-
ఆదివారం రాహుల్ గాంధీ..
నాగర్కర్నూల్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మల్లురవి గెలుపును కాంక్షిస్తూ ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ జోగుళాంబ గద్వాల జిల్లాలో ఆదివారం పర్యటించనున్నారు. ఎరవ్రల్లి చౌరస్తాలో సాయంత్రం జరిగే బహిరంగసభలో పార్టీ శ్రేణులు, ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. రాహుల్ గాంధీ ఆరు నెలల్లో ఉమ్మడి జిల్లాకు రావడం ఇది ఐదోసారి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన కోస్గిలో రేవంత్రెడ్డికి మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభతో పాటు మహబూబ్నగర్, గద్వాల, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో జరిగిన ప్రచార సభల్లో పాల్గొన్నారు. -
పకడ్బందీగా బందోబస్తు
ఎర్రవల్లిచౌరస్తా: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 5న ఎర్రవల్లి మండల కేంద్రంలో జరిగే బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు రాహుల్గాంధీ రానున్న సందర్భంగా ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఎస్పీ రితిరాజ్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఎస్పీ ఎర్రవల్లి మండల కేంద్రానికి చేరుకొని హెలిప్యాడ్, వీఐపీ పార్కింగ్, ట్రాఫిక్ రూట్లు, సభా స్థలానికి వెళ్లే దారులు, జనరల్ పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం బందోబస్తు పరంగా చేయాల్సిన ఏర్పాట్లను గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితిల్లో కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలన్నారు. సభా ప్రాంగణం చుట్టూ ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ గుణశేఖర్, పదవ పటాలం కమాండెంట్ సాంబయ్య, డిఎస్పి సత్యనారాయణ, సాయిధదళ డిఎస్పీ నరేందర్, అలంపూర్ సిఐ రవిబాబు, ఆర్ఐ వెంకటేష్, సిబ్బంది, తదితరులు ఉన్నారు. -
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
కాంగ్రెస్ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి, నాగర్కర్నూల్ అభ్యర్థి మల్లురవికి మద్దతుగా టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. రేవంత్ సొంత జిల్లా కావడంతో వీరి గెలుపు బాధ్యతలను ఆయన తన భుజాలపై వేసుకున్నారు. ఈ మేరకు కొడంగల్, కోస్గి, మద్దూరు, మహబూబ్నగర్, నారాయణపేట, బిజినేపల్లిలో రోడ్ షోలు, కార్నర్ మీటింగులు, బహిరంగసభల్లో పాల్గొన్నారు. తాజాగా శనివారం ఆయన మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధి దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కొత్తకోటకు రానున్నారు. రోడ్ షోతో పాటు కార్నర్ మీటింగ్లో మాట్లాడనున్నారు. వచ్చే వారం మక్తల్ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. -
బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ పూర్తి
గద్వాల రూరల్: గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలకు సంబందించిన అదనపు బ్యాలెట్ యూనిట్ల సప్లమెంటరీ ర్యాండమైజేషన్ నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో వివిధ రాజకీయా పార్టీల ప్రతినిధుల సమక్షంలో అదనపు బ్యాలెట్ యూనిట్ల సప్లమెంటరీ ర్యాండమైజేషన్ నిర్వహించడం జరిగిందని అన్నారు. నాగర్కర్నూల్ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య 20 మంది ఉన్నందున అదనంగా 888 బ్యాలెట్ యూనిట్ల అవసరం మేరకు సప్లమెంటరీ ర్యాండమోజషన్ నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలోని 378 బ్యాలెట్ యూనిట్లు, కేటాయించినట్లు మిగిలిన బ్యాలెట్ యూనిట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆధీనంలో రిజర్వ్ చేయడం జరి గిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముసి ని వెంకటేశ్వర్లు, ఆర్డీఓ రాంచందర్ పాల్గొన్నారు. -
మహిళలే నిర్ణేతలు
● మహబూబ్నగర్లో 50.53,నాగర్కర్నూల్లో 50.24శాతం మహిళా ఓటర్లు ● అభ్యర్థుల జాతకాలు తేల్చేది వీరే.. ● వారిని ప్రసన్నం చేసుకోవడానికిప్రయత్నిస్తున్న నేతలు మహబూబ్నగర్ డెస్క్: వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపోటములకు మహిళా ఓట్లే కీలకంగా మారాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్న నేపథ్యంలో ఎంపీ అభ్యర్థుల గెలుపును శాసించేది వీరే. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తాజా ఓటర్ల జాబితా ప్రకారం మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో 16,82,470 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 50.53 శాతంతో 8,50,172 మంది మహిళా ఓటర్లే ఉన్నారు. ఇక్కడ పురుషుల కంటే 17,916 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. నాగర్కర్నూల్ లోక్సభ స్థానంలో 17,38,254 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో కూడా 50.24 శాతంతో 8,73,340 మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ పురుషుల కంటే 8,465 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. నాగర్కర్నూల్ లోక్సభ పరిధిలోని కొల్లాపూర్, కల్వకుర్తి సెగ్మెంట్ల పరిధిలో మినహా ఉమ్మడి జిల్లాలోని మిగిలిన 12 సెగ్మెంట్లలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు తేలింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే: సీఎం జగన్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement