-
పింఛన్ జమ కాక ఆందోళన
ఇక్కడ కొడుకుతో కలిసి ఆళ్లగడ్డ యూనియన్ బ్యాంక్కు వచ్చిన వృద్ధురాలు మొగల్ సోఖరబీ. ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు గ్రామంలో నివాసం. కొన్నేళ్లుగా వృద్ధాప్యంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేవారు కాదు. ప్రతి నెల వలంటీర్ ఇంటిదగ్గరే వచ్చి పింఛన్ సొమ్ము ఇస్తుండటంతో వాటితో అవసరమైన మందులు కొనుక్కుని వేసుకునేది. చంద్రబాబు అండ్ కో నిర్వాకంతో వలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీ నిలిపివేయడంతో పట్టణంలోని బ్యాంకు వద్దకు వచ్చారు. తీరా ఇక్కడకు వచ్చి డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా జీరో అకౌంట్ ఇందులో జమ కాలేదని అధికారులు చెప్పడంతో వృద్ధురాలు ఆందోళన చెందింది. – ఆళ్లగడ్డ -
No Headline
● వలంటీర్ సేవల నిలిపివేతలో టీడీపీ అధినేతది కీలక పాత్ర ● చంద్రబాబుపై మండి పడుతున్న పింఛన్ లబ్ధిదారులు ● మండే ఎండల్లో మాకెందుకు ఇన్ని కష్టాలు అంటూ ఆవేదన ● ఉమ్మడి కర్నూలు జిల్లాలో డీబీటీ ద్వారా 3,53,405 మందికి నగదు బదిలీ ● సాంకేతిక కారణాలతో 5,917 మందికి బదిలీ కాని నగదు ● మూడో రోజూ బ్యాంకులకు పోటెత్తిన లబ్ధిదారులు ● పింఛన్ తీసుకొని ఇంటికి వెళ్తూ వృద్ధుడి మృతి ముడతలు పడిన దేహం.. ఎముకల గూడు వంటి శరీరం.. సత్తువంతా కూడదీసుకున్నా నాలుగు అడుగులైనా వేయలేని దీనత్వం.. ప్రతి నెలా ఠంచన్గా వలంటీర్ ఇంటికి వచ్చి ఇచ్చే పింఛనే ఆధారం..అలాంటి ఆధారం నేడు సందిగ్ధంలో పడింది.. నెలంతా వాడాల్సిన మందులు.. ఇతర ఖర్చులు.. నెల 3వ తేదీ వచ్చినా అందని పింఛన్.. వృద్ధుల్లో ఒకటే ఆందోళన.. 48 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఎండల్లోనూ అడుగులో అడుగు వేసుకుంటూ..పాణాన్ని అరచేతిలో పెట్టుకుని బ్యాంకుకు వెళితే అక్కడ వందల మంది..అంతా గందరగోళం.. గంటల తరబడి ఓపిగ్గా నిలుచుని కౌంటర్ దగ్గరికి చేరితే ఆధార్ అనుసంధానం కాలేదనో.. పాత బాకీ ఉందనో.. ఇలా ఎన్నో కారణాలతో పింఛన్ తీసుకోవడం కష్టమవుతోంది. ఇంట్లో హాయిగా పింఛన్ తీసుకునే తమకు కష్టాలు తెచ్చి పెట్టిన చంద్రబాబుపై అవ్వాతాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఉసురు తప్పక తగులుతుందని శాపనార్థాలు పెడుతున్నారు. టీడీపీ అధినేత కక్షపూరిత ధోరణిపై మండిపడుతున్నారు. ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.నందికొట్కూరు పట్టణంలోని స్టేట్ బ్యాంక్ వద్ద పింఛన్ కోసం వేచివున్న లబ్ధిదారులుకర్నూలు(అగ్రికల్చర్)/నంద్యాల (న్యూటౌన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో పింఛన్ల పంపిణీ మూడో రోజుకు చేరుకుంది. కర్నూలు జిల్లాలో మొత్తం 1,88,104 మందికి గాను 1,55,254 మందికి, నంద్యాల జిల్లాలో 1,71,218 మందికి గాను 1,39,803 మందికి డీబీటీ ద్వారా గురువారం పింఛన్ను జమ చేశారు. రెండు జిల్లాలో మిగిలిన 64,265 మంది లబ్ధిదారుల్లో 58,348 మంది బ్యాంకు ఖాతాలకు శుక్రవారం నగదు జమ చేశారు. సాంకేతిక కారణాలతో 5,917 మందికి నగదు బదిలీ కాలేదు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 3,53,405 మందికి డీబీటీ ద్వారా పింఛన్ సొమ్ము బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. దీంతో పండుటాకులైన అవ్వాతాతలు, ఇతర పింఛన్దారులు మండటెండల్లో కష్టాలు ఎదుర్కొంటూ బ్యాంకులకు వెళ్లారు. లబ్ధిదారులకు పింఛన్ ఇవ్వకుండా కొన్ని బ్యాంకులు ఇబ్బందులకు గురి చేశాయి. పాత బకాయిలకు జమ చేసుకొని మొండి చేయి చూపాయి. పింఛన్ కోసం బ్యాంకుకు వచ్చి తిరిగి వెళుతూ ఒక వృద్ధుడు మృత్యువాత పడ్డాడు. నందవరం మండలం మాచాపురం గ్రామానికి చెందిన పులిచింత ఆనంద్ అనే వృద్ధుడు పింఛన్ తీసుకొని వెళ్తూ ఎండకు అస్వస్థతకు గుఐ ఇంటికి చేరకుండానే మృత్యువాత పడ్డారు. ఈ పాపం చంద్రబాబుదేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు వల్లే ఈ కష్టాలు.. పింఛన్ లబ్ధిదారులతో బ్యాంకులు శుక్రవారం కిటకిటలాడాయి. చంద్రబాబు ముఠా కుట్రల కారణంగా ఏప్రిల్ నెలలో సచివాలయాలు, మే నెలలో బ్యాంకుల మెట్లు ఎక్కాల్సి వచ్చిందని అవ్వాతాతలు శాపనార్థాలు పెట్టడం చాలా చోట్ల కనిపించింది. ‘మేం కష్టాలు పడటం వల్ల మీ కడుపు మంట చల్లారిందా’ అంటూ పలువురు మండిపడ్డారు. వలంటీర్ సేవలను అడ్డుకున్న చంద్రబాబుకు తమ ఉసురు తగులుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. కర్నూలు జిల్లాలో 3,339 మందికి, నంద్యాల జిల్లాలో 2,578 మందికి మొత్తంగా 5,917 మందికి వివిధ కారణాలతో నగదు బదిలీ కాలేదు. వీరికి శనివారం ఇంటికి వెళ్లి పింఛన్లు అందజేయనున్నారు. -
No Headline
ప్రతి నెల 1వ తేదీ సూర్యుడు ఉదయించక ముందే వలంటీరు చిక్కటి చిరునవ్వుతో నిద్ర లేపి గుడ్మార్నింగ్ చెప్పి పింఛన్ సొమ్ము అందుకునే లబ్ధిదారులు నేడు బ్యాంక్ మెట్లపై నిరీక్షించాల్సిన పరిస్థితి దాపురించింది. శుక్రవారం డోన్ యూనియన్ బ్యాంక్ వద్ద ఖాతాలో పడిన సొమ్మును తీసుకునేందుకు అధిక సంఖ్యలో వృద్ధులు గంటల తరబడి వేచివున్నారు. ‘కక్షగట్టి ఇన్ని కష్టాలు పెట్టెందుకు తామేం పాపం చేశామని’ ప్రశ్నిస్తున్నారు. సాఫీగా సాగుతున్న జీవితాలను ఇక్కట్లు పాలు చేసిన చంద్రబాబుకు తమ ఉసురు తప్పక తగులుతుందని శాపనార్థాలు పెడుతున్నారు. – డోన్ టౌన్ -
No Headline
ఈ వృద్దురాలి పేరు బోయ అంకమ్మ. దేవరాయపురం గ్రామంలో నివసిస్తున్నారు. ఏప్రిల్ నెలలో చింతకుంట సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకున్నారు. మే నెలకు సంబంధించి సచివాలయం దగ్గరకు వెళ్లే నీ అకౌంట్లో జమ అయిందని చెప్పారు. చింతకుంట బ్యాంకుకు పోతే అకౌంట్ పనిచేయడం లేదు ఆళ్లగడ్డ మెయిన్ బ్యాంకుకు పోయి చూసుకోమన్నారు. రూ 400కు ఆటో మాట్లాడుకుని భార్యాభర్తలు ఇద్దరు ఆళ్లగడ్డ బ్యాంకుకు వచ్చారు. ఇక్కడకు వచ్చి అడిగితే అకౌంట్ పనిచేయడంలేదు అర్జీ రాసి ఇచ్చి మళ్లీ రమ్మన్నారు. చేసేది లేక ఎండ పొద్దున నడవలేక భర్త చేయి పట్టుకుని నడుస్తున్న ఈమెను చూసిన వారు ‘అయ్యో పాపం’ అన్నారు. మా లాంటి వారికి ఇంటి వద్దే పింఛన్ అందకుండా చంద్రబాబుకు కుట్రలు చేయడం అన్యాయమని వాపోయారు. – ఆళ్లగడ్డ -
నిబంధనలు పాటించని ఆసుపత్రులపై చర్యలు
నంద్యాల టౌన్: ఫైర్ సేఫ్టీ, బయో వేస్ట్ మేనేజ్మెంట్ తదితర నిబంధనలు పాటించని ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తప్పవని జిల్లా వైద్యారోగ్యాధికారి డాక్టర్ వెంకట రమణ హెచ్చరించారు. శుక్రవారం ఆయన నంద్యాల పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు ఎప్పటికప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, శానిటేషన్ తదితర విభాగాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు రెన్యువల్ చేయించాలన్నారు. అగ్ని ప్రమాద సమయాల్లో రోగుల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆసుపత్రి సిబ్బందికి అవగాహన ఉండాలన్నారు. ఎన్వోసీ లేకుండా, ఆరోగ్య శాఖ వద్ద నమోదు కాకుండా నడుపుతున్న ప్రైవేట్ ఆసుపత్రులను సీజ్ చేస్తామన్నారు. ఆయన వెంట డెమో ఆఫీసర్ రవీంద్ర నాయక్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. దేవస్థాన వైద్యశాలకు వైద్య పరికరాల అందజేత శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న దేవస్థాన వైద్యశాలకు పలు వైద్య పరికరాలను విరాళంగా అందజేశారు. శుక్రవారం హైదరాబాద్లోని హెచ్ఈఎస్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐ.వి.ఆర్.కృష్ణంరాజు దేవస్థాన వైద్యశాలకు వెంటిలేటర్–1, డిఫిబ్లేటర్–1, కార్డిక్ మానిటర్–1, బైపాస్ మిషన్–2, ఇన్ఫుషన్ ంపులు–2 విరాళంగా అందజేశారు. ఆయా వైద్య పరికరాలను దేవస్థాన ఈఓ డి.పెద్దిరాజుకు అందజేశారు. వీటి విలువ సుమారు రూ.16 లక్షలకు పైగా ఉంటుందని దాతలు తెలిపారు. ఆయా పరికరాలను అత్యవసర చికిత్స నిమిత్తం గుండెకు సంబంధించిన పరీక్షలు చేయవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో వసతి విభాగం సహాయ కార్యనిర్వహణాధికారి ఐఎన్వీ మోహన్, పీఆర్వో టి.శ్రీనివాసరావు, పర్యవేక్షకులు అయ్యన్న, అపోలో డాక్టర్లు సాయికిషన్, డాక్టర్ శశిధర్, గుమస్తా నాగేంద్రం, దేవస్థాన వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ బాహుబలులు బేతంచెర్ల: పట్టణంలోని సయ్యద్ అల్లాబకాష్ వలీ ఉరుసును సందర్భంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించి బల ప్రదర్శన పోటీలు ఆకట్టుకున్నాయి. 120 కేజీల గుండు, 130 కేజీల ఇసుక సంచి, 75 కేజీల చంద ఎత్తే పోటీల్లో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం పుల్లగుమ్మి సుధాకర్ చంద పందెంలో ప్రథమ స్థానం సాధించగా.. డోన్ మండలం గోసానిపల్లె చంద్ర ఇసుక, గుండు పందెంలో ప్రథమ స్థానంతో పాటు చంద పందెంలో ద్వితీయ స్థానం కై వసం చేసుకున్నాడు. గోసానిపల్లె గ్రామానికి చెందిన మధు ఇసుక పందెంలో ద్వితీయ, వెల్దుర్తి మండలం మాధవవరం గ్రామానికి చెందిన రాజశేఖర్ గుండు పందెంలో ద్వితీయ స్థానం కై వసం చేసుకున్నాడు. విజేతలకు నిర్వాహకులు వెండి పఽతకాలు అందజేశా రు. కార్యక్రమంలో నిర్వాహకులు ఖాజ, రాజ, ఇమామ్ హుసేన్, ఫైల్మాన్ పాల్గొన్నారు. ములాఖత్ వేళలు మార్పు కర్నూలు (లీగల్): వేసవి తీవ్రత దృష్టిలో ఉంచుకుని జైలు శాఖ డీజీ ఆదేశాల మేరకు కర్నూలులోని జిల్లా జైలులో ఖైదీలతో వారి బంధువులు మాట్లాడుకునేందుకు నిర్వహించే ములాఖత్ వేళల్లో మార్పు చేసినట్లు పర్యవేక్షణాధికారి ఘనే నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి జూన్ 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ములాఖత్ సమయాన్ని మార్చినట్లు పేర్కొన్నారు. ఖైదీల కుటుంబ సభ్యులు పైన తెలిపిన వేళలు పాటించాలని ఆయన కోరారు. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాల యం పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు నిర్వహించాల్సిన 2వ, 4వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ వెంకట సుందరానంద పుచ్చ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి ప్రా రంభం కావాల్సిన డిగ్రీ 2, 4వ సెమిస్టర్ థియరీ పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement