-
దేశానికి మోదీ నాయకత్వం అవసరం
అచ్చంపేట రూరల్: దేశానికి ప్రధాని మోదీ నాయకత్వం అవసరమని శివసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ అన్నారు. శుక్రవారం పట్టణంలో శివసేన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి శివసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. దేశంకోసం మోదీ మరోసారి ప్రధాని కావాలని, శివసైనికులు బీజేపీ అభ్యర్ధి భరత్ ప్రసాద్ గెలుపునకు శ్రమించాలని కోరారు. సమావేశంలో విద్యార్థిసేన జిల్లా అధ్యక్షుడు మారుతి, యువసేన అధ్యక్షుడు విష్ణు, వెంకటేష్, తరుణ్, అభిలాష్ ఉన్నారు. -
మహిళలే నిర్ణేతలు
● మహబూబ్నగర్లో 50.53,నాగర్కర్నూల్లో 50.24శాతం మహిళా ఓటర్లు ● అభ్యర్థుల జాతకాలు తేల్చేది వీరే.. ● వారిని ప్రసన్నం చేసుకోవడానికిప్రయత్నిస్తున్న నేతలు మహబూబ్నగర్ డెస్క్: వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపోటములకు మహిళా ఓట్లే కీలకంగా మారాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్న నేపథ్యంలో ఎంపీ అభ్యర్థుల గెలుపును శాసించేది వీరే. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తాజా ఓటర్ల జాబితా ప్రకారం మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో 16,82,470 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 50.53 శాతంతో 8,50,172 మంది మహిళా ఓటర్లే ఉన్నారు. ఇక్కడ పురుషుల కంటే 17,916 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. నాగర్కర్నూల్ లోక్సభ స్థానంలో 17,38,254 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో కూడా 50.24 శాతంతో 8,73,340 మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ పురుషుల కంటే 8,465 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. నాగర్కర్నూల్ లోక్సభ పరిధిలోని కొల్లాపూర్, కల్వకుర్తి సెగ్మెంట్ల పరిధిలో మినహా ఉమ్మడి జిల్లాలోని మిగిలిన 12 సెగ్మెంట్లలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు తేలింది. -
బీఆర్ఎస్, బీజేపీలకు ఓట్లు అడిగే హక్కులేదు
కల్వకుర్తి: ప్రజాసంక్షేమం, అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోని బీఆర్ఎస్, బీజేపీలకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని మాజీ మంత్రి చిత్తరంజన్దాసు నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎన్నికల కోడ్ కారణంగా రూ. 500 సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అమలు కాలేదన్నారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు. ఆగస్టు 15వ తేదీలోగా రూ. 2 లక్షల రుణమాఫీ చేయడంతో పాటు రైతుబంధు, పింఛన్లు పెంచుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న ప్రజాపాలనను బీఆర్ఎస్, బీజేపీలు జీర్ణించుకోలేక ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నాయని విమర్శించారు. ఎన్ని కుట్రలు చేసినా మహబూబ్నగర్, నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. కాగా, వివిధ గ్రామాలకు చెందిన బీజేపీ, బీఆర్ఎస్లకు చెందిన దాదాపు 300 మంది ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సమావేశంలో బాలాజీసింగ్, ఇందిరాశోభన్, ఆనంద్, గోపాల్రెడ్డి, విజయ్కుమార్, శ్రీనివాస్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి ఉన్నారు. -
మాదక ద్రవ్యాలతో భవిష్యత్ నాశనం
నాగర్కర్నూల్ క్రైం: మాదక ద్రవ్యాల వినియోగంతో భవిష్యత్ నాశనమవుతుందని.. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సూచించారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో మాదక ద్రవ్యాల వాడకం నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం అనేక మంది గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నా రు. విద్యార్థులపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలన్నారు. ఎక్కడయినా గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తిస్తే, డయల్ 100 లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అ నంతరం మాదక ద్రవ్యాల వాడకం నిషేధానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. డీఎస్పీ శ్రీనివాస్, డీసీఆర్బీ డీఎస్పీ సత్యనారాయణ, సీఐ కనకయ్యగౌడ్, డీసీఆర్బీ సీఐ ఉపేందర్, ఎస్ఐ గోవర్ధన్ పాల్గొన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిఘా బల్మూర్: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పోలీసు అధికారులను ఆదేశించారు. మండలంలోని కొండనాగుల, బల్మూర్, పోలిశెట్టిపల్లి గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈసందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్, సీఐ రవీందర్, ఎస్ఐ బాల్రాజులకు పలు సూచనలు చేశారు. అనంతరం బల్మూర్ పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి తెలకపల్లి: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం తెలకపల్లిలోని ఓ ఫంక్షన్హాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే ఎంపీగా మల్లు రవిని గెలిపించాలని కోరారు. అనంతరం బీఆర్ఎస్కు చెందిన ఎంపీటీసీ సభ్యురాలు విజయలక్ష్మితో పా టు పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సమావేశంలో జెడ్పీటీసీ సుమిత్ర, ఎంపీపీ కొమ్ము మధు, మాజీ ఎంపీపీ పర్వతాలు, మామిళ్లపల్లి యాదయ్య ఉన్నారు. నేడు హజ్ యాత్రికులకు టీకాలు నాగర్కర్నూల్ క్రైం: జిల్లా నుంచి హజ్ యాత్ర కు వెళ్తున్న భక్తులకు శనివారం జిల్లా కేంద్రంలోని రూబీ గార్డెన్లో టీకా శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా హజ్ సొసైటీ అధ్యక్షుడు షేక్ ఫరీద్ అహ్మద్ శుక్రవారం తెలిపారు. టీకా శిబిరం అనంతరం మహబూబ్నగర్కు చెందిన జామి యా నిజామియాకు చెందిన అలీం ముఫ్తి ము హమ్మద్ మౌలానా హఫీజ్ ఫైజుద్దీన్ శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. -
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
కాంగ్రెస్ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి, నాగర్కర్నూల్ అభ్యర్థి మల్లురవికి మద్దతుగా టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. రేవంత్ సొంత జిల్లా కావడంతో వీరి గెలుపు బాధ్యతలను ఆయన తన భుజాలపై వేసుకున్నారు. ఈ మేరకు కొడంగల్, కోస్గి, మద్దూరు, మహబూబ్నగర్, నారాయణపేట, బిజినేపల్లిలో రోడ్ షోలు, కార్నర్ మీటింగులు, బహిరంగసభల్లో పాల్గొన్నారు. తాజాగా శనివారం ఆయన మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధి దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కొత్తకోటకు రానున్నారు. రోడ్ షోతో పాటు కార్నర్ మీటింగ్లో మాట్లాడనున్నారు. వచ్చే వారం మక్తల్ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement