-
మరోసారి పీఠమెక్కేదెవరో..?
సాక్షి, మహబూబాబాద్: మానుకోట పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు గతంలో ఎంపీగా గెలిచిన వారే. ఇందులో ఏ ఇద్దరిని చూసినా ఒకే పార్టీలో పనిచేసిన పరిచయాలు ఉన్నాయి. గతంలో పనిచేసిన అనుభవానికి.. ప్రస్తుత పార్టీల చరిష్మాతో ఎవరికి వారుగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ముగ్గురు సమర్థులే కావడంతో.. ఎంపీ పీఠం మళ్లీ ఎవరికి దక్కుతుందో అనేది పార్లమెంట్ పరిధిలో చర్చగా మారింది.ముగ్గురు ముగ్గురే..2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన బలరాంనాయక్ సమీప అభ్యర్థి కుంజ శ్రీనివాసరావుపై 68,957ఓట్ల మెజార్టీతో గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టారు. కేంద్ర కేబినెట్లో సహాయ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన సీతారాంనాయక్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్పై 34,992 ఓట్ల మెజార్టీతో గెలిచారు.ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మాలోత్ కవిత బలరాంనాయక్పై 1,46,663ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు అదే పార్టీ నుంచి మరోసారి బరిలో నిలిచారు. ఇందులో కవిత, సీతారాంనాయక్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందగా.. వారిద్దరి చేతిలో బలరాంనాయక్ ఓటమిపాలవ్వడం గమనార్హం.ఒకరి ఓట్లకు మరొకరు గాలం..మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు పాత వారే కావడంతో.. వారు పోటీ చేస్తున్న పార్టీతో పాటు.. ఇతర పార్టీల్లోని ఓటర్లకు గాల వేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్న కవిత.. 2009లో కాంగ్రెస్ నుంచి మహబూబాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసి బీఆర్ఎస్ నాయకుడు శంకర్నాయక్ చేతిలో ఓడిపోయారు. తర్వాత కవిత బీఆర్ఎస్లో చేరి ఎంపీగా గెలిచారు.కాగా మాజీ ఎమ్మెల్యే శంకర్నాయక్కు కవితకు మధ్య వైరం కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే కవిత వర్గీయుల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా ప్రస్తుతం ఆమె పోటీలో ఉండడంతో కాంగ్రెస్ ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన రెడ్యానాయక్కు కవిత కూతురు కావడం.. ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులతో ఉన్న పాత పరిచయాలు కూడా ఇప్పుడు కవితకు ఓటు బ్యాంకుగా మారే అవకాశం లేకపోలేదు.అదేవిధంగా ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న సీతారాంనాయక్ తెలంగాణ ఉద్యమకారుడిగా.. గిరిజన సామాజిక వర్గం నుంచి మేధావిగా గుర్తింపు పొందారు. ఈమేరకు 2014లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. కాగా ఎన్నికల వరకు బీఆర్ఎస్లో ఉన్న సీతారాంనాయక్కు మానుకోట పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిచయాలు ఉన్నారు. ఇప్పుడు ఆయన వారి వద్దకు వెళ్లి మద్దతు ఇవ్వాలని కోరుతూ.. బీఆర్ఎస్ ఓట్లకు గండి పెడుతున్నారు. ఇక బలరాంనాయక్కు అధికార పార్టీ ఎమ్మెల్యేలే అతిపెద్ద బలం.ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఆయన గెలుపును ఎమ్మెల్యేలు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో వచ్చే మెజార్టీతోనే అధినాయకుడి వద్ద మార్కులు పొందే అవకాశం ఉంది. ఇందుకోసం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఓటర్లతోపాటు.. బీఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఆ పార్టీ ఓటర్లను తమ వైపు తిప్పుకుంటున్నారు. ఇలా ముగ్గురు అభ్యర్థులు ప్రత్యర్థి పార్టీల ఓట్లను చీల్చే అవకాశం ఉంది. -
హిస్టరీ హెచ్ఓడీ రాజీనామా!
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ హిస్టరీ విభాగం అధిపతిగా తాను బాధ్యతలు నిర్వర్తించబోనని ప్రొఫెసర్ టి.మనోహర్ రాజీనామా చేశారు. ఈ మేరకు గురువారం కేయూ రిజిస్ట్రార్ ఆచార్య పి.మల్లారెడ్డికి లేఖ అందజేసినట్లు సమాచారం. హిస్టరీ విభాగంలో ఒకే ఒక్క రెగ్యులర్ ప్రొఫెసర్గా టి.మనోహర్ మాత్రమే ఉన్నారు. పలువురు కాంట్రాక్టు, పార్ట్టైం లెక్చరర్లు ఉన్నారు. మనోహర్ సోషల్ సైన్స్ డీన్ గాను, హిస్టరీ విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ విభాగంలో నాల్గోసెమిస్టర్ విద్యార్థులకు అటెండెన్స్ ఇచ్చే విషయంలో వివాదం తలెత్తినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఆచార్య మనోహర్ రాజీనామా చేయడంతో యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. అయితే కొన్నినెలల క్రితం కూడా ఆచార్య మనోహర్ విభాగాధిపతి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు రాజీనామా లేఖను అప్పటి రిజిస్ట్రార్కు అందజేశారు. కానీ ఆమోదించకపోవడంతో మళ్లీ ఆయనే కొనసాగుతున్నారు. ప్రొఫెసర్ టి.మనోహర్ తప్పుకుంటే ఇక కాంట్రాక్టు లెక్చరర్లలో సీనియర్ కాంట్రాక్టు లెక్చరర్ను విభాగాధిపతిగా నియమించాల్సి ఉంటుంది. -
చిరు వ్యాపారుల మధ్య ఘర్షణ
మహబూబాబాద్: కూరగాయల మార్కెట్లో కూరగాయలు, ఇతర వస్తువులు విక్రయించే చిరు వ్యాపారుల మధ్య గుమ్చీల ఏర్పాటు విషయంలో శుక్రవారం ఘర్షణ జరిగింది. జిల్లా కేంద్రంలో మోడల్ మార్కెట్ నిర్మాణం చేసి వ్యాపారులకు గదులు కేటాయించారు. అయితే వ్యాపారులు షాపులను ఏర్పాటు చేసుకోకుండా తాత్కాలికంగా గాంధీపార్క్లో ఏర్పాటు చేసిన షాపుల్లోనే కూరగాయలు విక్రయిస్తున్నారు. కాగా మార్కెట్కు సంబంధించిన కొంత మంది గురువారం రాత్రి మోడల్ మార్కెట్ ఎదుట రెండు గుమ్చీలను ఏర్పాటు చేశారు. దీంతో ఇతర వ్యాపారులు గుమ్చీలను ఎలా ఏర్పాటు చేస్తారని వారితో వాగ్వాదం చేశారు. గుమ్చీలను రోడ్డుపై పడేశారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ నోముల రవీందర్కు ఫిర్యాదు చేశారు. వెంటనే మున్సిపల్ సిబ్బందితో చేరుకొని జేసీబీతో గుమ్చీలను తొలగించే క్రమంలో అవి పూర్తిగా దెబ్బతిన్నాయి. కాగా ఎట్టి పరిస్థితుల్లో మోడల్ మార్కెట్ ఎదుట గుమ్చీలను ఏర్పాటు చేయవద్దని వ్యాపారులు కోరారు. -
అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పూర్తి చేయాలి
కురవి: అమ్మ ఆదర్శ పాఠశాలల్లో కేటాయించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డీఈఓ రామారావు హెచ్ఎంలను ఆదేశించారు. శుక్రవారం సీరోలు మండల కేంద్రం శివారు రేకులతండాలోని డీఎన్టీపీఎస్ పాఠశాలను పరిశీలించారు. ఆదర్శ పాఠశాలలుగా ఎంపికై న స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు వెంటనే పనులు పూర్తి చేయాలన్నారు. ఈనెల 10వ తేదీలోగా పనులు పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట ఎంఈఓ పూల్చంద్, ఏఏపీసీ స్పెషల్ ఆఫీసర్ శ్రీనాథ్ పాల్గొన్నారు. పీహెచ్సీ సందర్శన కేసముద్రం: మండల కేంద్రంలోని పీహెచ్సీ, పెనుగొండ, ఉప్పరపల్లి సబ్సెంటర్లను డిప్యూటీ డీఎంహెచ్ఓ అంబరీష శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. గిరిజన ప్రాంతాల్లో ఎనిమియా(రక్తహీనత)పై చేపట్టిన సర్వే వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీలను పెంచాలని, సమయపాలన పాటించాలని ఆయన వైద్య సిబ్బందిని ఆదేశించారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో సీహెచ్ఓ కృష్ణార్జున, మెడికల్ ఆఫీసర్ నందికిషోర్, సూపర్వైజర్ జనార్దనాచారి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతిని కలిసిన హుస్సేన్ నాయక్ మహబూబాబాద్ అర్బన్: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్నాయక్ రాష్ట్రపతి ద్రౌపదిముర్మును శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం గిరిజనాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తోందన్నారు. బీజేపీ గిరిజనులు, ఆదివాసీలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని, దీనికి నిదర్శనమే ఎస్టీ సామాజిక వ ర్గానికి చెందిన ద్రౌపదిముర్ము రాష్ట్రపతి కావడమని కొనియాడారు. ఎస్టీ కమిషన్ నిధులతోనే గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలు వాయిదా మహబూబాబాద్ అర్బన్: జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలు వాయిదా పడినట్లు జెడ్పీ ఇన్చార్జ్ సీఈఓ నర్మద శుక్రవారం తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలు వాయిదా వేశామని, జిల్లా అధికారులు, జెడ్పీ సభ్యులు, ప్రజాప్రతినిధులు గమనించాలన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత సమావేశాలు నిర్వహిస్తామన్నారు. డిమాండ్ ఉన్న పంటలు సాగుచేయాలి మహబూబాబాద్ రూరల్: మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగుచేయాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖల అధికారి జినుగు మరియన్న అన్నారు. జిల్లాలోని పలు ఆయిల్పామ్ తోటలను శుక్రవారం ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయి ల్ పామ్ రైతులకు వేసవి యాజమాన్యం, కలు పు యాజమాన్యం, పచ్చిరొట్ట ఎరువులు, అంతర పంటలు, ఎరువుల వాడకం, పలు సాంకేతిక సలహాలు, సూచనలు చేశారు. ఆయిల్ పామ్ తోటలను కాపాడుకోవాలని, నూతన రైతులు పంట మార్పిడి చేసి డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ అధికారి నాగరాజు, రైతులు పుల్లయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
అంతరాయం లేకుండా విద్యుత్ అందించాలి
గూడూరు: వేసవిలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని జిల్లా విద్యుత్ పర్యవేక్షణ అధికారి నరేష్ అన్నారు. మండల కేంద్రంలోని 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్కు శుక్రవారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది విధులు నిర్వహించే రిజిస్టర్, విద్యుత్ అంతరాయ సమయ నమోదు రిజిస్టర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న వానాకాలం దృష్ట్యా ఈ నెల 15వ తేదీ అనంతరం ఫీడర్ మెయింటనెన్స్ పనుల ప్రణాళిక రూపొందించుకోవాలని ఏఈ ప్రణీత్కు ఆయన సూచించారు. మార్కెట్కు పోటెత్తిన ధాన్యం కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు శుక్రవారం ధాన్యం పోటెత్తింది. ఇటీవల ధాన్యం సీజన్ ప్రారంభం కాగా, 19వేలకు పైగా ధాన్యం బస్తాలు అమ్మకానికి వచ్చాయి. దీంతో షెడ్లు నిండిపోగా, ఓపెన్యార్డులో ధాన్యాన్ని రాశులుగా పోసుకున్నారు. టెండర్లు ఆలస్యం కావడంతో సాయంత్రం కాంటాలు, తొలకాలు ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు రైతులు రాశుల వద్ద పడిగాపులు పడ్డారు. కాగా, క్వింటా ధాన్యానికి గరిష్ట ధర రూ.2,256, కనిష్ట ధర రూ.1,850 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement