-
బెడిసికొట్టిన జడ్జి రామకృష్ణ దాడి నాటకం
సాక్షి ప్రతినిధి, కడప: అన్నమయ్యజిల్లా బి.కొత్తకోటకు చెందిన సస్పెన్షన్లో ఉన్న జూనియర్ సివిల్ జడ్జి ఎస్. రామకృష్ణ ఇంటిపై దాడి ఘటన ఓ నాటకంగా తేలిపోయింది. దాడిచేసి ఇంటి కిటికీ అద్దాలను పగులగొట్టింది స్వయానా జడ్జి తమ్ముడు రామచంద్ర అని విచారణలో నిర్ధారించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడంతో నాటకానికి తెరపడింది. సోదరుల మధ్య కుటుంబ ఆస్తి పంపకాల విషయంలో తలెత్తిన విభేదాలను కూడా మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి ఆపాదించే ప్రయత్నం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మదనపల్లెలో గురువారం మీడియా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై జడ్జి రామకృష్ణ చేసిన ఆరోపణలు నిరాధారమని అర్థమైంది.గతంలోనూ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధం లేని వివాదంలోకి లాగడం కూడా ఇలాంటిదేనని స్పష్టమైంది. రామకృష్ణ చేసిన ఫిర్యాదులో నిందితుడు అతని తమ్ముడేనని తేల్చి ఈ మేరకు అరెస్ట్ చేసి 41 నోటీసు జారీ చేశామని బి.కొత్తకోట సీఐ సూర్యనారాయణ శుక్రవారం తెలిపారు. గతనెల 30న రాత్రి బి.కొత్తకోట కరెంట్ కాలనీలో ఉంటున్న రామకృష్ణ ఇంటివద్దకు వచ్చిన తమ్ముడు రామచంద్ర ఆస్తి పంపకాల గురించి ప్రశ్నించేందుకు ప్రయత్నించాడు, ఇంటిలో నుంచి రామకృష్ణ వెలుపలికి రాకపోవడంతో అక్కడే ఉన్న కట్టెను తీసుకుని గేటుకు కొట్టడంతో రామకృష్ణ బయటకు రాగా ఇద్దరి మధ్య ఆస్తి పంపకాలకు సంబంధించి వివాదం జరిగింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న గొడవతో రామచంద్ర కిటికీ అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ ఘటనపై గుర్తు తెలియని వ్యక్తులు తనను హతమార్చేందుకు దాడిచేశారని ఈనెల ఒకటిన రామకృష్ణ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, పరిసరాల్లో జరిపిన విచారణలో రామచంద్రే ఇంటి కిటికీ అద్దాలను ధ్వంసం చేసినట్టు తేలింది. ఈ కేసులో నిందితుడైన రామచంద్రను అరెస్టు చేశామని సీఐ తెలిపారు. రామచంద్రపై బి.కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఏడు కేసులు నమోదైనట్టు ఆయన పేర్కొన్నారు. -
రేపటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
కడప సెవెన్రోడ్స్: పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే కార్యక్రమం ఈనెల 5 నుంచి 7వ తేది వరకు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే పీఓలు, ఏపీఓలు, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశామన్నారు. పోలింగ్ సిబ్బంది 14,640 మందికిగాను 13,536 మంది తమ పోస్టల్ బ్యాలెట్లను ఈనెల 5వ తేది అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో వినియోగించుకుంటారన్నారు. ఇతర జిల్లాలకు చెందిన 3570 మంది రిజిష్టర్డ్ ఓటర్లకు కూడా అదేరోజు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటువేసే అవకాశం కల్పించామన్నారు. ఈనెల 6, 7 తేదీలలో హోమ్ ఓటింగ్ జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 85 ఏళ్లు పైబడిన వారు 7365 మందికిగాను 519 మంది, 18,532 మంది దివ్యాంగులకు గాను 359 మంది కలిపి మొత్తం 878 మంది హోమ్ ఓటింగ్ ద్వారా తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారని వివరించారు. వీరు కూడా పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటు వేస్తారని చెప్పారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే 2731 మంది పోలీసు సిబ్బంది, 352 మంది అత్యవసర సర్వీసులకు చెందిన సిబ్బంది, ఇతర పోలింగ్ విధులు నిర్వర్తించే 2136 మంది ఈనెల 6వ తేది తమ పోస్టల్ బ్యాలెట్లను ఆయా నియోజకవర్గాల్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయాల వద్ద వినియోగించుకోనున్నారని తెలిపారు. ఇలా మొత్తం 23,203 మంది జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయనున్నట్లు పేర్కొన్నారు. ఇక ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్పులు, ఓటరు గైడ్ పంపిణీ కార్యక్రమం ఈనెల 6వ తేది నాటికి ముగుస్తుందన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ కేసుల వివరాలను పత్రికల ద్వారా వెల్లడించాలని ఆదేశించారు. గత ఎన్నికల్లో 38 పోలింగ్ కేంద్రాలు వల్నరబుల్ కింద ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 14కు తగ్గిందని పేర్కొన్నారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే వెబ్ కాస్టింగ్ ఉంటుందన్నారు. ముద్దనూరు మండలంలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో సిగ్నల్స్ లేవన్నారు. ఆపరేటర్ ద్వారా పోలీసుస్టేషన్, రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి అనుసంధానం చేస్తామన్నారు. నియోజకవర్గం ఫెసిలిటేషన్ కేంద్రం 23,203 పోస్టల్ బ్యాలెట్లు నియోజకవర్గ కేంద్రాల్లోఫెసిలిటేషన్ సెంటర్లు జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు 124–బద్వేలు జెడ్పీ బాలుర హైస్కూలు 126–కడప గాంధీనగర్ మున్సిపల్ హైస్కూలు 129–పులివెందుల అహోబిళాపురం ప్రభుత్వ హైస్కూలు 130–కమలాపురం బీఎస్ఎస్ఎస్ బాలికల హైస్కూలు 131–జమ్మలమడుగు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల 132–ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూలు, టీబీ రోడ్డు 133–మైదుకూరు జెడ్పీ బాలుర హైస్కూలు జిల్లా ఫెసిలిటేషన్ సెంటర్: జయనగర్ మున్సిపల్ బాలికల హైస్కూలు -
జిల్లాకు చేసిన మేలు చెప్పగలరా!
కడప కార్పొరేషన్: పద్నాలుగేళ్ల తెలుగుదేశం పార్టీ పాలనలో ఈ జిల్లాకు చేసిన మేలు ఏమిటో చెప్పాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, రీజనల్ కో ఆర్డినేటర్ కె. సురేష్ బాబు టీడీపీ అధినేత చంద్రబాబును ప్రశ్నించారు. శుక్రవారం ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, వేర్హౌస్ కార్పొరేషన్ ఛైర్మెన్ కరిముల్లాతో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో జరిగిన అభివృద్ధిని చూసి చంద్రబాబుకు కళ్లుకుట్టి, కడుపుమంటతో విమర్శలు చేశారన్నారు. ఆయన కడపలో సభ నిర్వహించిన ఏడురోడ్ల కూడలి గతంలో ఎలా ఉండేదో, ఇప్పుడెలా ఉందో చూడాలన్నారు. చంద్రబాబు పాలనలో చెప్పుకోదగిన ఒక్క మంచి పథకమైనా ఉందా అని ప్రశ్నించారు. 2014లో 680 హామీలిచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, అధికారాన్ని ఉపయోగించి తమ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేయడమే వారు చేసిన ఘనత అని ధ్వజమెత్తారు. కూటమి మేనిఫెస్టోను ప్రజలెవరూ నమ్మ డం లేదన్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక కులమతాలు, పార్టీలకతీతంగా అర్హులైతే చాలు సంక్షేమ పథకాలు ఇచ్చారన్నారు. కడపలో సుమారు రూ.2400కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. వైఎస్ జగన్ వచ్చాకే గండికోటలో 26 టీఎంసీలు, బ్రహ్మంసాగర్లో 17టీఎంసీలు నిల్వ చేయడం జరిగిందన్నారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిపై విమర్శలు సరికాదన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, తాను అవినీతి చేసి ఉంటే కడప ప్రజలు ఇన్ని సార్లు తనను గెలిపించేవారు కాదన్నారు. విద్య, వైద్య రంగాలకు పెద్దపీట: ఎమ్మెల్సీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి అన్నారు. నాడు–నేడు ద్వారా స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేశారన్నారు. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెప్పకుండా వైఎస్సార్సీపీని విమర్శించడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబును ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు -
7న కడపకు రాహుల్గాంధీ రాక
కడప వైఎస్ఆర్ సర్కిల్: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 7వ తేదీన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రానున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి సభాస్థలిగా మున్సిపల్ మైదానాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. నేడు సదస్సు కడప వైఎస్ఆర్ సర్కిల్: కడప సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 4న ఐ ఎం ఎ .హాల్ లో ’మన ఆర్థిక పరిస్థితి– దేశ భవిష్యత్తు’అనే అంశం పై సదస్సు నిర్వహించనున్నట్లు ఆ ఫోరం జిల్లా నాయకులు కామనురు శ్రీనివాసులురెడ్డి,బి దస్తగిరిరెడ్డి తెలిపారు శుక్రవారం నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ప్రముఖ ఆర్థికవేత్త విశ్లేషకులు పరకాల ప్రభాకర్ ప్రధాన వక్తగా హాజరుకానున్నట్లు వెల్లడించారు. దేశం వెలిగిపోతోందని పేదరికం తగ్గిపోయింది అంటున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీలు చెప్పడం సిగ్గు చేటన్నారు. ఈ సదస్సు ద్వారా అన్ని అంశాలను కూలంకుషంగా తెలియజేయటానికి అలాగే హాజరైన వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తారని చెప్పారు. ఈ సదస్సుకు మేధావులు ఉపాధ్యాయులు , ఉద్యోగులు, బ్యాంకింగ్ పోస్టల్ బీఎస్ఎన్ఎల్, విద్యుత్, ఎల్ఐసీ, ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. -
దరఖాస్తుల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్: కడప నగరం చిన్నచౌక్లోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు 2024–25 విద్యా సంవత్సరానికి ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ పి.విజయలక్ష్మి తెలిపారు. ఈ నెల 20వ తేదీ వరకు అర్హలైన బాలికలు తమ దరఖాస్తులను చిన్నచౌక్లోని గురుకుల పాఠశాలలో అందచేయాలని ఆమె తెలిపారు. వివరాలకు 9440687844, 8555074045 నెంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపాల్ తెలిపారు. ముందే ప్రవేశాలు సరికాదు కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ బోర్డు అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవ్వకముందే ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు తీసుకుంటున్నా, డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందినా సదరు జూనియర్ కళాశాల గుర్తింపు రద్దుకు సిఫారసు చేస్తామని ఇంటర్ ఆర్ఐవో బండి వెంకటసుబ్బయ్య హెచ్చరించారు. ఇంటర్ విద్యామండలి 2024–25 విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జూనియర్ కళాశాలల అడ్మిషన్లు జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను మానసిక వేదనకు గురిచేస్తున్న ప్రైవేటు జూనియర్ కళాశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరబ్గౌర్ హెచ్చరించినట్లు ఆర్ఐవో బండి వెంకటసుబ్బయ్య తెలిపారు. ఆలయానికి రూ.7.20లక్షలు కానుక ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక మేదరవీధిలోని శ్రీ రామలింగ చౌడేశ్వరిదేవి అమ్మవారి ఆలయ నిర్వహణకు శుక్రవారం భక్తులు రూ.7.20లక్షలు కానుకగా అందించారు. పేరి గురుమూర్తి, అంపావతిన వీరప్రసాద్ రూ.6.20లక్షలు, కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మిదేవి, వేణుగోపాల్ దంపతులు రూ.ఒక లక్ష ఆలయ నిర్వహణకు గాను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాండ్ను ఆలయ కమిటీ చైర్మన్ వుట్టి నాగశయనంకు అందించారు. ఆలయ కార్యదర్శి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు పోసా వెంకట లక్షుమయ్య, గిద్దలూరు ఈశ్వరయ్య, పోసా శివప్రసాద్, అర్చకుడు రాఘవేంద్ర, భక్తులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement