-
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
జగిత్యాలరూరల్: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ రాంబాబు ఆదేశించారు. శుక్రవారం జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయాధికారులు ధ్రువీకరించిన ధాన్యాన్ని వెనువెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.కార్యక్రమంలో సహకార సంఘం సీఈవో గాజంగి వేణు, సెంటర్ ఇన్చార్జి ప్రేమ్నాథ్ పాల్గొన్నారు.అంజన్న ఆదాయం రూ.88 లక్షలుకొండగట్టు(చొప్పదండి): కొండగట్టు అంజన్న ఆలయ హుండీలను శుక్రవారం ఈవో చంద్రశేఖర్ సమక్షంలో లెక్కించారు. ఈసందర్భంగా 36 రోజులకుగాను రూ.88,03,608 నగదు, 41 గ్రాముల మిశ్రమ బంగారం, 2.15 కిలోల వెండి, 27 విదేశీ కరెన్సీ నోట్లు సమకూరాయి. దేవాదాయ శాఖ వరంగల్ కార్యాలయ పరిశీలకులు ఎన్.కవిత, ఏఈవో అంజయ్య, సూపరింటెండెంట్లు సునీల్, శ్రీనివాసశర్మ తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ సిబ్బందికి వసతులు కల్పించండికోరుట్ల: వేసవి దృష్ట్యా పోలింగ్ సిబ్బందికి మెరుగైన వసతులు కల్పించాలని తపస్ నాయకులు శుక్రవారం ఆర్డీవో, కోరుట్ల నియోజకవర్గ సహాయ ఎన్నికల అధికారి ఆనంద్కుమార్కు వినతిపత్రం సమర్పించారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున వేడిని తట్టుకునేందుకు పోలింగ్ కేంద్రాల్లో కూలర్లు ఏర్పాటు చేయాలని, సరైన రవాణా సౌకర్యం కల్పించి, నిబంధనలకు అనుగునంగా రెమ్యునరేషన్ చెల్లించాలని కోరారు. ఎన్నికల హాజరు ధ్రువీకరణ పత్రాలు వెంటనే అందించాలని, పోలింగ్ సమయం పెంచినందున ఒక రోజు అదనపు జీతభత్యం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవయ్య, ఉపాధ్యక్షుడు చెరకు మహేశ్వరశర్మ, మండల నాయకులు కె.శ్రీనివాస్, అన్నల్దాస్, మురళి, మల్లికార్జున్, రాజేశ్వర్రావు, రమేశ్, రజనీకాంత్, సురేందర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇంటి వద్దే ఓటేశారుకథలాపూర్/ఇబ్రహీంపట్నం: కథలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచి ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకోగా, శుక్రవారం అధికారులు వారి ఇళ్ల వద్దకు వెళ్లారు. ఓటరు ఇళ్ల వద్ద ఓటు వేసేలా ఏర్పాట్లు చేసి పోస్టల్ బ్యాలెట్లను సేకరించారు. మండలంలో 30 మంది దరఖాస్తు చేసుకోగా రెండు రోజుల్లో ఓటు వేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ నాగేశ్, పోలింగ్ అధికారులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు పాల్గొన్నారు. అలాగే ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాల్లో 48 మంది నడవలేని స్థితిలో ఉన్న వికలాంగులు, 14 మంది 85 ఏళ్లు పైబడి నడవలేని స్థితిలో ఉన్నవారికి 3 బృందాలుగా వెళ్లి ఓటు హక్కు కల్పించినట్లు తహసీల్దార్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐ గంగాధర్, జూనియర్ అసిస్టెంట్ లావణ్య, బీఎల్వోలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
సమన్వయంతో ఎన్నికల నిర్వహణ
ధర్మపురి: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని పెద్దపెల్లి పార్లమెంటు అసిస్టెంట్ ఎన్నికల అధికారి దివాకర పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక గిరిజన వసతి గృహంలో పీవోలు, ఏపీవోలకు శిక్షణ తరగుతులు నిర్వహించారు. ప్రతి ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని 475 మంది పీవోలు, ఏపీలకు మాస్టర్ ట్రైనర్లు ఇస్తున్న శిక్షణ తరగతులు, ఈవీఎంల కమీషనింగ్ ప్రక్రియను, పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ విధానాన్ని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లతో పాటు వీవీ ప్యాట్లను అమర్చడం, మాక్ పోలింగ్ నిర్వహణ గురించి వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణచైతన్య, వివిధ మండలాలకు చెందిన తహసీల్దార్లు, మాస్టర్ ట్రైనర్లు శివప్రసాద్, చల్ల జనార్దన్, బక్కశెట్టి రవి, చెరుకు రాజన్న, బక్కశెట్టి మల్లేశం, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ● అదనపు కలెక్టర్ దివాకర -
ట్యాంకు ఉన్నా.. తాగు నీరేది?
● భగీరథ నీళ్లు ఎరుగని కలిగోట తండా ● ఏళ్లుగా విన్నవించినా ఫలితం లేదంటున్న గ్రామస్తులు కథలాపూర్(వేములవాడ): తలాపున గోదావరి ఉన్నా తాగేందుకు గుక్కెడు నీరు కరువు అన్న చందనంగా ఉంది కథలాపూర్ మండలం కలిగోట గిరిజన తండావాసుల పరిస్థితి. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా పేర్కొంటున్నా కలిగోట గిరిజన తండాకు ఇప్పటి వరకు నీళ్లు రావడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. భగీరథ ద్వారా నల్లా నీళ్లు ఇవ్వాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు ఏళ్లుగా విన్నవించినా పట్టించుకునేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనెక్షన్లు ఇవ్వని అధికారులు వేములవాడ నియోజకవర్గం కథలాపూర్, మేడిపెల్లి, బీమారం మండలాల్లోని గ్రామాలకు భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నీరు సరఫరా చేసేందుకు కలిగోట తండాలోనే బ్యాలెన్స్ రిజర్వాయర్ ట్యాంక్ నిర్మించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆగ్రహారం నుంచి పైపులైన్ ద్వారా నీళ్లు వచ్చి ఈ ట్యాంకులోకి చేరేలా పైపులైన్ ఏర్పాటు చేశారు. కలిగోట తండాలో నిర్మించిన రిజర్వాయర్ ట్యాంక్ నుంచి 3 మండలాలకు తాగునీరు సరఫరా చేస్తారు. కానీ తండాలోని సుమారు 60 కుటుంబాలకు తాగునీరు ఇచ్చేందుకు ప్రత్యేకంగా పైపులైన్ వేయలేదు. దీంతో భగీరథ నీరు అందడం ఐదేళ్లుగా కలగానే మిగిలిందని వాపోతున్నారు. ఫలితంగా తండావాసులు తాగేందుకు బోరుబావుల నీరే దిక్కయింది. ఇప్పటికై నా పాలకులు చొరవచూపి భగీరథ నీళ్లు అందేలా చూడాలని కోరుతున్నారు. -
అదనపు ఈవీఎం అవసరమే..
● మొదట ఒకటే ఈవీఎం అంచనా ● అభ్యర్థుల సంఖ్య పెరగడంతో మరో ఓటింగ్ మిషన్ కోసం కసరత్తు కోరుట్ల: నిజామాబాద్ పార్లమెంట్ బరిలో ఉన్న అభ్యర్థులు 29 మంది కావడంతో ఒక్క ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్తో సరిపెట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. మొదట బరిలో ఉండే అభ్యర్థుల సంఖ్య 16 వరకు ఉంటుందని ఎన్నికల అధికార యంత్రాంగం అంచనా వేసి తమ తమ సెగ్మెంట్ల పరిధిలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక ఈవీఎం చొప్పున తెప్పించుకుని భద్రపరిచారు. ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పోటీ చేస్తున్న అభ్యర్థులు 29 మంది కావడంతో మరో ఈవీఎం అవసరమైంది. ఈవీఎంల సర్దుబాటు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల నియోజకవర్గంలో 254, కోరుట్ల నియోజకవర్గంలో 262 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక్కో ఈవీఎం చొప్పున అందుబాటులో ఉంచాలి. పోలింగ్ రోజు ఈవీఎంలో సాంకేతిక లోపాలతో పనిచేయని పరిస్థితి తలెత్తితే అక్కడ వేరే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అమర్చడానికి వీలుగా అదనంగా 20 శాతం లెక్కన జగిత్యాల సెగ్మెంట్లో 315, కోరుట్ల సెగ్మెంట్లలో 327 ఈవీఎంలు అందుబాటులో ఉంచారు. అభ్యర్థుల సంఖ్య 16 లోపు ఉంటే ప్రస్తుతం ఉన్న ఈవీఎంలు సరిపోయేవి. కానీ అభ్యర్థుల సంఖ్య 29 కావడంతో ఒక్కో పోలింగ్ బూత్లో 2 ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. రెట్టింపు ఈవీఎంలు పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య పెరగడంతో ఒక్కో పోలింగ్ కేంద్రంలో 2 ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఈ లెక్కన కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లో 654, జగిత్యాలలో 640 ఈవీఎంలు అవసరముంటాయి. దీంతో ఈవీఎంల ను జగిత్యాల, కోరుట్ల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు తరలించడానికి అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల అ ధికారులు పూర్తి చేశారు. వీటిలో పాటు కోరుట్ల సె గ్మెంట్లో 366 కంట్రోల్ యూనిట్లు (సీయూ), జగి త్యాల సెగ్మెంట్లో 350 కంట్రోల్ యూనిట్లను ఇప్పటికే భద్రపరిచారు. సాధారణంగా పోలింగ్ సమయంలో సాంకేతిక లోపాలు తలెత్తడానికి ఈవీఎంల కంటే కంట్రోల్ యూనిట్లకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలో పోలింగ్ బూత్కు ఒకటి సరిపోయే కంట్రోల్ యూనిట్లను 150 శాతం అదనంగా అందుబాటులో ఉంచుతున్నారు. -
బోరుబావులే దిక్కు
మా తండాలో భగీరథ పథకం పైపులైన్ కనెక్షన్లు ఇవ్వలేదు. ఇంటి అవసరాలకు బోరుబావుల నీళ్లు వాడుతున్నాం. వేరే గ్రామాల్లో భగీరథ నీళ్లు అంటూ సంబరపడుతున్నారు. భగీరథ నీళ్లు ఎట్లుంటాయో మా తండావాసులు ఇప్పటికీ చూడలేదు. అన్ని పార్టీల నాయకులు మా తండా నుంచి వెళ్తుంటారు. కానీ నల్లా నీళ్ల సమస్యను ఏళ్లుగా పరిష్కరించలేదు. ఈ ప్రభుత్వం పట్టించుకోవాలి. – ధరావత్ అమ్మి, కలిగోట తండాఎవరూ పట్టించుకునేటోళ్లు లేరు కోరుట్ల– వేములవాడ రోడ్డు పక్కనే మా తండా ఉంది. పెద్ద ట్యాంక్ నిర్మించడానికి, పైపులు వేసేందుకు తండాకు చెందిన 20 గుంటల భూమి ఇచ్చాం. మాకు తాగునీళ్లు వస్తాయని అనుకున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేదు. ఇప్పుడైనా నల్లా నీళ్లు సరఫరా చేయాలి. – ధరావత్ సీతారాం, మాజీ వార్డుమెంబర్, కలిగోట తండా ప్రత్యేక ట్యాంక్ నిర్మిస్తేనే.. మూడు మండలాలకు నీళ్లు సరఫరా చేసే బ్యాలెన్స్ రిజర్వాయర్ ట్యాంక్ కలిగోట తండాలోనే నిర్మించాం. తండా కోసం ప్రత్యేకంగా ట్యాంక్ నిర్మిస్తే అందులో భగీరథ నీళ్లు నింపుతాం. ఆ ట్యాంక్ నుంచి ఇంటింటికీ నీరు సరఫరా చేసుకోవచ్చు. రిజర్వాయర్ ట్యాంక్ నుంచి నేరుగా నల్లా కనెక్షన్లు ఇవ్వరాదు. – అనిల్, మిషన్ భగీరథ గ్రిడ్ ఏఈ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
ది లీడర్..!
టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు
షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం
ఇండోనేషియాలో భారీ వరదలు.. 14 మంది మృతి!
కాంగ్రెస్ అంతిమ దశకు చేరుకుంది: జ్యోతిరాదిత్య సింధియా
చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
వయ్యారి భామ నీ కళ్లు చూస్తే.. రేరాజైనా కుళ్లుకోవాల్సిందే! (ఫోటోలు)
మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement