-
తనిఖీలు ముమ్మరం చేయాలి
సూర్యాపేట: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో చెక్పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి వెంకటరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అదనపు కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, అదనపు ఎస్పీ నాగేశ్వరరావుతో కలిసి నిర్వహించిన జిల్లా ఇంటెలిజెన్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంకర్లు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరిగే డిజిటల్ లావాదేవీలు, బ్యాంకు లావాదేవీలపై నిఘా ఉంచాలన్నారు. చెక్పోస్టుల వద్ద తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్న వాటికి తప్పకుండా రశీదు అందజేయాలని సూచించారు. జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పకడ్బందీగా అమలు చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ అప్పారావు, ఎకై ్సజ్ పర్యవేక్షకులు లక్ష్మానాయక్, డీఎఫ్ఓ సతీష్ కుమార్, ఇన్కంటాక్స్ అధికారి, డీసీఓ పద్మ, ఎలక్షన్ విభాగం పర్యవేక్షకుడు శ్రీనివాసరాజు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన జూనియర్ సివిల్ జడ్జి తుంగతుర్తి: తుంగతుర్తి జూనియర్ సివిల్ జడ్జిగా ఫర్హీన్ కౌసర్ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని సిటీ సివిల్ కోర్టు నుంచి ఆమె బదిలీపై తుంగతుర్తికి వచ్చారు. ఈ సందర్భంగా తుంగతుర్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తాళ్లపల్లి సత్యనారాయణ ఆమెను సన్మానించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు రమావత్ ఫుల్సింగ్ నాయక్, మల్లపాక రవికుమార్, బానోత్ ప్రతాప్, వంగాల నాగరాజు,, అనిల్కుమార్, న్యాయవాదులు జిల్లా కుమారస్వామి, కారింగుల వెంకటేశ్వర్లు, కుంభం రణధీర్, హరిచరణ్, జిలకర చంద్రమౌళి, బానోత్ సతీష్, రాజారాం, శ్రీనివాస్, ఓర్సు రాజు, నక్కల సురేందర్, శ్రీలత, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని శుక్రవారం అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం, నిత్యహోమం పూర్తిగావించి శ్రీస్వామి అమ్మవార్లకు ఎదుర్కోళ్ల మహోత్సవం జరిపించారు. అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్యప్రాశన, మధుఫర్కపూజ, మాంగల్యధారణ నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
ఏడు కేంద్రాల్లో నీట్
రామగిరి(నల్లగొండ): నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏడు కేంద్రాల్లో ఈ నెల 5న (ఆదివారం) నీట్–2024 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు నీట్ జిల్లా కోఆర్డినేటర్ జి.పార్థసారథి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఈ పరీక్షకు మొత్తం 2,316 అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారని, మధ్యాహ్నాం 1.30 గంటల తర్వాత పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తారని, అనుమతించరని పేర్కొన్నారు. పరీక్షకు వచ్చేవారు హాల్ టికెట్తో పాస్ఫొటో, 4/6 ఫొటోను, ఐడీ కార్డును తీసుకొని రావాలని సూచించారు. -
కాంగ్రెస్, కమ్యూనిస్టుల దోస్తీ కీలకం
హుజూర్నగర్ (చింతలపాలెం) : కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల కలయికపై ప్రజాస్వామ్యవాదులు హర్షిస్తున్నారని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం చింతలపాలెం మండలం దొండపాడులో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టులతో దోస్తీ చాలా కీలకంగా మారిందని తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంట్కు పంపించాలని కోరారు. ఈసందర్భంగా తమ్మారం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డి, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన, సీపీఐ జిల్లా నాయకులు ఉస్తెల నారాయణరెడ్డి, సీపీఎం నాయకులు పల్లా వెంకటరెడ్డి, సుందర మౌళీశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రఘువీర్రెడ్డిని గెలిపించాలి హుజూర్నగర్: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్రెడ్డిని గెలిపించాలని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి కోరారు. శుక్రవారం హుజూర్నగర్ పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రోడ్డుషో నిర్వహించారు. అనంతరం అడ్డరోడ్డు సెంటర్లో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి బార్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. రోడ్డు షోలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, సీపీఐ రాష్ట్ర నాయకులు రాములు పాల్గొన్నారు. బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్ కూడా దక్కదు చిలుకూరు: నల్లగొండ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్రెడ్డికి 5 లక్షలకు పైగా మెజారీటీ వస్తుందని, బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్ కూడా దక్కదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం చిలుకూరులో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ప్రచార సభకు ముందు చిలుకూరు కాలువ ఒడ్డున గల ఆంజనేయస్వామి దేవాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, ఎంపీ అభ్యర్థి రఘువీర్రెడ్డి, సీపీఐ సీనియర్ నాయకులు దొడ్డా నారాయణరావు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు కీత వెంకటేశ్వర్లు, హనుమంతరావు, ఎంపీపీ బండ్ల ప్రశాంతి, జెడ్పీటీసీ శిరీష, సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, మండవ వెంకటేశ్వర్లు, వేనేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
సూర్యాపేట : లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకుడు మనోజ్కుమార్ మాణిక్రావ్ సూర్యవంశీ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నోడల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల విధుల్లో మైక్రో అబ్జర్వర్లు, సెక్టార్ అధికారుల పాత్ర కీలకమన్నారు. మైక్రో అబ్జర్వర్లు తమ చెక్ లిస్ట్ ప్రకారం పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు పరిశీలించాలని తెలిపారు. కలెక్టర్ వెంకటరావు మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 10,00,012 మంది ఓటర్లు ఉండగా 1201 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై సీవిజిల్కు 54 ఫిర్యాదులు అందగా 48 కేసులు పరిష్కరించామన్నారు. సువిధాలో 291 అనుమతులకు 180 అనుమతులు ఇచ్చామని, 87 తిరస్కరించామని, 20 రద్దు అయ్యాయని మిగిలిన 4 పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. 1950 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా 181 ఫిర్యాదులు పరిష్కరించినట్లు చెప్పారు. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో 229 కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో అదనవు కలెక్టర్లు సీహెచ్ ప్రియాంక, బీఎస్ లత, ఏఎస్పీ నాగేశ్వర రావు పాల్గొన్నారు. సమన్వయం అవసరం ఎన్నికల సిబ్బందితో పోలీసు సిబ్బందికి సమన్వయం అవసరమని పోలీసు పరిశీలకుడు అమోగ్ జీవన్ గోవాకర్, జనరల్ పరిశీలకుడు మనోజ్ కుమార్ మానిక్ రావు అన్నారు. ఎన్నికల యాక్షన్ ప్లాన్, పోలీసు బందోబస్తుపై శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటరావు, ఎస్పీ రాహుల్ హెగ్డేతో కలిసి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ రాజేష్ మీనా, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వీర రాఘవులు పాల్గొన్నారు. ఫ ఎన్నికల సాధారణ పరిశీలకుడు మనోజ్కుమార్ మాణిక్రావు సూర్యవంశీ -
కాంగ్రెస్కు ప్రజలే బుద్ధి చెబుతారు
పెన్పహాడ్: అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటుతోనే బుద్ధి చెబుతారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని దూపహాడ్ గ్రామంలో బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా గ్రామంలో పార్టీ నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని మాటిచ్చి, ఇంత వరకు అమలు చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ను నమ్మి మోసపోయామంటూ ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల నియోజకవర్గ సమన్వయకర్త ఇస్లావత్ రామచంద్రనాయక్, ఎంపీపీ నెమ్మాది భిక్షం, పార్టీ మండల అధ్యక్షుడు దొంగరి యుగేందర్, మండల ప్రధాన కార్యదర్శి వెన్న సీతారాంరెడ్డి, మాజీ సర్పంచ్ బిట్టు నాగేశ్వరరావు, గుగ్గిళ్ల సోమయ్య, తూముల ఇంద్రసేనారావు, వీరయ్య, భద్రయ్య, యగ్గడి మురళి, దాసరి శ్రీనివాస్, దాచేపల్లి సుధాకర్, నల్లపు శ్రీను, అరవింద్, హుస్సేన్ పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటే తుంగతుర్తి: కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఒక్కటేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి, ప్రధాని మోదీలు ప్రజా సమస్యలను పక్క దారి పట్టిస్తున్నారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్లు గుజ్జ దీపికాయుగేందర్రావు, ఎలిమినేటి సందీప్రెడ్డి, భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ యాదవ్, మండల అధ్యక్షుడు సీతయ్య, వైస్ఎంపీపీ శ్రీశైలం, రాములుగౌడ్, సాయిలు పాల్గొన్నారు.ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement