-
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
సాక్షి, కృష్ణా జిల్లా: జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీని అభిమానులు చిత్తుచిత్తుగా ఓడించాలంటూ మాజీ మంత్రి కొడాలి నాని పిలుపునిచ్చారు. గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలు అంటే తనకు, సీఎం జగన్కు అమితమైన ప్రేమ. అందుకే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టామని తెలిపారు.‘‘పార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్కు నమ్మక ద్రోహం చేసి.. పార్టీని లాక్కున్న నీచుడు చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. ‘‘అన్న ఎన్టీఆర్ వారసులు.. అభిమానులెవరు టీడీపీలో ఉండరు.. చంద్రబాబు వెంట నడవరు. పది మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జండా పట్టుకొని టీడీపీ కార్యక్రమాలకు వెళితే... ఆ పార్టీ కార్యకర్తలు తన్ని తరిమేసే పరిస్థితి అనేక చోట్ల చూశాం. మన కుటుంబ సభ్యుడైన ఎన్టీఆర్ అభిమానులపై దాడులు చేయవద్దని చంద్రబాబుగాని.. లోకేష్ గాని తమ కార్యకర్తలకు ఎప్పుడు చెప్పలేదు. అభిమానులందరూ కష్టపడి టీడీపీని గెలిపిస్తే.. జూనియర్ ఎన్టీఆర్ను తుంగలో తొక్కుతారు.. లోకేష్ను అందలం ఎక్కిస్తారు’’ అని కొడాలి పేర్కొన్నారు.‘‘పెద్ద ఎన్టీఆర్ను దొంగలాంటి చంద్రబాబు మోసం చేస్తే.. జూనియర్ ఎన్టీఆర్ను ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియాలో తిట్టిస్తున్నారు. నేను తిరిగే కారుకు ఎన్టీఆర్.. వైఎస్సార్ రెండు ఫోటోలు పెట్టుకుని దమ్ముగా ధైర్యంగా తిరుగుతాను. ఎన్టీఆర్.. వైఎస్సార్ నాకు రెండు కళ్లు. తెలుగుదేశం పార్టీ గౌడ.. యాదవ.. మత్స్యకార.. ఇతర బీసీ సామాజిక వర్గాలను విస్మరించింది. కనీసం వారికి సీట్లు కూడా కేటాయించని పరిస్థితి. సీఎం జగన్ బీసీ కులాల అభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి.. అనేక రాజ్యాంగ పదవులు ఇవ్వడమే కాక.. రాజ్యసభ స్థానాలు ఇస్తూ.. ఎమ్మెల్యే ఎంపీ సీట్లను సగం వారికే కేటాయించింది’’ అని కొడాలి నాని చెప్పారు.‘‘ప్రజలను నమ్ముకొని ధైర్యంగా ముందుకు వెళుతున్న సీఎం జగన్కు.. నాకు అభిమానులు మద్దతుగా నిలవాలి. జూ.ఎన్టీఆర్ను ఒక విఐపిగా గౌరవిస్తాం’’ అని కొడాలి పేర్కొన్నారు. -
దగాకోరు చంద్రబాబుతో తస్మాత్ జాగ్రత్త: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబు చెప్పేవన్నీ మాయ మాటలేనని.. కూటమి మేనిఫెస్టోలో మోదీ ఫొటో మాయమైందని మాజీమంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ జనం గుండెల్లో గూడు కట్టుకున్నారన్నారు.‘‘జగన్ను కూలదోయడానికి కూటమి జట్టు కట్టుకట్టారు. మాయ మాటలతో ప్రజలను మోసం చేసేందుకు పక్కా ప్రణాళికతో వస్తున్నారు. చంద్రబాబు ముగ్గురు ఫోటోలతో కూటమి అని బయల్దేరాడు. మేనిఫెస్టో నాటికి మూడు ఫోటోలు కాస్తా రెండు ఫోటోలయ్యాయి. సూపర్ 6 అంటూ ఇంటింటికీ పాంప్లెట్లు పంచారు. ఇప్పుడేమో మేనిఫెస్టోకు బీజేపీ ఆర్ధిక అనుమతులు లేవంటున్నాడు. చంద్రబాబు ఇచ్చిన ప్రకటనల్లో ఇప్పుడు పవన్ ఫోటో మాయం చేశాడు. చంద్రబాబు మేనిఫెస్టోలో ఫోటోలతో పాటు హామీలు కూడా ఒక్కొక్కటి మాయమవుతున్నాయి. నాలుగు వేల పెన్షన్ అంటూ ఇంటింటికీ తిరిగి ఊదరగొట్టారు. ఇప్పుడు సూపర్ సిక్స్ నుంచి చివరి పేజీలోకి పోయింది. ఈ రోజు ఇచ్చిన ప్రకటనలో అసలు పెన్షనే లేకుండా ఎత్తేశారు’’ అని పేర్ని నాని ఎద్దేవా చేశారు.పేర్ని నాని మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే:నిన్న మోదీ..నేడు పవన్ కల్యాణ్ ఫోటోలు మాయం:⇒చంద్రబాబు, మోదీ, పవన్ కల్యాణ్లు ఈ రాష్ట్రాన్ని ఉద్దరిస్తామని కూటమిగా ఏర్పడ్డారు. ⇒సీఎం జగన్ లాంటి జనం గుండెల్లో గూడు కట్టుకున్న ప్రజా నాయకుడిని కూలదోయాలనే కుట్రతో ముగ్గురూ కలిశారు ⇒వారు జట్టు కట్టి మాయ మాటలతో ప్రజల్ని వంచించాలని పక్కా ప్రణాళికతో వస్తున్నారు⇒బీజేపీతో నేను కలిశానంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే అని చంద్రబాబు అంటారు⇒జగన్ను కూలదోయడం కోసం పవన్ కల్యాణ్తో కలిశానని చెప్తున్నాడు⇒ముగ్గురు ఫోటోలతో బయలుదేరిన ఆయన మేనిఫెస్టో విడుదలలో మూడు ఫోటోలు రెండు ఫోటోలు అయ్యాయి⇒మోదీ మాయమయ్యాడు. చంద్రబాబు, పవన్ కల్యాణే మిగిలారు⇒ముందు సూపర్ సిక్స్ అని చంద్రబాబు, వవన్, మోదీ ఫోటోలతో ఇంటింటికీ పాంప్లెట్ ఇచ్చారు⇒మేనిఫెస్టోలో మోదీ ఫోటో మాయమైంది. ఎందుకయ్యా అంటే మా మేనిఫెస్టోకి బీజేపీ ఆర్థిక పరమైన ఒత్తాసు లేదని చెప్తున్నారు⇒ఈ మేనిఫెస్టో అమలు చేయాలంటే రెండు లక్షల కోట్ల వరకూ కావాలి. .అంత మోసం మేం చేయలేం అని బీజేపీ తప్పుకుంది⇒ఈ రోజు చంద్రబాబు రాష్ట్రంలోని పత్రికలన్నిటికీ కోట్లు ఖర్చు పెట్టి ప్రకటనలు ఇచ్చుకున్నాడు⇒సరే పాపపు సొమ్ము ఉంది కాబట్టి ప్రకటనలు ఇచ్చుకుంటాడు. ఈ ప్రకటనలో పవన్ కల్యాణ్ మాయం⇒ముందు ముగ్గురం అన్నాడు.. మేనిఫెస్టోలో మోదీ మాయమయ్యాడు. ఎన్నికల దగ్గరయ్యే కొద్దీ పవన్ కల్యాణ్ కూడా మాయంఫోటోలే కాదు.. ఆయనిచ్చిన హామీలు మాయం:⇒ఫోటోలే కాదు..చంద్రబాబు ఇచ్చిన హామీలు కూడా మాయమై పోతున్నాయి. ⇒ఇంటింటికీ సూపర్ సిక్స్ పేరుతో ఊదరగొట్టారు. డబ్బా కబుర్లు చెప్పారు. ⇒ఈ రోజు ఇచ్చిన ప్రకటనలో వారి సూపర్ సిక్స్లో నాలుగు వేల పింఛన్ ఎత్తేశారు.⇒రూ.4వేలు పింఛన్ అని ముందు ఊదరగొట్టారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ దాన్ని కనిపించకుండా చేస్తున్నాడు.⇒మేనిఫెస్టోలో నాలుగు వేల పింఛన్ చివరి పేజీకి వెళ్లిపోయింది. ఈ రోజు అసలు కనిపంచనే లేదు.⇒ఇవాళ అప్పుడే చంద్రబాబు దగాకోరుతనం, మోసం మొదలైపోయింది.⇒ఇంతకు ముందు చంద్రబాబు ఓట్లు వేయించుకున్న తర్వాత మోసం మొదలు పెట్టేవాడు. ⇒ కానీ ఇప్పుడు ఇంకా పోలింగ్ కాకముందే మోసం మొదలుపెట్టాడు.⇒1994లో ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం, 50 రూపాయలకే హార్స్పవర్ విద్యుత్, మద్యపాన నిషేదం అని చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.⇒1995లో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ఎగిరి ఆ కుర్చీలో కూర్చున్న చంద్రబాబు రెండు రూపాయల కిలో బియ్యాన్ని వెంటనే ఐదున్నర రూపాయలు చేశాడు.⇒వ్యవసాయ విద్యుత్లో హార్స్పవర్ రూ.50 ఉన్నదాన్ని రూ.650 చేశాడు.⇒రామారావు గారు పెట్టిన మద్యపాన నిషేదాన్ని ఎత్తేశాడు.⇒అంటే 1994 నుంచే మేనిఫెస్టోపై దగా చేయడం చంద్రబాబుకు అలవాటు.⇒1999లో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలో 25 లక్షల ఉద్యోగాలిస్తాను..లేకపోతే కుటీర పరిశ్రమలు పెట్టుకోడానికి ఆర్థిక సాయం అన్నాడు.⇒బలహీనవర్గాలకు ఐదేళ్లలో 35 లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తానన్నాడు.⇒ఏపీలో ఉన్న ప్రతి ఒక్క పాఠశాలను పక్కా భవంతిగా చేస్తానన్నాడు.⇒చట్టసభల్లో మహిళలకు 3వ వంతు రిజర్వేషన్కి నేను బాధ్యత తీసుకుంటాను అన్నాడు. ⇒ఆయన పోరాటం చేయలేదు.. కనీసం తన పార్టీలో పది శాతం మందికి కూడా టికెట్లు ఇవ్వలేదు.⇒మహిళా బ్యాంకులు ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఎక్కడున్నా చూశారా మీరు? ⇒పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయి వరకూ మహిళలకు ఉచిత విద్యాసౌకర్యం అన్నాడు. ఎక్కడన్నా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడా?⇒2009లో కూడా మేనిఫెస్టో ఇచ్చాడు కానీ ఆయన మాటలు ఎవరూ నమ్మలేదు.⇒వైఎస్సార్ ఆ రోజు రెండే హామీలిచ్చారు. ప్రతి వ్యక్తికి 6కేజీల బియ్యం, 7 గంటల నిరంతర విద్యుత్ ఇస్తానని చెప్పారు.⇒చంద్రబాబు ఆరోజు డబ్బులు వేస్తానని ఇళ్లలో డమ్మీ ఏటీఎం కార్డులు పంచిపెట్టాడు.రైతు రుణమాఫీ చేయకపోగా... ఆశకు హద్దుండాలన్న వ్యక్తి చంద్రబాబు:⇒2014కు వచ్చే సరికి 600 హామీలు ఇచ్చాడు.. వాటిలో ఒక్కటీ అమలు చేయలేదు.⇒పేదవాళ్లకు మూడు సెంట్లు స్థలం అన్నాడు. అమలు చేయలేదు.⇒పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.25వేలు ఇస్తానన్నాడు. డ్వాక్రా రుణాలు రూ.14వేల కోట్ల రుణాల మాఫీ అన్నాడు. ఏదీ చేయలేదు.⇒రైతులకు రూ.85 వేల కోట్ల రుణమాపీ చేస్తాను అన్నాడు. ⇒వారి అడబిడ్డల నగలను కూడా బ్యాంకుల నుంచి విడిపించి ఇంటికి తెచ్చిస్తానన్నాడు. ⇒మాఫీ చేయకపోగా..ఆశకు హద్దుండాలయ్యా అన్నాడు.⇒మళ్లీ 2024 వచ్చింది. మళ్లీ బయలుదేరి మేనిఫెస్టో అంటాడు.⇒రెండు స్థలం అన్నాడు. 2014లో మూడు సెంట్లు అని మూడు గజాలు కూడా ఇవ్వలేదు.⇒ఇంటికో ఉద్యోగం చొప్పున 20 లక్షల ఉద్యోగాలట. 2014లో కూడా కోటి ఉద్యోగాలు..జాబు రావాలంటే బాబు రావాలన్నాడు. ⇒ఒక్క ఇంటికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. ఇస్తానన్న నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు.⇒రాష్ట్రంలో ఒక్క బాబుగారి కొడుక్కి తప్ప ఎవరికి జాబు వచ్చింది?⇒లోకేశ్ బాబుకు తప్ప రాష్ట్రంలో ఏ బాబుకూ ఉద్యోగం రాలేదు⇒అందుకే ఈ దొంగ మేనిఫెస్టో నుంచి మోడీ తెలివిగా తప్పుకున్నాడని భావించాలి⇒ఇక పవన్ కల్యాణ్ ఫోటో కూడా మాయమైంది కాబట్టి ఆయననూ బాబు పక్కన పెట్టేసినట్లే⇒వీళ్ల ఫోటోలకు సూపర్ సిక్స్ లో ఇచ్చిన నాలుగు వేల పింఛన్ హామీ కూడా మాయమైపోయింది⇒మోదీ, పవన్ కల్యాణ్లు ఆటలో అరటిపండ్లు..⇒నేను ఎంతటి వాడినైనా మోసం చేయగలను అనే ధీమా చంద్రబాబుది⇒ఈ దగాకోరు, నక్కజిత్తుల చంద్రబాబునాయుడితో తస్మాత్ జాగ్రత్త!⇒ జనసేన కార్యకర్తలు కూడా ఈ రోజు చంద్రబాబు ఇచ్చిన ప్రకటన చూడండి⇒మేమందరం ఒకటే అన్నాడు. నేనూ పవన్ కల్యాణ్ కవల పిలల్లం అన్నాడు⇒పవన్ కల్యాణ్ వీరుడు, సూరుడు ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి వచ్చాడు అన్నాడు..ఏకంగా ఫోటోనే లేపేశాడు⇒ఆంధ్రరాష్ట్ర ప్రజలారా..తస్మాత్ జాగ్రత్త⇒జగన్ అంటే ఒక నడిచే నమ్మకం. చంద్రబాబు అంటే ఒక ముసలి అపనమ్మకం⇒ఒక్కసారి ఆలోచన చేసుకోండి. జాగ్రత్తపడండి⇒చంద్రబాబు కన్నా ఈ రాష్ట్ర ప్రజలు తెలివైన వారని నా నమ్మకం⇒కొడుకు కోసం ఈ మోసపు మాటలతో పిల్లమొగ్గలు వేస్తున్న చంద్రబాబును తెడ్డుకాల్చి వాతపెట్టి పంపిస్తారని నా బలమైన నమ్మకంచంద్రబాబు, నిమ్మగడ్డలకు వృద్ధుల ఉసురు తగలకమానదు:⇒చంద్రబాబు తన బంధువైన నిమ్మగడ్డతో కోర్టుల్లో కేసులు వేయించి పింఛన్ ఇంటికి ఇవ్వకుండా చేశాడు.⇒వాలంటీర్ల ద్వారా సాఫీగా పంచే పింఛను అందించకుండా వృద్ధులను ముప్పుతిప్పలు పెడుతున్న వ్యక్తి చంద్రబాబే.⇒మొన్న సచివాలయాలకు రావాల్సిన పరిస్థితి వస్తే..ఈ రోజు బ్యాంకులకు రావాల్సిన పరిస్థితి వచ్చింది.⇒ఆ చంద్రబాబు బంధువు బ్యాంకుల్లో వేస్తే మంచిదే కదా అని చెప్పుకొస్తున్నాడు.⇒రాష్ట్రంలోని 65 లక్షల మంది పింఛన్దారుల్లో 45 లక్షల మంది ఎకౌంట్లు మైనస్లలో ఉన్నాయి. ⇒ఈ పింఛన్ డబ్బు పడగానే దానికి జమ అయిన పరిస్థితితో వృద్ధులంతా లబోదిబోమంటున్నారు.⇒చంద్రబాబు, ఆయన చుట్టమైన నిమ్మగడ్డకు కచ్చితంగా వృద్ధుల ఉసురు తగులుతుంది. -
ఏపీ హైకోర్టులో జనసేనకు ఎదురుదెబ్బ!
సాక్షి, విజయవాడ: జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల సంఘం నిర్ణయంపై కోర్టును ఆశ్రయించిన జనసేనకు హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. స్వతంత్ర అభ్యర్థులకు గాజ గ్లాస్ గుర్తు కేటాయింపుపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.కాగా, ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈసీకి వ్యతిరేకంగా జనసేన కోర్టుకు వెళ్లించింది. దీంతో, ఈ పిటిషన్పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జనసేన పోటీ చేయని చోట స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని హైకోర్టు సమర్థించింది.ఈ క్రమంలోనే జనసేన ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట మాత్రమే ఈ గుర్తును స్వతంత్రులకు కేటాయించవద్దని ఎన్నికల సంఘానికి సూచించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు మార్గదర్శకాలపై సమీక్ష చేయనున్నట్టు ఈసీ తెలిపింది. -
కృష్ణమ్మ తీరం విజయహారం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రగతి పరుగులు పెడుతోంది. విజయవాడను సుందరంగా తీర్చిదిద్దడంతో కృష్ణా నదీతీరం, దుర్గ గుడి, ప్రకాశం బ్యారేజీలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అంబేడ్కర్ స్మృతివనం నగరానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. మరోవైపు మెగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, జగనన్న కాలనీలు, ప్రభుత్వ భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మూలపాడు వద్ద బటర్ఫ్లై పార్కును అందంగా తీర్చిదిద్ది 150 రకాల ఔషధ మొక్కలు పెంచుతున్నారు. కొండపల్లి బొమ్మల పరిశ్రమ అంతరించిపోకుండా వాటి తయారీదారులకు చేయూతనిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బందరులో అత్యధిక జనాభా ఆధారపడి పనిచేసే రోల్డ్గోల్డ్ పరిశ్రమకు ప్రోత్సాహం కలి్పస్తున్నారు. అక్కడి ప్రజల చిరకాల కోరిక పోర్టు నిర్మాణం కల నెరవేరనుంది. గిలకలదిండిలో మత్స్యకారులకు ఉపాధి కలి్పంచేందుకు హార్బర్ నిర్మాణం పూర్తి కావస్తోంది. మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తయి 150 మంది విద్యార్థులతో తరగతులు జరుగుతున్నాయి. రుద్రవరంలో కృష్ణా యూనివర్సిటీ భవనాలు నిర్మాణం పూర్తి చేసుకొని కార్యకలాపాలు జరుగుతున్నాయి. విశాఖ బీచ్ తరహాలో ఆహ్లాదకరమైన వాతావరణం కలి్పంచేందుకు బందరు బీచ్లో రిసార్ట్స్, పార్కులు, గేమ్ జోన్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.రహదారులు.. అదరహో ⇒విజయవాడ బెంజిసర్కిల్ జంట ఫ్లై ఓవర్లు అందుబాటులోకి ⇒కృష్ణా నదిపై రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి కావడంతో తప్పిన ముంపు సమస్య ⇒వెస్ట్ బైపాస్ పనులు వేగంగా సాగుతున్నాయి తూర్పు బైపాస్ ప్రతిపాదనలకు తుది రూపు⇒జాతీయ రహదారి మొత్తం 17,761 మీటర్ల పొడవున 18 రహదారుల డివైడర్లను హరిత హారాలుగా తీర్చిదిద్దారు. ⇒నగరంలో 16 పార్కులను అభివృద్ధి చేశారు. ఎయిర్పోర్టు కారిడార్కు రూ.17 కోట్లతో తుదిరూపు ⇒మిషన్ క్లీన్ కృష్ణా కింద నదీ తీరాన్ని శుభ్రం చేశారు. నగరంలోని ప్రధాన కాలువల్లో బోటింగ్కు సన్నాహాలు ⇒కనకదుర్గా నగర్ గోశాల వద్ద రూ.216.05 కోట్లతో వివిధ పనులకు శంకుస్థాపన, రూ.23.145 కోట్లతో పూర్తి చేసిన పనులు ప్రారంభం ⇒ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతంలో రూ.102 కోట్లతో డ్రెడ్జింగ్ పనులు రూ.62 కోట్లతో మున్నేరు కాల్వలఆధునికీకరణ పనులు ⇒ విజయవాడలో కాలువలపై రూ.31 కోట్లతో ఏడు బ్రిడ్జిల నిర్మాణం ⇒ జిల్లాలో తొలి విడతలో 1.07 లక్షల మందికి ఇళ్లు మంజూరు.. ⇒ వాటిలో 14,935 ఇళ్ల నిర్మాణం పూర్తి ⇒ కాల్వ గట్టు, ప్రభుత్వ స్థలాలు, రోడ్ల పక్కన నివాసం ఉండే వారిని తొలగించి వాంబే కాలనీలో ఇళ్లు కేటాయింపు ⇒ పటేల్నగర్, ప్రకాష్నగర్, వడ్డెరకాలనీ, నందావరి కండ్రిక ప్రాంతాల్లో గతంలో 13,915 ఇళ్లు నిర్మించి కొన్నింటినే రిజి్రస్టేషన్ చేశారు ⇒ జలజీవన్ మిషన్ కింద 77,123 గృహాలకు నీరు అందించేందుకు రూ.77.9 కోట్లు ఖర్చు చేశారు అంబేడ్కర్ స్మృతివనం అద్భుతం⇒ నగరాభివృద్ధికి చేసిన ఖర్చు – రూ.1,383 కోట్లు ⇒అంబేడ్కర్ స్మృతివనం కోసం చేసిన ఖర్చు– రూ.400 కోట్లు ⇒ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులు– రూ.239.19 కోట్లు ⇒ జీజీహెచ్లో నాడు–నేడు ద్వారా అభివృద్ధి పనులకు– రూ.170 కోట్లు ⇒ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిర్మాణం కోసం – రూ.150 కోట్లు ⇒ కృష్ణా నది రక్షణ గోడ నిర్మాణం కోసం చేసిన ఖర్చు – రూ.394.27 కోట్లు ⇒బెంజి సర్కిల్ మొదటి ఫ్లైఓవర్ పొడవు– 2.27 కి.మీ ⇒ దాని నిర్మాణానికి చేసిన ఖర్చు– రూ.80 కోట్లు ⇒ బెంజి సర్కిల్ రెండవ ఫ్లైఓవర్ పొడవు – 1.703 కి.మీ ⇒ దాని నిర్మాణానికి చేసిన ఖర్చు – రూ.96 కోట్లు ⇒బెంజిసర్కిల్ వెస్ట్, ఈస్ట్ సైడ్ సరీ్వస్ రోడ్లకు ఖర్చు చేస్తున్న మొత్తం : రూ.40 కోట్లు ⇒ గన్నవరం విమానాశ్రయం హాఫ్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం చేసిన ఖర్చు –రూ.23.75 కోట్లు ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్ వైద్యసేవలు విజయవాడ జీజీహెచ్లో కార్డియోథోరాసిక్ సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, పిడియాట్రిక్ సర్జరీ వంటి సూపర్ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులోకి వచ్చాయి. రూ.150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిరి్మంచారు. అత్యాధునిక క్యాథ్ల్యాబ్, ఎంఆర్ఐ స్కాన్, 120 స్లైస్ సీటీ స్కాన్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందుకోసం వైఎస్ జగన్ సీఎం కాగానే రూ.30 కోట్లు విడుదల చేశారు. రూ.170 కోట్లతో నాడు–నేడు పనులు చురుగ్గా సాగుతున్నాయి. జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలకు రూ.437 కోట్లు ఖర్చు చేశారు. జిల్లాలోని ఏ కొండూరు మండలంలోని గిరిజన తండాల్లో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రోగుల కోసం రూ.40 కోట్లతో తాగునీటి ప్రాజెక్టులు చేపట్టారు. ఏ కొండూరు పీహెచ్సీలోనే డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసి ప్రతి నెలా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. అర్హులైన వారికి రూ.10 వేల పింఛన్ ఇస్తున్నారు. పురోగతిలో బెజవాడ బైపాస్ పనులు ప్యాకేజీ–3 చిన్న అవుటుపల్లి –గొల్లపూడి పొడవు: 30 కి.మీ ⇒ దీనికోసం ఖర్చు చేస్తున్న మొత్తం: రూ.1,148 కోట్లు ప్యాకేజీ–4 ⇒ గొల్లపూడి–చినకాకాని – 17.88 కి..మీ ⇒ కృష్ణా నదిపై ఆరువరుసల బ్రిడ్జి పొడవు– 3.12 కి.మీ ⇒ దీనికోసం ఖర్చు చేస్తున్న మొత్తం రూ.757 కోట్లు ⇒ ఈస్ట్ బైపాస్ ప్రతిపాదనలు ⇒ బైపాస్ పొడవు: 49.3 కి.మీ ⇒ కృష్ణా నదిపై నిర్మించే బ్రిడ్జి పొడవు – 3.750 కి.మీ ⇒ అంచనా వ్యయం మొత్తం –రూ.4,607.80 కోట్లు -
Doctor Family Suicide: నేను లేక.. మీరుండలేరు..!
పటమట(విజయవాడతూర్పు): తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చి ఆత్మహత్య చేసుకున్న ఆర్థోపెడిక్ సర్జన్ ధారావత్ శ్రీనివాస్(40) ఘటన విజయవాడ నగరంలో మంగళవారం సంచలనం రేకెత్తించింది. చిరకాల స్వప్నమైన ఆస్పత్రిని ప్రారంభించిన అనతికాలంలోనే దాన్ని వదులుకోవాల్సి రావడంతో మనస్తాపానికి గురైన అతను తాను అల్లారుముద్దుగా సాకుతున్న ఇద్దరు పిల్లలు, తనతో జీవితాన్ని పంచుకున్న భార్యను, తనను పెంచి పెద్ద చేసిన తల్లిని హతమార్చి, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణం విజయవాడ గురునానక్ నగర్లో జరిగింది. శ్రీనివాస్ అన్న దుర్గాప్రసాద్ పటమట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన విజయవా డ పోలీస్ కమిషనర్ రామకృష్ణ, డీసీపీ అదిరాజ్సింగ్ కేసు దర్యాప్తు చేపట్టారు.పోలీసుల కథనం మేరకు.. విజయవాడ గురునానక్ నగర్లోని మారుతీ కో– ఆపరేటివ్ కాలనీలో ప్లాట్ నంబరు 53లోని భవనంలో నివసించే ధారావత్ శ్రీనివాస్ గుంటూరులో వైద్య విద్య అభ్యసించారు. అనంతరం విజయవాడలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రాక్టీస్ చేశారు. సొంత ఆస్పత్రి ప్రారంభించాలని కలలు కన్నారు. ఈ క్రమంలో తన సేవింగ్స్తోపాటు ఓ ప్రైవేటు బ్యాంక్ నుంచి లోను తీసుకుని ఇటీవల సూర్యారావుపేటలో శ్రీజ ఆర్థోపెడిక్ క్లినిక్ ప్రారంభించారు. పూర్తిస్థాయిలో యంత్రపరికరాలు ఏర్పాటు చేసేందుకు డాక్టర్ ధారవత్ శ్రీనివాస్ స్నేహితులైన నగరంలోని ఆస్పత్రుల్లో పనిచేసే ముగ్గురు వైద్యులు అప్పులు ఇచ్చారు. దీంతో అప్పులు రూ.3 కోట్లకు చేరాయి. బ్యాంకు రుణం, స్నేహితుల వద్ద చేసిన అప్పులతో ఆస్పత్రి నడుపు తున్నా అనుకున్నంత స్థాయిలో ఆదాయం రావడంలేదు. అదే సమయంలో తామిచ్చిన అప్పులు తీర్చాలని స్నేహితులు ఒత్తిడి చేశారు. అప్పు కింద ఆస్పత్రి లో 90 శాతం వాటాను వారు సొంతం చేసుకున్నారు.వారం క్రితమే దారుణానికి వ్యూహం తన ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు మరింతగా దిగజారడంతో తానే ప్రాణంగా జీవిస్తున్న తల్లి, భార్య, పిల్లలు అనాథలవుతారని డాక్టర్ శ్రీనివాస్ భావించారు. వారి ప్రాణాలు తీసి, ఆత్మహత్య చేసుకోవా లని భావించారు. ఏప్రిల్ 25వ తేదీన గురునానక్ నగర్లోని సూపర్ మార్కెట్కు వెళ్లి రెండు చాకులు కొన్నారు. మంగళవారం తెల్లవారుజామున నిద్రపోతున్న తల్లి రమణమ్మ (65), భార్య ఉషా (38), కూతురు శైలజ (11), శ్రీహాన్ (6) మెడపై కత్తితో గాట్లు పెట్టి హత్య చేశారు. ఉదయం 6.30 గంటల సమయంలో ఇంటిలో ఉన్న కొంత నగదు, నగలు, ఆస్తి తాలూక డాక్యుమెంట్లను ఓ బ్యాగులో సర్ది దానిని కారులో పెట్టారు. అనంతరం ఎదురింటి గేటుకు ఉన్న డబ్బాలో తన అన్న దుర్గాప్రసాద్కు రాసిన లెటరు, తన కారు తాళం చెవిని అందులో వేశారు. తిరిగి తన ఇంటికి వచ్చి వరండాలో ఉరివేసుకున్నారు.తన వాట్సాప్కు వాయిస్ మెసేజ్ ఆత్మహత్య చేసుకునే ముందు డాక్టర్ శ్రీనివాస్ తన వాట్సాప్ నంబరుకు వాయిస్ మెసేజ్ పెట్టుకున్నారు. తన పరిస్థితికి తానే కారణమని, తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసు కుంటున్నానని పేర్కొన్నారు. తాను లేకపోతే తన కుటుంబ సభ్యులు అనాథలు అవుతారన్న భయంతో వారిని కూడా హతమార్చుతున్నానని ఆ మెసేజ్లో వివరించారు. క్లూస్ టీంతో ఆధారాల సేకరణ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబ సభ్యుల మరణాలపై విచారణ చేపట్టిన పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ డాగ్స్కా్వడ్, క్లూస్ టీంను రప్పించారు. శ్రీనివాస్ హత్యకు వినియోగించిన చాకులు, దాని బిల్లు, సూపర్ మార్కెట్ సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు డాక్టర్ శ్రీనివాసే కుటుంబ సభ్యులను హత్యచేశాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.మోసాన్ని జీరి్ణంచుకోలేక..! ఆర్థోపెడిక్ సర్జన్గా విజయవంతంగా కొనసాగు తున్న శ్రీనివాస్కు సొంతగా ఆస్పత్రి ఏర్పాటు చేయాలన్నది కల. ఆ మేరకు సూర్యారావుపేటలో శ్రీజ ఆర్థోపెడిక్ క్లినిక్ను ప్రారంభించారు. దాని నిర్వహణ కోసం స్నేహితులు అప్పులు ఇచ్చారు. ఆ అప్పులు తీర్చాలని ఒత్తిడిచేసి చివరకు ఆస్పత్రిలో 90 శాతం వాటా రాయించుకున్నారు. అనంతరం ఆస్పత్రిలోనే పనిచేయాలని శ్రీనివాస్ను ఒత్తిడిచేశారు. దీంతో మనస్తాపం చెంది శ్రీనివాస్ తల్లి, భార్య, పిల్లలను హత మార్చి ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్ తండ్రి జమలయ్య నాయక్ విజయవాడ తూర్పు ఏసీపీగా పనిచేశారు. అతని అన్న నల్గొండ జిల్లా జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీనివాస్ అత్తింటి వారు కూడా ఆర్థికంగా స్థితి మంతులే. శ్రీనివాస్ కుటుంబ సభ్యుల మరణానికి తీర్చలేనంత అప్పులు కారణం కాదని, తన స్నేహితులే మానసిక క్షోభకు గురిచేశారని బంధువులు ఆరోపిస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ
డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.
కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు
జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది
నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!
శోభిత పోస్ట్.. సమంత స్టైలిష్ట్ రిప్లై
ముంబై ఎయిర్పోర్టులో 12 కోట్ల విలువైన బంగారం, ఐఫోన్లు సీజ్
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement