-
కడియం.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి : పల్లా రాజేశ్వర్రెడ్డి
వరంగల్: ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని షోడాషపల్లి శివారులోని ఓ ఫంక్షన్ హల్లో వేలేరు, ధర్మసాగర్ మండలాల విస్తృత స్థాయి సన్నాహక సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్ను గెలిపించి కడియం శ్రీహరికి కర్రుకాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. మంత్రిగా పని చేసి ఘన్పూర్కు చేసిన పని ఒక్కటైనా చూపెట్టాలని సవాల్ చేశారు. ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. కడియం రాజీనామా చేసి వస్తే రాజకీయంగా బొందపెట్టడానికి పార, గడ్డపార రెడీగా ఉన్నాయన్నారు.కడియం శ్రీహరి ఓ నకిలీ దళితుడైతే, ఆయన కూతురు నకిలీ దళితురాలని మండిపడ్డారు. ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. తనను ఎంపీగా గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కడియం కావ్య తండ్రి చాటు బిడ్డ అని, అరూరి రమేశ్ కబ్జాదారుడని విమర్శించారు.కడియం శ్రీహరి, అరూరి రమేశ్ దొందూ దొందేనని విమర్శించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ చాడ సరిత, జెడ్పీ కో–ఆష్షన్ సభ్యురాలు జుబేదా లాల్, కార్పొరేటర్ ఆవాల రాధిక రెడ్డి, వైస్ ఎంపీపీ సంపత్, మండల అధ్యక్షుడు నర్సింగరావు, కో–ఆష్షన్ జానీ, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
నర్సంపేట : ఆరోగ్యంపై విద్యార్థులు శ్రద్ధచూపాలని నర్సంపేటలోని తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్ క్వాలిటీ మేనేజర్ డాక్టర్ వి.శ్వేత సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐక్యూఏసీ, ఎన్ఎస్ఎస్, మహిళా సాధికారత సెల్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లం నవీన్ అధ్యక్షతన శుక్రవారం హెల్త్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె డయాగ్నోస్టిక్స్ హబ్లో అందుబాటులో ఉన్న వివిధ టెస్టులు, స్కానింగ్ సదుపాయాల గురించి వివరించారు. అనంతరం మాట్లాడుతూ అన్ని పరీక్షలు ఉచితంగా చేయించుకోవచ్చని తెలిపారు. ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ఎ.శ్రీనాథ్, జిల్లా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ఐ.శివనాగ శ్రీను, కళా శాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి బి.రమేష్, మహిళా సాధికారత సెల్ కోఆర్డినేటర్ టి.సుమతి, అకడమిక్ కోఆర్డినేటర్ ఎం.నరేందర్, టి.రమేశ్, ఎల్.సత్యనారాయణ, బి.విష్ణుకుమార్, జి.ప్రసూన, ఎం.సమ్మయ్య, ఎం.శైలజ, పి.త్యాగయ్య, ఆర్.కుమారస్వామి, ఏఓ ఎన్. స్వరూపారాణి, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఎంహెచ్డీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రదీప్ గీసుకొండ : మాదిగ హక్కుల దండోరా (ఎంహెచ్డీ) రాష్ట్ర అధ్యక్షుడిగా గ్రేటర్ వరంగల్ నగరం 15వ డివిజన్ మొగిలిచర్లకు చెందిన గనిపాక ప్రదీప్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎంహెచ్డీ వ్యవస్థాపక అధ్యక్షుడు యాతాకుల భాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ క్యాదరి భాస్కర్ పేరుతో శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంత కాలం ప్రదీప్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ సంగెం: విద్యుత్ వినియోగదారులు, సిబ్బంది అప్రమత్తతతోనే ప్రమాదాలను నివారించవచ్చని ఎన్పీడీసీఎల్ వరంగల్ డివిజనల్ ఇంజనీర్ టెక్నికల్ ఎ.ఆనందం అన్నారు. విద్యుత్ భద్రతా వారోత్సవాల్లో భాగంగా కాపులకనిపర్తి, సంగెం, మచ్చాపూర్ సెక్షన్ల సిబ్బంది, వినియోగదారులకు ‘విద్యుత్ భద్రత– పొదుపు’పై మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. వర్షాకాలంలో వానలు, ఈదురు గాలులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీగలు తెగిపోవడం, సాగడం, స్తంభాలు విరగడం వల్ల ప్రమాదాలు పొంచి ఉంటాయని తెలిపారు. వ్యవసాయబావుల వద్ద రైతులు విద్యుత్ సిబ్బందికి తెలియకుండా ట్రాన్స్ఫార్మర్లు బంద్ చేయడం, ఫ్యూజులు వేసుకోవడం, స్తంభాలు ఎక్కడం వంటి పనులు చేయవద్దన్నారు. ఇంటిలో హౌస్వైరింగ్కు దగ్గరలో జీఐ వైరును దండెంగా వాడొద్దని సూచించారు. ఎవరికైనా విద్యుత్ షాక్ తగిలితే రక్షించేందుకు చేతులతో తాకవద్దని, విద్యుత్ ప్రసరించని వస్తువులతో మాత్రమే రక్షించాలన్నారు. అవసరం లేనప్పుడు వాడకుండా విద్యుత్ను పొదుపు చేయాలని సూచించారు. విద్యుత్ షాక్ తగిలి స్పృహ కోల్పోయిన వ్యక్తిని సీపీఆర్ ద్వారా బతికించవచ్చని వివరించారు. కార్యక్రమంలో వరంగల్ డివిజనల్ ఇంజనీర్ బి.భిక్షపతి, ఏడీఈ నర్సింహారావు, ఏఈలు తిరుపతిరెడ్డి, మధుసూదన్, సంపత్రెడ్డి, సబ్ఇంజనీర్లు తాజుద్దీన్, విక్రమ్, క్రాంతి, సురేష్, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఉరేసుకుని వ్యాపారి ఆత్మహత్య నర్సంపేట రూరల్ : ఉరేసుకుని వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నర్సంపేటలో శుక్రవారం జరిగిందని ఎస్సై ప్రవీణ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన మార్త సురేశ్ (45) వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, ముంబాయికి చెందిన ఓ ప్రైవేట్ ఫైనాన్స్లో సురేశ్ భార్యకు అప్పు ఉంది. నిత్యం ఫోన్ చేస్తుండడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన ఇంట్లో ఎవరులేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అభివృద్ధే ప్రధాని మోదీ లక్ష్యం
సంగెం : దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే ప్రధాని మోదీ లక్ష్యమని బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన రోడ్షోలో పాల్గొని ఆయన మాట్లాడారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశ ఆర్థిక వ్యవస్థను మూడో స్థానానికి తీసుకెళ్తుందని తెలిపారు. రేవంత్రెడ్డి అరచేతిలో బెల్లం పెట్టి మోచేత నాకించాడని ఆరోపించారు. కడియం కావ్యకు ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. సంగెం–చింతలపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం, టెక్స్టైల్ పార్కును మరింత అభివృద్ధి చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అరూరి రమేశ్ కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, డాక్టర్ రాజేశ్వర్రావుతోపాటు డాక్టర్ పగడాల కాళీప్రసాద్రావు, పార్టీ మండల అధ్యక్షుడు బుట్టి కుమారస్వామి పాల్గొన్నారు. బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ -
కాంగ్రెస్, బీఆర్ఎస్ను భూస్థాపితం చేయాలి
వర్ధన్నపేట : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ను భూస్థాపితం చేయడమే మాదిగల లక్ష్యమని ఎంఎస్పీ జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్ అన్నారు. వర్ధన్నపేటలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎస్సీల వర్గీకరణపై అంకిత భావంతో ఉన్నారని తెలిపారు. ఇందులో భాగంగానే బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద శనివారం మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో నిర్వహించనున్న మాదిగల ఆత్మగౌరవ మహాసభను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు మహేందర్, మాసాని గోపాల్, ధర్మయ్య, సుధాకర్, రాపాక వినోద్, ఉదయ్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
నల్లబెల్లి : మండల కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ నల్లబెల్లి అధ్యక్షుడు బత్తిని మహేశ్, నాయకులు మాలోత్ రమేశ్, వైనాల అశోక్, చార్ల శివారెడ్డి, మాలోత్ చరణ్సింగ్, కడుదూరి కట్టయ్య, డ్యాగల కృష్ణ, వర్ణం ఇంద్రారెడ్డి, జిల్లా మునేందర్ తదితరులు పాల్గొన్నారు. ఏనుగల్ తండాలో 10 కుటుంబాలు.. నర్సంపేట రూరల్ : నర్సంపేట మండలంలోని ఏనుగల్తండాకు చెందిన బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు బానోత్ రవి, వార్డు మాజీ సభ్యుడు బోడ సోములు ఆధ్వర్యంలో 10 కుటుంబాలు బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాయి. వారికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. అదేవిధంగా గురిజాల గ్రామ సొసైటీ మాజీ డైరెక్టర్ అల్లిరాజు బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు గజ్జి రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పెట రమేశ్, కత్తి కిరణ్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పార్వతమ్మ, మహిళా అధ్యక్షురాలు సాంబలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎల్గూర్స్టేషన్ గ్రామం నుంచి.. సంగెం : ఎల్గూర్స్టేషన్ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినట్లు పార్టీ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు గుగులోత్ బొంద్యా, గుగులోత్ రమేష్, నర్సానగర్ నుంచి జాటోత్ భద్రయ్య పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టుపల్లి రమేశ్, నాయకులు అచ్చ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
తప్పక చదవండి
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement