-
Hyderabad: మద్యం బాటిళ్ల లారీ బోల్తా.. ఎగబడ్డ జనం
రసూల్పురా: మద్యం సీసాల లోడ్తో వెళ్తున్న డీసీఎం వాహనం టైరు పేలి బోల్తా పడిన ఘటన బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొంపల్లి ఐఎంఎఫ్ఎల్ డిపో నుంచి రూ.32 లక్షల విలువైన మద్యం కాటన్ బాక్సులతో డీసీఎం కంటైయినర్ బంజారాహిల్స్ వైపు వెళ్తోంది. బోయిన్పల్లి ఎంఎంఆర్ గార్డెన్ వద్దకు చేరుకోగానే వెనక టైరు పేలి అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో కంటెయినర్లో నుంచి మద్యం సీసాల కాటన్ బాక్స్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సమీపంలో ఉన్న బస్తీవాసులు, రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు మద్యం సీసాలను తీసుకుని ఉడాయించారు. మద్యం సీసాలను తీసుకుని వెళ్తున్న కొందరిని డీసీఎం డ్రైవర్ బసవలింగప్ప, ఇద్దరు హెల్పర్లు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ను నియంత్రించారు. డీసీఎం బోల్తా పడిన ఘటనతో జాతీయ రహదారిపై మూడు గంటల పాటు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. -
మధ్యతరగతికి 2వ అనుకూల నగరంగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: మధ్యతరగతి వర్గాలు సౌకర్యవంతంగా జీవించడానికి, తగినంత ఆదాయం పొందడానికి దేశంలోనే ఉత్తమ నగరంగా హైదరాబాద్ నిలిచింది. ఇక్కడ మిడిల్ క్లాస్..అటు వ్యయంలోనూ ఇటు పొదుపులోనూ తగినన్ని జాగ్రత్తలు పాటిస్తూన్నారని హోమ్ క్రెడిట్ ఇండియా ‘ది గ్రేట్ ఇండియన్ వాలెట్’ జాతీయస్థాయి అధ్యయనం స్పష్టం చేసింది. జాతీయ స్థాయిలో పలు నగరాల్లో మధ్యతరగతి జీవనం గురించి జరిపిన ఈ అధ్యయనం మన నగరం గురించి వెల్లడించిన ఆసక్తికర అంశాల్లో కొన్ని...👉దేశంలోని దిగువన ఉండే మధ్య తరగతి ప్రజల కోసం అనుకూల నగరంగా హైదరాబాద్ వరుసగా రెండవ సంవత్సరం తన హోదాను నిలబెట్టుకుని రెండో స్థానంలో నిలిచింది. బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. 👉 అత్యధిక వ్యక్తిగత నెలవారీ ఆదాయంతో (రూ.44 వేలు) దిగువ–మధ్యతరగతి జీవనంలో మన నగరం అగ్రస్థానంలో ఉంది, నగరంలో 69 శాతం మంది 2024లో ఎక్కువ ఆదా చేయగలిగారని అధ్యయనం తేల్చింది. 👉 నెలవారీ ఖర్చుల విషయానికి వస్తే, పర్యటనలు/సైట్ సీయింగ్ల కోసం ఆదాయంలో 35శాతం, బయటి ఆహారం కోసం 28 శాతం, సినిమాల కోసం 19 శాతం, ఫిట్నెస్ కోసం 6 శాతం, ఓటీటీ యాప్ల కోసం 10 శాతం ఖర్చు చేయడానికి ఇష్టపడుతున్నారు. 👉 ఆన్లైన్ ఆర్థిక మోసాలను తాము విన్నామని/చూస్తున్నామని నగరంలో 41 శాతం మంది ధృవీకరించారు. తామే స్వయంగా ఆన్లైన్ మోసానికి గురయ్యామని 27 శాతం మంది చెప్పారు. ఆరి్థక మోసం చేయాలనే ఉద్దేశ్యంతో వచ్చే బూటకపు ఫోన్ కాల్స్ను/మెసేజ్లను అందుకుంటున్నామని 37 శాతం మంది నగరవాసులు తెలిపారు. 👉 సులభంగా రుణ ఊబిలో ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయని 31 శాతం మంది, అధిక వ్యయం గురించి భయపడి 28 శాతం మంది, అధిక వడ్డీ రేట్ల కారణంగా 24 శాతం మంది, అధిక ప్రాసెసింగ్ ఇతర అధిక ఛార్జీలు గురించి 7 శాతం మంది యూపీఐపై రుణ సౌకర్యాన్ని వినియోగించుకోవడానికి ఇష్టపడడం లేదు. 👉 యూపీఐ సేవలకు రుసుములు గానీ వసూలు చేస్తే 64 శాతం మంది తాము దానిని ఉపయోగించడం ఆపివేస్తామని అంటున్నారు. 👉 తమ ఆదాయం గత సంవత్సరం కంటే ప్రస్తుత సంవత్సరంలో పెరిగిందని 52 శాతం మంది చెప్పారు, అలాగే రాబోయే సంవత్సరం నాటికి తమ ఆదాయం ఇంకా పెరుగుతుందని 74 శాతం మంది భావిస్తున్నారు. రాబోయే సంవత్సరంలో తాము మరింత పొదుపు చేయగలమని 66 శాతం మంది మరింత పెట్టుబడి పెట్టగలమని 66 శాతం మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 👉 నగరంలో సగటు వ్యక్తిగత నెలవారీ ఆదాయం 2023లో రూ.42 వేల నుంచి 44 వేలకు పెరిగింది. అలాగే స్థిర నెలవారీ ఖర్చులు కూడా రూ.19 వేల నుంచి 24 వేలకు పెరిగాయి. 👉 గత ఆరు నెలల్లో 57 శాతం మంది దుస్తులు, ఇతర అవసరార్ధ వస్తువుల కొనుగోలులో మునిగిపోయారని గణాంకాలు చెబుతున్నాయి. ఇంటి ఖర్చుల కోసం 79 శాతం వెచి్చస్తూ, నగరం ఈ విషయంలో ముంబై (75శాతం)ని అధిగమించింది. 👉 వ్యక్తిగత నెలవారీ ఆదాయం విషయంలో బెంగుళూరు హైదరాబాద్ నగరాలు జాతీయ సగటు కంటే వరుసగా 15 శాతం, 33 శాతం అధిక ఆదాయాలతో ముందున్నాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. 👉 ఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్ పూణే వంటి నగరాలలో ఆరి్థక మోసాల బారిన పడిన సంఘటనలు ఎక్కువగా ఉన్నాయని నివేదికలు తెలుపుతున్నాయి. 👉 నగరంతో సహా ఢిల్లీ–ఎన్.సి.ఆర్, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పుణే, లక్నో, జైపూర్, భోపాల్, పాట్నా, రాంచీ, చండీగఢ్, డెహ్రాడూన్, లుథియానా, కొచి్చతో సహా 17 నగరాల్లో గ్రేట్ ఇండియన్ వాలెట్ ఈ అధ్యయనం నిర్వహించింది. దీని కోసం 18–55 సంవత్సరాల మధ్య వయసు్కలు, వార్షిక ఆదాయం రూ.2 లక్షల నుండి రూ.5 లక్షల మధ్య ఉన్నవారిని ఎంచుకున్నారు. -
ఏఎంసీలో ఏమైంది?
లక్డీకాపూల్: నిమ్స్ ఆస్పత్రిలోని పాత అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ)లో ఏసీలు పని చేయకపోవడంపై బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన వార్తా కథనానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలని నిమ్స్ మెడికల్ సూరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణను ఆదేశించింది. దీంతో నిమ్స్ యాజమాన్యం ఏఎంసీలోని పరిస్థితులపై సంజాయిషీ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శికి రాసిన లేఖ ప్రతులను మీడియాకు విడుదల చేశారు. నిమ్స్లోని అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ)లో ప్రస్తుతం ఉన్న ప్యాకేజీ యూనిట్లు(ఏసీ) పురాతనమైనవి కారణంగా పనిచేయడం లేదని, మరమ్మతులు చేసినా ఫలితం కని్పంచడం లేదని లేఖలో అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుత ప్యాకేజీ యూనిట్లను మరింత సమర్థవంతమైన డక్టబుల్ యూనిట్లతో భర్తీ చేయడానికి రూ.12.50 లక్షల వ్యయంతో అంచనా వేశామని తెలిపారు. ఈ మేరకు నిపుణుల అభిప్రాయం కోసం అంతర్గత కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా టెండర్లు వేయడం కుదరదని అడ్మిని్రస్టేషన్ సూచించిందని, ఈ కారణంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారిని తాత్కాలికంగా అదే బ్లాక్లోని పాత ఐసీయూకి మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా..బుధవారం సాయంత్రానికల్లా ఏసీలను తాత్కాలికంగా మరమ్మతు చేయించారు. దీంతో పనిచేయడం మొదలు పెట్టాయని రోగుల బంధువులు పేర్కొన్నారు. ‘సాక్షి’ పుణ్యమా అని తమకు ఉపశమనం లభించిందని ఓ రోగి సహాయకుడు డానియేల్ సంతృప్తి వ్యక్తం చేశారు. -
Bolarum Cantonment Hospital: బోర్డుదే బాధ్యత
రసూల్పురా: బొల్లారం కంటోన్మెంట్ జనరల్ ఆసుపత్రిలో ఆవరణలో చెట్టు కూలి మృతి చెందిన తూంకుంట నివాసి రవీందర్ కుటుంబానికి కంటోన్మెంట్ బోర్డు అధికారులు న్యాయం చేయాలని కోరుతూ బంధువులు, కుటుంబ సభ్యులు బుధవారం ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. ఎండిన చెట్టు తొలగించడంలో బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నిండు ప్రాణం బలైందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయ పడిన రవీందర్ సతీమణి సరళాదేవి ఆస్పత్రి ఆవరణలో అంబులెన్స్లోనే ఉండి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వీరికి ఉపాధ్యాయ సంఘాల నాయకులు, తిరుమలగిరి మండల పరిధిలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మద్దతు పలికి ఆందోళనలో పాల్గొన్నారు. దీనిపై సమాచారం అందుకున్న బోర్డు సీఈవో మధుకర్ నాయక్ తమ తరపున ప్రతినిధులుగా వాటర్వర్క్స్ సూపరిటెండెంట్ రాజ్కుమార్, నర్సింగ్ రావు, యాని, రమణ, రాములును ఆస్పత్రికి పంపించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ బోర్డు అధికారులు ఘటనకు బాధ్యత వహించి రవీందర్ ఇద్దరు కుమార్తెలకు న్యాయం చేయాలని కోరారు. అధికారుల నిర్లక్ష్యంవల్లే రవీందర్ మృతి చెందాడని ఆరోపించారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని ఆస్పత్రి ముందు, మీటింగ్ హాల్లో, సూపరింటెండెంట్ రామకృష్ణ వద్ద నాలుగు గంటల పాటు నిరసనకు దిగారు. ఒక దశలో ఉపాధ్యాయులు అధికారి రాజ్కుమార్తో వాగ్వాదానికి దిగారు. అధికారుల హామీతో ఆందోళన విరమణ ఈ విషయంలో నిర్ణయం తీసుకునే వీలు తమకు లేదని, బోర్డు పాలకమండలి సమావేశంలో చర్చించి రవీందర్ కుటుంబానికి, వారి ఇద్దరు కుమార్తెలకు న్యాయం చేసేందుకు తగిన నిర్ణయం తీసుకుంటామని వాటర్వర్క్స్ అధికారి రాజ్కుమార్ హామీచ్చారు. అదే విధంగా తీవ్రంగా గాయపడిన సరళాదేవికి కిమ్స్ హాస్పిటల్లో మెరుగైన చికిత్స అందజేస్తామని, ఆ ఖర్చు మొత్తం బోర్డు భరిస్తుందని, బొల్లారం హస్పిటల్ నుంచి ఓ డాక్టర్ను కిమ్స్ ఆసుపత్రికి సరళాదేవితో పంపిస్తామని అధికారులు హామీచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. -
తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ బస్సుల బోల్తా.. ముగ్గురి మృతి
కర్నూలు, నిర్మల్/సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో గురువారం వేకువ ఝామున ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదాలతో రోడ్లు రక్తసిక్తమయ్యాయి. కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. అదే సమయంలో నిర్మల్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూల్ జిల్లా కోడుమూరు సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులోని 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులు హాహాకారాలు చేశారు. పోలీసులు స్థానికులు క్షతగాత్రులను బయటకు తీసి.. చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుండి ఆదోనికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.ఇక.. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్ పై ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల్లో 25 మందికి గాయాలు కాగా.. ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. పది మందిని నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. బస్సు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్తోందని.. ముందు వెళ్తున్న కారును ఓవర్టేక్ చేసే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. -
World Para Athletics Championships 2024: దీప్తితో మాటామంతి
కలకు సాధన తోడైతే చాలు మిగతావన్నీ వాటికవే వచ్చి చేరతాయి. ఈ మాట నా విషయంలో అక్షర సత్యం అంటోంది దీప్తి జివాంజీ. తెలంగాణలోని వరంగల్ వాసి అయిన దీప్తి జివాంజీ దినసరి కూలీ కుమార్తె. జపాన్లో జరుగుతున్న ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మహిళల విభాగంలో సోమవారం 400 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా 21 ఏళ్ల దీప్తిని పలకరిస్తే ఇలా సమాధానమిచ్చింది.⇢ క్రీడలే ప్రధానంగా!నా చిన్నప్పుడు స్కూల్లో పీఈటీ సర్ చెప్పిన విధంగాప్రాక్టీస్ చేసేదాన్ని. అప్పుడే జిల్లా స్థాయి ΄ోటీల్లో పాల్గొనేదాన్ని. నాకు చిన్నతనంలో తరచూ ఫిట్స్ వస్తుండేవి. రన్నింగ్ చేసేటప్పుడు బాడీ షేక్ అయ్యేది. దీంతో మా పీఈటీ సర్‡పారా అథ్లెట్స్తో మాట్లాడి, టెస్టులు చేయించారు. వారితో మాట్లాడి ‘ఇక పారా అథ్లెట్స్ గ్రూప్లో పాల్గొనమ’ని చె΄్పారు. మా అమ్మనాన్నలది మేనరికం కావడం వల్ల జన్యుపరమైన సమస్యలు వచ్చాయని తెలిసింది. అక్కణ్ణుంచి పారా అథ్లెటిక్ కాంపిటిషన్లో పాల్గొంటూ వచ్చాను. ఖమ్మంలో స్టేట్ మీట్ జరిగినప్పుడు అందులో పాల్గొన్నాను. మెడల్ రావడంతో అక్కణ్ణుంచి నా జీవితంలో క్రీడలు ప్రధాన భాగంగా మారి΄ోయాయి. డిగ్రీలో చేరాను కానీ, అప్పటికి ఇంకా పరీక్షలు రాయడం పూర్తి చేయలేదు.⇢ బలహీనతలను అధిగమించేలా..స్పోర్ట్స్లో పాల్గొనడం వల్ల ఒక ఆరోగ్యపరమైన సమస్యను ఆ విధంగా అధిగమించాను అనుకుంటాను. చిన్నప్పుడు మా చుట్టుపక్కల ఈ ఆటలు నీకు అవసరమా అన్నట్టు మాట్లాడేవారు. కానీ, కానీ, మా అమ్మ మాత్రం ‘అవన్నీ పట్టించుకోవద్దు. నీవనుకున్నదానిపైనే దృష్టి పెట్టు. ఈ రోజు నిన్ను అన్నవాళ్లే రేపు నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు’ అని చెప్పేది. ఆ విధంగా మానసిక ధైర్యం కూడా పెరిగింది. స్పోర్ట్స్ అన్ని బలహీనతలను దూరం చేస్తుందని.. గెలిచినా, ఓడినా.. ఎప్పడూ పాఠాలు నేర్చుకుంటూనే ఉంటామని నమ్ముతాను. ఇప్పటివరకు నాలుగు వరల్డ్ చాంపియన్షిప్ ΄ోటీల్లో పాల్గొన్నాను. నాకు సాయం చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు. ⇢ ధైర్యమే బలంమా ఇంటి పరిస్థితులు ఎప్పుడూ కష్టంగానే ఉండేవి. మా అమ్మ ధనలక్ష్మి కూలి పనులకు వెళుతుంది. నాన్న పైపుల కంపెనీలో పనిచేస్తాడు. చెల్లెలు స్కూల్కు వెళుతుంది. ఉండటానికి మాకు కనీసం అద్దె ఇల్లు కూడా ఉండేది కాదు. మొన్న మొన్నటి వరకు మా అమ్మమ్మ వాళ్లింటోనే ఉన్నాం. ఎన్నో అవమానాలూ ఎదుర్కొన్నాం. ఈ మధ్య ఆ ఇంటినే కొనుగోలు చేశాం. ఇక బలమైన ఆహారం అంటే స్పోర్ట్స్ అకాడమీలోకి వచ్చిన తర్వాతే అని చెప్పుకోవాలి. అమ్మ ఎప్పుడూ చెప్పే విషయాల్లో బాగా గుర్తుపెట్టుకునేవి కొన్ని ఉంటాయి. వాటిలో ‘కష్టపడితే ఏదీ వృథా ΄ోదు. నీకు నువ్వు ధైర్యంగా నిలబడాలి. అప్పుడే నిన్ను కాదని వెళ్లి΄ోయినవి కూడా నీ ముందుకు వస్తాయి’ అంటుంది. మొన్న జపాన్లో జరిగిన పారా ఒలింపిక్లో బంగారు పతకం సాధించిన విషయం చెప్పినప్పుడు అమ్మ చాలా సంతోషించింది. నా బలం మా అమ్మే. ఆమె ఏమీ చదువుకోలేదు. కానీ, ధైర్యంగా ఎలా ఉండాలో చెబుతుంది. ఆడపిల్లలమైనా మేం బాగా ఎదగాలని కోరుకుంటుంది.⇢ ప్రాక్టీస్ మీదనే దృష్టిటీవీ కూడా చూడను. ΄÷లిటికల్ లీడర్స్కు సంబంధించి వచ్చే సాంగ్స్ వింటుంటాను. ఆ పాటల్లో స్ఫూర్తిమంతమైన పదాలు ఉంటాయి. హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఉంటున్నాను. మరో మూడు నెలల్లో ఒలపింక్స్ లో పాల్గొనబోతున్నాను. దేశం తరపున పాల్గొనబోతున్నాను కాబట్టి నా దృష్టి అంతాప్రాక్టీస్ మీదనే ఉంది. సాధారణంగా ఉదయం రెండు గంటలు; సాయంత్రం రెండు గంటలుప్రాక్టీస్ ఉంటుంది. మధ్యలో మా రోజువారీ పనులు, విశ్రాంతికి సమయం కేటాయిస్తాం. నాతో పాటు ఉన్న స్నేహితులతో చిట్ చాట్ ఉంటుంది.⇢ బాధ్యతగా ఉండాలిచిన్నప్పటి నుంచి అమ్మనాన్నల కష్టం చూస్తూ పెరగడం వల్ల సొంతంగా ఇష్టాలు, అభిరుచులు అనే ధ్యాస ఏమీ లేదు. కానీ, చిన్నప్పటి నుంచి ΄ోలీసు కావాలనేది నా కల. ఇప్పటికీ అదే ఆలోచన. నా కృషి నేను చేస్తున్నాను. నేను కోరుకున్నది వస్తుందనేది నా నమ్మకం. అమ్మనాన్నలు ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. ΄ోలీసుని అయి మా అమ్మ నాన్నలను, చెల్లెలిని బాగా చూసుకోవాలి, అది నా బాధ్యత అనుకుంటున్నాను’’అంటూ ముగించింది దీప్తి. ఆమె ఆశలు, ఆశయాలు నెరవేరాలని కోరుకుందాం. – నిర్మలారెడ్డి -
సోనియాను ఏ ప్రాతిపదికన, ఎలా పిలుస్తారు? : జి.కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: జూన్ 2న జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాందీని ముఖ్యఅతిథిగా ప్రభుత్వం ఆహ్వానిస్తుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు జి.కిషన్రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో జాప్యం చేసి.. 1,500 మంది ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నందుకు ఆమెను పిలుస్తారా అని నిలదీశారు. సోనియాను ఆవిర్భావ ఉత్సవానికి పిలవడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వలేదని, అప్పటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుకు సుష్మాస్వరాజ్ ఆధ్వర్యంలో బీజేపీ పూర్తిస్థాయిలో పోరాటం చేసిందని, తమ పార్టీ పార్లమెంట్లో మద్దతు ఇచ్చింది కాబట్టే యూపీఏ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్రెడ్డి సోనియాను దయ్యం అన్నారని, ఇప్పుడు ఆయనకు ఆమె దేవత అయ్యిందా అని ఎద్దేవా చేశారు. తమకు సోనియాగాంధీ అప్పుడూ ఇప్పుడూ దయ్యమేనని వ్యాఖ్యానించారు. రైతులకు రాష్ట్ర సర్కారు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటేసినందుకు రైతులకు ‘చెయ్యి’ ఇస్తున్నారని కిషన్రెడ్డి మండిపడ్డారు. రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, అమలు చేయకుండా రైతాంగాన్ని నిలువునా ముంచిందని ధ్వజమెత్తారు. దొడ్డు, సన్న అనే తేడా లేకుండా ప్రతి రైతుకూ బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుభరోసా కింద రైతులు, కౌలు రైతులకు రూ. 15 వేల చొప్పున ఇవ్వలేదన్నారు. సన్న బియ్యాన్ని ప్రోత్సహించాలని అనుకుంటే రూ.1000 బోనస్ ఇవ్వాలని, దొడ్డు రకానికి రూ.500 బోనస్ ఇవ్వాలని చెప్పారు. దొడ్డు బియ్యం కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, రైతులకు ఇచి్చన హామీ నుంచి తప్పించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తో్తందన్నారు.తెలంగాణలో 90 శాతంమంది దొడ్డు రకం వడ్లు వేస్తుండగా, సన్నాలకే బోనస్ ఇస్తామని ఎలా చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో సకాలంలో ధాన్యం సేకరించలేకపోతున్నారు ‘2023–24 ఒప్పందం ప్రకారం కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన బియ్యం ఇంకా ఇవ్వలేదు. సకాలంలో ధాన్యం సేకరించలేకపోతోంది. అకాల వర్షాలతో ధాన్యం కల్లాలోనే తడిసిపోతోంది. కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి రైతులు పడిగాపులు కాస్తున్నారు. నిన్న కేవలం 75 వేల టన్నుల మాత్రమే కొనుగోలు చేసింది. ఇలాగే కొనసాగితే ధాన్యం కొనుగోలు పూర్తి కావడానికి మరో రెండు నెలల సమయం పడుతోంది’ అని కిషన్రెడ్డి చెప్పారు. -
మళ్లీ అధిక ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ పెరగనున్నాయి. అకాల వర్షాల నేపథ్యంలో గత పది రోజులుగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతూ వచ్చాయి. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారడం, నైరుతి సీజన్కు సమయం అనుకూలంగా మారుతున్న తరుణంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ శాఖ సూచించింది. ఉక్కపోత కూడా తీవ్రం కానుందని తెలిపింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర తీరానికి సమీప నైరుతి ప్రాంతంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బుధవారం ఉదయం అల్ప పీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ అల్ప పీడనం ఈశాన్య దిశలో కదిలి ఈ నెల 24వ తేదీ నాటికీ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ తర్వాత ఈ వాయుగుండం ఈశాన్య దిశలో కదులుతూ మరింత బలపడి ఈ నెల 25న ఈశాన్య, దానికి ఆనుకొని ఉన్న వాయవ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే దీని ప్రభావం రాష్ట్రంపై అంతగా ఉండబోదని తెలిపారు. రుతుపవనాలకు అనుకూలంగా..నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని మిగిలిన ప్రాంతాలు, ఉత్తర మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రానికి తూర్పు దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని, రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచిమోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించారు. బుధవారం రాష్ట్రంలో చాలాచోట్ల సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సీయస్ మేర తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్టంగా ఆదిలాబాద్లో 41.8 డిగ్రీ సెల్సీయస్, కనిష్టంగా మెదక్లో 24.3 డిగ్రీ సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (22-05-2024)
-
తీన్మార్మల్లన్నపై కేటీఆర్ సంచలన కామెంట్స్
సాక్షి,వరంగల్: మహిళల మెడలో తాళిబొట్టు కొట్టేసే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని కేటీఆర్ విమర్శించారు. వరంగల్లో బుధవారం(మే22) జరిగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులు ఉప ఎన్నిక ప్రచార సభలో కేటీఆర్ మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలైనవి.మంగళవారం ఎంజీఎం ఆసుపత్రిలో 5గంటల విద్యుత్ నిలిపోయింది. రూ.2లక్షల రుణమాఫీ కాలేదు. రైతులకు రైతుబంధు రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. వరికి రూ. 500 బోనస్ దక్కలేదు. రాష్ట్రంలో మోసాల పరంపర సాగుతోంది. కాంగ్రెస్ నాయకులు పచ్చి మోసగాళ్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలంటే... పట్టభద్రుల ఎమ్మెల్సీగా రాకేష్రెడ్డిని గెలిపించాలి.420 హామీలతో అధికారంలోకి వచ్చారు. కొత్త పరిశ్రమలను తీసుకువచ్చే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు. ఉన్న కంపెనీలను కాపాడుకునే సత్తా లేని నాయకులు కాంగ్రెస్ నాయకులు. తీన్మార్ మల్లన్న లాంటి నాయకులు గెలిస్తే చట్టసభలు బూతు మాటలకు వేదిక అవుతుంది’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. -
హైదరాబాద్: మేడిపల్లిలో దారుణం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని మేడిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. నెలల చిన్నారిని ఓ దుర్మార్గుల ముఠా అమ్మకానికి పెట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. చిన్నారిని అమ్ముతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పీర్జాదిగుడా కార్పొరేషన్ రామకృష్ణ నగర్లో శోభారాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఈ ఘటన జరిగింది. సుమారు నాలుగు లక్షలకు చిన్నారిని ఇప్పిస్తామని డాక్టర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొదటగా పదివేలు అడ్వాన్స్ తీసుకున్నట్లు సమాచారం. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏసీపీ ఉమామహేశ్వరరావు కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. అంతకు ముందు ఏసీబీ కార్యాలయంలో ఆయనను విచారించిన అధికారులు.. ట్యాబ్లో ఉన్న ఆస్తి వివరాలపై ఆరా తీశారు. బీనామీ ఆస్తులపై కూపీలాగుతున్నారు. సందీప్ అనే వ్యక్తి ఎవరు? అతనితో ఉన్న లావాదేవీలు ఏంటి? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న ఆస్తులు డాక్యుమెంట్స్ వివరాలను ఏసీబీ అధికారులు కోర్టుకు అందించారు. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం మూడు కోట్ల ఆస్తులను ఏసీబీ గుర్తించింది.ఆస్తి విలువ అనధికారికంగా బహిరంగ మార్కెట్లో రూ. 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. పలుమార్లు సస్పెండయినా కానీ కీలక పోస్టింగ్లు దక్కించుకోవటంపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఉమామహేశ్వరరావు వెనక ఉన్న అధికారుల అవినీతిపై ఏసీబీ విచారణ చేస్తోంది. కాగా, ఏసీబీ విచారణకు ఉమా మహేశ్వర రావు ఏమాత్రం సహకరించడం లేదని సమాచారం. ఉమామహేశ్వరరావు ఫిర్యాదుదారులనే బెదిరించి వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ల్యాప్ టాప్లో దొరికిన సమాచారం ఆధారంగా ఏసీబీ విచారణ చేపట్టింది. కొందరు పోలీస్ అధికారులతో కలిసి బినామీ వ్యాపారాలు చేసినట్టు ఏసీబీ గుర్తించింది.ఉమామహేశ్వరరావుకు జ్యూడీషియల్ రిమాండ్ఉమామహేశ్వరరావుకు నాంపల్లి ఏసీబీ కోర్టు 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. జూన్ 5 వరకు రిమాండ్ విధించింది. ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. -
వరంగల్లో అర్ధరాత్రి బాంబుల మోత, కారణం ఏంటంటే..
వరంగల్: బాంబులతో వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ పాత భవనాల కూల్చివేత జరుగుతుండగా.. బాంబుల మోతతో నగరం దద్దరిల్లింది. పెద్ద శబ్దాలకు చుట్టుపక్క ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చిన్న తప్పిదం జరిగినా భారీ నష్టం వాటిళ్లే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా కూతవేటు దూరంలో రైల్వే స్టేషన్ కూడా ఉండటం గమనార్హం.ఇక.. వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ పాత భవనాల తొలగింపు పనులు చకచకా సాగుతున్నాయి. రూ.70 కోట్లతో అధునాతన బహుళ అంతస్తుల బస్స్టేషన్ నిర్మాణంలో భాగంగా సిటీ బస్స్టేషన్ను అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత బాంబుల (జిలెటిన్ స్టిక్స్)తో భవనాలను కూల్చి వేశారు. పురాతన భవనాలు దృఢంగా ఉండటంతో ఎక్స్కవేటర్లతో కూల్చడం సాధ్యం కాకపోవడంతో, కూల్చివేతలకు పేలుడు పదార్థాలు ఉపయోగించారు. -
రేవంత్ హామీ నెరవేర్చినట్లా? యూటర్న్తో మోసం చేసినట్లా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం అయిన మంత్రివర్గం సన్నవడ్లు పండించే రైతులకు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనితో కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన మరో హామీని నెరవేర్చినట్లేనా! ఒక రకంగా చూస్తే వాగ్దానం అమలు చేసినట్లే అవుతుంది. ఇంకో రకంగా చూస్తే రైతులను మోసం చేసినట్లు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీల గురించి ప్రస్తావించినప్పుడు అందులో ఉన్న పాయింట్ ఏమిటంటే వరి ధాన్యం పండించే రైతులకు ఏడాదికి 500 రూపాయల బోనస్ ఇస్తామని తెలిపారు. ఇప్పుడు అలాగే చేశారు కదా అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ తన గ్యారంటీలను అమలు చేయడంలో ముందుకు వెళ్లినట్లే కదా అని భావించవచ్చు. ఇక్కడే కిటుకు ఉంది. మంత్రివర్గం ఈ హామీ అమలులో ఒక షరతుపెట్టింది. సన్నరకం వడ్లు పండించే రైతులకే ఈ బోనస్ ఇస్తామని తెలిపింది. గ్యారంటీలలో ఇలాంటి షరతు పెట్టలేదు కదా అని ఎవరైనా అడగవచ్చు. అలా అని అన్ని రకాల వడ్లకు ముఖ్యంగా దొడ్డు రకం వడ్లకు బోనస్ ఇస్తామని ప్రత్యేకంగా చెప్పలేదు కదా అని వాదించవచ్చు. కాంగ్రెస్ నేతలు తమ ప్రసంగాలలో రైతు పండించే పంట ప్రతి గింజను కొనుగోలు చేసి బోనస్ కూడా ఇస్తామని చెప్పేవారు. అందువల్ల ఈ షరతు పెడతారని ఎవరూ అనుకోరు. ఇలా కండిషన్ పెట్టడం రైతులను మోసం చేసినట్లే కదా అని ఎవరైనా విమర్శిస్తే కూడా అంగీకరించవలసిందే. దీనికి కారణం ఏమిటంటే తెలంగాణలో పండించే వడ్లలో సన్నరకం వాటా కేవలం ముప్పై శాతమేనని ఒక అంచనా. మిగిలినదంతా దొడ్డు రకం వడ్లేనని చెబుతున్నారు. అప్పుడు మిగతా రైతులకు బోనస్ దక్కదు. దీనిపై రైతు వర్గాలలో వ్యతిరేకత వస్తుంది. మార్కెట్ లో సన్నరకం ధాన్యానికి మంచి గిరాకి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కన్నా ఐదు వందల నుంచి ఏడువందల రూపాయలు అధికంగా మార్కెట్ లో లబిస్తుంది. అందువల్ల మార్కెట్ లో విక్రయించుకునే సన్నవడ్ల రైతులకు బోనస్ ఇవ్వవలసిన అవసరం ఉండదు. ఒక లెక్క ప్రకారం ఏడాదికి రెండు సీజన్ లలో కలిపి కోటిన్నర టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది.మొత్తం ధాన్యానికి బోనస్ ఇవ్వవలసి వస్తే ప్రభుత్వానికి సుమారు ఆరువేల కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతుంది. సన్నరకం వడ్లకు బోనస్ ఇస్తే ప్రభుత్వంపై రెండువేల కోట్ల భారం పడుతుందని అధికారవర్గాలు చెబుతున్నా,వాస్తవానికి అంత కూడా ఉండదన్నది విపక్షాల అభిప్రాయం. ఇది రైతులను మోసం చేయడమేనని వారు అంటున్నారు. సన్నవడ్లలో కూడా ఏ రకానికి బోనస్ ఇచ్చేది తర్వాత అధికారులు ప్రకటిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరులకు చెప్పారు. అంటే ఇందులో కూడా లిటిగేషన్ ఉందన్న మాట. రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చేటప్పుడు బాధ్యతగా ఉండడం లేదని, ఏదో రకంగా మభ్య పెట్టి ఓట్లుపొందడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. సన్నరకం వడ్లను ప్రోత్సహించడానికి తొలుత ఆ వడ్లకు బోనస్ ఇస్తున్నామని, తదుపరి దొడ్డురకం వడ్లకు కూడా ఇస్తామమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కె చెప్పారు. ఆయన తెలివిగానే ఈ ప్రకటన చేసినా, ఆ మేరకు క్యాబినెట్ లో తీర్మానం చేయలేదు కదా అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. తెలంగాణలోకాని, కర్నాటకలోని గ్యారంటీల పేరుతో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు సతమతమవుతున్నాయి.ఒకటి,రెండు అంశాలను అమలు చేసి గ్యారంటీలను చెప్పినట్లే చేస్తున్నాం కదా అని డబాయిస్తున్నారు. రైతులకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సహజంగానే వ్యతిరేకత తెస్తుంది. నిజానికి రైతులు ఎవరూ తమ ఉత్పత్తులకు బోనస్ ఇవ్వాలని అడగలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను గద్దె దించడానికి ఇలాంటి పలు వాగ్దానాలు చేసింది. వాటిలో రైతు భరోసా కింద పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని, కౌలు రైతులకు కూడా వర్తింప చేస్తామని, రైతు కూలీలకు పన్నెండువేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. రైతు భరోసాను గత ప్రభుత్వం అమలు చేసిన పదివేలు చొప్పునే చేయగలిగారు. దానికి కొంత టైమ్ తీసుకున్నా మొత్తం మీద ఆ మేర అయినా చేశారు. ఇది ప్రామిస్ ను నెరవేర్చినట్లేనా అంటే మళ్లీ అదే రకంగా రెండు రకాల వాదనలు వస్తాయి.రైతుల రుణాలు రెండు లక్షల వరకు మాఫీ చేస్తామన్న మరో హామీ కూడా ఉంది. ఎన్నికల ప్రచారం సమయంలో పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి రైతులు ఎవరైనా బ్యాంకులలో అప్పులు చేయకపోతే వెళ్లి తీసుకోవాలని కూడా సూచించారు. ఇప్పుడు అది శక్తికి మించిన పని కావడంతో కిందా మీద పడాల్సి వస్తోంది. దాంతో పలు వాయిదాలు వేస్తున్నారు. ఆగస్టు పదిహేను లోగా రుణమాఫీ చేస్తామని రేవంత్ అంటున్నారు. ఇందుకోసం సుమారు నలభై వేల కోట్ల రూపాయలు అవసరమని ఒక అంచనా కాగా,పాతికవేల కోట్లు సరిపోవచ్చని కొందరి అంచనా. ఇప్పుడు బోనస్ లో ఎలా మెలిక పెట్టారో, రుణమాఫీలో కూడా కొన్ని షరతులు పెట్టి భారం తగ్గించుకునే ప్రయత్నం జరగవచ్చు. ప్రభుత్వం అన్నాక కొన్ని నిబంధనలు పాటించక తప్పదు. వాటిని దృష్టిలో ఉంచుకునే రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేయాలి. ఎన్నికల సమయంలో నేతలు ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చేస్తున్నారు.కొండకు వెంట్రుక కట్టినట్లు వ్యవహరించి అధికారం సాధించిన తర్వాత మాత్రం గుడ్లు తేలేయవలసి వస్తోంది. గతంలో కెసిఆర్ ప్రభుత్వం చిన్న,పెద్ద,ధనిక రైతులందరికి రైతు బంధు అమలు చేసింది.ఆ రోజుల్లో పలు విమర్శలు కూడా వచ్చాయి. పంటలు పండని భూములకు కూడా రైతు బంధు ఇచ్చారని అనేవారు. కొందరు బెంజ్ కార్లలో వెళ్లి రైతు బంధు డబ్బు తీసుకున్నారు. కౌలు రైతులకు ఆ స్కీమ్ అమలు చేయలేమని అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టంగానే చెప్పారు.కాంగ్రెస్ వారు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని అన్నారు.కాని ఆ దిశగా ముందుకు వెళ్లలేదు.ఇక రుణమాఫీ అమలు ఎలా చేస్తారా అన్నది ఆసక్తికరంగా ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చేయగలుగుతామని రేవంత్ తదితరులు ఆయా సందర్భాలలో చెప్పారు. కాంగ్రెస్ కేంద్రంలో అదికారంలోకి రాలేకపోతే ఏమి చేయాలన్న ప్రశ్న వస్తుంది. రిజర్వు బ్యాంక్ ను అప్రోచ్ అయి బ్యాంకుల ద్వారా రుణాలు పొందాలని ఆలోచిస్తున్నారు. ఎక్సైజ్,రిజిస్ట్రేషన్ వంటి శాఖల ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణం తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు గతంలో కొన్ని ప్రభుత్వాలు చేయకపోలేదు. రిజర్వుబ్యాంక్ అందుకు అంత సుముఖత చూపలేదు. ఉదాహరణకు ఎపిలో 2014లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రైతులకు లక్షన్నర రూపాయల వరకు రుణమాఫీ చేయాలని తలపెట్టి ,రైతుసాధికార సంస్థను నెలకొల్పినా, ఆచరణలో హామీని నిలబెట్టుకోలేకపోయింది. 89 వేల కోట్ల రూపాయల రుణాల మాఫీ చేస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు అంతా కలిపి పదిహేను వేల కోట్లు చేసి చేతులెత్తేశారు. అందులో కూడా రైతులు నానా పాట్లు పడవలసి వచ్చింది.ఎన్నో షరతులు పెట్టేసరికి వారికి విసుగు వచ్చింది.తత్పలితంగా రైతులంతా టిడిపి ప్రభుత్వం తమను మోసం చేసిందని భావించి 2019 ఎన్నికలలో ఓడించారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తపడే యత్నం చేస్తోంది. అయినా తొలి అడుగులోనే తడబడాల్సి వస్తోంది.ప్రభుత్వం వద్ద ఆర్దిక వనరులు పుష్కలంగా ఉంటే దేనినైనా చేయవచ్చు. అలా నిధులు లేవని తెలిసినా, శక్తికి మించిన పని అని తెలిసినా, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చేసి ఇప్పుడు దిక్కులు చూడవలసి వస్తోంది. కాంగ్రెస్ మాత్రమే ఇలా చేస్తోందని కాదు.ఆయా రాష్ట్రాలలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఇలాగే చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఒడిషా లో బీజేపీ ప్రతి మహిళకు ఏభైవేల రూపాయల చొప్పున ఓచర్ ఇస్తామని వాగ్దానం చేసిందట. ఉచితాలకు వ్యతిరేకం అని చెప్పే బారతీయ జనతా పార్టీ నేతలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోతీరున ఉంటున్నారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలలో మరికొన్ని ముఖ్యమైన హామీలను అమలు చేయలేని నిస్సహాయ స్తితి ఉంది.వృద్దులకు ఇచ్చేపెన్షన్ ను నాలుగువేల రూపాయలు చేస్తామని ప్రకటించినా, ఆచరణ ఆరంభం కాలేదు. నిరుద్యోగ బృతి పరిస్థితి అంతే. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి అసలు నిరుద్యోగ భృతి ఎక్కడ ఇస్తామని అనడంపై విపక్షాలు మండిపడ్డాయి. మహాలక్ష్మి కింద ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ తెలిపింది. అది ఎప్పటికి అమలు అవుతుందో చెప్పలేరు. దానికి కూడా ఏవేవో కండిషన్లు పెట్టి అయిపోయిందని చెబుతారో ఏమో చూడాలి.500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ స్కీము అమలు చేశామని చెప్పారు కాని అది ఎంతమందికి వస్తుందో తెలియదు. మహిళలకు ఉచిత బస్ హామీని మాత్రం పూర్తిగానే అమలు చేస్తున్నట్లు లెక్క.ఆలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచారు. వీటివల్ల ప్రభుత్వంపై తక్షణ భారం ఉండదు.అయినా ఆర్టిసి భవిష్యత్తులో ఇబ్బంది పడవలసి ఉంటుంది. మరో వైపు ప్రభుత్వం ఇప్పటికే సుమారు పదహారువేల కోట్ల అప్పు చేసిందని బీజేపీ వ్యాఖ్యానిస్తోంది. ఫీజ్ రీయింబర్స్ మెంట్ కింద 6500 కోట్ల బకాయిలు ఉన్నాయని కాలేజీలవారు, ఆరోగ్యశ్రీ కింద 1200 కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయని ఆస్పత్రులవారు చెబుతున్నారు.ఈ నేపధ్యంలో రేవంత్ ప్రభుత్వానికి ఈ గ్యారంటీలు,వాటితో నిమిత్తం లేకుండా ఆయా డిక్లరేషన్ లలో చేసిన ఇతర హామీలు పెద్ద గుది బండలే అవుతాయని చెప్పకతప్పదు.ఒకరకంగా ఇది రేవంత్ ప్రభుత్వానికి సవాలు వంటిది. కొసమెరుపుగా ఒకటి చెప్పుకోవాలి. ఏపీ లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోసే ఈనాడు,తదితర ఎల్లో మీడియా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి భజన చేసింది. సన్నవడ్లకు బోనస్ వల్ల రెండువేల కోట్ల భారం అని ఈనాడు రాసిందే తప్ప, కాంగ్రెస్ వాగ్దాన భంగం చేసిందని మాత్రం రాయకుండా జాగ్రత్తపడింది. చూశారుగా..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఈనాడు మీడియా ఎలా జాకీలు పెడుతోందో..బాకాలు ఊదుతోందో!. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయలు -
నా బిడ్డలు నాకు కావాలి.. పీఎస్ ఎదుట ఎస్ భార్య నిరసన
కొమురవెల్లి(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా కొమురవెల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్ఐ నాగరాజు భార్య మానస మంగళవారం ఆందోళనకు దిగింది. తన భర్త రెండో పెళ్లి చేసుకొని, ఇద్దరు కుమారులను తీసుకెళ్లాడని, న్యాయం చేయాలని కోరింది. బాధితురాలి కథనం ప్రకారం.. ఎస్ఐ నాగరాజు తనను పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారని మానస తెలిపింది. రెండేళ్ల నుంచి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడని, అనంతరం రెండో పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. తన ఇద్దరు పిల్లను దూరం చేసి మరో సంసారం చేస్తూ తనకు అన్యాయం చేస్తున్నాడని వాపోయింది. రెండేళ్ల క్రితం కరీంనగర్లో పెట్టి తన ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి విడాకులు ఇవ్వాలని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అన్నారు. దీంతో తాను ఆత్మహత్యకు యత్నించగా.. పిల్లలను తనకు ఇప్పించి న్యాయం చేస్తామని బంధువులు చెప్పడంతో విరమించినట్లు తెలిపింది. ఈ విషయమై సిద్దిపేట సీపీ, చేర్యాల సీఐ, కరీంనగర్ మహిళ స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తకు ఫోన్ చేస్తే నంబర్ను బ్లాక్ లిస్టులో పెట్టాడని పేర్కొంది. బంధువులతో కలిసి కొమురవెల్లి పోలీస్స్టేషన్కు రాగా ఎస్ఐ ఆరు రోజులుగా సెలవులో ఉన్నాడని చెప్పారని తెలిపింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని చెప్పింది. సీఐ శ్రీనివాస్ వివరణ కోరగా.. ఇటీవల మానస ఈ విషయం తన దృష్టికి తీసుకువచి్చందని, కౌన్సెలింగ్ ఇచ్చామని, ఉన్నత అధికారుల ఆదేశాసుసారంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
పబ్బుల మీద బతికే వసూల్ రాజా!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లకు టార్గెట్లు పెట్టి మరీ కప్పం వసూలు చేస్తున్నాడు. తొలినాళ్లల్లో పోలీసులకు, పబ్స్కు మధ్య దళారిగా వ్యవహరించిన ఇతడు ప్రస్తుతం వాటి యజమానులను బెదిరించే స్థాయికి వెళ్లాడు. తనకు నెలనెలా మామూళ్లు చెల్లించకపోతే సిటీలో వ్యాపారం చేయలేరని, పోలీసులు, ఎక్సైజ్ విభాగాలతో పాటు నార్కోటిక్స్ వింగ్స్తోనూ దాడులు చేయిస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. ఆయా అధికారులతో మాట్లాడిన ఆడియోలను సైతం వారికి షేర్ చేసి మరీ డబ్బు డిమాండ్ చేస్తున్నాడు. ఇటీవల కాలంలో పబ్బులపై పోలీసులు కఠిన వైఖరి అవలంబిస్తుండటంతో దీన్నే పెట్టుబడిగా మార్చుకుని రెచ్చిపోతున్న ఈ వసూల్ రాజా బారి నుంచి తమను ఆదుకోవాలని పలువురు వేడుకుంటున్నారు. అధికారులను ఉసిగొల్పుతానంటూ.. నగరంలోని కొన్ని పబ్స్ యజమానులకు చోటా నేతగా పరిచయమైన ఈ వసూల్ రాజా.. హ్యూమన్రైట్స్ కార్యకర్త అని, ఓ సేన యాక్టివిస్ట్ అంటూ పోలీసులకు దగ్గరయ్యాడు. ఆపై సదరు పోలీసు అధికారుల సంబం«దీకులకు–పబ్స్ యజమానులకు మధ్య దళారీగా మారాడు. కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది తమ వారు ఎవరైనా పబ్కు వెళ్లాలని భావిస్తే ఇతడిని సంప్రదించే వాళ్లు. వారిని పబ్కు పంపడమే కాకుండా బిల్లుల్లోనూ రాయితీలు ఇప్పించేవాడు. ఇలా కొన్ని పబ్స్ను తన చేతిలో పెట్టుకున్న సదరు దళారీ వాటి యజమానులకు టార్గెట్లు పెట్టి మరీ ప్రతి నెలా వసూళ్లకు పాల్పడ్డాడు. పోలీసులు, ఎక్సైజ్, నార్కోటిక్స్ విభాగాలతో పాటు ఇతరులకూ డబ్బు ఇవ్వాల్సి ఉందంటూ వారి నుంచి దండుకున్నాడు. ఆ అధికారులు ఎవరూ పబ్ జోలికి రాకుండా చూస్తానంటూ యజమానుల నుంచి డబ్బు తీసుకున్నాడు. నా మాట వినకుంటే అంతే.. 👉తన మాట వినని వారికి సంబంధించిన పబ్స్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ స్థానిక పోలీసులు, ప్రత్యేక విభాగాలకు ఈ దళారీ ఫోన్లు చేస్తుంటాడు. ఆ ఆడియోలను రికార్డు చేసి సదరు పబ్ యజమానికే పంపిస్తుంటాడు. అలా పంపిన తర్వాత పోలీసులతో తనకు దగ్గరి సంబంధాలు ఉన్నాయని, తన మాట వినకుంటే దాడుల చేయిస్తానని బెదిరింపులకు దిగి వసూళ్లు చేస్తున్నాడు. ఎంతకీ తన మాట వినని పబ్స్ యజమానులకు తన దారికి తెచ్చుకోవడానికి సదరు దళారీ పోలీసులను వినియోగించుకుంటాడు. 👉 ఆయా పబ్స్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, యువత పెడదారి పడుతున్నారని, స్థానిక మహిళలు తనకు ఫిర్యాదు చేశారంటూ పోలీసులకు ఫోన్లు చేస్తాడు. తక్షణం దానిపై దాడి చేసి, సోదాలు చేయాలని కోరతాడు. వారు పట్టించుకోకుంటే పై స్థాయి «అధికారులకు ఫోన్లు చేయడం ప్రారంభిస్తాడు. ఆపై పబ్స్ యజమానిని సంప్రదించి అధికారులతో మాట్లాడిన ఆడియో రికార్డులు షేర్ చేస్తాడు. 👉తడి బెదిరింపులు తట్టుకోలేకపోయిన కొందరు పబ్స్ యజమానులు తమ సంస్థలు అయినకాడికి అమ్ముకుని నగరం విడిచి వెళ్లిపోయారు. మరికొందరు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. ఈ దళారీ బెదిరింపులకు భయపడి ప్రోత్సహించవద్దని, అతడి బారి నుంచి తమను కాపాడాలని పబ్స్ యజమానులు పోలీసులను వేడుకుంటున్నారు. -
ఏఎంసీ.. నో ఏసీ!.. ఇచ్చట ఎవరి ఫ్యాన్లు వారే తెచ్చుకోవలెను
ఇది మామూలు ఆసుపత్రి కాదు..ఏ పట్టణంలోదో..పల్లెల్లోదో అంతకన్నా కాదు. సాక్ష్యాత్తు రాజధాని నగరం హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక నిజామ్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్). కానీ ఇక్కడి అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ)సెంటర్లో ఏసీ పనిచేయడం లేదు. కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా లేవు. దీంతో ‘ఏసీ పనిచేయడం లేదు..మీరే ఫ్యాన్లు తెచ్చుకోండి’ అంటూ ఆస్పత్రి సిబ్బంది రోగుల సంబందీకులకు సెలవిస్తున్నారు. వాస్తవానికి ప్రాణపాయ స్థితిలో ఉన్న రోగులకు అత్యంత వైద్య సంరక్షణ అందించేందుకు ఏఎంసీని వినియోగిస్తారు. కానీ ఇప్పుడు నిమ్స్ ఏఎంసీని చూస్తే జనరల్ వార్డుకన్నా అధ్వానంగా మారింది. లక్డీకాపూల్: నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలను అందించే నిమ్స్ ఆస్పత్రిలో సేవలు పొందడం చాలా కష్టతరమైంది. పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా మెరుగైన సేవలు, సౌకర్యాలు కలి్పంచడంలో యాజమాన్యం విఫలమవుతోంది. ఇందుకు ఉదాహరణగా ఆస్పత్రిలోని ఏఎంసీ వార్డును పేర్కొనవచ్చు. వ్యాధి సమస్య తీవ్రరూపం దాలి్చన స్థితిలో రోగిని ఇక్కడకి తరలించి వైద్యసేవలను అందిస్తారు. వాస్తవానికి ఏఎంసీ సాధారణ వ్యాధులు(జనరల్ మెడిసిన్) విభాగానికి సంబంధించిన ఐసీయూ(అత్యవసర చికిత్సా కేంద్రం). ఇందులో రోగి ప్రాణపాయస్థితికి చేరినప్పడు వైద్యసేవలను అందిస్తారు.ముఖ్యంగా అన్ కంట్రోల్ డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్న వారిని, డెంగ్యూ ఫీవర్, తీవ్రమైన స్థాయిలో రక్తాన్ని కోల్పోతున్న రోగులకు ఏఎంసీలో చికిత్స అందిస్తుంటారు. అదే విధంగా జ్వరంతో బాధపడుతున్న వాళ్లతో పాటు ఇతర మెడికల్ కండిషన్లో రోగులకు సైతం ఏఎంసీలో వైద్యసేవలను అందిస్తారు. ప్రస్తుతం ఈ వార్డులో 16 పడకలు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ రోగులతో నిండుకున్నాయి. అయితే..అత్యంత కీలకమైన ఈ విభాగంలో ఏసీలు పని చేయకపోవడంతో రోగుల బాధలు వర్ణణాతీతం. ఇక్కడకి చికిత్స కోసం వచ్చే రోగులకు ముందు ఫ్యాన్ తెచ్చుకోవాలని అక్కడి వైద్య సిబ్బంది నేరుగా సూచించడం పరిపాటి. రెండు దశాబ్దాల నాటి ఏసీలు చెడిపోయాయి. దీంతో ఏఎంసీ దుస్థితి అధ్వాన్నంగా తయారైంది. కాలం చెల్లిన ఏసీలు.. దాదాపు 15 ఏళ్ల నాటి ఏసీలే ఇప్పటికీ వినియోగిస్తుండడంతో అవి మొరాయిస్తున్నాయి. కనీసం రిపేరుకు స్పేర్ పార్ట్స్ కూడా దొరక్క వాటిని ఆపేస్తున్నారు. ఏఎంసీ వార్డులో కూడా ఇదే జరిగింది. కండెన్సర్లు దెబ్బతినడంతో ఏసీలు పని చేయడం మానేశాయి. మరొపక్క ఆస్పత్రిలో ఏసీ లోడ్ భారం కూడా విపరీతంగా పెరిగిందనే చెప్పాలి. ఆస్పత్రిలో ఒకప్పుడు 200 పడకల సామర్ధ్యం కలిగిన ఐసీయూ యూనిట్లు ఉండేవి. ప్రస్తుతం 500ల వరకు ఐసీయూ పడకలు రోగులకు అందుబాటులో ఉన్నాయి. దానికి తోడు వైద్య పరీక్షల్లో మరింత మెరుగైన సేవలను అందించే క్రమంలో అందుబాటులోకి తీసుకువచి్చన అత్యాధునికి వైద్య పరికరాలకు సైతం ఏసీల అవసరం ఉంది.మరమ్మతులు చేయిస్తాం.. ‘ఏఎంసీలో ఏసీలు పని చేయడం లేదు..రోగులే ఫ్యాన్లు తెచ్చకుంటున్నారు. ఇది నిజమే. ఆ ఏసీలను రిపేరు చేయాలంటే ఆ వార్డును ఖాళీ చేయాలి. అందులో ఉన్న రోగులను ఎక్కడికి షిప్ట్ చేయాలో తెలియడం లేదు. అందుకే సకాలంలో రిపేరు చేయించలేకపోతున్నాం. ఏఎంసీని పూర్తిగా ఆధునీకరించేందుకు దాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. త్వరలో చర్యలు తీసుకుంటాం’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. హెచ్డీయూ లేదు..సాధారణంగా ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్ విభాగానికి సంబంధించి ఏఎంసీతో పాటు హై డిఫెడెంట్ యూనిట్(హెచ్డీయూ)ను కూడా ఏర్పాటు చేయాలి. కానీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, రిఫరల్ ఆస్పత్రిగా ఖ్యాతి చెందిన నిమ్స్లో హెచ్డీయూను విస్మరించారు. ఏఎంసీలో వైద్య సేవలకు అంతరాయం కలిగినప్పుడే కాకుండా వ్యాధి తీవ్రత మేరకు ఏంఎంసీపై భారం తగ్గించడానికి హెచ్డీయూ ఉపయుక్తంగా ఉంటుంది. ఒక విధంగా ఈ విభాగాన్ని ఏఎంసీ సపోరి్టంగ్ యూనిట్గా వినియోగిస్తారు. అలాంటి దాని విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది. ఫలితంగా ప్రస్తుత పరిస్థితుల్లో రోగులు నానా అగచాట్లకు గురవుతున్నారు. ఏసీలు పని చేయని కారణంగా.. రోగులే సొంతంగా ఫ్యాన్లు తెచ్చుకుని వైద్యసేవలు పొందాల్సి వస్తోంది. -
రెప్పపాటులోనే మృత్యు ఒడికి
హైదరాబాద్: చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన దంపతులపై అకస్మాత్తుగా చెట్టు కూలి మీద పడడంతో భర్త దుర్మరణం పాలయ్యాడు. భార్య తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోంది. ఈ విషాదకర సంఘటన బొల్లారం పీఎస్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..తూంకుంటకు చెందిన ప్రైవేటు ఉద్యోగి రవీందర్..బొల్లారం పయనీర్ బజార్ ప్రభుత్వ పాఠశాల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న భార్య సరళకుమారితో కలిసి హోండా యాక్టివాపై బొల్లారం ఆస్పత్రికి వచ్చారు. వాహనం ఆవరణలోకి ప్రవేశించగానే అకస్మాత్తుగా పక్కనే ఉన్న ఓ భారీ వృక్షం కూలి వీరిపై పడింది. ఈ ఘటనలో రవీందర్ అక్కడికక్కడే మృతి చెందగా సరళకుమారి తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మెరుగైన చికిత్స కోసం సరళాదేవిని గాంధీ ఆస్పత్రికి అంబులెన్స్లో తరలించారు. రవీందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న సహచర ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. సరళకుమారి అనారోగ్యం బారిన పడడంతో చికిత్స కోసం బొల్లారం ఆసుపత్రికి వచ్చారని వారు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఎండిన భారీ వృక్షాన్ని తొలగించినట్లయితే ప్రమాదం జరిగేది కాదని, పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమేనని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. సీసీ ఫుటేజ్.. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన దంపతులు.. చెట్టు కూలి భర్త మృతి https://t.co/kUxuCIxNku pic.twitter.com/SGDpJqzx1l— Telugu Scribe (@TeluguScribe) May 21, 2024 -
Hyderabad: కట్టుకున్నోడే కడతేర్చాడు..
హైదరాబాద్: ఉప్పల్ ఎస్బీఐ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్నోడే కాలయముడయ్యాడు. భర్తపై ఉన్న అనుమానంతో ప్రశి్నంచినందుకు అర్దరాత్రి భార్య గొంతుపై కాలు పెట్టి తొక్కి అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడో కిరాతకుడు. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జనగాం లింగంపల్లి ప్రాంతానికి చెందిన భూక్యా రమేశ్, కొండాపూర్ దుబ్బ తండాకు చెందిన భూక్యా కమలకు 2016లో వివాహం జరిగింది. బతుకు దెరువుకోసం నగరానికి వచ్చి ఉప్పల్ ఎస్బీఐ కాలనీలో ఉంటున్నారు.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలు నానమ్మ ఇంటికి వెళ్లారు. కాగా గత కొంత కాలంగా భర్త రమేష్ వ్యవహారం అనుమానాస్పదంగా కనిపించడంతో.. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కమల అనుమానించింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు నిలదీసి పంచాయితీ పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం భార్యా భర్తల మధ్య గొడవ మొదలయింది. అనంతరం ఇద్దరు కలిసి ఇంటికి తాళం పెట్టి బయటకు వెళ్లి తిరిగి సాయంత్రం వచ్చారు. రాత్రి వీరిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగి..రమేశ్ భార్య తలపై కొట్టడంతో కింద పడిపోయింది. వెంటనే ఆమె గొంతు మీద కాలు పెట్టి తొక్కి..చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కమల హత్య వార్త తెలుసుకున్న కుంటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం ఉదయం ఉప్పల్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. -
వీధి కుక్కలను చంపి ‘పడేశారు’!
అడ్డాకుల: మూసాపేట మండలం జానంపేట శివారు 44వ నంబర్ జాతీయ రహదారి పక్కన కాల్వలో కుక్కల కళేబరాలు కనిపించడం కలకలం రేపింది. పదిహేను వీధి కుక్కలను గుర్తు తెలియని దుండగులు చంపి వాటిని కాల్వలో పడేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మంగళవారం స్థానికుల సమాచారంతో ఎస్ఐ సుజాత అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం కుక్కల కళేబరాలను ట్రాక్టర్లో చక్రాపూర్ శివారులోని అటవీ ప్రాంతానికి తరలించి అక్కడ పశువైద్యాధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత గుట్ట సమీపంలోని ప్రభుత్వ భూమిలో గుంతను తవి్వంచి పూడ్చి వేశారు. కుక్కల కళేబరాలపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో విష ప్రయోగం చేసి చంపి ఉంటారని భావిస్తున్నారు.కుక్కలకు సంబంధించిన శాంపిల్స్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తున్నట్లు పశువైద్యాధికారి డాక్టర్ రాజేష్ఖన్న తెలిపారు. పొన్నకల్ ఘటన మరువక ముందే? అసలు ఈ కుక్కలను ఎవరు.. ఎక్కడ.. ఎందుకు చంపారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏదో గ్రామంలో కుక్కల సంఖ్యను తగ్గించడానికి వాటిని చంపేసి కళేబరాలను ఇక్కడ వదిలేసి ఉంటారనే అనుమానం కలుగుతోంది. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 16న అడ్డాకుల మండలం పొన్నకల్లో 21 వీధి కుక్కలను తుపాకీతో కాల్చి చంపిన ఘటన మరువక ముందే ఇప్పుడు 15 కుక్కల కళేబరాలు హైవే పక్కన కాల్వలో కనిపించడం కలకలం రేపుతోంది. -
రాష్ట్రీయ గీతం.. రెండు వెర్షన్లలో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 2న నిర్వహించనున్న బహిరంగసభలో తెలంగాణ రాష్ట్ర గీతమైన ‘జయ జయహే తెలంగాణ’కు సంబంధించిన రెండు వెర్షన్లను అధికారికంగా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’పూర్తి స్థాయి గేయాన్ని ఓ వెర్షన్గా, సంక్షిప్తీకరించిన గేయాన్ని మరో వెర్షన్గా విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం రాష్ట్ర సచివాలయంలో గేయ రచయిత అందెశ్రీ, సినీ సంగీత దర్శకుడు కీరవాణితో సమావేశమయ్యారు.రాష్ట్ర గీతానికి రెండు వెర్షన్లు సిద్ధం చేసి కీరవాణితో కలిసి రికార్డు చేసే బాధ్యతలను అందెశ్రీకి ప్రభుత్వం అప్పగించింది. అంతర్జాతీయ, జాతీయ, వివిధ రాష్ట్రాల అధికారిక గీతాలను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు. పూర్తిస్థాయి వెర్షన్లో గేయాన్ని ఉన్నది ఉన్నట్టు వాడుకోవాలా, ఏమైనా మార్పులు చేయాలా అన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా అందెశ్రీ తన ఆలోచనలను వివరించారు. చరణాలు, పల్లవి, బాణీలో అవసరమైన మార్పులపై తుదినిర్ణయం తీసుకునే బాధ్యతను అందెశ్రీకి అప్పజెప్పారు.జాతీయ, అంతర్జాతీయ స్థాయి అతిథులు రాష్ట్ర పర్యటనకు వచి్చనప్పుడు సుదీర్ఘంగా ఉన్న జయజయహే తెలంగాణ గేయాన్ని పాడటం/వినిపించడానికి అవసరమైన సమయం ఉండదు. ఈ నేపథ్యంలో గేయం సంక్షిప్తరూపంతో మరో వెర్షన్ను సైతం సిద్ధం చేస్తున్నారు. గేయాలను ఎవరు పాడాలి? కోరస్ ఉండాలా? సోలోగా పాడాలా? అనే అంశాలను సైతం అందెశ్రీకి వదిలేసింది. సంగీత దర్శకుడిగా కీరవాణి పేరును సైతం అందెశ్రీ ప్రభుత్వానికి సూచించినట్టు సమాచారం.ఉద్యమ సమయంలో యావత్ తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించిన జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఎంపిక చేయాలని గతంలో నిర్వహించిన రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్యప్రజాసంబంధాల అధికారి బోరెడ్డి అయోధ్యరెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు వేం నరేందర్రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పాల్గొన్నారు.తిరుమలకు సీఎం రేవంత్ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లారు. మనవడి తలనీలాలు సమరి్పంచి మొక్కు తీర్చుకోవడానికి ఆయన శ్రీవారి ఆలయానికి వెళ్లినట్లు తెలిసింది. బుధవారం ఉదయం ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సీఎం హైదరాబాద్కు తిరిగి చేరుకోనున్నారు. -
సన్న వడ్లపై సర్కార్ సన్నాయి నొక్కులు
నల్లగొండ టూటౌన్/ మిర్యాలగూడ: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ అంటూ రేవంత్రెడ్డి సర్కార్ సన్నాయి నొక్కులు నొక్కుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలను ప్రజలు నమ్మారని, కానీ ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల అపఖ్యాతిని మూటగట్టుకుందని విమర్శించారు. మంగళవారం నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, హాలియాల లో నిర్వహించిన వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమా వేశాల్లో కేటీఆర్ మాట్లాడారు.‘‘కాంగ్రెస్ రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా, నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు, మహిళలకు నెలకు రూ.2,500, వరి ధాన్యానికి రూ.500 బోనస్ అని అనేక హామీలిచ్చి ప్రజలను మోసం చేసింది. డిసెంబర్ 9 నాటికి రైతుబంధు ఇస్తామని చెప్పిన రేవంత్రెడ్డి.. మే వచి్చనా సొమ్ము వేయలేదు. నాగార్జునసాగర్ ఆయకట్టు ఎండిపోతే కాంగ్రెస్ నాయకులు పట్టించుకోలేదు. అన్నదాతలు ఆగమవుతున్నారు. సాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పజెప్పిన దద్దమ్మలు కాంగ్రెస్ వాళ్లు. రేవంత్ పాలనలో అంతా మోసమే..’’అని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపిస్తే నమ్మి కాంగ్రెస్ను గెలిపించారని.. ఇప్పుడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ మోసపోవద్దని పేర్కొన్నారు. మొదటిసారి మోసపోతే కాంగ్రెస్ మాయ అనుకుందామని.. అదే రెండోసారి మోసపోతే మన తప్పే అవుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్థి బ్లాక్ మెయిలర్.. ఉన్నత చదువులు చదివి అమెరికాలో మంచి ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవ కోసం వచి్చన గోల్డ్ మెడ లిస్ట్ కావాలో.. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజే గోల్డ్ స్నాచర్ కావాలో పట్టభద్రులు తేల్చుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలర్ అని ఆరోపించారు. దీనిపై మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా ఆలోచన చేయాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డి గెలిస్తే.. మండలిలో పట్టభద్రులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జి.జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. -
‘పట్టభద్రులపై’ పట్టు కోసం!
సాక్షి, హైదరాబాద్: శాసన మండలి ‘వరంగల్– ఖమ్మం–నల్లగొండ’పట్టభద్రుల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్లలో పట్టు సాధించేందుకు విస్తృతంగా ప్రచారం సాగిస్తోంది. ఈ నెల 13న లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక వ్యూహాన్ని బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ఖరారు చేశారు.అందుకు అనుగుణంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఇప్పటికే పట్టభద్రుల నియోజకవర్గం విస్తరించి ఉన్న జిల్లాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. నాలుగు రోజులుగా ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ప్రచారం చేసిన కేటీఆర్ బుధవారం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు.ఎన్నికల ప్రచారం ఈ నెల 25న ముగియనుండటంతో సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లోనే ఆయన ప్రచారం కొనసాగుతోంది. మరోవైపు మాజీ మంత్రి హరీశ్రావు కూడా ఈ నెల 23 నుంచి రెండు రోజుల పాటు పట్టభద్రుల ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇక నాగర్కర్నూలు నుంచి బీఆర్ఎస్ తరపున లోక్సభ అభ్యరి్థగా పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఓటరునూ కలిసి.. శాసన మండలి ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’ స్థానం నుంచి బీఆర్ఎస్ వరుసగా నాలుగు పర్యాయాలు గెలవడంతో ప్రస్తుత ఉప ఎన్నికలోనూ ఆ పార్టీ అభ్యర్థి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల ప్రచార గడువు, పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో పార్టీ యంత్రాంగం నడుమ సమన్వయానికి బీఆర్ఎస్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలకు సమన్వయ బాధ్యతలు అప్పగించింది.మండలాల వారీగా పట్టభద్రులు నియోజకవర్గం ఓటరు జాబితాను సమన్వయకర్తలకు అందజేసి, క్షేత్ర స్థాయిలో ప్రతీ ఓటరును పార్టీ కేడర్ కలిసేవిధంగా ప్రణాళికను అమలు చేస్తున్నారు. ప్రచారంలో ప్రధానంగా కాంగ్రెస్ వైఫల్యాలు, ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్ల జారీలో వైఫల్యం, పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి విద్యార్హతలు, కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న వ్యవహార శైలి తదితరాలను ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ప్రతీ ఓటును ఒడిసి పట్టేందుకు మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఓటరును ప్రత్యక్షంగా కలవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అసంతృప్త నేతలకు బుజ్జగింపు ఏనుగుల రాకేశ్రెడ్డి అభ్యరి్థత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలతో కేటీఆర్ స్వయంగా మాట్లాడి బుజ్జగిస్తున్నారు. ఈ ఉప ఎన్నికను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో విభేదాలు వీడి కలిసి పనిచేయాలని కోరుతున్నారు. త్వరలో ఏర్పాటయ్యే పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యవర్గాల్లో ప్రాధాన్యతను ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యరి్థత్వం ఆశించిన వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి మంగళవారం కేటీఆర్ను కలిశారు. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్రెడ్డి గెలుపు కోసం పనిచేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు. కేటీఆర్, హరీశ్ ప్రచార షెడ్యూలు ఇదే కేటీఆర్ ఈ నెల 22న ములుగు, నర్సంపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశి్చమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. హరీశ్రావు ఈ నెల 23న భూపాలపల్లి, వర్దన్నపేట, పాలకుర్తి, డోర్నకల్, 24న సత్తుపల్లి, వైరా, మధుర, పాలేరు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. -
సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో (సీసీఎస్) ఏసీపీగా పని చేస్తున్న టీఎస్ ఉమామహేశ్వరరావును ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆయన, ఆయన బంధువుల నివాసాలపై మంగళవారం దాడులు చేశారు. తెలంగాణ, ఏపీలోని ఉమామహేశ్వరావు ఇళ్లు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లతో సహా మొత్తం 11 చోట్ల సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో నగదు, బంగారం, ఆస్తి పత్రాలతో పాటు రెండు బ్యాంకు లాకర్లను గుర్తించినట్లు తెలిసింది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ప్రారంభమైన సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ ఉమామహేశ్వరరావును అరెస్టు చేసినట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్రబాబు తెలిపారు. ‘ప్రీలాంచ్’ నిందితులకు వత్తాసుపై ఫిర్యాదులు ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో వేలాది మంది నుంచి డబ్బు వసూలు చేసి నిండా ముంచిన సాహితీ ఇన్ఫ్రా సంస్థ, దాని అనుబంధ సంస్థలపై అనేక కేసులు నమోదయ్యాయి. రూ.వేల కోట్లతో ముడిపడి ఉన్న ఈ స్కామ్కు సంబంధించిన కేసులు అన్నీ సీసీఎస్కు బదిలీ అయ్యాయి. దాదాపు 50 కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులు దాని బాధ్యతలు ఉమామహేశ్వరరావుకు అప్పగించారు. దీన్ని తనకు అనువుగా మార్చుకున్న ఉమా మహేశ్వరరావు నిందితుల నుంచి భారీ మొత్తం డిమాండ్ చేసి వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితులకు వత్తాసు పలుకుతూ బాధితులకు తీవ్ర అన్యాయం చేశారనే ఫిర్యాదులు ఏసీబీకి అందాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదులూ వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. ఏపీలోని బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు మంగళవారం ఉదయం అశోక్నగర్లోని ఓ అపార్ట్మెంట్లో ఉన్న ఉమామహేశ్వరరావు ఇల్లు, నేరేడ్మెట్, ఎల్బీనగర్ల్లోని స్నేహితుల ఇళ్లు, ఆయన సోదరుడు, మామ ఇళ్ళతో సహా ఏపీలోని భీమవరం, విశాఖపట్నం, నర్సీపట్నంల్లోని బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా రోలుగుంటలో ఉమామహేశ్వరరావు దూరపు బంధువు దివంగత మడ్డు తమ్మునాయుడు ఇంట్లో ఐదుగురు సభ్యులతో కూడిన తెలంగాణ ఏసీబీ అధికారుల బృందం తనిఖీలు చేసింది. తమ్మునాయుడు భార్య నుంచి వారి ఇల్లు, భూములు తదితర ఆదాయ వనరుల వివరాలు సేకరించారు. పత్రాలు, డైరీల్లో సందీప్ అనే పేరు దాడుల్లో పలు కీలక డాక్యుమెంట్లతో పాటు రూ.38 లక్షల నగదు, 60 తులాల బంగారం, 17 ఆస్తులకు సంబంధించిన పత్రాలు, 5 ప్లాట్ల వివరాలు లభించినట్లు తెలిసింది. ఉమామహేశ్వరరావు బినామీల పేరిట భారీగా ఆస్తులు కూడగట్టారని ఏసీబీ అధికారులు గుర్తించారు. బ్యాంకు లాకర్ల విషయంలో ఉమామహేశ్వరరావు సహకరించట్లేదని, వాటిని తెరవడానికి కొంత సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. ఉమామహేశ్వరరావు నుంచి స్వా«దీనం చేసుకున్న పత్రాలు, డైరీల్లో సందీప్ అనే పేరును అధికారులు గుర్తించారు. తన వెంట నిత్యం ల్యాప్టాప్ ఉంచుకునే ఉమామహేశ్వరరావు అందులో తాను ఎవరి నుంచి ఎంత తీసుకున్నరీ రాసుకున్నట్లు తెలిసింది. దీన్ని స్వాదీనం చేసుకున్న ఏసీబీ అధికారులు అందులోని వివరాలు విశ్లేషిస్తున్నారు. సోదాలు పర్యవేక్షించిన జేడీ సు«దీంద్రబాబు ఉమామహేశ్వరరావు, సందీప్ కలిసి అనేక చోట్ల పెట్టుబడులు పెట్టారని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సందీప్ ఎవరు? అతడి పాత్ర ఏంటి? అనేది లోతుగా ఆరా తీస్తున్నారు. సీసీఎస్లోని ఉమామహేశ్వరరావు చాంబర్లో తనిఖీలు చేపట్టి ,ఆయన దర్యాప్తు చేసిన కేసుల వివరాలు ఆరా తీస్తున్నారు. జేడీ సుదీంద్రబాబు మంగళవారం రాత్రి అశోక్నగర్లోని ఉమామహేశ్వరరావు ఇంటికి వెళ్లి సోదాలను పర్యవేక్షించారు. ఉమామహేశ్వరరావును అరెస్టు చేశామని, బుధవారం కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. గతంలో అబిడ్స్ ఇన్స్పెక్టర్గా పని చేసిన ఉమామహేశ్వరరావు అక్కడ ఓ మహిళా కానిస్టేబుల్తో దురుసుగా ప్రవర్తించి సస్పెండ్ అయ్యారు. విధుల్లోకి తిరిగి వచి్చన ఆయన్ను రేంజ్ అధికారులు సైబరాబాద్ కమిషనరేట్కు అలాట్ చేశారు. జవహర్నగర్ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్గా పని చేస్తుండగా ఓ నేర స్థలికి వెళ్లిన ఆయన అక్కడ ఓ మహిళ ముందు అభ్యంతరకంగా ప్రవర్తిస్తూ వివాదాస్పదుడు కావడంతో మరోసారి సస్పెండ్ అయ్యారు. ఇబ్రహీంపట్నం ఏసీపీగా పని ఉమామహేశ్వరరావు ఎన్నికల ముందు జరిగిన బదిలీల్లో సీసీఎస్కు వచ్చారు. -
మాటలతో మూటలు
సాక్షి, హైదరాబాద్: శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ చేసిన రూ.200 కోట్ల స్కామ్లో టెస్కాబ్ మాజీ జనరల్ మేనేజర్ నిమ్మగడ్డ వాణీబాల పాత్ర కీలకమని పోలీసులు అనుమానిస్తున్నారు. తన భర్త మేక నేతాజీ, కుమారుడు మేక శ్రీహర్ష నిర్వహిస్తున్న ప్రింటింగ్ మెటీరియల్ సప్లై ఏజెన్సీని ఫైనాన్స్ సంస్థగా మార్చడంలో ఆమె పాత్ర కీలకమని భావిస్తున్నారు. ఈ సంస్థ చేతిలో మోసపోయిన వారి సంఖ్య 517 కాగా, దర్యాప్తు నిమిత్తం కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) అప్పగించారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోపక్క టెస్కాబ్ అధికారులు వాణీబాలను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. వాణీబాల చేసిన మోసంలో తమ బ్యాంకుకు ఎలాంటి సంబంధం లేదంటూ చెబుతున్నారు. ‘ప్రియాంక’ సంస్థ ఏర్పాటు ఉద్దేశమే వేరు... ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మేక నేతాజీ 1985 నుంచి అబిడ్స్ తిలక్రోడ్లో శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్, గ్రాఫిక్ సిస్టమ్స్ పేరుతో సంస్థను నిర్వహిస్తున్నాడు. ముద్రణ రంగంలో వినియోగించే ప్లేట్లు, రంగులు తదితరాలను కంపెనీల నుంచి ఖరీదు చేసి, ప్రింటింగ్ ప్రెస్ వారికి విక్రయించడం ఈ సంస్థ ప్రధాన వ్యాపారం. ఇంజినీరింగ్ పూర్తి చేసిన శ్రీహర్ష తన తండ్రి నిర్వహిస్తున్న శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్లోనే చేరారు. కొన్నాళ్లుగా ఈ సంస్థ వ్యాపారం తగ్గడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మెటీరియల్ సరఫరా చేసే కంపెనీల నుంచి దాదాపు రూ.6 కోట్ల మేర క్రెడిట్ తీసుకోవడంతోపాటు ఆయా కంపెనీల్లో పనిచేసే వారి వద్ద నుంచి వడ్డీకి భారీగా అప్పులు కూడా తీసుకున్నారు. ఈ సంస్థ ఏటా దాదాపు రూ.6 కోట్ల టర్నోవర్ చేస్తుండటంతో తమ నగదు ఎక్కడికీ పోదనే ఉద్దేశంతో పలువురు అప్పులు ఇచ్చారు. వాణీబాల సలహాతోనే ఫైనాన్స్ సంస్థగా... తన భర్త, కుమారుడు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల్ని చూసిన వాణీబాల తనకున్న పరిచయాలు, ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకొని భారీ స్కామ్కు ప్లాన్ చేసింది. ప్రియాంక ఎంటర్ప్రైజెస్ను ఫైనాన్స్ సంస్థలా మార్చేలా చేసింది. తొలినాళ్లల్లో తన సహోద్యోగులతో పాటు వారి బంధువుల నుంచి డిపాజిట్లు తీసుకుంది. వీరికి సాలీనా 18 నుంచి 24 శాతం చొప్పున వడ్డీ చెల్లించింది. దీంతో వారికి వాణీబాలపై నమ్మకం ఏర్పడి సహకరించడం ప్రారంభించారు. టెస్కాబ్లో డబ్బు డిపాజిట్ చేయడానికి వచ్చే వారితో వాణీబాల మాటలు కలిపేది. వారితో నమ్మకంగా మాట్లాడుతూ కష్టసుఖాలు తెలుసుకునేది. ఆపై తమకున్న ఫైనాన్స్ కంపెనీ విషయం చెప్పి..బ్యాంక్లో అయితే కేవలం 6 నుంచి 7 శాతం మాత్రమే వడ్డీ వస్తుందని చెప్పేది. ఆ మొత్తం ఈ రోజుల్లో ఏ ఖర్చులకూ సరిపోదని, తన భర్త, కుమారుడు నిర్వహిస్తున్న ప్రియాంక సంస్థలో డిపాజిట్ చేయాలని సూచించేది. తాము క్రమం తప్పకుండా 20 నుంచి 24 శాతం వడ్డీ చెల్లిస్తామని నమ్మబలికింది. ఈ మాటలు నమ్మిన అనేక మంది పదవీవిరమణ చేసిన వారు తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను ప్రియాంక సంస్థలో పెట్టుబడులుగా పెట్టారు. బ్యాంకు సిబ్బందినీ వినియోగించుకుంది జనరల్ మేనేజర్ హోదాలో ఉన్న నిమ్మగడ్డ వాణీబాల తన భర్తకు చెందిన సంస్థలోకి టెస్కాబ్కు రావాల్సిన డిపాజిట్లను మళ్లించింది. దీనికోసం ఆ బ్యాంకులో పనిచేసే కొందరు ఉద్యోగుల సహకారం కూడా తీసుకున్నట్టు తెలిసింది. డిపాజిట్ల వ్యవహారాలు పర్యవేక్షించే వారికి కమీషన్ల ఆశ చూపి, వినియోగదారులు ప్రియాంక సంస్థలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించింది. ఇలా టెస్కాబ్కు రావాల్సిన డిపాజిట్లు ప్రైవేట్ సంస్థకు తరలి వెళ్లిపోతున్నా ఉన్నతాధికారులు గుర్తించలేకపోయారు. ఎట్టకేలకు సీసీఎస్లో కేసు నమోదైన తర్వాత వాణీబాలను సస్పెండ్ చేసి, విచారణ చేస్తున్నట్టు ప్రకటించారు. తమను సంప్రదించిన బాధితులతో ఆమెకు, బ్యాంకుకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారని తెలిసింది. మేక నేతాజీ, శ్రీహర్షలు తమ వద్ద పెట్టుబడులు పెట్టిన డిపాజిట్దారులకు ఇవ్వడానికి ప్రత్యేకంగా శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో తయారు చేయించారు. దీనిపై వివరాలు రాసి, రూ.1 విలువైన రెవెన్యూ స్టాంప్ అతికించి, సంతకాలు చేసి ఇచ్చారు. కరోనా తర్వాత కాస్త ఒడుదొడుకులు ఎదురైనా, గతేడాది నవంబరు, డిసెంబర్ నుంచి వడ్డీలు చెల్లింపులు దాదాపు పూర్తిగా ఆగిపోయాయి. ఈ నెల 3న ప్రియాంక సంస్థ నిర్వాహకులు సిటీ సివిల్ కోర్టులు దివాలా పిటిషన్ (ఐపీ) దాఖలు చేసి ఆ మరుసటి రోజు నుంచి వాణీబాల, నేతాజీ, శ్రీహర్ష అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మూడు రాష్ట్రాల్లో వ్యాపారాలంటూ బ్రోచర్లు డిపాజిట్దారులకు ఇవ్వడానికి శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ ఎస్పీ లోగోతో బ్రోచర్లు ముద్రించింది. వాటిలో తమకు ఎస్పీ గ్రాఫిక్ సిస్టమ్స్, శ్రీ ప్రియాంక డిజిటల్స్, శ్రీ ప్రియాంక గ్రాఫిక్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు కూడా ఉన్నట్టు పేర్కొంది. హైదరాబాద్లోని తిలక్రోడ్తో పాటు జీడిమెట్ల, బెంగళూరులోని రాజాజీనగర్, విజయవాడలోని గాంధీనగర్ల్లో వీటి బ్రాంచ్లు ఉన్నట్టు పేర్కొన్నారు. తమ వార్షిక టర్నోవర్ దాదాపు రూ.60 కోట్లు ఉన్నట్టు వాటిలో స్పష్టం చేసింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. మంగళవారం మరికొందరు బాధితులు సీసీఎస్కు రాగా వారి నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్న అధికారులు వీరితోపాటు సంబం«దీకులు, ఆయా సంస్థల పేరుతో ఉన్న ఆస్తుల వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. దీనికోసం రెండు రాష్ట్రాల్లో ఉన్న సబ్రిజి్రస్టార్లకు లేఖలు రాస్తున్నారు. సిటీ సివిల్ కోర్టులో నిందితులు దాఖలు చేసిన ఇన్సాల్వెన్సీ పిటిషన్పై జూలై మూడోవారంలో హియరింగ్ జరగనుంది. ప్రియాంక ఎంటర్ప్రైజెస్లో పెట్టుబడులు పెట్టి మోసపోయిన వారిలో వృద్ధులు, పదవీ విరమణ చేసిన వారే ఎక్కువగా ఉన్నారని తెలిసింది. ఉద్యోగ జీవితంలో సంపాదించింది మొత్తం పెట్టేశా మా బంధువు ఒకరు టెస్కాబ్ బ్యాంకులో పనిచేస్తున్నారు. ఆయనతోపాటు మరికొందరు దాదాపు రూ.60 లక్షల వరకు ప్రియాంక ఎంటర్ప్రైజెస్లో పెట్టుబడి పెట్టారు. వారి ద్వారానే వాణీబాల నాకు పరిచయమైంది. మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేయాల్సిన నేను నా ఉద్యోగ జీవితంలో సంపాదించిన రూ.20 లక్షలు వారి వద్ద పెట్టుబడిగా పెట్టాను. సైదాబాద్ మనోహర్కాలనీలోని వాణీబాల ఇంటికి తాళం వేసి ఉండగా.. బ్యాంకు అధికారులు అక్కడే ఆమె సస్పెన్షన్ నోటీసు అంటించారు. సీసీఎస్ పోలీసులు మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. – ఎం.శ్రీనివాసమూర్తి, ల్యాబ్ టెక్నీషియన్, కోటి గవర్నమెంట్ ఆస్పత్రి
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ప్రశాంతంగా జాతర జరుపుకోవాలి
నేరచరిత లేనివారిని బైండోవర్ చేయొద్దు
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
టమాట సీజన్ ప్రారంభం
No Headline
కూడేరులో జూనియర్ కాలేజ్ ఏర్పాటు
బాధ్యతగా విధులు నిర్వర్తించండి
ఆ ఇద్దరు టీచర్లపై విద్యాశాఖ ప్రేమ
ఆకట్టుకున్న మాక్డ్రిల్
27 నుంచి విజయవాడ రైలు రద్దు
తప్పక చదవండి
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ బస్సుల బోల్తా.. ముగ్గురి మృతి
- ఛాన్స్ వచ్చినా మోదీ బయోపిక్లో నటించను: సత్యరాజ్
- భారత సంతతి శాస్త్రవేత్తకు ‘షా’ అవార్డ్
- భూతల్లి పై ఒట్టేయ్...
- ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్లో..?
- World Para Athletics Championships 2024: దీప్తితో మాటామంతి
- ఇబ్రహీం రైసీకి ఇరాన్ వీడ్కోలు
- Delhi CM Arvind Kejriwal: ప్రధాని కావాలని లేదు
- మరీ ఇంత ‘పచ్చ’పాతమా!
- ‘పంటల బీమా’కి రూ.3 వేల కోట్లు
Advertisement