-
ప్రచార హోరు
● జిల్లాకు ఇద్దరు అగ్రనేతలు ● 6న కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ● హాజరుకానున్న ప్రియాంక గాంధీ ● 7న కామారెడ్డిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్ర ● జనసమీకరణపై పార్టీల దృష్టిసాక్షి, కామారెడ్డి: సార్వత్రిక ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై ఫోకస్ చేసిన బీజేపీ నాయకత్వం సంగారెడ్డి–కామారెడ్డి జిల్లాలకు మధ్య అందోల్లో ప్రధాని మోదీతో సభ నిర్వహించింది. కాంగ్రెస్ నాయకత్వం ఏఐసీసీ నేత ప్రియాంక గాంధీ సభ కోసం ఎల్లారెడ్డి అనుకున్నా తర్వాత కామారెడ్డికి మార్చారు. ఈ నెల 6న కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. అలాగే ముందే నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 7న కా మారెడ్డి పట్టణంలో రోడ్షో అనంతరం సుభాష్రోడ్డులో జరిగే సభలో ప్రసంగిస్తారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 6న కామారెడ్డిలో నిర్వహించనున్న సభకు భారీ జనసమీకరణ చేయడానికి పార్టీ నేత లు ఏర్పాట్లు చేస్తున్నారు. కామారెడ్డితో పాటు ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల నుంచి జనాన్ని తరలించాలని ప్లాన్ చేస్తున్నారు. సభకు ప్రియాంక గాంధీ హాజరుకానున్న నేపథ్యంలో పెద్దఎత్తున జనాన్ని సమీకరించాలని నేతలు భావిస్తున్నారు. అలాగే మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర ఈ నెల 7న కామారెడ్డికి చేరుకోనున్న నేపథ్యంలో కామారెడ్డిలో నిర్వహించే రోడ్షో, సభలకు భారీగా జనాన్ని సమీకరించేందుకు ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే మా జీ మంత్రి ప్రశాంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజాల సురేందర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్లు రూట్ మ్యాప్ను పరిశీలించారు. ర్యాలీకి భారీ జనాన్ని సమీకరించడం ద్వారా సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తున్నారు. -
కూలీల కనీస వేతనం పెంచాలి
కామారెడ్డి క్రైం: మండలాల్లో ఉపాధి హామీ పథకం కింద ప్రజలకు అవసరమైన వివిధ పనులను గుర్తించి కూలీలకు ఉపాధి కల్పిస్తూ.. కనీస వేతనం 300 చెల్లించేలా చూడాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో డీఆర్డీవో చందర్ నాయక్తో కలిసి కూలీల హాజరు శాతం, కనీస వేతనం, పని ప్రాంతాల్లో సౌకర్యాలపై ఎంపీడీవోలు, ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీలతో సమీక్ష సమావేశం నిర్వాహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని మండలాల్లో కూలీల హాజరు, కనీస వేతనం చాలా తక్కువగా ఉందన్నారు. రాబోయే వారం రోజుల్లోగా సమీక్షించి హాజరుశాతం, కనీస వేతనం పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఉపాధి కూలీలకు వడదెబ్బ తగలకుండా పనిచేసే చోట టెంట్లు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో ఎంపీడీవోలు, ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్, తదితరులు పాల్గొన్నారు.ఆర్డీవో కార్యాలయంలో ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటుకామారెడ్డి క్రైం: ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకునేందుకు గాను కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ ఫెసి లిటేషన్ సెంటర్ను ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేశామని ఆర్డీవో రంగనాథరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు 4 ,5 తేదీల్లో, ఇతర పోలింగ్ సిబ్బంది 6, 7 తేదీల్లో తమ పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకోవాలని సూచించారు. నియోజక వర్గంలో 2167 మంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించనున్నారని తెలిపారు. తహసీల్దార్ జనార్దన్, తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గాలకు ఈవీఎంలుకామారెడ్డి క్రైం: ఈవీఎంలను అసెంబ్లీ నియోజకవర్గాలకు రెవెన్యూ అదనపు కలె క్టర్ చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్గో బస్సుల్లో పంపారు. ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో శుక్రవారం నిర్వహించారు. జుక్కల్ నియోజకవర్గానికి 319, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి 338, కామారెడ్డి నియోజకవర్గానికి 333 చొప్పున కేటాయించిన ఈవీఎంలను భారీ భద్రతతో పంపించారు. కార్యక్రమంలో పార్టీల ప్రతినిధులు నరేందర్, కాసీంఅలీ, ఎన్నికల విభాగం అధికారులు ఉమలత, ఇందిరా ప్రియదర్శిని, సంతోష్ రెడ్డి పాల్గొన్నారు. పది కళాశాలల్లో ‘గుర్తింపు’ తనిఖీలు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ వర్సిటీ పరిధి లో యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు కో సం నిర్వహిస్తున్న డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు శుక్రవారం కొనసాగాయి. ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ నేతృత్వంలో మ హాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల డిగ్రీ కాలేజీ(వర్ని), విజయ డిగ్రీ కాలేజీ (వర్ని), బాన్సువాడలోని ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కాలేజీ, ఎస్ఎస్ఎల్ డిగ్రీ కాలేజీ, శశాంక్ డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ(బిచ్కుంద), ప్రభు త్వ డిగ్రీ కాలేజీ(మద్నూర్), రత్న డిగ్రీ కాలేజీ (మద్నూర్), రెయిన్బో డిగ్రీ కాలేజీ (జుక్కల్), ఎస్వీ డిగ్రీ కాలేజీ (పిట్లం)లో తనిఖీలు నిర్వహించారు. నిబంధనల మేరకు వసతి, సౌకర్యలు లేని కళాశాలలకు నోటీసులు అందజేసినట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. -
ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ
భిక్కనూరు: పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పూర్తిగా ఖాళీ అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ అన్నారు. కేవలం కేసీఆర్ కుటుంబీకులు, పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న వారు మాత్రమే ఆ పార్టీలో ఉంటారని వ్యాఖ్యానించారు. శుక్రవారం మార్క్ఫెడ్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు జేపీ సిద్ధాగౌడ్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో అపూర్వ ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్షెట్కార్ భారీ మెజారిటీతో గెలుస్తారన్నారు. కేసీఆర్ తన హయాంలో రైతులకు మాయమాటలు చెప్పడం తప్ప వారికి ఒరగబెట్టిందేమీ లేదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గాలిరెడ్డి, పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు భీంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్, విండో చైర్మన్ గంగళ్ల భూమయ్య, నేతలు దయాకర్రెడ్డి, నర్సింహరెడ్డి, మ్యాతరి నర్సింలు, బత్తుల బాగులు, జేపీ వెంకటేశ్ గౌడ్ పాల్గొన్నారు. కాంగ్రెస్కు ప్రజల్లో అపూర్వ ఆదరణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
కామారెడ్డి టౌన్: రాబోయే మూడురోజుల్లో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ సూచించారు. మానిటరింగ్ అధికారులు, పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్లు, లారీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 5 నుంచి 7 వరకు జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా అవసరమైన టార్పాలిన్లు, గోనె సంచులను కేంద్రాల్లో అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేందుకు కొనుగోలు కేంద్రాలకు అవసరమైన లారీలను అందించాలని ట్రాన్స్పోర్ట్ అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఎటువంటి ఆలస్యం చేయకుండా రాత్రి కూడా కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని తూకం వేసి ట్యాగ్చేసిన మిల్లుల కు తరలించాలని, ట్యాబ్ ఎంట్రీ కూడా వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అందరూ డిప్యూ టీ తహసీల్దార్లు కేంద్రాల్లో కొనుగోళ్ల ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తూ వేగవంతం అయ్యేలా చూడాలన్నారు. కేంద్రాల ఇన్చార్జీలు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, రైస్మిల్లర్లతో సమన్వయం చేసుకుంటూ నాణ్యతా ప్రమాణాలకనుగుణంగా ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించే వరకు మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. కాన్ఫరెన్స్లో జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ నిత్యానందం, డిప్యూటీ తహసీల్దార్లు, మానిటరింగ్ అధికారులు, లారీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం అదనపు కలెక్టర్ చంద్రమోహన్ -
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
● జహీరాబాద్ ఎంపీ స్థానం ప్రధానికి గిఫ్ట్గా ఇవ్వాలి ● కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికామారెడ్డి టౌన్: దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుందని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్లో నిర్వహించిన కామారెడ్డి, రాజంపేట మండలాల కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. వికసిత భారత్ కోసం బీజేపీకి ఓటు వేయాలని కోరారు. జహీరాబాద్ ఎంపీ స్థానాన్ని గెలిపించి ప్రధాని నరేంద్రమోదీకి గిఫ్ట్గా ఇవ్వాలని కార్యకర్తలను కోరారు. గెలుపు ఖాయమైందని కానీ మెజార్టీ కోసమే కష్టపడుతున్నామన్నారు. కనీసం లక్షకు పైగా మెజారిటీతో గెలిపించుకోవాలని పేర్కొ న్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ మాట్లాడుతూ.. తనను ఎంపీగా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులతో జహీరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గత పదేళ్లుగా భారత్ అన్ని రంగాల్లో ముందుకు దూసుకు పో యిందని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వా త ఇంకా అద్భుతమైన పాలన సాగుతుందన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి, రాజంపేట మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
తప్పక చదవండి
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement