-
No Headline
● వైఎస్సార్సీపీలో 60 టీడీపీ కుటుంబాల చేరిక పార్వతీపురంటౌన్: వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలన కు ఆకర్షితులవుతున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు కుటుంబాలతో సహా వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. ఈ మేరకు పార్వతీపురం మండలంలోని అడ్డాపుశీల పంచాయతీ పరిధి బంటువానివలస గ్రామం నుంచి స్థానిక సర్పంచ్ రామకృష్ణ సారథ్యంలో వైఎస్సార్సీపీ పార్వతీపురం ఎమ్మెల్యే అభ్యర్థి అలజంగి జోగారావు సమక్షంలో అధికాన పార్టీ లో పలువురు టీడీపీ నాయకులు శుక్రవారం చేరా రు. పార్టీలో చేరిన వారిలో టీడీపీ ముఖ్య నాయకులు సింహాచలం, సూర్యనారాయణ, సీతంనాయు డు, కిరణ్, మధులతో పాటు వారికి చెందిన 60 కుటుంబాల వారురన్నారు. వైఎస్సార్సీపీలో చేరిన వారంతా జగనన్నకు మద్దతుగా నిలుస్తామని, నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలవనివ్వబోమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి జోగారా వు వారందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి అందరం కలిసికట్టుగా పని చేసి మరో 10 రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహ న్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందు కు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ రామకృష్ణ, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సాలూరులో 50 కుటుంబాల చేరిక సాలూరు: మండలంలోని మారేయ్యపాడు, బొర్రపణుకువలస గ్రామాలకు చెందిన సుమారు 50 కుటుంబాల వారు వైఎస్సార్సీపీలో శుక్రవారం చేరారు. వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, స్థానిక సర్పంచ్ బేటుకూరి రామ్మూర్తి, ఎంపీటీసీ అనూషల ఆధ్వర్యంలో ఆయా గ్రామాలకు చెందిన బేటుకూరి విక్ర మ్, శంకరరావు, పెంటయ్య, నగరయ్య, మల్లయ్య తదితర సుమారు 50 కుటుంబాలు టీడీపీ, సీపీఎంలను వీడి వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నాయి. సాలూరు అసెంబ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థి పీడిక రాజన్నదొర ఆయన స్వగృహంలో వారికి పార్టీ కండువాలు వేసి వారిని సాదరంగా ఆహ్వానించారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం అందరూ సమష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా రాజన్నదొర కోరారు. కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ
● కలెక్టర్ నిషాంత్ కుమార్ పార్వతీపురం: సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిషాంత్కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవా రం కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్లో ఆయనతో పాటు ఎస్పీ విక్రాంత్పాటిల్, అరకు పార్లమెంట్ నియోజకవర్గం సాధారణ పరిశీలకుడు ప్రమోద్ కుమార్ మెహర్దా, పార్లమెంట్ నియోజకవర్గం పోలీసు పరిశీలకుడు నయీం ముస్తఫా మన్సూరీ, శాసనసభ నియోజక వర్గాల వ్యయ పరిశీలకుడు రమాకాంత్ ప్రధాన్, పార్లమెంట్ నియోజకవర్గం వ్యయ పరిశీలకుడు గురుకరణ్సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన ఎన్నికల ఏర్పాట్లను, తీసుకుంటున్న చర్యలను, పర్యవేక్షణను కలెక్టర్ నిషాంత్కుమా ర్, ఇతర అధికారులు వివరించారు. హత్యాయత్నం కేసులో ముగ్గురి అరెస్ట్మక్కువ: మండల కేంద్రం మక్కువలోని కూరాకుల వీధిలో ఓవ్యక్తిపై హత్యాయత్నం చేసిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్చేసి బొబ్బిలి సబ్జైలుకు తరలించినట్లు ఎస్సై పి.నరసింహమూర్తి శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈనెల1వతేదీన కూరాకుల వీధికి చెందిన కోట రామకృష్ణపై, మక్కువకు చెందిన సూర్యనారా యణ, హరి, బర్రి అనే వ్యక్తులు హత్యాయత్నానికి ప్రయత్నించడంతో రామకృష్ణ గాయాలపాలయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను స్థానిక చర్చిసెంటర్ వద్ద శుక్రవారం అరెస్ట్చేశారు. విచారణ అనంతరం నిందితులను బొబ్బిలి సబ్జైలుకు తరలించిన ట్లు ఎస్సై చెప్పారు. సాలూరులో ఫ్లాగ్మార్చ్సాలూరు: ఏఎస్పీ సునీల్షరోన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బలగాలతో సాలూరు పట్టణంలో శుక్రవారం పోలీస్ సిబ్బంది ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఎన్నికల వేళ అందరు ఎన్నికల నియమావళికి అనుగుణంగా నడుచుకోవాలని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అంద రూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ, రూరల్ సీఐలు వాసునాయుడు, బాలకృష్ణ, ఎస్సైలు సురేష్, సీతారాం, రమణ, ప్రత్యేక పోలీస్ బృందాలు పాల్గొన్నారు. మేజిస్ట్రేట్లు బాధ్యతల స్వీకరణ సాక్షి ప్రతినిధి, విజయనగరం:జిల్లాలో ముగ్గురు మేజిస్ట్రేట్లు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక మొబైల్ మేజిస్ట్రేట్గా పి.బుజ్జి, ఎకై ్స్జ్ మేజిస్ట్రేట్గా ఎం.శ్రీనివాసరావు, చీపురుపల్లి మేజిస్ట్రేట్గా వై.ప్రేమలత ఆ కోర్టుల ఇన్చార్జిగా ఇంతవరకు వ్యవహరించిన మేజిస్ట్రేట్లు బి.రమ్య, రత్న కుమారిల నుంచి చార్జ్ తీసుకున్నారు. వీరు ముగ్గురు గుంటూరు, విశాఖపట్నం, గాజువాకలో పనిచేస్తూ బదిలీపై జిల్లాకు వచ్చారు. -
No Headline
2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలన్నీ నెరవేర్చారు. మళ్లీ నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టోతో మీ ముందుకు వస్తున్నాం. హామీ ఇస్తే నిలబెట్టుకునేది..నెరవేర్చేది ఎవరో? ఎవరి పాలనలో పింఛన్ లబ్ధిదారులు కష్టపడకుండా ఇంటిదగ్గరే పెన్షన్ అందుకున్నారో? అందరూ గుర్తెరగాలి. రైతులకు అన్ని రకాలుగా సహాయం అందించే ప్రభుత్వ ఏదో గుర్తించాలి. ఈ ప్రభుత్వం రాకముందు ప్రతిపక్ష టీడీపీ పాలనలో పడిన ఇబ్బందులు గుర్తు చేసుకోవాలి. ఆ నాటి కష్టాలు మళ్లీ ఎదురు కాకుండా ఉండాలంటే అధికార వైఎస్సార్సీపీని గెలిపించాలంటూ పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో జోరుగా దూసుకుపోతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు గ్రామాల్లోకి ఎన్నికల ప్రచారం కోసం వస్తుంటే ఆయా గ్రామాల ప్రజలు ఎదురేగి హర్షధ్వానాలతో స్వాగతం పలుకుతున్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. -
మరోమారు ఎల్లో కుట్రలు
సాక్షి, పార్వతీపురం మన్యం: చంద్రబాబు హయాంలో ఐదేళ్ల క్రితం వరకు పింఛన్ మొత్తాన్ని రూ.వెయ్యి చొప్పునే అందించేవారు. అది కూడా అర్హులందరికీ కాక, కొద్దిమందికే అందేది. 2019 జనవరి వరకు ఇదే మొత్తం కొనసాగేది. అప్పట్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా టీడీపీ ప్రభుత్వం రూ.2 వేలకు పెన్షన్ పెంచింది. అది కూడా ప్రతిపక్ష నేతగా జగన్మోహన్రెడ్డి ప్రకటించిన తర్వాత. ఈ సొమ్ము కోసం కూడా పంచాయతీ కార్యాలయాల చుట్టూ గంటలు, రోజుల తరబడి లబ్ధిదారులు పడిగాపులు కాయాల్సి వచ్చేది. వేకువజామున 6 గంటల నుంచే చెట్లు, గట్ల వద్ద పాట్లు పడేవారు. మండుటెండలో నిరీక్షిస్తున్న పండుటాకుల కష్టాలను కళ్లారా చూసిన వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి..తాను అధికారంలోకి రాగానే సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి నేరుగా ఇళ్ల వద్దకే పింఛన్ అందించారు. దీనివల్ల వేలాది మంది వృద్ధులు, దివ్యాంగులు, మానసిక వికలాంగులకు ప్రయోజ నం కలిగింది. అంతేకాదు.. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ మొత్తాన్ని ప్రతి ఏడాదీ పెంచుకుంటూ వెళ్తూ, రూ.3 వేలు చేసి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారు. ప్రతి నెలా ఒకటో తేదీనే వలంటీర్ల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇంటికే తీసుకెళ్లి పింఛన్ మొత్తం అందించడం గతంలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వమూ అమలు చేయలేదు. కరోనా వంటి కష్ట సమయమైనా, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఠంఛన్గా పింఛన్ అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిదే. ఈ విధానం నాలుగున్నరేళ్లు సాఫీగా సాగింది. అవ్వాతాతలపై విషం.. ప్రతినెలా క్రమం తప్పకుండా ఒకటో తేదీనే అవ్వాతాతలకు, అభాగ్యులకు అందించే సామాజిక పింఛన్లపై వలంటీర్లను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ రాజకీయం మొదలుపెట్టింది. దీనివల్ల జిల్లాలో వేలాదిమందికి ఇబ్బందులు ప్రారంభమయ్యా యి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. వలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తే, ఓటర్లు ప్రభావితం అవుతారంటూ ఒక దుష్ప్రచారాన్ని బయటకు తెచ్చి, ‘పచ్చ’బృందం ఎన్నికల సంఘానికి ఫిర్యా దు చేసింది. బ్యాంకుల్లోనే పింఛన్ మొత్తం జమ చేయాలని కోరింది. దీనిపై ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంది. గత నెలలో సచివాలయాల వద్ద పంపిణీ చేసినా ఎక్కడో తప్పు జరిగిపోతోందంటూ మళ్లీ టీడీపీ అండ్ కో ఫిర్యాదులు చేసింది. నిత్యం ఫిర్యాదులు రావడంతో డీబీటీతో బ్యాంకుల ద్వారా పింఛన్ మొ త్తం ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. ఆ ప్రకారమే ఈ నెల ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిపై కూడా ‘ఎల్లో’ బ్యాచ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. మళ్లీ ఆ నాటి రోజులే.. చంద్రబాబు హయాంలో పింఛనుదారులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో మళ్లీ ఆ కష్టాలను రెండు నెలలుగా చవి చూస్తున్నారు. ఎండల్లో సచివాలయాలు, బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కిలోమీటర్ల దూరం నడిచి బ్యాంకులకు వస్తూ సొమ్మసిల్లిపడిపోతున్నారు. మొన్నటి వరకూ వలంటీర్లే ఇంటికి తెచ్చి, ఒకటో తేదీనే పింఛన్ ఇచ్చేవారని.. చంద్రబాబు చేయించిన ఫిర్యాదుల వల్ల ఈ వయసులో అవస్థలు పడుతున్నామని వృద్ధులు వాపోతున్నారు. చంద్రబాబుకు మాపై ఎందుకింత పగో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తమపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ, రూ.4 వేలు పెన్షన్ అందిస్తానంటే ఎవరు నమ్ముతారని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని అబద్ధాలైనా ఆడుతాడని విమర్శిస్తున్నారు. రాలేని పరిస్థితిలో ఉన్నవారికి ఇంటివద్దకే.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాలేని పరిస్థితిలో అధికార వైఎస్సార్సీపీపై అక్కసు. వలంటీర్లపై విషం..పండుటాకులపై కడుపుమంట. వెరసి ‘పచ్చ’ కూటమి పన్నిన పన్నాగం. వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని నిలుపు చేయించాలని ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదు ఫలితం. రెండు నెలలుగా సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న పండుటాకులు, ఇబ్బందులు పడుతున్న అభాగ్యులు. నాటి చంద్రబాబు పరిపాలన రోజులను గుర్తు చేసుకుంటున్న అవ్వాతాతలు, దివ్యాంగులు. -
సీతంపేట మండలం నుంచి వచ్చాను
మా గ్రామానికి దగ్గరలో బ్యాంకులు లేవు.అందుకే వీరఘట్టం బ్యాంకుకు వచ్చాం. మాలాంటి ముసలోళ్లను పింఛన్ల కోసం ఇంత ఇబ్బంది పెడుతు న్న చంద్రబాబును ఇక ఎవరూ నమ్మరు. జగనన్న దయవల్ల ఎప్పుడూ పింఛన్ల కోసం ఇన్ని ఇబ్బందులు పడలేదు. –ఆరిక రింపిడి, పొల్ల గ్రామం, సీతంపేట మండలంఉన్నవారికి ఇంటి వద్దకే తీసుకెళ్లి పింఛన్ మొత్తం అధికారులు అందజేస్తున్నారు. మే నెలకు సంబంధించి జిల్లాలో 1,12,947 మందికి 33,88,43,000 మొత్తాన్ని నేరుగా బ్యాంకుల్లో జమ చేయాలని నిర్ణయించారు. 32,124 మంది లబ్ధిదారులకు రూ.8,86,33,500లను అందించేందుకు నిర్ణయించారు. ఇందులో 95 శాతం ఇప్పటికే పూర్తి చేశారు. మొత్తంగా 1,45,071 మంది పింఛనర్లకు గానూ 1,42,731 మందికి పింఛన్ మొత్తం అందజేశారు. రూ.42,07,47,000 మొత్తాన్ని పంపిణీ చేసి, రాష్ట్రంలోనే మూడో స్థానంలో జిల్లా నిలిచింది. వివిధ కారణాలతో డీబీటీ ద్వారా నగదు జమ కాని సుమారు 800 మంది లబ్ధిదారులకు నేరుగా సచివాలయాల ద్వారా పింఛన్లు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
ది లీడర్..!
టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు
షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం
ఇండోనేషియాలో భారీ వరదలు.. 14 మంది మృతి!
కాంగ్రెస్ అంతిమ దశకు చేరుకుంది: జ్యోతిరాదిత్య సింధియా
చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
వయ్యారి భామ నీ కళ్లు చూస్తే.. రేరాజైనా కుళ్లుకోవాల్సిందే! (ఫోటోలు)
మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement