-
జగన్ పాటకే భయపడ్డారు!
హిందూపురం అర్బన్: ప్రజాభిమానం మెండుగా ఉన్న వైఎస్ జగన్ పేరు చెబితేనే టీడీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ‘భళి రా.. భళి భళి రా..భళి రా..పులివెందులలో పుట్టింది పులి రా’ అంటూ జనం వైఎస్సార్ సీపీ జెండా పట్టుకుని ఆనందంతో నృత్యాలు చేస్తుంటే టీడీపీ నాయకులు చూసి తట్టుకోలేక ఘర్షణకు దిగుతున్నారు. ఈక్రమంలోనే ముద్దిరెడ్డిపల్లికి చెందిన టీడీపీ నేతలు హద్దులు దాటి ప్రవర్తించారు. గురువారం బాలకృష్ణ సతీమణి వసుంధర ముద్దిరెడ్డిపల్లిలో రోడ్ షో నిర్వహించారు. అదే సమయంలో అక్కడే వైఎస్సార్ సీపీ ప్రచార జీపు కూడా ఉంది. అందులో జగన్ పాటలు వినిపిస్తుండటంతో పచ్చమూకలు రెచ్చిపోయాయి. జగన్ పాటలు ఎందుకు పెట్టారంటూ దౌర్జన్యానికి దిగారు. స్థానికులు నచ్చ జెప్పటంతో అప్పటికి వెనుతిరిగారు. అనంతరం పలువురు టీడీపీ నాయకులు అక్కడ గుమికూడటంతో.. వైఎస్సార్సీపీ నాయకులూ అక్కడికి చేరుకున్నారు. ఇంత చిన్న విషయానికి రాద్ధాంతం అవసరం లేదని వైఎస్సార్ సీపీ నేతలు చెబుతుండగానే... టీడీపీ నాయకులు రెచ్చి పోయారు. వైఎస్సార్ సీపీ నాయకులు లోకేష్, నాగభూషన్రెడ్డి, నవీన్, బాబు, అసీఫ్లపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో లోకేష్తో పాటు బాబు, నవీన్లకు గాయాలు కాగా, వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీంతో టీడీపీ నేతలు కూడా దాడిలో తమకూ గాయాలయ్యాయని ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలోనూ ఇరువర్గాల మధ్య గొడవ ప్రారంభం కాగా, పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం వైఎస్సార్ సీపీ నేతలు దాడులకు తెగబడిన టీడీపీ నేతలపై వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ నేతలపై టీడీపీ నేతలూ ఫిర్యాదు చేశారు. -
ఉరవకొండలో కృష్ణమ్మ గలగలలు
● కృష్ణాజలాలతో నియోజకవర్గం సస్యశ్యామలం ● గతంలో ఎటు చూసినా బీడు భూములే ● నేడు పచ్చని పంటలతో కళకళ ● భారీగా పెరిగిన భూగర్భజలాలు ● సీఎం వైఎస్ జగన్ హమీతో 80 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ● జీడిపల్లి రిజర్వాయర్ నిర్వాసితులకూ పునరావాసం ● ఉరవకొండ మండలంలో జిల్లాలోనే ప్రసిద్ధి గాంచిన పర్యాటక పుణ్యక్షేత్రం పెన్నహోబిళం ఉంది. ఇక్కడికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, పర్యాటకులు తరలివస్తుంటారు. ● కూడేరు మండలంలో పీఏబీఆర్(పెన్నఅహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) ఉంది. ఇది పర్యాటక ప్రాంతంతో పాటు జలవిద్యుత్ తయారీ కేంద్రంగా ఉంది. ● బెళుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయర్ జిల్లాకు ఆయువుపట్టు లాంటింది. హంద్రీనీవా ద్వారా వచ్చే నీటిని జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. ● ఉరవకొండ మండలం బూదగవిలో రాష్ట్రంలోనే రెండోదిగా ప్రసిద్ధిగాంచిన సూర్యదేవాలయం ఉంది. ● కూడేరులో ప్రసిద్ధిగాంచిన జోడులింగాల సంగమేశ్వర ఆలయం కొలువుదీరింది. నీటితో కళకళ లాడుతున్న జీడిపల్లి రిజర్వాయర్ ఉరవకొండ: నియోజకవర్గంలో జల సిరులు సవ్వడి చేస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా కరువును పాలదోలడానికి జలయజ్ఞంలో భాగంగా హంద్రీ–నీవాకు అంకుర్పారణ చేయగా ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయకట్టు అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. ఫలితంగా నియోజకవర్గంలో కృష్ణాజలాలు పరుగులుడితున్నాయి. ఒకవైపు కృష్ణ, మరోవైపు తుంగభద్ర నీటితో రైతులు విస్తుృతంగా పంటలు సాగు చేస్తున్నారు. నియోజకవర్గ విశిష్టత.. ఉరవకొండ నియోజకవర్గం అనంతపురం జిల్లా కేంద్రానికి వాయువ్యదిశలో 52 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1808లో దత్త మండలాల్లో ఉరవకొండ ఒకటిగా ఉండేది. 1882లో అనంతపురం జిల్లాలో భాగమైంది. 1988 నుంచి గ్రామ పంచాయతీ బోర్డుగా ఎర్పడి స్థానిక స్వపరిపాలనకు శ్రీకారం చుట్టింది. 1985 మే 25న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీరామారావు మాండలిక వ్యవస్థకు శ్రీకారం చుట్టడంతో కణేకల్లు సబ్డివిజన్ తాలుకాలోని కొన్ని గ్రామాలను కలిపి మండలంగా ఏర్పాటు చేశారు. ఉరవకొండ చుట్టూ కొండ ఉండటం వల్ల ఆకొండ పాము పడగ ఆకారంలో ఉండటం వల్ల ఉరగాద్రిగా పిలవబడే ఈ ప్రాంతం ఉరవకొండగా మారిపోయింది. నియోజకవర్గ స్వరూపం.. ఉరవకొండ నియోజకవర్గం 1955లో ఏర్పడింది. 2009 నియోజకవర్గ పునర్విభజనలో నియోజకవర్గంలో ఉన్న కణేకల్లు, పామిడి, గుంతకల్లు మండలాల్లోని కొన్ని గ్రామాలు పూర్తిగా ఆయా మండలాల్లోకే వెళ్లాయి. కొత్తగా కూడేరు, బెళుగుప్ప మండలాలు నియోజకవర్గంలోకి చేరాయి. ఉరవకొండ నియోజకవర్గ కేంద్రానికి ఉత్తరాన వజ్రకరూరు మండలం, దక్షిణాన బెళుగుప్ప మండలం, తూర్పున కణేకల్లు, బొమ్మనహాళ్, పడమర కూడేరు మండలాలున్నాయి. ఉరవకొండకు కేవలం 17 కిలోమీటర్ల దూరం( విడపనకల్లు మండలం) దాటగానే కర్ణాటక సరిహద్దు ప్రాంతం ప్రారంభమవుతుంది. దీంతో పలు గ్రామాల్లో కన్నడ ప్రభావం అధికంగా ఉంది. పాఠశాలలో తెలుగు మాధ్యమం ఉన్నప్పటికీ వ్యవహారికంలో ఇప్పటికీ కన్నడ భాషను వాడుతున్నారు. రాజకీయ పోరు.. రాజకీయ ఉద్ధండులకు నిలయమైన ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు ప్రతిసారి విలక్షణ తీర్పును వెలువరిస్తూ వస్తున్నారు. ఉరవకొండలో ఒక పార్టీ నుంచి అభ్యర్థి గెలిస్తే ఇంకొక పార్టీ అధికారం చేపట్టే సెంటిమెంట్ కొనసాగుతోంది. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి అత్యధికంగా ఆరుసార్లు టీడీపీ గెలుపొందగా, నాలుగు సార్లు కాంగ్రెస్, ఒకసారి ఇండిపెండెంట్, ఒకసారి వైఎస్సార్సీపీ విజయం సాధించాయి. 1962లో గుర్రం చిన్నవెంకన్న(ఇండిపెండెంట్) 1967లో గుర్రం చిన్నవెంకన్న(నేషనల్ కాంగ్రెస్) 1972లో బుక్కిట్ల బసప్ప(కాంగ్రెస్) 1978లో రాయల వేమన్న(కాంగ్రెస్) 1983లో వై.భీమిరెడ్డి(టీడీపీ), 1985లో గుర్రం నారాయణప్ప(టీడీపీ) 1989లో గోపినాథ్(కాంగ్రెస్) 1994లో పయ్యావులకేశవ్(టీడీపీ) 1999లో వై.శివరామిరెడ్డి(కాంగ్రెస్) 2004లో పయ్యావుల కేశవ్(టీడీపీ) 2009లో పయ్యావులకేశవ్(టీడీపీ) 2014లో వై.విశ్వేశ్వరరెడ్డి (వైఎస్సార్సీపీ) 2019లో పయ్యావుల కేశవ్ (టీడీపీ) గెలుపొందారు. నియోజకవర్గ ప్రత్యేకతలు.. నియోజకవర్గ సమాచారంఉరవకొండ బరిలో 11 మంది అభ్యర్థులు ఉరవకొండ నియోజకవర్గ అసెంబ్లీ పరిధిలో 11 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇందులో నలుగురు ఇండిపెండింట్ అభ్యర్థులు ఉన్నారు. బరిలో ఉన్న వారిలో వై.విశ్వేశ్వరరెడ్డి (వైఎస్సార్సీపీ), పయ్యావుల కేశవ్ (టీడీపీ), వై.మధుసూదన్రెడ్డి (కాంగ్రెస్), అంకే తిప్పేస్వామి (బీఎస్పీ), కురుబ చిన్నక్క (ఆలిండియా కిసాన్ జనతా పార్టీ), బెస్త పవన్కుమార్ (భారతీయ చైతన్య యువజన పార్టీ)తో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా మోహన్దాస్, బి.చంద్రశేఖర్రెడ్డి, కె.దామోదర్రెడ్డి, విశ్వేశ్వరయ్యస్వామి ఉన్నారు. -
జిల్లాలోనే అత్యధిక ఆయకట్టు..
హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం కింద ఉరవకొండ నియోజకవర్గానికి జిల్లాలోనే అత్యధికంగా 50 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉరవకొండ పర్యటన సందర్భంగా ఆయకట్టు అభివృద్ధికి ఆమోదం తెలిపారు. హంద్రీనీవా 33వ ప్యాకేజీ కింద 20,600 ఎకరాలు, 34వ ప్యాకేజీ కింద 17,300 ఎకరాలు, 36(ఏ) ప్యాకేజీ కింద 65,600 ఎకరాలు మొత్తంగా 76,058 ఎకరాలకు సంబంధించి ఫీల్డ్ ఛానల్స్ నిర్మాణానికి 68.45 కోట్లు మంజురు చేశారు. దీంతో పాటు బెళుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయర్ కింద ఉన్న జీడిపల్లి గ్రామాన్ని పునరావసం కల్పించడానికి నిధులు కూడా మంజూరు చేశారు. హంద్రీనీవా ద్వారా నియోజకవర్గంలో ఇప్పటికే 50 వేల ఎకరాల ఆయకట్టు సాగునీరు అందడంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. -
అన్న చేతిలో తమ్ముడు హతం
గుంతకల్లు రూరల్: చిన్నపాటి విషయానికి చోటు చేసుకున్న గొడవలో చివరకు అన్న చేతిలో తమ్ముడు హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన నాగిరెడ్డి, నారాయణమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పుట్టుకతోనే చెవుడు, మూగ కావడంతో పెద్ద కుమారుడు నారాయణరెడ్డికి తల్లిదండ్రులు వివాహం చేయలేకపోయారు. మరో కుమారుడు రామకృష్ణారెడ్డికి గుంతకల్లు మండలం సంగాల గ్రామానికి చెందిన శ్రీవాణితో వివాహమైంది. కుమార్తె బాలమ్మకు సొంతూరిలోనే పెద్దిరెడ్డి అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. కొన్ని రోజులుగా అన్నదమ్ములిద్దరూ మద్యానికి బానిసలయ్యారు. భర్త రామకృష్ణారెడ్డి ప్రవర్తనతో విసుగు చెందిన శ్రీవాణి ఇటీవల అతడిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. గురువారం నారాయణరెడ్డి, తన బావ పెద్దిరెడ్డితో కలసి ఇంట్లోనే మందు పార్టీ ఏర్పాటు చేసుకున్నాడు. కాసేపటి తర్వాత మద్యం మత్తులో ఇద్దరూ గొడవపడ్డారు. ఆ సమయంలో వండిన ఆహారాన్ని నారాయణరెడ్డి బయట పడేసి వెళ్లిపోయాడు. ఈ విసయాన్ని బామ్మర్ది రామకృష్ణారెడ్డితో చెప్పి పెద్దిరెడ్డి బాధపడ్డాడు. దీంతో రామకృష్ణారెడ్డి తన అన్నను మందలిస్తూ చేయి చేసుకున్నాడు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న నారాయణరెడ్డి మంచంపై నిద్రిస్తున్న రామకృష్ణారెడ్డిపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న గుంతకల్లు రూరల్ ఎస్ఐ సురేష్ శుక్రవారం ఉదయం అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో మెడికో దుర్మరణం మల్కాపురం (విశాఖ జిల్లా): శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మెడికో మృతి చెందగా.. మరో ఇద్దరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వివరాలు ఇలా.. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల ప్రాంతానికి చెందిన షేక్జానీ(19), అనంతపురం ప్రాంతానికి చెందిన సత్యకుమార్, శ్రీకాకుళానికి చెందిన ప్రమోద్లు కొమ్మదిలోని గాయత్రి మెడికల్ కళాశాలలో మెడిసిన్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. ఈ ముగ్గురు ఒకే ద్విచక్రవాహనంపై యారాడ, గంగవరం బీచ్కు శుక్రవారం తెల్లవారుజామున బయలుదేరారు. మల్కాపురం పోలీసు స్టేషన్ రోడ్డు నుంచి సింథియా వైపు వెళుతుండగా షిప్యార్డ్ కమర్షియల్ కాంప్లెక్స్ సమీపంలో ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో షేక్జానీ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సత్యకుమార్, ప్రమోద్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రాంతంలో డివైడర్ పనులు జరుగుతున్నాయి. తవ్విన వ్యర్థాలను తరలించేందుకు అక్కడ ట్రాక్టర్ వచ్చింది. ఇది గుర్తించలేని యువకులు ట్రాక్టర్ను ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని కేజీహెచ్లో చేర్పించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. విచారణ జరుపుతున్నామని మల్కాపురం ఇన్చార్జ్ సీఐ దాశరథి చెప్పారు. రెచ్చిపోయిన టీడీపీ అల్లరిమూక ●యల్లనూరు: శింగనమల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి ఎన్నికల ప్రచారంలో టీడీపీ అల్లరిమూక రెచ్చిపోయింది. దీంతో ప్రశాంతంగా ఉన్న యల్లనూరు మండలం గొడ్డుమర్రి గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వివరాలు... శుక్రవారం ఉదయం గొడ్డుమర్రిలో శ్రావణి ఎన్నికల ప్రచార సమయంలో టీడీపీకి చెందిన అల్లరి మూకలు ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలకు సైలెన్సర్లు తీసేసి హల్చల్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ గిరిబాబు, సిబ్బంది అక్కడకు చేరుకుని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కమిటీ సభ్యుల నియామకంఅనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లాకు చెందిన నాయకులను ఎన్నికల కమిటీ సభ్యులుగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. నియమితులైన వారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మిద్దె కుళ్లాయప్ప(శింగనమల), రాష్ట్ర కార్యదర్శిగా గౌస్ బేగ్(అనంతపురం), విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తిరువీధుల లోకేష్కుమార్ (అనంతపురం), విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా ఎద్దుల నవీన్కుమార్ రెడ్డి (ఉరవకొండ), అనంతపురం జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా గుజ్జల పోతులయ్య (అనంతపురం), జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా లబ్బే రాఘవ (అనంతపురం), జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడిగా పల్లె వినోద్కుమార్రెడ్డి (తాడిపత్రి), అనంతపురం నగర కార్యదర్శిగా యు.లోక్నాథరెడ్డి, నగర కార్యదర్శిగా బి. రామమోహన్ రెడ్డి ఉన్నారు. -
అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలి
● సిబ్బందికి కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశం అనంతపురం అర్బన్: జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్లో (డీసీసీసీ) పనిచేసే సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్ ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఎస్పీ అమిత్ బర్దర్తో కలిసి కలెక్టర్ శుక్రవారం తనిఖీ చేశారు. స్టాటిస్టిక్ సర్వైలెన్స్ టీమ్ యూనిట్ నుంచి జిల్లాలో చెక్పోస్టుల వద్ద లైవ్ స్ట్రీమింగ్ను వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివరాలను రిజిస్టర్లో పక్కాగా నమోదు చేయాలని చెప్పారు. వెబ్కాస్టింగ్ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలన్నారు. చెక్పోస్టుల వద్ద లైవ్ స్ట్రీమింగ్, ఎఫ్ఎస్టీ వాహనాల లైవ్ స్ట్రీమింగ్, జీపీఎస్ ద్వారా వాహనాల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. రాత్రి సమయంలో లైవ్ స్ట్రీమింగ్ బాగా జరుగుతోందా...? ఏవైనా సమస్యలు ఉన్నాయా..? అంటూ అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, నోడల్ అధికారి ఉమామహేశ్వరమ్మ, డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు. జగన్ పాటకే భయపడ్డారు! ● హిందూపురంలో టీడీపీకి ఓటమి భయం ● వైఎస్ జగన్ పాటలు పెట్టారంటూ పచ్చ నేతల గొడవ ● వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి.. ముగ్గురికి గాయాలు హిందూపురం అర్బన్: ప్రజాభిమానం మెండుగా ఉన్న వైఎస్ జగన్ పేరు చెబితేనే టీడీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ‘భళి రా.. భళి భళి రా..భళి రా..పులివెందులలో పుట్టింది పులి రా’ అంటూ జనం వైఎస్సార్ సీపీ జెండా పట్టుకుని ఆనందంతో నృత్యాలు చేస్తుంటే టీడీపీ నాయకులు చూసి తట్టుకోలేక ఘర్షణకు దిగుతున్నారు. ఈక్రమంలోనే ముద్దిరెడ్డిపల్లికి చెందిన టీడీపీ నేతలు హద్దులు దాటి ప్రవర్తించారు. గురువారం బాలకృష్ణ సతీమణి వసుంధర ముద్దిరెడ్డిపల్లిలో రోడ్ షో నిర్వహించారు. అదే సమయంలో అక్కడే వైఎస్సార్ సీపీ ప్రచార జీపు కూడా ఉంది. అందులో జగన్ పాటలు వినిపిస్తుండటంతో పచ్చమూకలు రెచ్చిపోయాయి. జగన్ పాటలు ఎందుకు పెట్టారంటూ దౌర్జన్యానికి దిగారు. స్థానికులు నచ్చ జెప్పటంతో అప్పటికి వెనుతిరిగారు. అనంతరం పలువురు టీడీపీ నాయకులు అక్కడ గుమికూడటంతో.. వైఎస్సార్సీపీ నాయకులూ అక్కడికి చేరుకున్నారు. ఇంత చిన్న విషయానికి రాద్ధాంతం అవసరం లేదని వైఎస్సార్ సీపీ నేతలు చెబుతుండగానే... టీడీపీ నాయకులు రెచ్చి పోయారు. వైఎస్సార్ సీపీ నాయకులు లోకేష్, నాగభూషన్రెడ్డి, నవీన్, బాబు, అసీఫ్లపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో లోకేష్తో పాటు బాబు, నవీన్లకు గాయాలు కాగా, వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీంతో టీడీపీ నేతలు కూడా దాడిలో తమకూ గాయాలయ్యాయని ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలోనూ ఇరువర్గాల మధ్య గొడవ ప్రారంభం కాగా, పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం వైఎస్సార్ సీపీ నేతలు దాడులకు తెగబడిన టీడీపీ నేతలపై వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ నేతలపై టీడీపీ నేతలూ ఫిర్యాదు చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
కలల సాకారం కోసం పోరాడితేనే 'స్టార్'
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)
మీ భూములకు జగన్ గ్యారెంటీ.. హిందూపురం సిద్ధం ప్రచారంలో జనసందోహం (ఫొటోలు)
తెలుగులో స్ట్రీమింగ్కు వచ్చేసిన హాలీవుడ్ హిట్ సినిమా
అసభ్య వీడియోల కేసు.. ప్రజ్వల్పై మరో లుక్అవుట్ నోటీసు
RCB vs GT: ఆర్సీబీ జోరు కొనసాగేనా?
ముంబైని ముంచేసిన కేకేఆర్
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
Advertisement