-
ఎండ ప్రచండం
ఫ ఆరు మండలాల్లో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రత భువనగిరిటౌన్ : భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. శుక్రవారం జిల్లాలోని ఆరు మండలాల్లో 45 డిగ్రీలకు పైగా, ఏడు మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా వలిగొండ మండల కేంద్రంలో 45.5డిగ్రీల ఎండ కాసింది. మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. -
ఎన్నికల్లో ఏ సమస్యలూ రావద్దు
సాక్షి, యాదాద్రి : ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో, సజావుగా జరగాలని, ఏ చిన్న సమస్య తలెత్తకుండా చూడాలని, అందుకు మైక్రో అబ్జర్వర్లు కీలకంగా వ్యవహరించాలని లోక్సభ ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాబర్ట్సింగ్ క్షేత్రిమయుమ్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో భువనగిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన మైక్రో అబ్జర్వర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు, సలహాలు చేశారు. మైక్రో అబ్జర్వర్లు క్షేత్రస్థాయిలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుండాలని, అనెగ్జర్ –28 ప్రకారం 18 అంశాలపై జనరల్ అబ్జర్వర్కు ఎప్పటికప్పుడు నేరుగా నివేదికలు అందజేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలపై దృష్టి సారించాలని, పోలింగ్ రోజు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన విధివిధానాలు అమలు జరుగుతున్నాయా లేదా పరిశీలించాలన్నారు. మాక్ పోలింగ్ మొదలుకొని పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఏ చిన్న సమస్య వచ్చినా, అవకతవకలు జరిగినా తక్షణమే సమాచారం ఇవ్వాలని కోరారు. మైక్రో అబ్జర్వర్లకు ట్రైనర్లు కడారి నర్సిరెడ్డి, హరినాథ్రెడ్డి వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఫ ఎన్నికల సాధారణ పరిశీలకుడురాబర్ట్సింగ్ క్షేత్రిమయుమ్ -
No Headline
గ్రామం ఉష్ణోగ్రత వలిగొండ 45.5 కొలనుపాక 45.4 నారాయణపురం 45.2 యాదగిరిగుట్ట 45.2 ఆత్మకూర్(ఎం) 45.1 జనగామ 45.1 మోటకొండూరు 44.9 మర్యాల 44.9 భువనగిరి 44.9 చౌటుప్పల్ 44.3 బీబీనగర్ 44.2 జలాల్పురం 44.0 ఉష్ణోగ్రతలు ఇలా.. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఐదుగురు నామినేషన్లు
నల్లగొండ: నల్లగొండ – వరంగల్– ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి శుక్రవారం ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న రెండు సెట్లు, స్వతంత్ర అభ్యర్థులుగా మాధవపెద్ది వెంకట్రెడ్డి ఒక సెట్, చంద్రశేఖర్ రెండు సెట్లు నామినేషన్ పత్రాలను నల్లగొండ కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అందజేశారు. అదేవిధంగా అలియన్స్ డెమొక్రటిక్ రీఫామ్స్ పార్టీ అభ్యర్థి ఈడ శేషగిరిరావు ఒక సెట్, తెలంగాణ సకల జనుల పార్టీ అభ్యర్థి నందిపాటి జానయ్య ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. -
చెక్కు, డీడీ రూపంలోనే చెల్లించాలి
ఫ ఎన్నికల వ్యయ పరిశీలకుడు కళ్యాణ్ కుమార్ దాస్ నల్లగొండ: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేసిన రోజు నుంచి ఫలితాలు వెలువడే వరకు చేసే ఎన్నికల ఖర్చును చెక్కు లేదా డీడీ రూపంలో మాత్రమే చెల్లించాలని నల్లగొండ జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు కళ్యాణ్ కుమార్ దాస్ తెలిపారు. శుక్రవారం నల్లగొండ కలెక్టరేట్లో అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల వివరాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. అభ్యర్థులు ఎన్నికలు పూర్తయ్యే వరకు కేవలం రూ.10వేల వరకు మాత్రమే నగదు ఖర్చు చేసే అవకాశం ఉందన్నారు. ఆ మొత్తం బ్యాంకు నుంచి డ్రా చేసి ఖర్చు చేయాలన్నారు. మిగతా ఖర్చులు మొత్తం చెక్కు లేదా డీడీ రూపంలో చెల్లించాలన్నారు. ఆయన వెంట సహాయ వ్యయ పరిశీలకుడు సురేష్, అకౌంటింగ్ టీం సభ్యులు, పోటీలో ఉన్న అభ్యర్థులు ఉన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకోవాలి
మరింత ఆలస్యంగా..?
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement