-
అగ్రనేతల క్యూ! సై.. అంటే సై!!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: లోక్సభ ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. ఇంకా వారం రోజుల్లో ప్రచార పర్వం ముగియనుంది. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ సొంత ఇలాకా కావడంతో పార్టీ అధిష్టానం పాలమూరుపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. రెండింటిలోనూ విజయకేతనం ఎగురవేసి సత్తా చాటాలని బీజేపీ.. సిట్టింగ్ స్థానాలను తిరిగి దక్కించుకుని, పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ కదనరంగంలో దూకుడు ప్రదర్శిస్తున్నాయి.ప్రచార గడువు దగ్గరపడుతుండడంతో ఆయా పార్టీ ల అభ్యర్థులకు మద్దగా అగ్రనేతలు రంగంలోకి దింపుతున్నారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ పార్లమెంట్ల పరిధిలో జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు రోడ్షోలు, బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారం మరింత హోరెత్తనుంది.ఇవి చదవండి: మరోసారి పీఠమెక్కేదెవరో..? -
ఆదివారం రాహుల్ గాంధీ..
నాగర్కర్నూల్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మల్లురవి గెలుపును కాంక్షిస్తూ ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ జోగుళాంబ గద్వాల జిల్లాలో ఆదివారం పర్యటించనున్నారు. ఎరవ్రల్లి చౌరస్తాలో సాయంత్రం జరిగే బహిరంగసభలో పార్టీ శ్రేణులు, ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. రాహుల్ గాంధీ ఆరు నెలల్లో ఉమ్మడి జిల్లాకు రావడం ఇది ఐదోసారి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన కోస్గిలో రేవంత్రెడ్డికి మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభతో పాటు మహబూబ్నగర్, గద్వాల, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో జరిగిన ప్రచార సభల్లో పాల్గొన్నారు. -
కేటీఆర్.., హరీశ్రావు
మహబూబ్నగర్, నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మద్దతుగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఆయా పార్లమెంట్ స్థానాల్లో నిర్వహించిన రోడ్షోలు, కార్నర్ మీటింగ్లకు హాజరై పార్టీ శ్రేణులు, ప్రజలనుద్దేశించి మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ వారంలో ప్రచార గడువు ముగిసేలోపు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్), మరో మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కొత్తకోట, దేవరకద్ర, మక్తల్, భూత్పూర్, నాగర్కర్నూల్లో నిర్వహించనున్న రోడ్షోలు, కార్నర్ మీటింగ్కు హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
ఓటరు సహకార కేంద్రం ఏర్పాటు
మహబూబ్నగర్ రూరల్: ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో సందేహాలు. ఎవరిని అడగాలి.. ఫిర్యాదు చేయాలంటే ఎక్కడ సంప్రదించాలి..? ఎన్నికల వేళ ఇలాంటి ప్రశ్నలు సాధారణమే. అయితే ఓటర్ల సందేహాల నివృత్తికి కేంద్ర ఎన్నికల సంఘం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో భాగంగా ఓటరు సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా మహబూబ్నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని.. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలంటే నిబంధనలు పక్కాగా అమలు చేయాల్సిందే. ఉల్లంఘనకు తావిస్తే సరైన అభ్యర్థులు ఎన్నికయ్యే అవకాశం ఉండదు. ఈ విషయంలో ఓటర్లు అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు గుర్తిస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలి. నిబంధనల ఉల్లంఘనపై ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదుదారులు వివరాలను గోప్యంగా ఉంచుతారు. ఫిర్యాదును వెంటనే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి పంపి అక్రమాల కట్టడికి చర్యలు తీసుకుంటారు. వీటిపైనే ఎక్కువగా.. ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంలో జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతోంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. సహాయ కేంద్రానికి ఎక్కువగా ఓటరు జాబితాకు సంబంధించిన ఫిర్యాదులే వస్తున్నాయి. దరఖాస్తు చేసినా ఓటరు జాబితాలో పేరు లేదని కొందరు, ఈసారి పోలింగ్ కేంద్రం మారిందని ఇంకొందరు సహాయ కేంద్రానికి ఫోన్ చేస్తున్నారు. పట్టణ ప్రాంతంలో ఉన్న వారు పోలింగ్ కేంద్రాల చిరునామాకు సంబంధించిన సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారు. మూడు నియోజకవర్గాలు.. జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో మహబూబ్నగర్లో 2,58,658 ఓటర్లు ఉండగా.. పురుషులు 1,28,268, సీ్త్రలు 1,30,377.. ఇతరులు 13 ఉన్నారు. జడ్చర్లలో 2,23,222 ఓటర్లు ఉండగా 1,11,354 పురుషులు, సీ్త్రలు 1,11863, ఇతరులు 5 ఉన్నారు. దేవరకద్రలో 2,39,077 ఓటర్లలో 1,18,372 పురుషులు, 1,20,705 సీ్త్రలు కలిపి మొత్తం 7,20,957 మంది ఓటర్లు ఉన్నారు. సద్వినియోగం చేసుకోవాలి ఓటరు సహకార కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలి. అందరి సహకారం ఉంటేనే ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. నిబంధనల ఉల్లంఘనపై ఏ సమయంలోనైనా నిర్భయంగా ఫిర్యాదు చేయాలి. ఓటరు జాబితాలో పేరు రాకపోయినా.. పోలింగ్ కేంద్రానికి సంబంధించిన సందేహాలు నివృత్తి చేసుకునేందుకు వీలుంటుంది. – నవీన్, మహబూబ్నగర్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి 8 రకాల సేవలు.. ఓటరు హెల్ప్లైన్ ద్వారా 8 రకాల సేవలు అందిస్తున్నారు. పోలింగ్, ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ిఫిర్యాదులు, అభిప్రాయాల స్వీకరణ, ఎన్నికల అధికారికి సంబంధించిన వివరాలు, శాసనసభ నియోజకవర్గ సమాచారాన్ని ఓటర్లకు తెలియజేయడం, ఓటరు నమోదు, పోలింగ్ కేంద్రం చిరునామా, ఎన్నికల సమాచారం, 24 గంటలు ఓటర్లకు సాయం అందించడం వంటి సేవలు ఇందులో ఉన్నాయి. సందేహాలుంటే 08542–241311 నంబర్ సంప్రదించొచ్చు తహసీల్దార్ కార్యాలయంలో 24 గంటల అందుబాటులో సిబ్బంది -
మోదీ ప్రభుత్వాన్ని సాగనంపాలి
స్టేషన్ మహబూబ్నగర్: సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో జన రంజక పాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే యెన్నం సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో దొరల పాలనను సాగనంపినట్లే కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని కూడా సాగనంపాలని కోరారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం సామాన్య ప్రజల స్థితిగతులను నాశనం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అయితేనే ప్రజలకు మేలు చేస్తుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్చార్జీగా ఉన్నారని, ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎంకు బహుమతిగా ఇద్దామని ఎమ్మెల్యే అన్నారు. స్థానిక మోతీనగర్లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ పాలమూరు, మన పిల్లల భవిష్యత్ కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయా కార్యక్రమాల్లో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు వినోద్కుమార్, సంజీవ్ముదిరాజ్, చల్లా అశ్లేషారెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు రాములుయాదవ్, కౌన్సిలర్ జాజిమొగ్గు నర్సింహులు, నాయకులు సిరాజ్ఖాద్రీ, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement