-
జాతీయ కిక్బాక్సింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
నిర్మల్టౌన్: రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు ఈనెల 1 నుంచి 2వ వరకు వనపర్తిలో నిర్వహించారు. ఇందులో నిర్మల్ జిల్లా నుంచి పలువురు క్రీడాకారులు పాల్గొని అద్భుత ప్రతిభ కనబర్చారు. ఆరు బంగారు పతకాలు, ఒక వెండి పతాకం సాధించి జాతీయస్థాయికి ఎంపికయ్యారు. వీరిలో ఎల్.నాగలక్ష్మి 32 కేజీలు లైక్ కాంటాక్ట్, కె.సాహితీ 37 కేజీలు లైట్ కాంటాక్ట్ , కె.దివ్య 32 కేజీలు ఫైన్ ఫైట్, ఎం.అక్షయ 42 కేజీలు ఫైన్ఫైట్, ఎల్.సుజల 53 కేజీలు కిక్ లైట్, సీహెచ్.నక్షత్ర 70 కేజీలు లైట్ కాంటాక్ట్లో బంగారు పతకాలు సాధించారు. ఎం.శశివర్ధన్ 72 కేజీలు లైట్ కాంటాక్ట్లో వెండి పతాకం సాధించారు. ఈనెల 21 నుంచి 26 వరకు పూణేలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో వీరు పాల్గొననున్నట్లు కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చందుల స్వామి తెలిపారు. -
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక చెల్లదు
మారిన రాజకీయ పరిస్థితులు.. అప్పటికి ఇప్పటికీ రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహించారు. అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా దండే విఠల్ను ప్రకటించినప్పటికీ పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తూ ఇదే పార్టీలో ఉన్న సారంగా పూర్ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి కూడా నామినేషన్ వేశాడు. ఉపసంహరణ విషయంలో అప్పుడు మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినా పత్తిరెడ్డి దిగిరాలేదు. ఇదిలా ఉంటే ఆరోజు 24 మందిలో 22 మంది నామినేషన్ ఉపసంహరించుకున్నారని ఎన్నికల అధికారులు ప్రకటించా రు. అందులో పత్తిరెడ్డి కూడా ఉన్నట్టు కూడా తెలిపారు. అయితే తన ప్రమేయం లేకుండానే ఫోర్జరీ సంతకాలతో తన నామినేషన్ను బీఆర్ఎస్ నేతలు ఉపసంహరింపజేశారని ఆయన ఆరోపించాడు. దీనిపై హైకోర్టును ఆశ్రయించాడు. తాజాగా తీర్పు వెలబడింది. కాగా ప్రస్తుతం మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి ఇద్దరూ కాంగ్రెస్లోనే ఉండటం గమనార్హం. -
‘బీజేపీతోనే అభివృద్ధి’
సారంగపూర్: మోదీ పదేళ్ల పాలనలో దేశం సుభిక్షంగా ఉందని అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని, మళ్లీ అధికారిమిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని సాయినగర్తండా, రాంసింగ్తండా, దుప్యాతండా, ఆదివాసిగూడ గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో డంపింగ్ యార్డులు, వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతివనాలకు కేంద్రమే నిధులు మంజూరు చేసిందని వివరించారు. చిరు వ్యాపారులకు రుణాలు, మహిళల ఆర్థిక ఎదుగుదలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. హిందువుల 500 ఏళ్ల కల అయిన అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని పే ర్కొన్నారు. నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీనేత మహేశ్వర్రెడ్డిని ఆదరించినట్లుగానే తన ఎంపీగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్రెడ్డి, సత్యనారాయణగౌడ్, రాజేందర్రెడ్డి, విలాస్, విజయ్, తిరుమలచారి, నానక్ సింగ్, గంగారెడ్డి, తేజు, రాజారెడ్డి, మధు పాల్గొన్నారు. -
రాహుల్ సభ ఏర్పాట్లు పరిశీలన
నిర్మల్చైన్గేట్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 5న కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ నిర్మల్లో ప్రచార సభ నిర్వహించనున్నారు. ఈమేరకు సభా స్థలిని ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్చార్జి మంత్రి సీతక్క, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణతో కలిసి శుక్రవారం పరిశీలించారు. రాహుల్గాంధీ బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, టీపీసీసీ కార్యదర్శి సత్తు మల్లేశ్, ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ అజ్మీరా శ్యామ్నాయక్, మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలచారి, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్లో చేరికలు.. జిల్లా కేంద్రంలోని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్క సమక్షంలో గొల్లపేట, భాగ్యనగర్ కాలనీలకి చెందిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీతక్క వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
ఇంటి నుంచే ఓటేశారు..
నీటి కష్టాలు తీరేదెన్నడు..? కడెం మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతాలను నీటి కష్టాలు వెంటాడుతున్నా యి. మిషన్ భగీరథ పథకం ఇక్కడ మాత్రం జాడలేదు. వాతావరణం ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. వేడిగాలులు వీస్తాయి. ఉదయం నుంచే వేడి అధికంగా ఉంటుంది. వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. IIIలోu లోక్సభ ఎన్నికల్లో భాగంగా 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు ఈసారి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం ఈమేరు ఓట్ ఫ్రమ్ హోమ్ కార్యక్రమాన్ని ఎన్నికల సిబ్బంది శుక్రవారం చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఫామ్ 12డీ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఓటర్ల ఇంటికి వెళ్లి వారి సంతకాలు, వేలి ముద్రలు సేకరించి ఇంట్లోనే రహస్యంగా ఓటు వేయించారు. భైంసాటౌన్ పట్టణంలోని పురాణబజార్కు చెందిన శతాధిక వృద్ధురాలు చివాటే అన్నపూర్ణబాయి(104) అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోస్టల్ బ్యాలట్ ద్వారా ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకోగా, ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనూ శుక్రవారం పోస్టల్ బ్యాలట్ ద్వారా ఇంటి నుంచే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుంటాల మండలంలో శతాధిక వృద్ధులు లసుంబాయి, లింబగిరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్ /భైంసాటౌన్/కుంటాలనిర్మల్లో ఓటేస్తున్న వృద్ధురాలు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే: సీఎం జగన్
భార్యాభర్తలిద్దరూ స్టార్ క్రికెటర్లే.. అతడు కాస్ట్లీ.. ఆమె కెప్టెన్!(ఫొటోలు)
టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు.. తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
నాకు జాబ్ ఇవ్వండి.. నేనే రూ.40 వేలిస్తా!
రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement