-
బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
విశాఖ విద్య: జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ సీ్త్ర శిశు సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు డాక్టర్ గొండు సీతారాం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 ఏళ్ల లోపు వయసు గల బాలలు ఈ పురస్కారాలకు అర్హులని పేర్కొన్నారు. సామాజిక సేవ, సాంకేతిక పరిజ్ఞానం, విద్య, ధైర్య సాహసాలు, పర్యావరణం, క్రీడలు, కళలు, సాహిత్యం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం తదితర అంశాల్లో ప్రతిభావంతులకు ఇదో అరుదైన అవకాశమని తెలియజేశారు. 2025 జనవరిలో రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకోవచ్చన్నారు. అర్హత, ఆసక్తి గల బాలలు జూలై 31 లోపు http:/awards.gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
వైఎస్సార్సీపీతో ముస్లింల బంధం విడదీయరానిది
ఎంవీపీకాలనీ: ౖవెఎస్సార్సీపీతో ముస్లింలది విడదీయరాని బంధమని రాజ్యసభ సభ్యుడు, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వెంకోజిపాలెం సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం రాత్రి ముస్లింల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత దివంగత వైఎస్సార్కు దక్కుతుందన్నారు. ఆయన అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లింల సంక్షేమానికివిశేష కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ముస్లింల రాజకీయ ప్రాధాన్యం పెంచేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే గత ఎన్నికల కంటే ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ముస్లింలకు ఎక్కువ అసెంబ్లీ సీట్లు కేటాయించినట్లు చెప్పారు. 2019లో 5 కేటాయిస్తే, 2024లో ఆ సంఖ్యను 7కు పెంచారన్నారు. ముస్లింలకు అన్ని రకాల సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఈ మేలును గుర్తుంచుకుని ఎన్నికల్లో ముస్లింలంతా వైఎస్సార్సీపీకి అండగా నిలవాలని కోరారు. వైఎస్సార్సీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. మానవీయత, నిజాయితీ, నిస్వార్థానికి ప్రతీకగా నిలిచే ముస్లింలు రాష్ట్రానికి, ప్రజలకు మంచి చేస్తున్న జగన్ ప్రభుత్వానికి అండగా నిలిచి, ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అఖండ విజయాన్నందించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఫరూఖీ, వీఎంఆర్డీఏ చైర్మన్ సనపల చంద్రమౌళి, బోణి శివరామకృష్ణ, 53వ వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ, ఎ.షరీఫ్, అటవీ కార్పొరేషన్ డైరెక్టర్ గుజ్జు వెంకటరెడ్డి, పలువురు ముస్లిం నాయకులు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. వారి ఆకాంక్షలు నెరవేరుస్తాం ఆత్మీయ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి -
విద్యుత్ షాక్తో యువకుడి మృతి
ముంచంగిపుట్టు: మండలంలోని కుమడ పంచాయతీ పూలబంద గ్రామానికి చెందిన కొర్రా వెంకటరావు(21) అనే గిరిజన యువకుడు తూర్పుగోదావరి జిల్లా భీమవరంలో రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఈ నెల 2 న విద్యుత్ షాక్తో మృతిచెందాడు. దీంతో ఫ్యాక్టరీ యాజమాన్య ప్రతినిధులు మృతదేహాన్ని అంబులెన్స్లో గురువారం రాత్రి పూలబంద గ్రామానికి తీసుకువచ్చారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి, వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. జరిగిన ఘోరంపై పూలబంద గ్రామస్తులు,మృతుని తల్లిదండ్రులు కామేశ్వరరావు,జులాయిలు వారిని నిలదీశారు.తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో మృతదేహాన్ని అంబులెన్స్ నుంచి దింపవద్దని అడ్డుకున్నారు. పరిస్థితి చేయి దాటుతోందని భావించిన ఫ్యాక్టరీ యాజమాన్య ప్రతినిధులు ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో పాటు కొంత సాయం చేయడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. మృతుడు వెంకటరావు చింతపల్లి ప్రభుత్వ కళాశాలలో బీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చదువుకుంటూ, కూలి పనులు చేస్తూ కుటుంబానికి అండగా ఉండే కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ విషయం తెలుసుకున్న వైస్ ఎంపీపీ సత్యనారాయణ, సీపీఎం మండల నేత ఎంఎం శ్రీను తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతుని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. భీమవరం రొయ్యల ఫ్యాక్టరీలో ఘటన మృతుడు ముంచంగిపుట్టు మండలం పూలబంద గ్రామ వాసి.. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం అప్పగించేందుకు యత్నించిన ఫ్యాక్టరీ యాజమాన్య ప్రతినిధులు మృతిపై నిలదీసిన పూలబంద గ్రామ గిరిజనులు కుటుంబానికి న్యాయం చేస్తామన్న హామీతో ఆందోళన విరమణ -
అదనంగా పెంచిన ఫీజు అమలుకు చరమ‘గీతం’
కొమ్మాది : రుషికొండలో ఉన్న గీతం డీమ్డ్ వర్సిటీలో బీటెక్, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు 40% అదనంగా ఫీజు చెల్లించాలని యాజమాన్యం తెలపడంతో గురువారం విద్యార్థులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఇక్కడ బీటెక్, డిగ్రీలలో నిర్వహించే సెమ్లలో 40 శాతం మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్లు నిర్థారిస్తారు. అయితే ఉత్తీర్ణత సాధించిన వారకి ఫైనల్గా మరో 40 శాతం అదనంగా ఫీజు కట్టాలని, కొత్తగా ఓ వెబ్సైట్ తీసుకుని వచ్చామని, దాని నిమిత్తం ఈ అధిక మొత్తాన్ని చెల్లించాలని యాజమాన్యం తెలిపినట్లు విద్యార్థులు తెలిపారు. ఇది ఎన్నికల ఫండ్స్ కోసం ఇలా చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. దీనిపై శుక్రవారం ‘సాక్షి’లో గీతం విద్యార్థుల ఆందోళన అనే శీర్షికతో వార్త ప్రచురణ కావడం, విషయం బయటకు తెలియడంతో చేసేదేమి లేక 40 శాతం అదనపు ఫీజు చెల్లించాలనే విషయాన్ని ఉపసంహరించుకున్నట్లు విద్యార్థులు తెలిపారు. కాగా, వాస్తవానికి ఒక సెమ్ ఫీజు రూ.6 వేలు ఉండగా, రూ.10 వేలు చెల్లించాలని గురువారం గీతం యాజమాన్యం విద్యార్థులపై ఒత్తిడి తెచ్చింది. అయితే విద్యార్థులు ఆందోళనతో ప్రస్తుతానికి 40 శాతం సెమ్ ఫీజు ఆలోచన విరమించుకున్నప్పటికీ ఎన్నికల తరువాత తిరిగి పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రత్యేక చర్యలు
చింతూరు: ఈనెల 13న జరగనున్న ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు చింతూరు సీఐ గజేంద్రకుమార్ చెప్పారు. మండల కేంద్రంలో శుక్రవారం పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ గజేంద్రకుమార్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎటువంటి ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటు వేయాలని సూచించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రశాతంగా ఎన్నికలు జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టినా, ఘర్షణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సీఆర్పీఎఫ్ బెటాలియన్–1 డీఎస్పీ హంసరాజ్, 42–బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ దివాకర్, చింతూరు ఎస్ఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్ అరుదైన పురస్కారం
మండుటెండను లెక్కచేయని అభిమానం...!
ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
మండుటెండను లెక్కచేయని అభిమానం..!
పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ..ఎంతంటే..
మరోసారి పీఠమెక్కేదెవరో..?
విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు
Actor Nani HD Stills: వారెవ్వా... బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో నాని.. ఫ్యాన్స్ ఫిదా
ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement