతాల్లో టీడీపీ మూకలు విధ్వంసకాండ కొనసాగిస్తుండటంతో పోలీసులు జిల్లావ్యాప్తంగా మంగళవారం సాయంత్రం నుంచి 144 సెక్షన్ విధించారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాల్లో దుకాణాలను మూసివేయించారు. చివరకు కొన్నిచోట్ల మెడికల్, కూరగాయలు, పాల దుకాణాలు, టీస్టాల్స్ను కూడా తెరవలేదు. బహిరంగ ప్రదేశాల్లో నలుగురికి మించి గుమిగూడకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. అయినప్పటికీ టీడీపీ నేతల దాడులు ఆగడం లేదు. వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా స్వైరవిహారం చేస్తున్నారు. తమకు ఓటు వేయని వారిపై దాడులు కొనసాగిస్తున్నారు. గ్రామానికి తిరిగిరాగానే పచ్చ మూకల దాడి.. గురజాల నియోజకవర్గంలో టీడీపీ దౌర్జన్యకాండ కొనసాగుతోంది. పల్లెల్లో టీడీపీ ఫ్యాక్షన్ చిచ్చురేపుతోంది. దాచేపల్లి మండలం మాదినపాడులో వైఎస్సార్సీపీ కార్యకర్త దొండేటి ఆదిరెడ్డిపై టీడీపీ నేతలు కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. పోలింగ్ రోజునే ఆదిరెడ్డితో టీడీపీ నాయకులు వాగి్వవాదానికి దిగారు. పోలింగ్ ముగిశాక గ్రామంలో పరిస్థితి బాగోలేకపోవటంతో రెండు రోజులపాటు వేరే గ్రామంలో ఉన్న బంధువుల ఇంటిలో ఆయన తలదాచుకున్నాడు. బుధవారం ఉదయం మాదినపాడు చేరుకున్న వెంటనే 30 మందికిపైగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు కర్రలు, ఇనుపరాడ్లతో ఆదిరెడ్డిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన తలకు బలమైన గాయాలు కావడంతో సొమ్మసిల్లిపడిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు గ్రామానికి చేరుకుని ఆదిరెడ్డిని పిడుగురాళ్లలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తీసుకెళ్లారు. ఆదిరెడ్డి తలలో నరాలు తెగి రక్తప్రసరణ నిలిచిపోయిందని.. రెండు మేజర్ సర్జరీలు చేయాలని వైద్యులు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నం.. నాదెండ్ల మండలం అప్పాపురంలో వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన మాజీ మండల ఉపాధ్యక్షుడు కోవెలమూడి సాంబశివరావుపై కర్రలు, కత్తులతో దాడికి తెగబడ్డారు. పోలింగ్ రోజు పన్నెండో బూత్లో ఎస్సీ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో బారులు తీరి రాత్రి 7 గంటల వరకు ఓట్లేశారు. వీరికి సాంబశివరావు అండగా ఉన్నాడు. ఇది మనసులో పెట్టుకున్న టీడీపీ నేతలు ఆయనపై దాడికి దిగారు. మరికొంతమందిపై కూడా దాడి చేసేందుకు కారులో వెంటపడ్డారు. అలాగే పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణç³ల్లిలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులు వెంకయ్య, విజయేంద్రబాబుల ఇళ్లపై దాడి చేశారు. వారిద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో గురజాల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.ఎమ్మెల్యేల హౌస్ అరెస్ట్.. పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులతో పోలీసులు కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేసి వారిని ఇంటికే పరిమితం చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్రెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలను హౌస్ అరెస్ట్లో ఉంచారు. మరోవైపు అల్లర్లకు కారణమైన టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై జిల్లావ్యాప్తంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందు జాగ్రత్తగా నేరస్వభావం ఉన్న వారిని బైండోవర్ చేశారు. దీంతో వందలాది మంది గ్రామాలను వదిలి వేరే ప్రాంతాలకు మకాం మార్చారు. -
బడుగులపై బరితెగింపు
అయ్యన్న గ్యాంగ్ అరాచకంఎన్నికల్లో చురుగ్గా పని చేసిందనే క్షక్షతో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం ధర్మసాగరంలో ఓ ఒంటరి మహిళ పట్ల అయ్యన్నపాత్రుడి అనుచరులు దుశ్శాసనుల్లా వ్యవహరించారు. మంగళవారం అర్థరాత్రి బాధితురాలి ఇంట్లోకి చొరబడి జుత్తు పట్టుకొని ఈడ్చుకొచ్చి కాళ్లతో తన్నుతూ.. తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ దుశ్చర్యను అడ్డుకోడానికి ప్రయత్నించిన స్థానికులపై పచ్చముఠాలు విరుచుకుపడ్డాయి. బాధితురాలు పొలమూరి రాజకుమారి 13 ఏళ్ల తన కుమారుడితో కలసి జీవిస్తోంది. కొన్నాళ్లు వలంటీరుగా పని చేసింది. పోలింగ్ రోజు ఓటర్లకు స్లిప్లు రాసిచ్చి వైఎస్సార్సీపీకి అనుకూలంగా పని చేయడం అయ్యన్న పాత్రుడి అనుచరులకు మింగుడు పడలేదు. పోలింగ్ మర్నాడు బాధితురాలు అదే గ్రామంలో ఉన్న తన పుట్టింటికి వెళ్లింది. రాత్రి 10 గంటల సమయంలో టీడీపీకి చెందిన రెడ్డి రాజేష్, రెడ్డి సత్యసాయి, కామిరెడ్డి శివ, సుకల రాజేష్, పెట్ట గంగాధర్, అల్లు రాజు, వానపల్లి రాజేష్, సొర్ల రఘు, నందిపల్లి బోయిల నాయుడు ఆమె ఇంటిని చుట్టుముట్టి తలుపులు బాదటంతో బయటకు వచ్చింది.రౌడీ మూకలు ఆమె మొబైల్ను లాక్కుని భౌతిక దాడికి పాల్పడ్డాయి. మెడలోని బంగారు గొలుసు లాక్కున్నారు. దీన్ని ప్రతిఘటించిన వృద్ధురాలు సీతమ్మ చెంపపై కొట్టి చెవి దుద్దులు లాక్కున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు 324, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయ్యన్నపాత్రుడి అనుచరురాలు, జెడ్పీటీసీ సుకల రమణమ్మ తన అనుచరులను దాడికి పురిగొల్పినట్లు బాధితురాలు పేర్కొంది.సాక్షి, అమరావతి/విశాఖ సిటీ/ఉంగుటూరు, నెట్వర్క్: ‘ఈసీ’ ఉదాసీనతతో పేట్రేగుతున్న పచ్చ ముఠాలు రాష్ట్రవ్యాప్తంగా భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ మహిళలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలపై పాశవికంగా దాడులకు తెగబడుతున్నాయి. గ్రామాల్లో హింసను ప్రేరేపిస్తూ దమనకాండకు తెర తీశాయి. అనకాపల్లి జిల్లాలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి అనుచరులు ఒంటరి మహిళపై కీచక పర్వానికి తెగబడగా కృష్ణా జిల్లా ఉంగుటూరులో ఫ్యాన్కు ఓటేసిందనే కక్షతో ఓ మహిళను ట్రాక్టర్తో తొక్కించి హత్యాయత్నానికి తెగబడ్డాయి. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మద్దతుగా పని చేయడమే ఈ అక్కచెల్లెమ్మలు చేసిన నేరం! తాజాగా పల్నాడులోనూ టీడీపీ మూకల దాష్టీకాలకు బడుగు, బలహీన వర్గాలు ఓ రాత్రంతా దేవాలయంలో తలదాచుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. ఓట్ల లెక్కింపు వరకు విధ్వంసకాండ కొనసాగించే ప్రణాళికను టీడీపీ మూకలు అమలు చేస్తున్నాయి. ఓట్ల లెక్కింపు చేపట్టే జూన్ 4వరకు రాష్ట్రం రావణకాష్టంగా రగులుతూ ఉండాలని టీడీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీనికనుగుణంగానే టీడీపీ గూండాలు, రౌడీ మూకలు స్వైర విహారం చేస్తుండటంతో ఏపీలో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన ఎన్నికల కమిషన్ ఈ దాడుల పట్ల నిర్లిప్తంగా వ్యవహరించడం పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. సమస్యాత్మక జిల్లాల్లో బదిలీలపై వచ్చిన పోలీసు అధికారులు పచ్చమూకల దౌర్జన్యకాండకు కొమ్ము కాస్తున్నారు.బెదిరించి.. భయపెట్టిప్రజాబలంతో టీడీపీ నెగ్గలేదని స్పష్టం కావడంతో పోలింగ్ రోజు రాష్ట్రవ్యాప్తంగా అవ్వాతాతలు, మహిళలను బెదిరిస్తూ దాడులతో హడలెత్తించే కుట్రలను చంద్రబాబు అమలు చేశారు. పోలింగ్ రోజు మొదలైన ఈ విధ్వంస కాండ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కల్పించేందుకు పథకాలను రచిస్తున్నారు. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు కొనసాగిస్తూ గ్రామాల్లో లేకుండా చేయాలని, జూన్ 4న కౌంటింగ్ కేంద్రాల వద్దకు సైతం రాకుండా భయోత్పాతం సృష్టించాలని చంద్రబాబు ఎత్తుగడలు వేస్తున్నారు.పల్నాడులో చల్లారని ఉద్రిక్తతలుఎన్నికలు ముగిసి మూడు రోజులైనా పల్నాడులో ఉద్రిక్తతలు చల్లబడలేదు. టీడీపీ మూక దాడులతో ఎస్టీ, బీసీ వర్గాలు గ్రామాలు వీడి దూరంగా తలదాచుకుంటున్నాయి. పోలింగ్ రోజు రాత్రి అరాచక ముఠాల దాడులతో మాచవరం మండలం కొత్త గణేశునిపాడులో గ్రామం వదిలి వెళ్లిన ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులు ఇంతవరకు స్వగ్రామాలకు చేరుకోలేదు. పల్నాడులో 144 సెక్షన్తో దుకాణాలు మూతబడ్డాయి. మాచర్ల, గురజాల, నరసరావుపేట ఎమ్మెల్యేలు హౌస్ అరెస్ట్లో ఉన్నారు. దాచేపల్లి మండలం మాదినపాడులో వైఎస్సార్సీపీ కార్యకర్త దొండేటి ఆదిరెడ్డిపై టీడీపీ నేతలు కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేయడంతో గాయపడ్డాడు. తాడిపత్రిలో పట్టణాన్ని వీడి వెళ్లిన ఎమ్మెల్యే కేతిరెడ్డి నివాసంలో చొరబడ్డ పోలీసులు తలుపులు బద్ధలు కొట్టారు. కంప్యూటర్లను పగులగొట్టారు.ఫ్యాన్కు ఓటేసిందని.. మహిళను ట్రాక్టర్తో తొక్కించబోయాడు!వైఎస్సార్సీపీకి ఓటు వేసిందని కక్షగట్టి ఓ మహిళను టీడీపీ నాయకుడు ట్రాక్టర్తో తొక్కించబోగా తృటిలో తప్పించుకుంది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన వేముల సంధ్యారాణి వైఎస్సార్ సీపీకి ఓటు వేసిందని టీడీపీ నాయకుడు ఏడుకొండలు కక్ష పెంచుకున్నాడు. బుధవారం ఉద్దేశపూర్వకంగా ఆమెతో ఘర్షణ పడి తన ట్రాక్టర్తో ఢీకొట్టాడు. పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని గన్నవరం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీమోహన్ పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దన్ను... ఈసీ ఉదాసీనత టీడీపీ మూకలు బరితెగించి దాడులు, విద్వంసానికి పాల్పడుతున్నా పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం విస్మయపరుస్తోంది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో డీఐజీ నుంచి ఎస్సై వరకూ పోలీసు అధికారులను పోలింగ్కు ముందు ఈసీ హఠాత్తుగా బదిలీ చేసింది. వారి స్థానంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై ఏమాత్రం అవగాహనలేని అధికారులను నియమించింది. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకమైన డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీలను కూడా ఈసీ బదిలీ చేసింది. చంద్రబాబు ఆదేశాలతో పురందేశ్వరి అందచేసిన జాబితాలో సూచించిన వారినే నియమించింది. అదే దన్నుగా టీడీపీ గూండాలు చెలరేగిపోతున్నారు. ఈసీ టీడీపీకి అనుకూలంగా ఉందనే సంకేతాలు వెలువడటంతో విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. అధికార యంత్రాంగాన్ని నడిపిస్తున్న ఈసీ ఈ దాడుల పట్ల బుధవారం వరకూ స్పందించలేదు. ఎస్పీలు, డీఐజీలకు ఆదేశాలు ఇవ్వలేదు. డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్లతో చర్చించలేదు. ఈసీ, పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ గట్టిగా నిలదీయడంతో ఇక తప్పదన్నట్లుగా సమీక్షకు ఉపక్రమించింది. -
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని.. టీడీపీ దాడులు చేస్తున్నా.. పోలీసులు పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అసాంఘిక శక్తులు రాజకీయ కక్షతో దాడులు, హింసాకాండ కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు.రాజకీయ కక్షతో బడుగు బలహీన వర్గాలపై దాడులకు చేశారు.ఈసీ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. పోలింగ్ సమయంలో టీడీపీ గూండాలు ఎక్కడికక్కడ తెగబడ్డారు.పోలింగ్ సజావుగా జరగకూడదని టీడీపీ దాడులు చేసింది. టీడీపీ దాడులపై డీజీపీకి, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాం’’ అని సజ్జల చెప్పారు.‘‘రిగ్గింగ్ చేయాలనే ఆలోచనతో దాడులకు తెగబడ్డారు. కూటమి నేతలు చెప్పినచోటే పోలీసు అధికారులను మార్చారు. ఈసీ నియమించిన పోలీస్ అధికారులకు రాష్ట్రంపై అవగాహన లేదు. టీడీపీ నేతలు ఇచ్చి పార్టీకి పోలీస్ అబ్జర్వర్ హాజరయ్యారు. పోలింగ్కు ముందే పోలీస్ ఉన్నతాధికారులను మార్చేశారు. ఎక్కడైతే పోలీస్ అధికారులను మార్చారో అక్కడే హింస జరిగింది. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.పోలింగ్ రోజు వైఎస్సార్సీపీ అభ్యర్థులను హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ అభ్యర్థులు మాత్రం యథేచ్చగా తిరిగారు. గురజాలలో ఓ గుడిలో తలదాచుకున్న దళితులపై దాడులు చేశారు. ఈసీ వైఫల్యం కారణంగానే పల్నాడులో గొడవలు జరిగాయి. వీటన్నిటికి ఎన్నికల కమిషనే బాధ్యత తీసుకోవాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.‘‘ఎన్నికల సంఘం విధుల్లో కూడా టీడీపీ దూరింది. పురందేశ్వరి ఎవరిపై ఫిర్యాదు చేశారో వారిని బదిలీ చేశారు. వారు కోరిన అధికారులను వేశారు. మొత్తం 29 మంది అధికారులను ఉన్నట్టుండి ట్రాన్సఫర్ చేశారు. విష్ణువర్ధనరావు అనే రిటైర్డ్ ఆఫీసర్ ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా వెళ్లారు. విష్ణువర్ధన్ రావు టీడీపీ నేత సుజనాచౌదరికి దగ్గరి మనిషి. అలాంటి వ్యక్తి ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ వెళ్లితే ఇక ఎన్నికలు ప్రశాంతంగా ఎలా జరుగుతాయి?. టీడీపీ ఆఫీసులో రూపు దిద్దుకున్న ప్లాన్ ని దీపక్ మిశ్రా ద్వారా ఈసీ అమలు చేసింది. రెడ్డి, ఎస్సీ, ఎస్టీ అధికారులు అందరినీ వరుసపెట్టి ట్రాన్సఫర్ చేశారు. ఎవరిపై ఫిర్యాదు వచ్చినా విచారణ చేయకుండానే వెంటనే ట్రాన్సఫర్ చేశారు. ప్రకాశం, పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో అధికారులను మార్చారు. అక్కడే ఎక్కువ హింస చెలరేగింది’’ అని సజ్జల ధ్వజమెత్తారు.జరుగుతున్న దాడులన్నీ ఒన్ సైడే జరుగుతన్నాయి. మంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా హౌస్ అరెస్టు చేశారు. ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కుటుంబంపై దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. వెంటనే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని వెంటనే వెనక్కు పిలవాలి. ఎన్నికల కమిషన్ త్వరగా స్పందించి శాంతిభద్రతలను పరిరక్షించాలి. సంక్షేమ పథకాల నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చేసేందుకు కూడా టీడీపీ కుట్రలు పన్నుతోంది. కచ్చితంగా రెండోసారి జగన్ పాలన రాబోతోంది’’ అని సజ్జల చెప్పారు.‘‘సీఎస్, డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించటం అసాధారణం. పోలింగ్ తర్వాత కూడా పరిపాలన జరగకుండా చేయటం ఏంటి?. వీటన్నిటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. పురందేశ్వరి ఇచ్చిన లేఖల ప్రకారం ఈసీ పనిచేయటంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాం. పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాని నియమించటం వెనుక కుట్ర ఉంది. లేకపోతే రిటైర్డ్ ఆఫీసర్ ని పోలీసు అబ్జర్వర్గా నియమించటం ఏంటి?. ఉద్యోగంలో ఉన్న ఆఫీసర్ని నియమిస్తే బాధ్యతతో వ్యవహరిస్తారు. రిటైర్డ్ అధికారిని నియమిస్తే బాధ్యత ఏం ఉంటుంది?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు. -
టీడీపీతో కుమ్మక్కు.. ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ నేతలతో కుమ్మక్కై తెరవెనుక కథ నడిపినట్టు దీపక్ మిశ్రాపై ఆరోపణలు ఉన్నాయి. డీజీపి హరీష్ కుమార్ గుప్తా, ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వైఎస్సార్సీపీ ఫిర్యాదులు చేసింది. పోలింగ్ రోజు టీడీపీ కూటమికి మద్దతుగా వ్యవహరించాలని పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు ఫిర్యాదులో వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు.పోలింగ్ కు మూడు రోజుల ముందు విజయవాడలో టీడీపీ నేత విష్ణువర్ధనరావు ఇచ్చిన పార్టీకి దీపక్ మిశ్రా హాజరైనట్లు గుర్తించారు. ఆ తర్వాత నుండి భారీగా పోలీసు అధికారుల మార్పులు జరగటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాచర్ల, గురజాలలో రాత్రికి రాత్రే సీఐలు, ఎస్ఐలను మార్చేశారు.చివరికి సీఎం జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసులో కూడా జోక్యం చేసుకున్నట్లు వైఎస్సార్సీపీ చెబుతోంది. ఆ మేరకు ఆధారాలు కూడా ఉన్నాయని వైసీపి నేతలు తెలిపారు. కేసులోని A2 నిందితుడిని అరెస్టు చేయవద్దని విచారణ అధికారిపై ఒత్తిడి తెచ్చినట్లు వైఎస్సార్సీపీ పేర్కొంది. ఆధారాలను సేకరించి డీజీపి, ఈసీలకు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. -
టీడీపీ అరాచకం.. డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, గుంటూరు: టీడీపీ దాడులు, హింసాత్మక చర్యలపై డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ నేతలు మేరుగు నాగార్జున, అంబటి రాంబాబు, పేర్ని నాని డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.అనంతరం మంత్రి అంబటి రాంబాబు మంగళగిరి డీజీపీ కార్యాలయం దగ్గర మీడియాతో మాట్లాడుతూ, పోలింగ్ బూత్లలో హింస జరుగుతుంటే పోలీసులు అడ్డుకోలేదన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. కొంతమంది పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారని మండిపడ్డారు.‘‘వైఎస్సార్సీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లు చేశారు.టీడీపీ నేతలు మాత్రం విచ్చలవిడిగా తిరిగారు. కూటమి ఫిర్యాదుతో ఈసీ పోలీస్ అధికారులను మార్చింది. అధికారులను మార్చిన తర్వాత కూడా హింస ఎందుకు జరిగింది?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.‘‘పోలీసు వ్యవస్థలో కొంతమంది టీడీపీ వారితో కలిసిపోయారు. మాకు బాగా ఓట్లు పడేచోట భారీగా పోలీసులను పెట్టారు. టీడీపీకి బలమైన గ్రామాలలో పోలీసులను పెట్టలేదు. దీంతో వారు పోలింగ్ బూత్లను క్యాప్చర్ చేశారు. నన్ను హౌస్ అరెస్టు చేసి, నా ప్రత్యర్థిని యథచ్చగా తిరగనిచ్చారు. చాలా దుర్మార్గపు చర్యలకు దిగారు. పోలీసు అధికారులను ఉన్నట్టుండి మార్చారు. అలా మార్చితే మేలైన పరిస్థితులు ఉండాలి కదా? మరి ఎందుకు హింస జరిగింది?. అధికారులను మార్చిన తర్వాత ఎందుకు హింస జరిగింది?. అవగాహన లేని డీజీపి, ఎస్పీలను పెట్టడం వలన హింస జరిగింది’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.‘‘ఎన్నికల కమిషన్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వలనే ఈ పరిస్థితి ఏర్పడింది. పోలీసు పరిశీలకుడు ఢిల్లీ ఆదేశాలు, పురంధేశ్వరి ఆదేశాలతోనే చేశారు. సీఎస్, డీజీపీలను ఢిల్లీకి పిలిచారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తన నియోజకవర్గంలో రీపోలింగ్ అవసరం లేదని ఈసీ ఎలా చెబుతుంది?. వెబ్ కెమెరాలను విశ్లేషించకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణాలు: మాజీ మంత్రి పేర్నిటీడీపీ నేతలు, కార్యకర్తలు యథేచ్చగా కర్రలు, రాడ్లతో దాడులు చేశారు. మా వాళ్లు ఎదురు తిరిగితే మాపై కేసులు పెడుతున్నారు. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసలకు పోలీసుల వైఫల్యమే కారణం. పల్నాడు ఎస్పీకి ఫోన్లు చేసినా పట్టించుకోలేదు?. రిటైర్డ్ అధికారిని పోలీసు అబ్జర్వర్ని పెడితే ఏం జవాబుదారీతనం ఉంటుంది. బీజేపి, కూటమికి సహకరించమని పోలీసు అధికారులనే ఆయన బెదిరించారు. మా కార్యకర్తలపై హత్యానేరం కేసులు పెడుతున్నారు. పురంధేశ్వరి చెప్పినట్టు పోలీసు అధికారును మార్చినచోటే హింస జరిగింది. అంటే పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణాలకు పాల్పడ్డారు -
ఘొల్లుమనే జోకులేసిన రఘురామ
పశ్చిమ గోదావరి, సాక్షి: ఓడలు ఏదో ఒకనాటికి బండ్లు అవుతాయంటే ఇదేనేమో. తొమ్మిదేళ్లలో ఐదుసార్లు పార్టీలు మార్చిన కనుమూరి రఘురామకృష్ణంరాజు.. చివరకు అనుకున్న సీటు దక్కించుకోలేక, ఓ అసెంబ్లీ సీటు సంపాదించుకోవడం కోసం ఎంతగా దిగజారుడు రాజకీయాలు చేశారో తెలుగు రాష్ట్రాలు కళ్లారా చూశాయి.ఈ ఐదేళ్లలో రఘురామ వెలగబెట్టింది ఏంటో అందరికీ తెలిసిందే. చంద్రబాబు డైరెక్షన్లో నిత్యం సీఎం జగన్ను, ఏపీ సర్కార్ను విమర్శిస్తూ.. ఢిల్లీలో ఉంటూ కోర్టుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వేస్తూ కాలం వెల్లదీశారు. అయితే ఎన్నికలు ముగిసినా కూడా రఘురామ తన డ్యూటీని ఇంకా మానలేదు. పాపం స్పీకర్ సీటు మీద ఆయనకు ఆశలున్నాయేమో కదా. అందుకే.. పుట్టినరోజున కూడా ఘొల్లుమనే జోకులేశారు. జోస్యం పేరిట రఘురామ పేల్చిన ఆ జోకులనే యెల్లో మీడియా తెగ ప్రచారం చేసుకుంటోంది. నిన్న(మే 14న) రఘురామ పుట్టినరోజు. పాపం.. పెద అమిరంలోని తన ఆఫీస్లో రచ్చబండ పెట్టారుకానీ జనాలు మాత్రం రాలేదు. అయినా రఘురామ తగ్గలేదు. ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధిస్తుందంటూ బిగ్గరగా మాట్లాడారు. ఏపీ కూటమి ఏకంగా 150కిపైగా సీట్లు దక్కించుకుందట. అధికారంలోకి వస్తుందట. ఆ మాటకు పక్కనున్న టీడీపీ నేతలు బయటకే నవ్వుకోవడం కనిపించింది. రఘురామ జోకులు అంతటితో ఆగలేదు.తనపై మత వ్యతిరేకుడనే ముద్ర వేయించారని తెగ ఫీలైపోయారు. అంతేకాదు.. తన శపథం నెరవేరిందని, పోలింగ్కు జనం పెద్ద ఎత్తున తరలిరావడమే కూటమి గెలుస్తుందనడానికి సంకేతమంటూ మాట్లాడారు. అయితే రఘురామ వాస్తవాల్ని గ్రహించలేకపోతున్నారు. పోటెత్తిన ఓటర్లలో జగనన్న పాలనలో సంక్షేమం అందుకున్న లబ్ధిదారులు, ఆ సంక్షేమం కొనసాగాలని కోరుకుంటున్న మహిళా ఓటర్లు.. అదే టైంలో ఇంకోవైపు పెన్షన్లు ఇంటికే అందక ఇబ్బందులు పడి చంద్రబాబును తెగ తిట్టుకున్న అవ్వాతాతలు.. అధికంగా ఉన్నారు. మరి వాళ్లంతా తిరిగి ఎవరికి పట్టం కడతారో ఊహించలేమా?. అయినా.. రాబోయేది జగన్ సర్కారే అని చెప్పడానికి గోదావరి జిల్లాల సిద్ధం సభలకు లభించిన స్పందన చాలాదా?. -
ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడి.. తాడిపత్రిలో పోలీసుల ఓవరాక్షన్
అనంతపురం, సాక్షి: జిల్లాలో పోలింగ్ వేళ నుంచి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. తాజాగా.. తాడిపత్రి నియోజకవర్గంలో పోలీసులు ఓవరాక్షన్కు దిగారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లోకి చొరబడిన పోలీసులు వీరంగం సృష్టించారు.కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు.. పని మనుషుల్ని బెదిరించారు. అంతేకాదు.. సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు హార్డ్ డిస్క్, సీపీయూలను పోలీసులు మాయం చేశారని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇంతటితో ఆగలేదు.తాడిపత్రివ్యాప్తంగా 30 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదంటూ హెచ్చరించారాయన.ఏఎస్పీ రామకృష్ణ సహకారంతో టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి రౌడీయిజం చేస్తున్నారని, పోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెబుతున్నారు. శాంతి భద్రతలకు సహకరించాలనే ఉద్దేశంతోనే తాము తాడిపత్రిని వీడి బయటకు వచ్చామని, అయితే పోలీసులు మాత్రం మరోలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడుతున్నారు. -
టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
సాక్షి, తాడేపల్లి: ఏపీ ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారని అన్నారు మంత్రి మేరుగ నాగార్జున. జూన్ నాలుగో తేదీన వైఎస్సార్సీపీ కొత్త చరిత్ర సృష్టించబోతుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రామరాజ్యం రాబోతుందని వ్యాఖ్యలు చేశారు.కాగా, మంత్రి మేరుగ నాగర్జున బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి వస్తుంది. ఇది పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగిన యుద్ధం. ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారు. జూన్ నాలుగో తేదీన వైఎస్సార్సీపీ సునామీ రాబోతుంది. పేదలు వైఎస్సార్సీపీకి ఓటు వేశారని దాడులు చేశారు.టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్ట్రేషన్లోకి వెళ్లాడు. పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచాలని కోరినా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు. కేంద్రంతో కుమ్మక్కై చంద్రబాబు ఎన్నికలలో అక్రమాలకు పాల్పడ్డారు. పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారు.అధికారంలోకి రాగానే ఎన్నికల్లో అక్రమాలకు వంతపాడిన పోలీసు అధికారులపై విచారణ జరిపిస్తాం. ఘోరాతి ఘోరంగా ఎన్నికల్లో టీడీపీ నేతలు దాడులు చేశారు. వైఎస్సార్సీపీకి అండగా నిలిచిన ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలపై పనిగట్టుకొని దాడులకు ఉసిగొల్పారు. డీబీటీల ద్వారా నిధులు ప్రజల ఖాతాల్లోకి రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
పోటెత్తిన ఏపీ ఓటర్లు.. అప్పట్లో ఏం జరిగిందంటే..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఒక ట్వీట్ చేస్తూ తన విజయాన్ని ధృవీకరించుకున్నారు. సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, అక్కచెల్లెమ్మలకు అంటూ వివిధ వర్గాలను ప్రస్తావిస్తూ ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. ఆ కామెంట్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్లీ ఏపీ శాసనసభ ఎన్నికలలో గెలవబోతున్నదన్న స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఇప్పటివరకు సాగిన సుపరిపాలన మరింత మెరుగ్గా సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఓట్ల పోలింగ్ పెరగడాన్ని ఆయన పాజిటివ్ ఓటింగ్గా భావిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు కూడా తమ కూటమి ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీరి దృష్టిలో పెరిగిన ఓట్ల శాతం ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకత. ఓట్ల శాతం పెరిగినంతమాత్రాన అది పాజిటివ్ అనో, నెగిటివ్ అనో నిర్ధారించవచ్చా? గతంలో జరిగిన ఎన్నికలలో పోలైన ఓట్ల శాతాలను పరిశీలిస్తే పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. వాటిని కూడా పరిశీలిద్దాం.ఏపీలో సుమారు ఎనభై ఒక్క శాతం వరకు ఓట్ల పోలింగ్ నమోదు అయింది. ఇంత పెద్ద ఎత్తున ఓట్లు పోలైతే ఎవరికి అడ్వాంటేజ్ అన్నదానిపైనే అందరి ఆలోచన. ప్రతిపక్ష తెలుగుదేశం కూటమివారు ఇందుకు ఒక భాష్యాన్ని చెబుతూ, ప్రజలలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వల్లే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఓట్లు వేయడానికి తరలివచ్చారని ప్రచారం చేసుకుంటున్నారు.మహిళలు, వృద్దులు ఉదయానే వచ్చి ఓట్లు వేయడంపై స్పందిస్తూ, మద్య నిషేధం చేయలేదన్న అసంతృప్తితో వారు అలా వచ్చారని చెప్పేవరకు వెళ్లారు. మిగిలిన 99 శాతం హామీలు అమలు చేయడన్ని విస్మరించి ఈ ఒక్క కారణంకోసం వ్యతిరేకత వచ్చిందంటే అది హాస్యాస్పదం.నిజంగానే ప్రభుత్వ వ్యతిరేక ఎక్కువగా ఉంటేనే పోలింగ్ అదికంగా జరుగుతుందా అన్నది ప్రశ్న! కొన్నిసార్లు అది వాస్తవం కావచ్చు. మరికొన్నిసార్లు అది నిజంకాదు అని చెసప్పడానికి అనేక దృష్టాంతాలు ఉన్నాయి. 1967లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత పార్టీలో సిండికేట్ నాయకుల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కున్నారు. ఆమె చేయదలచుకున్న బ్యాంకుల నేషనలైజేషన్ , రాజభరణాల రద్దు వంటి వివిధ సంస్కరణలను సిండికేట్ నేతలు వ్యతిరేకించారు. ఆ నేపధ్యంలో రాష్ట్రపతి ఎన్నికలలో అధికారిక కాంగ్రెస్ అభ్యర్ధి నీలం సంజీవరెడ్డిని వ్యతిరేకించి, తిరుగుబాటు అభ్యర్ధి వి.వి.గిరిని బలపరిచారు. దాంతో పార్టీ కూడా కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్ గా చీలిపోయింది. 1971లో ఆమె పార్లమెంటు ఎన్నికలకు వెళ్లినప్పుడు గరీబీ హటావో నినాదం ఇచ్చారు. అప్పుడు విపరీతమైన స్పందన ఆమెకు లభించింది. అప్పుడు ప్రజలలో సానుకూల ఓటింగ్ పడింది. 1967లో 61 శాతం ఓట్లు పోలైనా కాంగ్రెస్ పార్టీకి 283 సీట్లు మాత్రమే వచ్చాయి. పార్టీ చీలికతో ఇందిరాగాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. అయినా ఆమె డి.ఎమ్.కె.,వామపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. 1971లో ఎన్నికలకు వెళ్లినప్పుడు 55 శాతం ఓట్లే పోలైనప్పటికీ, ఇందిరాగాంధీ ఆద్వర్యంలోని కొత్త కాంగ్రెస్కు 352 సీట్లు రావడం విశేషం. అలాగే 1967 కాంగ్రెస్కు 40 శాతం ఓట్లు వస్తే, 1972లో ఇందిరాగాంధికి 43 శాతం ఓట్లు లబించాయి. అంటే ఓట్ల శాతం తగ్గినా, పెరిగినా, ఆనాటి రాజకీయ పరిస్థితులు, పరిణామాలు, నాయకత్వం వీటన్నిటి ఆదారంగా గెలుపు, ఓటములు ఉంటాయని తేలుతుంది.ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయం చూద్దాం. 1982 లో టీడీపీ ఆవిర్బావం తర్వాత రెండు పార్టీల వ్యవస్థ వేళ్ళూనుకుంది. 1983 లో జరిగిన ఎన్నికలలో 67.70 శాతం ఓట్లు పోల్ కాగా, కొత్తగా ఆవిర్భవించిన టిడిపి అధికారంలోకి వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్. 1985లో శాసనసభను రద్దు చేసి మద్యంతర ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు కూడా దాదాపు ఇదే శాతం ఓట్లు పోలయ్యాయి.ఆ ఎన్నికలలో 67.60 శాతం ఓట్లు పోల్ కాగా టిడిపి మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఎన్.టి.ఆర్.ప్రభుత్వాన్ని పడగొట్టడానికి 1984లో జరిగిన ప్రయత్నాల కారణంగా ఆయనకు సానుభూతి వచ్చి మళ్లీ గెలిచారు. 1989 లో జరిగిన ఎన్నికలలో టీడీపీ ఓటమిపాలైంది. ఆ ఎన్నికలలో 70.40 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ కొంత ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్పుటించిందనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కి 181 సీట్లు, టీడీపీకి 74 సీట్లు వచ్చాయి. 1994లో జరిగిన ఎన్నికలలో పోలైన ఓట్ల శాతం పెద్దగా పెరగలేదు. ఆ ఎన్నికలలో కేవలం 0.60 శాతం పోలింగ్ పెరిగింది. అయినా టిడిపికి 216 సీట్లు, మిత్రపక్షాలకు మరో 34 సీట్లు వచ్చాయి. దీనిని ఏ విధంగా అర్దం చేసుకోవచ్చు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, టీడీపీ వామపక్షాల కూటమిని ప్రజలు ఆదరించారు. ఆనాడు ఎన్.టి.ఆర్.ఇచ్చిన రెండు రూపాయలకే కిలో బియ్యం, మద్య నిషేధం వంటి హామీలు బాగా పనిచేశాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ కు కేవలం 26 సీట్లే వచ్చాయి. తదుపరి 1995లో ఎన్.టి.ఆర్.ప్రభుత్వాన్ని కూలదోసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు . ఆ తర్వాత 1999 ఎన్నికలలో సుమారు రెండు శాతం పోలింగ్ తగ్గినా టిడిపి 180 సీట్లతో అధికారంలోకి రాగా, కాంగ్రెస్ కు 91 సీట్లు వచ్చాయి. చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ టీడీపీ వ్యూహాత్మకంగా బిజెపితో పొత్తు పెట్టుకోవడం కలిసి వచ్చింది. అంతే తప్ప అది ప్రభుత్వానికి పూర్తి సానుకూల ఓటు కాదని చెప్పవచ్చు. కాంగ్రెస్ అంతకుముందున్న 26 సీట్లనుంచి 91 సీట్లకు పెరగడమే నిదర్శనం. 2004 శాసనసభ ఎన్నికలలో గతంలో కన్నా పోలింగ్ పెద్దగా పెరగలేదు. 69.8 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. అంటే కేవలం 0.7 శాతం పోలింగ్ పెరిగిందన్నమాట. కాని ఈసారి కాంగ్రెస్ 185 సీట్లతో అధికారంలోకి రాగా, మిత్ర పక్షమైన టిఆర్ఎస్ కు 26 సీట్లు, వామపక్షాలకు 15 సీట్లు లబించాయి. టీడీపీకి కేవలం 47 సీట్లే వచ్చాయి. పోలింగ్ శాతం పెద్దగా పెరగకపోయినా టిడిపి ఎందుకు అంత తక్కువ సీట్లకు పడిపోయిందన్నది పరిశీలిస్తే, దానికి కారణం ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కాంగ్రెస్,టిఆర్ఎస్,వామపక్షాలు పొత్తు పెట్టుకోవడమే అని చెప్పవచ్చు.వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర,రైతులకు ఉచిత విద్యుత్ వంటివి ఉపకరించాయి.2009 నాటి అనుభవం మరింత ఆసక్తికరమైంది.ఆ ఎన్నికలలో కొత్తగా వచ్చిన ప్రజారాజ్యం, లోక్ సత్తా వంటి పార్టీలు స్వతంత్రంగా పోటటీచేశాయి. టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం లు మహాకూటమిగా ఏర్పడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో తలపడ్డాయి. ఈ ఎన్నికలలో ఓట్ల శాతం 72,70 శాతంగా ఉంది. అంటే అంతకు ముందు ఉన్న పోలింగ్ శాతం కన్నా మూడు శాతం పెరిగిందన్నమమాట. అయినా వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 156 సీట్లను సాధించింది. తెలుగుదేశంకు 92, టీఆర్ఎస్కు పది, వామపక్షాలకు ఆరు సీట్లు వచ్చాయి. ప్రజారాజ్యం కు 18 సీట్లు రాగా, లోక్ సత్తా ఒక సీటుకే పరిమితం అయింది. ఓట్ల శాతం పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేకత అని వాదించేవారికి ఇది సమాధానం అవుతుంది. ఓట్ల శాతం పెరిగినా అది పాజిటివ్ ఓటు కావచ్చనడానికి ఈ ఫలితం ఒక ఉదాహరణ అవుతుంది. అయితే ఇది పూర్తి పాజిటివ్ ఓటా అంటే ఔనని చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ టీడీపీ 47 నుంచి 92 కి పెరిగింది. కాని ప్రజారాజ్యం, లోక్ సత్తా వంటి పార్టీల వల్ల కాంగ్రెస్, టీడీపీలు కొంత నష్టపోయాయి. నాలుగు పార్టీలు కూటమి కట్టాయి. అయినా దానిని తట్టుకుని కాంగ్రెస్ కొంత పాజిటివ్ ఓటు సాదించడం వల్ల బయటపడిందని చెప్పాలి. 2014 లో విభజిత ఏపీలో 76.80 శాతం ఓట్ల పోలింగ్ జరిగింది. అప్పటికి కాంగ్రెస్ పూర్తిగా ప్రజా మద్దతు కోల్పోవడం టీడీపీకి కలిసి వచ్చింది. గతంతో పోల్చితే నాలుగు శాతం ఓట్లు పెరిగినా, టీడీపీ, బిజెపి కూటమికి 106 సీట్లే వచ్చాయి. ప్రతిపక్షంగా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్కు 67 సీట్లు దక్కాయి. టీడీపీకి పాజిటివ్ ఓటు అయి ఉంటే ప్రతిపక్షానికి ఈ స్థాయిలో సీట్లు రావడానికి తక్కువ ఆస్కారం ఉంటుంది. నరేంద్ర మోదీ ప్రదాని అభ్యర్ధిగా రావడం, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టి కాపు వర్గాన్ని ఆకర్షించడం, చంద్రబాబు రైతుల రుణమాఫీ వంటి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం వంటి వాటివల్ల అధికారంలోకి రాగలిగారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ అప్పట్లో రుణమాఫీ హామీ ఇచ్చినా, కొందరు కీలక నేతలుపార్టీలో చేరడానికి వచ్చినప్పుడు అంగీకరించినా, ఆయనకే ప్రజలు పట్టం కట్టేవారన్న అభిప్రాయం కూడా ఉంది. 2019 ఎన్నికలలో 79.80 శాతంం ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికలలో చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపించింది. అదే టైమ్లో జగన్ ఇచ్చిన హామీలు కూడా పనిచేశాయని చెప్పవచ్చు. అందువల్లే వైఎస్సార్సీపీకి 151 సీట్లు, టీడీపీకి కేవలం 23 సీట్లు వచ్చాయి. 2024 శాసనసభ ఎన్నికలలో గతంలో కన్నా సుమారు రెండు శాతం పెరిగినట్లు లెక్కలు గడుతున్నారు. దీనివల్ల వైఎస్సార్సీపీకి నష్టం అని టీడీపీ కూటమి మద్దతుదారులు వాదిస్తున్నా, ఓట్ల పోలింగ్ శాతం పెరిగినంతమాత్రాన అన్నిసార్లు అది ప్రభుత్వ వ్యతిరేకత అని అనుకోనవసరం లేదనడానికి పైన ఇచ్చిన గణాంకాలు తెలుపుతాయి. పైగా ప్రభుత్వంపై సానుకూలత ఉన్నప్పుడు కూడా ఓట్ల శాతం పెరగవచ్చు. ప్రస్తుత ప్రభుత్వం కనుక గెలవకపోతే పేదవర్గాలకు నష్టం కలుగుతుందన్న భావన బాగా ప్రబలితే కూడా ఓట్ల శాతం పెరుగుతుంది. అయితే ప్రభుత్వం మీద అసలు వ్యతిరేకత ఉండదని ఎవరూ చెప్పరు. కాని దానికన్నా ప్రభుత్వంపై సానుకూలత ఎక్కువగా ఉందనడానికి పలు ఆధారాలు కనిపిస్తాయి. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని పేదవర్గాలు అధికంగా ఓటింగ్లో పాల్గొన్నట్లు కనిపిస్తుంది. అలాగే మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. టీడీపీకి పట్టణ ప్రాంతాలలో కొంత అనుకూలత ఉన్నా, అక్కడ కూడా ఉండే పేద వర్గాలు సీఎం జగన్ వైపే మొగ్గుచూపుతాయి. దానికితోడు ఎస్సి, బిసి, ఎస్టి, మైనార్టీ, రెడ్డి వర్గాలు బలంగా ఉంటే వైఎస్సార్సీపీ ఓడించడం కూటమికి సాధ్యం కాదనిపిస్తుంది. 2019లో ఏ సామాజిక సమీకరణలు ఉన్నాయో,దాదాపు అవే ఇప్పటికే కొనసాగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన ద్వారా కాపు వర్గాన్ని కొంత ఆకర్షించినా, అధికారంలోకి రావడానికి అది సరిపోదనిపిస్తుంది. జగన్ పేదలు vs పెత్తందార్ల స్లోగన్ బాగా పనిచేసినట్లు కనిపిస్తుంది. అది కరెక్టు అయితే సీఎం జగన్కు వేవ్ వచ్చినా ఆశ్చర్యపడనవసరం లేదు. ఒకవేళ వేవ్ రాకపోయినా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జగన్కు డోకా ఉండదన్న అభిప్రాయం ఏర్పడుతోంది. స్థూలంగా చెప్పాలంటే ఆయా ఎన్నికలలో అప్పటి పరిస్థితులు, రాజకీయ పరిణామాలు, వాగ్దానాలు, సామాజిక సమీకరణలు, నాయకత్వంపై విశ్వాసం మొదలైన అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి. ఇవి ఈ ఎన్నికలలో సీఎం జగన్కు ఎక్కువగా అనుకూలంగా ఉండడం వల్లే ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అవుతారన్న భావన బలీయంగా ప్రజలలో నెలకొంది. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
పచ్చ ముఠా మంటల్లో ‘పల్నాడు’
పల్నాడు, సాక్షి: పోలింగ్ రోజున చెలరేగిన హింస మూడు రోజులైనా చల్లారడం లేదు. వైఎస్సార్సీపీ శ్రేణుల్ని రెచ్చగొడుతూ.. టీడీపీ శ్రేణులు అవకాశం దొరికినప్పుడల్లా దాడులకు తెగబడుతున్నాయి. దీంతో.. మూడు రోజులుగా జిల్లా అట్టుడుకి పోతోంది.హింసను కట్టడి చేయడంలో తొలి రెండు రోజులు విఫలమైన పోలీస్ యంత్రాంగం.. ఆలస్యంగా మేల్కోంది. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించింది. పల్నాడు కేంద్రంలో 800 మందితో కూడిన కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. అయినా కూడా టీడీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. ‘‘ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తారా?’’.. అంటూ దాడులు చేస్తూ పల్నాట మంటల్ని రాజేస్తున్నాయి.మరోవైపు టీడీపీ నేతలను, శ్రేణుల్ని కట్టడి చేయలేని పోలీసులు.. మాచర్ల, గురజాల ఎమ్మెల్యేలను మాత్రం హౌజ్ అరెస్ట్ చేశారు. మాచర్లలో ఇప్పటికీ షాపులుతెరచుకోలేదు. అక్కడ 2 వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని అడుగడుగునా మోహరించారు. అంతటా వాహనాలను పోలీసులు జల్లెడ పుతున్నారు. వైఎస్సార్సీపీ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో.. మాచర్లలోనే మకాం వేసిన డీఐజీ త్రిపాఠి అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
‘కేటీపీఎస్’ ఐరన్ పైపులు చోరీ
గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సస్పెన్షన్
చోరీ సొమ్ము రికవరీ
11 డయేరియా కేసులు నమోదు
బీఆర్ఎస్ నాయకుల నిరసన
కుల బహిష్కరణకు పాల్పడితే కఠిన చర్యలు
సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచండి
ఆయిల్పామ్ సాగు విస్తరణపై దృష్టి
ఏసీబీకి చిక్కిన ట్రాన్స్కో ఏఈఈ
ఎమ్మెల్సీ ఎన్నిక ఏర్పాట్లలో వేగం
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement