-
బాబు మట్టికొట్టుకు పోతాడు
25 కిలోమీటర్లు బస్సులో వచ్చాను. వెంకటగిరి నుంచి వచ్చే బస్సులో సీటు దొరకలేదు. ముచ్చేలి వరకు నిలబడి వచ్చి అక్కడి నుంచి కూర్చున్నాను. కాళ్లు పడిపోతున్నాయి. తర్వాత ఆటో ఎక్కి బ్యాంకు వద్దకు చేరుకున్నాను. ఆయాసం, ఎండ నీరసం కలిగింది. రూ.20 పెట్టి నీళ్లు సీసా కొనుక్కుని బ్యాంకులో ఉన్న లైన్లో కూర్చున్నాను. ఎపుడు ఇస్తారో తెలియదు. గతంలో వలంటీర్లు మా ఇంటికి వచ్చి తలుపుతట్టి 4గంటలకే పింఛన్ ఇచ్చేవారు. మందులు కొనుక్కునే దాన్ని. కొడుకులు, కోడళ్లు పెట్టకపోయినా జగన్ పుణ్యమా అని పింఛన్ సొమ్ముతో సంతోషంగా జీవించేదాన్ని. ఇప్పుడు చంద్రబాబు కారణంగా ఈ కష్టాలు పడాల్సి వస్తోంది. బాబూ..నువ్వు మట్టికొట్టుకుపోతావు. – కుప్పమ్మ, ఇలగనూరు, శ్రీకాళహస్తి మండలం పింఛన్ కోసం ఆపసోపాలు కనపర్తి గ్రామం నుంచి ఆటో ఎక్కి పాతబస్టాండు వద్ద దిగి అక్కడి నుంచి బ్యాంక్కు వెళ్లేందుకు ఆటోను అడిగితే రూ.20 ఇవ్వమన్నారు. కిలోమీటరు మేర నడుచుకుంటూ బ్యాంకు వద్దకు చేరుకున్నా. పింఛన్ ఎప్పుడు ఇస్తారో తెలియదు. క్యూ పెద్దదిగా ఉంది. నాలుగేళ్లు వలంటీర్లు తలుపుతట్టి మరీ పింఛన్ డబ్బులు చేతిలో పెట్టి వెళ్లారు. చంద్రబాబు దుష్టబుద్ధితో మాకు ఈ ప్రయాస మిగిల్చారు. – రామమ్మ, కనపర్తి గ్రామం, తొట్టంబేడు -
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. 19 రోజుల పాటు ఈ ఉత్సవం జరగనుంది. మే 12న భాష్యకార్ల సాత్తుమొర నిర్వహించనున్నారు. భగవద్ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి ‘శ్రీభాష్యం’ పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా పేరొందారు. శ్రీరామానుజులవారు జన్మించిన ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాదీ శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల సాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. భాష్యకారుల ఉత్సవాల మొదటి రోజు శుక్రవారం ఉదయం శ్రీవారి ఆలయంలో మొదటి గంట అనంతరం శ్రీ రామానుజులవారిని బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా జీయ్యంగార్లు దివ్యప్రబంధ గోష్టి చేపట్టారు. తిరుమల పెద్ద జీయర్స్వామి, చిన్న జీయర్స్వామి పాల్గొన్నారు. – తిరుమల -
మాపై ఎందుకంత కక్ష
ప్రతి నెలా ఒకటో తేదీన వలంటీర్ దగ్గర హాయిగా పింఛన్ డబ్బులు తీసుకునే వాళ్లం. వలంటీరే వచ్చి మా పింఛన్ నగదును ఇచ్చే వారు. అవ్వా పింఛన్ డబ్బులు తీసుకో అంటూ పైసా కూడా తీసుకోకుండానే మా పింఛన్ రూ.3 వేలు ఇచ్చి వెళ్లేవారు. పింఛన్ డబ్బులు తీసుకోవాలంటే ఎలాంటి బాధలు పడేవాళ్లం కాదు. ఎలక్షన్ రాగానే చంద్రబాబుకు కడుపుబ్బి పోయింది. వలంటీర్లు పింఛన్ ఇవ్వకూడదని అడ్డు తగిలారు. వలంటీర్లు ఎక్కడ తిరగకుండా చేశాడు. ఇప్పుడు పింఛన్ నగదు తీసుకోవాలంటే దేవుడు కనపడుతున్నాడు. బ్యాంకు వద్దకు వెళ్లిన తర్వాత రెండు గంటల పాటు క్యూలో ఉండి పింఛన్ నగదును తీసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. మా ఉసురు తప్పక తగులుతుంది. – కే.సుబ్బమ్మ, గుండవోలు గ్రామం, రాపూరు మండలం ఈ తిప్పలు మాకొద్దు ఒకటో తేదీ వచ్చిదంటే తెల్లవారు జామునే ఇంటి తలుపు తట్టి పెన్షన్ సొమ్ము ఇచ్చే వలంటీర్లను తీసేశారు. ఇప్పుడు బ్యాంకు వద్దకు వెళ్లితే ఆ జనాన్ని చూస్తే భయమేస్తోంది. ఆ క్యూలో నిలుచుకునే ఓపిక కూడా లేదు. మాలాంటి నిరుపేదలను కష్టపెట్టేవారికి మా గోడు తప్పక తగలుతుంది బాబు. చంద్రబాబూ.. మాపై ఎందుకు ఇంత కోపం?. – ఎం.రమణమ్మ, రాపూరు కాళ్లీడ్చుకుంటూ వచ్చా గత రెండు నెలలుగా కాళ్లు, చేతులు నొప్పులతో బాధపడుతున్నా. మనిషి లేందే బయటకు రాలేను. గతంలో వలంటీరు పింఛన్ డబ్బులు ఇంటికి తెచ్చిచ్చేవాడు. నేను డబ్బులిచ్చి మాత్రలు కావాలన్నా తెచ్చిచ్చేవాడు. ఫోన్ చేసి ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించి వెళ్లేవాడు. ఇప్పుడు వాళ్లను తీసేసేకాడికి నా పరిస్థితి దారుణంగా మారింది. ఆటోకు రూ.100 పెట్టుకుని బ్యాంక్ వద్దకు వచ్చాను. మరో రూ.100 ఉంటే కానీ ఇంటికి వెళ్లలేను. బ్యాంకులో వారిని వీరిని అడుక్కుని మెట్లెక్కి లోపలకు వచ్చాను. వృద్ధాప్యంతో మేము ఈ బాధలు పడుతుంటే ఎన్నికల ముందు చంద్రబాబు మమ్మల్ని ఈ విధంగా కష్టాలపాలు చేశాడు. – తిరుమలమ్మ, తెట్టు, శ్రీకాళహస్తి ఈ పాపం ఊరికే పోదు వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు అందించే పింఛన్ పంపిణీని అడుగడుగునా అడ్డుకుంటున్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి వార్డు వలంటీర్లను అడ్డుకున్న చంద్రబాబు, పవన్కళ్యాణ్కు పుట్టగతులు ఉండవు. ఎండల్లో వ్యయప్రయాసలకోర్చి పింఛన్ల కోసం పరుగులు పెట్టే పరిస్థితులను తెచ్చిన వారు ఈ పాపాలను అనుభవించక తప్పదు. బ్యాంకులో పింఛన్ పడి రెండు రోజులు అవుతున్నా ఇప్పటివరకు తెచ్చుకోలేకపోయాను. ఎండలు ఓ కారణం అయితే దూరంగా ఉన్న బ్యాంకుకు వెళ్లడానికి నాకు అవకాశం లేకుండా పోయింది. ఆటోలో వెళ్లి రావడానికి రూ.300 వరకు ఖర్చు పెట్టాలి. గడిచిన ఐదేళ్లు గౌరవంగా వలంటీర్లు ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చి ఆదరించేవారు. ఆ పరిస్థితులను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. – రమణమ్మ, తిరుపతి ● -
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
పెళ్లకూరు: పేదల అభ్యున్నతే ధ్యేయంగా సంక్షేమ పాలన సాగించిన జగనన్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని తిరుపతి ఎంపీ అభ్యర్థి మద్దిల గురుమూర్తి ప్రజలను అభ్యర్థించారు. శుక్రవారం సూళ్లూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డితో కలిసి మండలంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న సుపరిపాలనతో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి ఎంపీగా తనను, ఎమ్మెల్యేగా కిలివేటి సత్యనారాయణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. నాయకులు ప్రద్యుమ్న కుమార్రెడ్డి, వెంకటరత్నం, చక్రపాణి, రఘునాయుడు, అమరేంద్రరెడ్డి, బాబురెడ్డి, వినోద్కుమార్రెడ్డి, వీరకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
No Headline
ఇదివరకు ఒకటో తేదీ వస్తే పండుగ వచ్చినట్టుండేదని అవ్వాతాతలు చెబుతున్నారు. వలంటీర్ ఇంటికి వచ్చి ఆత్మీయంగా పలకరిస్తే ఆనందంగా అనిపించేదని.. చేతికి పింఛన్ సొమ్ము అందగానే ప్రాణం లేచి వచ్చేదని వెల్లడిస్తున్నారు. కనీస అవసరాలు తీర్చుకునేందుకు ఎవరిపై ఆధారపడాల్సిన పనిలేదు అనే ధైర్యం వచ్చేదని తెలియజేస్తున్నారు.. ఇలా సాఫీగా సాగిపోతున్న మా జీవితాలను చంద్రబాబు కష్టాల కడలిలోకి నెట్టేశారని ఆవేదన చెందుతున్నారు. పింఛన్ నగదు కోసం బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితిని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండే ఎండల్లో తిరగలేక ప్రాణం పోయేలా ఉందని వాపోతున్నారు. ఇంతగా తమపై కక్షగట్టడం ధర్మం కాదని.. తమ ఉసురు తప్పక తగులుతుందని శాపనార్థాలు పెడుతున్నారు. – సాక్షి నెట్వర్క్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement