-
పింఛన్లపై లోకేశ్ మాట్లాడొద్దన్నాడు
సాక్షి, అమరావతి :ఇంటి వద్ద పింఛన్ల పంపిణీని అడ్డుకుని వృద్ధులను 45 డిగ్రీల ఎండలో నడిరోడ్డున పడేసిన టీడీపీ ఇప్పుడు దానిపై ఏంచేయాలో తెలీక లబోదిబోమంటోంది. టీడీపీ అభ్యర్థులు, నేతలను పింఛనుదారులు ఎక్కడికక్కడ నిలదీస్తుండడం, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడంతో వారు బెంబేలెత్తిపోతున్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ దొంగ రాజకీయం బయటపడిపోవడంతో ఏం మాట్లాడొద్దని చంద్రబాబు తనయుడు లోకేశ్బాబు పార్టీ కేడర్కు సూచించారు. దీనిపై ఏదో ఒకటి చేయాలని పార్టీ అభ్యర్థులు టీడీపీ కార్యాలయంలో పనిచేసే వారికి ఫోన్లుచేసి బతిమలాడుతున్నారు. కానీ, వారు తామేం చేయలేమని, తప్పు టీడీపీదేనని, దీనిపై ఏం మాట్లాడకుండా ఉండాలని చెబుతూ చేతులెత్తేశారు. దీంతో ఎల్లో మీడియా, సోషల్ మీడియా వృద్ధుల ఏడుపులపై దొంగ ప్రచారానికి దిగింది. చంద్రబాబును, టీడీపీని అడ్డగోలుగా వృద్ధులు తిడుతుంటే దాన్ని వక్రీకరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు చిత్రీకరించి తాము దిగజారుడులో మాస్టర్స్మని నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలో.. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రధాన అనుచరుడు ఒకరు టీడీపీ కార్యాలయ ముఖ్య ఉద్యోగితో మాట్లాడుతున్న సంభాషణ వింటే (ఆడియో లీకైంది) పింఛన్లపై టీడీపీ ఏడుపు ఏమిటో అర్థమవుతుంది.ఇదీ సంభాషణ..పెమ్మసాని అనుచరుడు : హలో.. ఏమ్మా రఘు ఎక్కడున్నావ్?టీడీపీ కార్యాలయ ఉద్యోగి : అన్నా ఇక్కడే అన్నా.. ఆఫీసులోఅనుచరుడు : ఏమ్మా ఎట్లా ఉన్నావు?ఉద్యోగి : బానే ఉన్నా.. మీరెట్లా ఉన్నారన్నా..అనుచరుడు : బావున్నా.. ఏంలేదు పెన్షన్ ఇష్యూ బాగా వైరల్ అయిపోతోందంట. బ్యాడ్ నేమ్ వస్తోంది. మార్నింగ్ కూడా మన పెమ్మసాని గారు క్యాంపెయిన్కి వెళ్లినప్పుడు ఎక్కడపడితే అక్కడ ముసలోళ్లు గోలచేస్తూ సార్ దగ్గరికి వచ్చి నిలదీస్తున్నారు. ఆయన ఫుల్ హార్ష మీద ఉన్నాడు. ఏంటసలు.. వీళ్లు ఏం చేస్తున్నారో కనుక్కోమన్నాడు. అందుకే కాల్చేశా..ఉద్యోగి : అన్నా నాకర్థమైంది. నాకూ ఉదయం నుంచి ఇదే విషయం మీద 40–50 కాల్స్ వచ్చాయి. అనుచరుడు : ఎందుకని మీరేం చేయలేకపోతున్నారు? అసలు ఏంటిది?ఉద్యోగి : చెప్పి చెప్పి విసిగిపోయామన్నా..అనుచరుడు : ఏంది విసిగిపోయేది.. వాళ్లేమో మన మీద అంత అగ్రెసివ్గా ఉంటున్నారు. నిమ్మగడ్డ రమేష్ మనోడే అంటున్నారు. దాని మీద మనం ఏమీ కౌంటర్ ఇవ్వలేకపోతున్నాం ఎందుకని?ఉద్యోగి : కౌంటర్ కాదన్నా.. అసలు విషయం ఏంటంటే.. యాక్చువల్గా మిస్టేక్ మనదే ఉంది. పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే.. నిమ్మగడ్డ రమేష్తో పెద్దాయనే (చంద్రబాబు) ఇదంతా చేయించారు. పిటిషన్ వేయించి ఎన్నికల కమిషన్తో ఇట్లా చేయించారని బాగా స్ప్రెడ్ అయిపోయింది. అనుచరుడు : దానిపై కౌంటర్ ఇవ్వలేమా?ఉద్యోగి : దీని గురించి లోకేశ్ అన్నకు చెప్పాం. మీరెవ్వరూ దీనిపై ఎట్టి పరిస్థితుల్లో రెస్పాండ్ అవ్వొద్దు అని చెప్పారు. 60–70 నియోజకవర్గాల నుంచి దీనిపై కాల్స్ వచ్చాయి. అనుచరుడు : కాదమ్మా రఘు.. ఇప్పటికే మన పరిస్థితి వరస్ట్గా ఉంది. పెమ్మసాని గారు ఇంత ఖర్చుపెట్టి కష్టపడుతున్నారు.. ఆయనే అన్నాడు.. దీనిపై ఇంతమంది ఇలా అడుగుతున్నారు.. మనవాళ్లు ఏం చేస్తున్నారో కనుక్కోమన్నారు.ఉద్యోగి : కాదన్నా.. ఇది ఒక పెమ్మసాని గారి విషయం కాదు. స్టేట్ మొత్తం ఇది ఉంది. లోకేశ్ గారు దీనిపై మాట్లాడవద్దన్నారు. ఒకవేళ దీనిపై రెస్పాండ్ అయితే మళ్లీ మన మీదకే మిస్ఫైర్ అవుతుంది, ఏ యాక్షన్ వద్దు అని చెప్పారు. అనుచరుడు : డ్యామేజి కంట్రోల్ ఎట్లా మరి? ఏం చేస్తారో ప్లాన్ ఏమీ చెప్పలేదా?ఉద్యోగి : లోకేశ్ అన్న చెప్పింది ఏమిటంటే అవసరమైతే పార్టీ వాళ్లతో ప్రెస్మీట్లు పెట్టిద్దాం. ఇప్పుడు మాత్రం ఇన్వాల్వ్ అవ్వొద్దని చెప్పారు. అందుకే మన వాళ్ల నుంచి దీనిపై ఒక్క పోస్టు కూడా రాలేదు. అనుచరుడు : ఏదో ఒకటి చేయండయ్యా.. ఇప్పటికే మనవాళ్లు చాలా డీమోరలైజ్ అయిపోయారు. లక్ష మంది అట్లా ఉంటే పోనీలే అనుకోవచ్చు. 72–73 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. అందులో మనకి ఇంకో 10 రోజులే ఉంది. మనకి ఏదైనా తేడాపడితే..ఉద్యోగి : చూసుకుంటారన్నా మనవాళ్లు.. అనుచరుడు : కొంచెం యాక్టివ్గా ఉండండి..ఉద్యోగి : కేడర్ డీమోరలైజ్ అవకుండా చూడాలన్నా.. అది మీరే చేయాలి.అనుచరుడు : నీకూ తెలుసు. పెమ్మసాని గారు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏం చేస్తున్నారని.. మాకు మీరు కొంచెం సపోర్ట్ చేయండి.ఉద్యోగి : ముసలోళ్లతో ఏముంది గానీ.. రెండు, మూడ్రోజులైతే అయిపోతుంది.. పెమ్మసాని అనుచరుడు : 2, 3 రోజులు కాదు. ఇంకా పది రోజులే టైముంది. ఏం చేయాలో? ఉద్యోగి : లోకేశ్ అన్న ప్రెస్మీట్లు పెట్టిద్దామన్నారు. మాట్లాడిస్తారు. -
ఫించన్ ఎత్తేశారు!
రాకముందే అవ్వాతాతలకు అవస్థలు 14 ఏళ్లు అధికారంలో ఉండీ ఏ పేదవాడికీ, ఏమీ చేయని చంద్రబాబు ఈనాడులో ఇచి్చన ప్రకటన చూశారా? సూపర్ సిక్స్లో అవ్వాతాతల పెన్షన్ను అప్పుడే ఎత్తేశారు. సూపర్ సిక్స్లో అవ్వాతాతల పెన్షన్ మీకు ఎక్కడైనా కనిపించిందా? చంద్రబాబు రాకమునుపే అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఎండనకా వాననకా తిరగాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. ఇక పొరపాటున చంద్రబాబు పాలన వస్తే చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది. అవ్వాతాతలు ప్రతి ఒక్కరూ ఇది జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నా. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు, సాక్షి ప్రతినిధి, గుంటూరు, సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘ఈ ఎన్నికల యుద్ధంలో చంద్రబాబు తన బాణాన్ని నేరుగా పేద సామాజికవర్గాల మీద, నా అవ్వాతాతల మీద, వారి పెన్షన్ల మీద గురి పెట్టాడు. ఇవాళ పెన్షన్ల విషయంలో జరుగుతున్న రాజకీయాలు, చేస్తున్న అన్యాయాన్ని మీరంతా చూస్తున్నారు. అయ్యా చంద్ర బాబూ...! 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ నీ హయాంలో అవ్వాతాతలకు నువ్వు ఇచ్చి న పెన్షన్ ఎంత? కేవలం వెయ్యి రూపాయలు కాదా? ఆ పెన్షన్ను రూ.3 వేలు చేసింది ఎవరు? ఆ అవ్వాతాతలకు పెన్షన్ ఇంటికే పంపుతున్నది ఎవరు? చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల్లో అవ్వాతాతల పెన్షన్ను అప్పుడే ఎత్తేశారు’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పల్నాడు జిల్లాపెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు, సాయంత్రం ప్రకాశం జిల్లా కనిగిరిలోని పామూరు బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్ ప్రసంగించారు. ఆ వివరాలివీ.. సాధ్యం కాని హామీలతో వల.. మరో 10 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోంది. ఈ ఎన్నికలు కేవలం ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకునేవి కావు. ఐదేళ్ల మీ భవిష్యత్తు, ఇంటింటికీ పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలివి. మీ జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు, మళ్లీ మోసపోవడమే! చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే. సాధ్యం కాని హామీలతో వల వేస్తున్నాడు. వదల బొమ్మాళీ వదలా.. అంటూ పసుపు పతి మళ్లీ నిద్రలేచి వస్తాడు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ చంద్రముఖి మీ ఇంటి తలుపుతట్టి లకలకా అంటూ ఐదేళ్లు రక్తం తాగేందుకు వస్తుంది. మరోసారి మోసగించేందుకే చంద్రబాబు సాధ్యం కాని హామీలను ఇస్తున్నాడు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకునే ఆ పెద్దమనిషి పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క మంచి గుర్తుకొస్తుందా? నాడు అవస్థలతో 39 లక్షలు.. నేడు ఠంఛన్గా 66 లక్షలు ఓ అవ్వాతాతా.. చంద్రబాబు ఇచ్చిన సామాజిక పెన్షన్లు ఎన్నో తెలుసా? ఎన్నికలకు ఆర్నెల్ల ముందు వరకూ ఇచ్చింది కేవలం 39 లక్షలు. అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకుంటూ వివక్షకు లోనవుతూ అరకొరగా తీసుకున్న దుస్థితి. మీ బిడ్డ జగన్ హయాంలో ఏకంగా 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాడు. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా రూ.3వేలు చొప్పున పెన్షన్ నేరుగా మీ ఇంటికే అందిస్తున్నాడు. ఆ పాపిష్టి కళ్లు పడనంతవరకూ.. చంద్రబాబు పాపిష్టి కళ్లు ఆ అవ్వాతాతల మీద పడనంత వరకూ ఇంటికే పెన్షన్ సజావుగా అందేది. సూర్యోదయానికి ముందే, ఒకటో తేదీ ఉదయాన్నే అవ్వాతాతల ఇంటికే మనవళ్లు, మనవరాళ్ల రూపంలో వలంటీర్లు వచ్చి చిరునవ్వుతో పింఛను అందించి మంచి చేసిన కాలం మనదే. ఎప్పుడైతే చంద్రబాబు పాపిష్టి కళ్లు పడ్డాయో.. తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి వలంటీర్లు ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వకూడదంటూ ఉత్తర్వులు ఇప్పించాడు. చంద్రబాబు పాపిష్టి చేష్టలు అంతటితో ఆగలేదు. ఇంకా కడుపుమంట చల్లారక ఏం చేశాడో తెలుసా? అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేటట్టుగా వాళ్ల పెన్షన్ బ్యాంకుల్లో జమ చేయమని చెప్పాడు. దీంతో ఎన్నికల కమిషన్ అక్కడ నుంచి ఆదేశాలు ఇచ్చింది. అవ్వాతాతలు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇంత ఎండలో క్యూలలో నిలబడలేక చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ ఉంటే ఆ దౌర్భాగ్యపు పని చేసిన చంద్రబాబు ఆ నెపాన్ని మీ బిడ్డపై వేస్తున్నాడు. చంద్రబాబు, దుష్ట చతుష్టయం, ఎల్లోమీడియా వీళ్లంతా కలిసి ఆ నెపాన్ని మీ బిడ్డ మీద వేస్తున్నారు. ఆ ఈనాడు కథనాలు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 చూస్తే.. వీళ్లంతా మనుషులేనా? అనిపించేంత దారుణమైన రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు పాలనను 14ఏళ్లు మీరంతా చూశారు. మీ బిడ్డ 59 నెలల పాలన కూడా చూశారు. పెన్షన్లు నేరుగా మీ ఇంటికే వచ్చిన పరిస్థితులు చూశారు. చంద్రబాబు ఏ ఒక్క రోజూ అవ్వాతాతల మీద ప్రేమ చూపించలేదు. పెన్షన్ ఇంటికి పంపిన పరిస్థితి అంతకంటే లేదు. మీ కోసమే నా తొలి సంతకం.. నేను ఇవాళ ప్రతి అవ్వకూ, తాతకూ చెబుతున్నా. అవ్వాతాతా..! ఒక్క నెల ఓపిక పట్టండి. జూన్ 4వ తేదీ దాకా ఓపిక పట్టండి. మీ బిడ్డ మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తాడు. నా మొట్ట మొదటి సంతకం మీకోసం పెడతా అని అవ్వాతాతలకు మాటిస్తున్నా. మీ మనవళ్లు, మనవరాళ్లుగా వలంటీర్లు సూర్యోదయానికి ముందే ఇంటికే వచ్చి చిరునవ్వుతో పెన్షన్లు అందించే పరిస్థితులు మీ బిడ్డ మళ్లీ తెస్తాడు. విద్యా విప్లవం.. మహిళా సాధికారత గతంలో ఎప్పుడూ జరగని విధంగా గవర్నమెంట్ బడిలో చదివే పిల్లలకు స్కూళ్లు తెరిచే సమయానికే విద్యాకానుక, ఇంగ్లిష్ మీడియం, బైజూస్ కంటెంట్, మూడో తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్టు టీచర్లను అందుబాటులోకి తెచ్చాం. నాడు–నేడుతో కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దాం. ఇంగ్లిష్ మీడియంతో వేసిన అడుగులు నుంచి సీబీఎస్ఈ, ఐబీ దాకా మన ప్రయాణం కొనసాగుతోంది. 8వ తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబ్లు కనిపిస్తున్నాయి. తొలిసారిగా 6వ తరగతి నుంచే క్లాస్రూమ్ లలో డిజిటల్ బోర్డులు, డిజిటల్ బోధన పేద పిల్లలకు అందుబాటులోకి వచ్చింది. పిల్లలు ఇబ్బంది పడకుండా బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్ సమకూర్చాం. డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి ఉన్నత చదువులు అభ్యసిస్తున్న 93శాతం మంది విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లిస్తూ జగనన్న విద్యాదీవెనతోపాటు వసతి దీవెన కూడా అందిస్తున్నాం. తొలిసారిగా అంతర్జాతీయ వర్సిటీలు అందించే ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులను మన కాలేజీల్లో అందుబాటులోకి తెచ్చాం.పిల్లలను బడికి పంపిస్తే చాలు చదువులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి ఇస్తున్నాం. అక్కచెల్లెమ్మలు సొంత కాళ్లపై నిలబడేలా చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, వైఎస్సార్ సున్నావడ్డీ, ఆసరా ఇస్తున్నాం. ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వారి పేరిటే రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు 22 లక్షల ఇళ్లు కూడా కడుతున్నాం. గ్రామాల్లోనే మహిళా పోలీసు, దిశ యాప్, రాజకీయ సాధికారత కోసం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేసింది మీ బిడ్డ ప్రభుత్వమే. లంచాలు లేని సమాజం గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఏకంగా 600 రకాల సేవలు మీ ఇంటి వద్దకే వస్తున్నాయి. ప్రతి 60–70 ఇళ్లకు వలంటీర్ వ్యవస్థ, లంచాలు లేకుండా ఇంటికే పెన్షన్, పౌర సేవలు, పథకాలు.. ఇవన్నీ జరుగుతోంది ఈ 59 నెలల కాలంలోనే. మీ బిడ్డ ముఖ్యమంత్రి కాకముందు గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు లంచాలు లేకుండా నేరుగా మీ చేతికే అందుతాయని ఎవరైనా చెబితే నమ్మేవారా? మీ బిడ్డ 130 సార్లు బటన్లు నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా జమ చేశాడు. నాకు ఓటు వేయని వారినీ కోరుతున్నా.. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఇది క్లాస్ వార్. పేదవాడు బాగుపడాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా మీ ఓటు ఎంత కీలకమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతున్నా. గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా ఒక్కటే కోరుతున్నా. మీ ఇంటికి వెళ్లి అవ్వాతాతలు, భార్యాపిల్లలతో కూర్చుని మాట్లాడండి. ఎవరి హయాంలో, ఎవరి వల్ల మీకు మంచి జరిగింది? ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుందో ఆలోచన చేసి ఆ తర్వాతే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోండి. మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్లీ ఇంటికే పెన్షన్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఆ పెన్షన్లో పెరుగుదల కూడా కనిపిస్తుంది. మళ్లీ మీ జగన్ అధికారంలో ఉంటేనే పెంచిన అమ్మ ఒడి నా అక్కచెల్లెమ్మలకు అందుతుంది. ఆ మోసాలు మీరంతా చూశారు.. మీ బిడ్డను నమ్మి మీరంతా అధికారం ఇచ్చినందువల్ల దేవుడి దయతో ఐదేళ్లలో ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తేగలిగాం. ఏకంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నా తమ్ముళ్లు, చెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావిస్తూ 99శాతం హామీలను అమలు చేశాం. 2014లో ఒకసారి చంద్రబాబును నమ్మారు! ఆ కూటమిని నమ్మి ఓటు వేశారు! చంద్రబాబు మేనిఫెస్టో మాయలు, మోసాలు ఎలా ఉంటాయో మీరంతా చూశారు. ఈ 59 నెలల్లో మీ జగన్ పాలన చూస్తున్నారు. మీ బిడ్డ చెప్పిన దానికన్నా నాలుగు అడుగులు ముందుకు వేశాడు. కొత్త మోసాలతో అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్న వారికి, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత లేని మనుషులకు తగిన గుణపాఠం చెప్పమని కోరుతున్నా. మంచి చేసిన ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్సింకులోనే ఉండాలి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన పిల్లల చదువులు, బడులు బాగుపడాలన్నా, ఆసుపత్రులు, వ్యవసాయం బాగుండాలన్నా రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాల్లో ఒక్కటి కూడా తగ్గకుండా గెలిపించాలి. చంద్రబాబు మోసాలను ఓడించడానికి, పేదలను గెలిపించడానికి, విలువలు విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా? మన అభ్యర్థులను ఆశీర్వదించండివైఎస్సార్సీపీ నరసాపురం, పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థులు ముదునూరి ప్రసాదరాజు, గుడాల గోపి, ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల, పెదకూరపాడు ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకరరావు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి పి.అనిల్ కుమార్ యాదవ్, కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నా. గతంలో ఇవి ఉన్నాయా?» పిల్లలకు విద్యాకానుక, వారి చేతుల్లో ట్యాబ్లు గతంలో ఎప్పుడైనా చూశారా? » రోజుకో రుచికరమైన మెనూతో పౌష్టికాహారంతో గోరుముద్ద చూశారా? » తల్లులకు అమ్మఒడి, పూర్తి ఫీజులతో విద్యాదీవెన, వసతిదీవెన, ఓ ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల గృహ నిర్మాణాలు, ఇంటివద్దే అందించిన పౌర సేవలు, పథకాలను చూశారా? » ఇంటికే రూ.3 వేల పెన్షన్ కానుక, ఓ రైతు భరోసా, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, వాహనమిత్ర, నేతన్ననేస్తం, మత్స్యకార భరోసా, జగనన్న తోడు, చేదోడు, లా నేస్తం, రూ.25 లక్షలదాకా ఉచితంగా విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష గతంలో మీరు చూశారా? » వీటన్నింటితో పాటు మీ ఊరిలోనే గ్రామ సచివాలయం, నాడు–నేడుతో బాగుపడిన ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, ఓ ఆర్బీకే, విలేజ్ క్లినిక్, ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, మహిళా పోలీస్, అక్కచెల్లెమ్మల చేతుల్లో దిశ యాప్ గతంలో ఉన్నాయా? » మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్లీ ఇవన్నీ సజావుగా కొనసాగి పథకాలు అందుతాయి. 2014లో బాబు ముఖ్యమైన మోసాలివీ..» రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ చేస్తానన్నాడు... జరిగిందా? » రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాల్లో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? » ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో వేస్తామని ఏ ఒక్కరికైనా ఇచ్చాడా? » ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి హామీ అమలైందా? ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఏ ఇంటికైనా ఇచ్చాడా? » అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. ఏ ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా? » రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ జరిగిందా? » ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా? » సింగపూర్కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మించాడా? నరసాపురం, పెదకూరపాడు, కనిగిరిలో ఎవరికైనా కనిపిస్తున్నాయా? » ప్రత్యేక హోదా తీసుకురాకపోగా అమ్మేశాడు. »ఇప్పుడు మళ్లీ అదే కూటమి పేరుతో మీ ముందుకొచ్చి సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కార్ అంటూ మరోసారి వంచనకు సిద్ధమైన మోసగాళ్లతో రాజకీయ యుద్ధం చేస్తున్నాం. నేడు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ఇలా.. సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు హిందూపురంలోని అంబేడ్కర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్సభ స్థానం పరిధిలోని పలమనేరులోని బస్టాండ్ సెంటర్లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని నెల్లూరు సిటీలో ఉన్న గాంధీ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. పలువురు నేతలు వైఎస్సార్సీపీలో చేరిక సాక్షి, నరసరావుపేట: ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలు, సంఘాల ముఖ్య నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. తూర్పు గోదావరి జల్లాకు చెందిన బీసీ పోరాట సమితి జిల్లా అ«ధ్యక్షుడు రేలంగి శేఖర్, మూల్ నివాసి సంఘ్ జాతీయ అధ్యక్షుడు నయనాల కృష్ణారావు, జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ నరసరావుపేట కాంగ్రెస్ పార్టీ నేత మారూరి రామలింగారెడ్డి, మార్వాడి కమ్యూనిటీ ప్రెసిడెంట్ తివారీకి సీఎం జగన్ వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహా్వనించారు. -
బాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్ర లేపినట్టే: సీఎం జగన్
పల్నాడు జిల్లా, సాక్షి: చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపినట్టేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పల్నాడు జిల్లా పెదకూరపాడు క్రోసూరు సెంటర్లో బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు మూడు సార్లు సీఎంగా పనిచేశారని చెప్పుకుంటారు.. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచైనా గుర్తొస్తుందా? అంటూ ప్రశ్నించారు.‘‘గతంలో ఎన్నడూ చూడని పాలనను 59 నెలల్లో చూశారు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్ని కొనసాగింపు. అదే చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికి ముగింపే. విశ్వసనీయతకు మరోసారి ఓటేసేందుకు మీరంతా సిద్ధమా?. గతంలో లేని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చా. రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. 31 లక్షల ఇళ్ల పట్టాలు అక్కా చెల్లెమ్మల పేరుపై రిజిస్ట్రేషన్ చేశాం. ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చా. మీ ఓటు ఐదేళ్ల భవిష్యత్తు’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.‘‘2014లో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా?. పిల్లల చేతుల్లో ట్యాబులు ఎప్పుడైనా మీరు చూశారా?. అమ్మఒడి, విద్యాదీవెన, వసతి, దీవెన, ఆసరా, చేయూత, కాపునేస్తం లాంటి పథకాలు చూశారా?. గతంలో మేనిఫెస్టో పేరుతో ఎలా మోసం చేశారో అందరూ చూశారు2014లో మేనిఫెస్టోను నమ్మి కూటమికి ఓటు వేశారు?. ఒక్కరికైనా రైతు రుణమాఫీ చేశారా?. అర్హులైనవారికి పక్కా ఇళ్లు అన్నారు.. ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చారా?. సింగపూర్ మించి అభివృద్ధి చేస్తానని అన్నారు.. జరిగిందా?. ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా?. ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?’’ అంటూ చంద్రబాబును సీఎం జగన్ నిలదీశారు.‘‘జరగబోయే ఈ ఎన్నికలు మీరు వేసే ఓటు మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయిస్తుంది. సాధ్యం కాని హామీలతో బాబు ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం ప్రజలను మోసం చేయడమే. చంద్రముఖి నిద్ర లేస్తే గతంలోలాగే మీ రక్తం తాగేందుకు ఇంటింటికీ వస్తుంది. బాబు మోసాలను ఓడించడానికి, పేదలను గెలపించడానికి, విలువలు, విశ్వసనీయతకు ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా?. మీరు జగన్ను నమ్మి అధికారం ఇచ్చినందువల్ల గత ఐదేళ్లలో ప్రతి ఒక్క రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తేగలిగాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు 59 నెలల కాలంలోనే ఇచ్చాం. అక్కచెల్లెమ్మలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు, 21 లక్షల ఇళ్ల నిర్మాణం ఈ 59 నెలల్లోనే జరుగుతోంది. మేనిఫెస్టోకు విశ్వసనీయత తెచ్చి 99% అమలు జరిగింది ఈ పాలనలోనే. ప్రభుత్వ బడులు మారాయి, పిల్లల చదువులు మారాయి. లంచాలు లేని వివక్షలేని ఇంటివద్దకే పాలన, పెన్షన్, పౌరసేవలు, పథకాలు గతంలో ఎప్పుడూ లేవు’’ అని సీఎం జగన్ వివరించారు. -
‘జగన్ కోసం సిద్ధం’ బస్సులను ప్రారంభించిన వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: ‘జగన్ కోసం సిద్ధం’ బస్సులను వైఎస్సార్సీపీ ప్రారంభించింది. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, జగన్ కోసం సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.వేరే దేశాలలో ఉన్న ఎన్నారైలు ఏపీకి వచ్చి పని చేయడం హ్యాపీగా ఉందని.. జగన్ గెలుపు మన ఇంట్లో గెలుపులా మహిళలు సైతం భావిస్తున్నారని సజ్జల అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ఉంటుందన్న ఆయన... చేసిన మంచి గురించి ప్రజలకు వివరించటం చాలా మంచి పరిణామన్నారు.పార్టీ, జగన్ తరపున ఎన్నారైలకు కృతజ్ఞతలు. టీడీపీ వికృత చేష్టలు పెరిగాయి. కోమటి జయరాం అనే టీడీపీ అహంకారి నోట్లతో ఓట్ల కొనాలనటం సిగ్గు చేటు. రాజకీయం అంటే డబ్బు కాదు, ప్రజలకు మంచి చేయడం. లీడర్ని బట్టి కార్యకర్తలు ఉంటారు. ప్రజల కోసం వైసీపీ ఎన్నారై లు వస్తే.. డబ్బులు పంచడం కోసం టీడీపీ ఎన్నారైలు వచ్చారు. సమాజంలో మార్పు ప్రజలకు చెప్పాలని వైసీపీ ఎన్నారై టీమ్ పనిచేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 4 బస్సులతో స్టార్ క్యాంపైనర్స్ ప్రచారం చేస్తారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. -
చంద్రబాబు మేనిఫెస్టో అబద్దాల పుట్ట: సజ్జల
సాక్షి, గుంటూరు: బాబు కూటమిలో అన్ని సాధ్యం కాని హామీలేనని.. చేయగలిగినవి మాత్రమే సీఎం జగన్ మేనిఫెస్టోలో పెట్టారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాడేల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అబద్దాల పుట్ట అని ప్రజలకు తెలుసు.. వైఎస్సార్సీపీ బాధ్యతాయుతమైన పార్టీగా వ్యవహరిస్తోందన్నారు.‘‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని అమలు చేయగలిగినవే చెప్పాం. కోవిడ్ సమయంలో ఆ రెండేళ్లు కూడా ఆగకుండా సంక్షేమం అమలు చేశాం. జగన్ అమలు చేస్తున్న సంక్షేమంతో రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు అన్నారు. ఇప్పుడేమో మళ్ళీ అడ్డగోలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటున్నారు. గతంలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి నిలువునా మోసం చేశారు. నిరుద్యోగులకు రూ.3 వేలు, రైతులకు రూ.20 వేలు సహాయం అని మేనిఫెస్టోలో పెట్టారు. కానీ అర్హత ఏంటో చెప్పలేదు. అంటే అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా? లేదా?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.1999లో కూడా కోటి మందికి ఉపాధి అని హామీ ఇచ్చారు. కానీ అమలు చేయకుండా ఎగనామం పెట్టారు. చంద్రబాబు హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వెయ్యి రూపాయలు చేశారు. అది కూడా సరిగా ఇచ్చారా అంటే అదీ లేదు. వృద్దులు, వికలాంగులకు ఏ ఇబ్బందీ లేకుండా జగన్ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేశారు. ఇప్పుడు కోర్టుకు వెళ్లి, ఈసీకి ఫిర్యాదు చేసి వాలంటీర్లను అడ్డుకున్నారు. చివరికి బ్యాంకులో పెన్షన్లు వేసేలా ఈసీ ద్వారా చేయించారు. బ్యాంకుల దగ్గర పెన్షన్దారులు పడుతున్న ఇబ్బందులు చూస్తే బాధ కలుగుతోంది’’ అని సజ్జల ఆవేదన వ్యక్తం చేశారు.‘‘చంద్రబాబు పొరపాటున అధికారంలోకి వస్తే ఎలాంటి నరకం ఉంటుందో ముందే కనపడుతోంది. వృద్దులు, వికలాంగుల కష్టాలకు పూర్తి పాపం చంద్రబాబుదే. వాలంటీర్ల వ్యవస్థను తొలగించి మళ్ళీ జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేస్తారు. 2019లో ప్రజలు చిత్తుగా ఓడించారన్న కోపం చంద్రబాబుకు ఉంది. అందుకే వారి జీవితాలతో చెలగాటమాడటానికి సిద్ధం అయ్యారు. కూటమి మేనిఫెస్టోలో బీజేపీ ఫోటోలు ఎందుకు లేవు. అంటరానితనంగా ఎందుకు వ్యవహరించారు?. సిక్కిం, అరుణాచలప్రదేశ్ లో కూటమి మేనిఫెస్టోలో మరి బీజేపీ, మోదీ బొమ్మలు ఎందుకు ఉన్నాయి?’’ అని సజ్జల ప్రశ్నించారు.‘‘చంద్రబాబు హామీలు అమలు చేసేలా లేవని బీజేపీకి అర్థం అయింది. అందుకే చంద్రబాబు మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ తేల్చి చెప్పింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద చంద్రబాబు విపరీతంగా అబద్దాలను ప్రచారం చేస్తున్నారు. ఆ యాక్టును బీజేపీ కేంద్ర ప్రభుత్వమే అమలు చేయాలని చూస్తోంది. ఆ చట్టం మీద అనుమానాలు ఉంటే దానికి బాధ్యత బీజేపీదే. తప్పుడు ప్రచారాలు చేసే చంద్రబాబు అసలు రాజకీయాలకే అనర్హుడు. చంద్రబాబు మేనిఫెస్టో బూతుపత్రం. ల్యాండ్ టైటిల్ యాక్టు మీద బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలి. బీజేపి రాష్ట్ర నాయకులు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?. చంద్రబాబు లెక్క ప్రకారం దేశంలోని భూములన్నీ మోదీ అమ్ముకుంటున్నారా?. దీనిపై బీజేపీ రాష్ట్ర, జాతీయ నేతలు క్లారిటీ ఇవ్వాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
అదిరే..అదిరే మాధురి స్టయిలే అదిరే!
తప్పక చదవండి
- కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
Advertisement