-
వారిది వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
భోపాల్: దళిత మహిళ గురించి మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ జీతూ పట్వారీ చేసిన వ్యాఖ్యపైన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్కు మహిళలను గౌరవించడం తెలియదని, ఆ పార్టీకి ఉపయోగించుకుని వదిలేసే అలవాటు ఉందని అన్నారు.కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జీతూ పట్వారీ.. ఇమర్తి దేవిపై పట్వారీ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు ఇలాంటి నీచమైన పదాలు ఉపయోగిస్తారని నేను కలలో కూడా ఊహించలేదు. ఇలాంటి పదాలు ఏ మహిళపై ఉపయోగించకూడదని సింధియా అన్నారు. ఇమర్తి దేవి 2020 మార్చిలో సింధియాతో కలిసి బీజేపీలో చేరారు.పార్టీ కార్యకర్తలను, గిరిజన ప్రజలను, మహిళలను ఇలా ఎవరినైనా అవసరమున్నంత వరకు వాడుకుని, ఆ తర్వాత వదిలేయడం కాంగ్రెస్ పార్టీకి బాగా అలవాటని సింధియా మండిపడ్డారు. కాంగ్రెస్ ఎప్పుడూ తమపై దాడులు చేస్తూనే ఉంటుంది.. ఎప్పుడూ తమ విజయం తధ్యమని చెబుతుంది. చివరి ఫలితాలు తారుమారు అవుతాయని చెప్పుకొచ్చారు. మధ్యప్రదేశ్లోని మొత్తం 29 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని సింధియా పేర్కొన్నారు. -
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆమ్ఆద్మీపార్టీ శనివారం(మే4)విడుదల చేసింది. ఈ లిస్టులో 40 మంది స్టార్ క్యాంపెయినర్ల పేర్లను చేర్చింది.ప్రస్తుతం జైలులో ఉన్న ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా జైలులో ఉన్న మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేందర్జైన్ పేర్లను లిస్టులో చేర్చడం గమనార్హం. వీరితో పాటు కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్మాన్ సింగ్ ఎంపీలు రాఘవ్చద్దా, సందీప్పాఠక్ ఢిల్లీ మంత్రులు, అతిశీ, సౌరభ్ భరద్వాజ్, గోపాల్రాయ్ తదితరులను స్టార్ క్యాంపెయినర్లుగా ఆప్ ప్రకటించింది. -
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
సాక్షి, విజయవాడ: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వ్యవస్థల మీద నమ్మకం పోయేవిధంగా వ్యవరిస్తున్నారన్నారు. ‘‘ప్రభుత్వాధినేత భూములు మింగేస్తారని చెప్పడం దేనికి సంకేతం’’ అంటూ టీడీపీపై ధ్వజమెత్తారు.అధికారంలోకి రావాలి అనుకున్నప్పుడు చేయాల్సిన విమర్శలు ఇవేనా?. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా?. అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ చట్టం తెచ్చారు. ఇంకా గజిట్ అవ్వలేదు చట్టం అమలు అవ్వలేదు. విధి విధానాలు ఖరారు అవ్వలేదు. ఎన్నికల కోసం ఈ రకంగా ప్రచారం చేస్తారా?’’ అంటూ సజ్జల మండిపడ్డారు.భూ అక్రమాలకు చెక్ పెట్టడం కోసమే చట్టం ఉద్దేశం. చట్టం తేవడం ఒక విప్లవాత్మక మార్పు. ల్యాండ్ గ్రాబింగ్ చేసింది టీడీపీ. టీడీపీ ప్రభుత్వంలో వెబ్ ల్యాండ్ పేరుతో చంద్రబాబు భూముల అక్రమాలకు పాల్పడ్డారు. వెబ్ ల్యాండ్ పోర్టల్లో మార్పులు చేసి ఎంతో మంది భూములను ఇబ్బందులోకి నెట్టారు. సీఆర్డీఏ పరిధిలోని భూములను డీమ్డ్ మ్యుటేషన్ పేరుతో అక్రమాలకు చంద్రబాబు పాల్పడ్డారు. సాదా బైనామా పేరుతో భూములు కొల్లగొట్టారు. అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారు. అరాచకానికి అడ్డుకట్ట వేసేందుకు జగన్ అడుగులు వేస్తున్నారు’’ అని సజ్జల పేర్కొన్నారు.తన అనుయాయులకు భూములు చంద్రబాబు కట్టబెట్టారు. లీజులకు తీసుకోవడం వాటిని కొల్లగొట్టడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది. కబ్జాలకు అలవాటు పడిన వాళ్లకి సంస్కరణలు నచ్చవు. సమగ్ర భూ సర్వే పూర్తి అయ్యాక భూముల రక్షణ విషయంలో పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. కబ్జాలు,అక్రమాలు, అన్యాయాలకు అడ్డుకట్ట పడుతుందని చంద్రబాబు భయపడుతున్నారు’’ అని సజ్జల చెప్పారు.‘‘భూముల వివరాలను ఏ కంపెనీకి ఇస్తున్నాం. అర్థరహితమైన ఆరోపణలు చేస్తారా. 190 దేశాల్లో భూముల వివాదాలపై సర్వే చేస్తే 154 స్థానంలో ఉన్నాం. కన్నాలు వేసే వాళ్లకి ఇటువంటి చర్యలు నచ్చవు. భూ సంస్కరణలు అమలు చేస్తుంటే చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆరు వేల గ్రామాల్లో భూముల రీ సర్వే పూర్తి అయ్యింది. రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తే దానికి అడ్డుపడుతున్నారు.’’ అని సజ్జల నిప్పులు చెరిగారు.‘‘చంద్రబాబు హయాంలో స్టాంప్స్ కుంభకోణాలకు పాల్పడ్డారు. పాస్ పుస్తకాలను డిజిటలైజ్ చేశాం. పుస్తకాలపై సీఎం జగన్ ఫోటో వస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి?. రాష్ట్ర ప్రజలకు లేని సమస్య చంద్రబాబుకు మాత్రమే వచ్చిందా?. ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేస్తానని చంద్రబాబు అంటే మాత్రం కచ్చితంగా శిక్షించాల్సిందే. సమగ్ర భూ సర్వే పూర్తి అయ్యాక మాత్రమే ఈ చట్టం అమలవుతుంది. ఇదే విషయాన్ని కోర్టుకు తెలిపాం. చట్టం అమలు అవ్వాలంటే మరో రెండు నుంచి మూడేళ్లు పడుతుంది’’ సజ్జల వివరించారు.‘‘కోవిడ్ వైరస్ కంటే చంద్రబాబు ముఠా ప్రమాదకరం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీపై ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నాం. ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలను బట్టి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి’’ అని సజ్జల పేర్కొన్నారు. -
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రాంచీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ 2024 ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో భాగంగానే మోదీ జార్ఖండ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతి రహిత పాలన సాగించానని అన్నారు.గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న 15 ఏళ్ల కాలంలో.. ప్రధానమంత్రిగా కొనసాగిన 10 సంవత్సరాల కాలంలో కూడా నాపైన ఒక్క రూపాయి అవినీతి ఆరోపణ కూడా లేదని మోదీ స్పష్టం చేశారు. నా తల్లి, సోదరీమణులు దూరంగా ఉన్నాను. నాకు ఆనందం ముఖ్యం కాదు, ప్రజలు నా మీద ఉంచిన విశ్వాసమే ముఖ్యమని అన్నారు.500 ఏళ్ల తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం , జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు ముఖ్యమైన మైలురాళ్లుగా పేర్కొంటూ, తన నాయకత్వంలో భారతదేశం సాధించిన అద్భుతమైన పురోగతిని ప్రధాని నొక్కిచెప్పారు. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా ముందుకు సాగుతుందని అన్నారు.కాంగ్రెస్ కూటమి నాయకుల అవినీతి విధానాలను మోదీ ఖండించారు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం తన దార్శనికతతో వారి స్వయంసేవ ఉద్దేశాలను విభేదించారు. జేఎంఎం, కాంగ్రెస్ నేతలు అవినీతితో అపారమైన సంపదను కూడబెట్టుకున్నారని ప్రధాని ఆరోపించారు.మోడీ ఒక లక్ష్యం కోసం పుట్టారు.. జేఎంఎం-కాంగ్రెస్ నేతలు అవినీతితో అపారమైన సంపదను కూడబెట్టారు. నాకు సైకిల్ కూడా లేదు. కానీ వారు తమ పిల్లలకు కూడా వారసత్వంగా ఎన్నో సమకూర్చారు. కానీ మీరంతా నా వారసులు. మీ పిల్లలు, మనవరాళ్లకు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ఇవ్వాలనుకుంటున్నానని అన్నారు.పేద, అట్టడుగు వర్గాలకు చెందిన వారి జీవితాలపై ప్రభుత్వ పథకాల పరివర్తన ప్రభావాన్ని ప్రధాన మంత్రి వివరించారు. గత 10 సంవత్సరాలలో.. మీకు ఇల్లు, విద్యుత్, గ్యాస్, నీరు అన్నీ బీజేపీ ప్రభుత్వం అందించిందని మోదీ అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమ మద్దతును కొనసాగించాలని.. అభివృద్ధి, పురోగతి కోసం ప్రజలకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. -
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
సాక్షి, విజయవాడ: టీడీపీపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. కొద్దిరోజులుగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా టీడీపీ నిరాధార ఆరోపణలు చేస్తోంది. దీనిపై ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం.. విచారణకు సీఐడీని ఆదేశించింది. తక్షణమే నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.మా ఫిర్యాదుపై ఈసీ స్పందించింది: ఎమ్మెల్యే మల్లాది విష్ణుమార్కాపురం, ఒంగోలు సభల్లో సీఎం జగన్పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబుకు జగన్పై అసూయ తారా స్థాయికి చేరిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై బాబు అండ్ కో విషం చిమ్ముతోంది. ఐటీడీపీ సైట్లో విష ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ విలువలు, విశ్వసనీయత కోల్పోయారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఐవీఆర్ఎల్ సర్వేలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మా ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. చర్యలకు సీఐడీకి సిఫారసు చేసింది. చంద్రబాబు, పవన్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి’’ అని విష్ణు కోరారు.ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బాబు, పవన్ దుష్ప్రచారం: మనోహర్ రెడ్డిల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేస్తున్న విషప్రచారంపై ఈసీకి ఫిర్యాదు చేశామని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేస్తున్నారు. భూ వివాదాల పరిష్కారం కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై మోదీ సభలో మాట్లాడే ధైర్యం బాబు, పవన్లకు ఉందా?. అబద్దాల ప్రచారానికి టీడీపీకి ఓ యూనివర్సిటీ నే ఉంది’’ అని మనోహర్రెడ్డి వ్యాఖ్యానించారు.కాగా, అమల్లో లేని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి తెలుగుదేశం పార్టీ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారం చేస్తోంది. ఓటర్లను తప్పుదారి పట్టిస్తోంది. ఇది ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కు విరుద్ధం. టీడీపీపై తగిన చర్యలు తీసుకోండి’ అని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్కుమార్ మీనాకు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు ఎ.నారాయణమూర్తి, న్యాయవాది కె.శ్రీనివాసరెడ్డిలు ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదుతో పాటు తగిన ఆధారాలను అందజేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement