-
‘బండి’ని గెలిపించాలి..
కరీంనగర్: కరీంనగర్ మండలంలోని బొమ్మకల్లో శుక్రవారం బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్కు మద్దతుగా ఆ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు.నల్ల చెరువులో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు, ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులను కలిసి ఎంపీగా సంజయ్ చేసిన అభివృద్ధి పనులను వివరించారు. ఆయనను మరోసారి గెలిపించాలని కోరారు. అనంతరం అభివృద్ధి పనులకు సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు దాది సుధాకర్, పాశం తిరుపతి, చిందం అశోక్, దాసరి రమణారెడ్డి, పుట్టపాక శ్రీధర్, పెద్ది లక్ష్మణ్, కాల్వ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.సంజయ్కి పలు బీసీ సంఘాల మద్దతు..బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కి శుక్రవారం పలు బీసీ సంఘాలు మద్దతు తెలిపాయి. నాయకులు మాట్లాడు తూ.. జనాభాలో 50 శాతం ఉన్న బీసీలందరూ ఏకమై, బీసీ అభ్యర్థి అయిన సంజయ్ని గెలి పించాలని కోరారు. ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒక్క బీజేపీ మాత్రమే బీసీ అభ్యర్థికి అవకాశం ఇచ్చిందని,ఈ అవకాశాన్ని ఉపయోగించుకొ ని, ఆయనను గెలిపించాలని పిలుపునిచ్చారు. నాయకులు కేశిపెద్ది శ్రీధర్ రాజు, ఎన్నం ప్రకా శ్, నాగుల కనకయ్య గౌడ్, నారోజు రాకేశ్చారి, దొగ్గలి శ్రీధర్, మియాపురం రవీంద్రాచారి, కాయితోజు బ్రహ్మచారి, రంగు సంపత్ గౌడ్, మాదాసు సంజీవ్, బోయిని ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్లు తొలగిస్తారన్నది అపోహ
విద్యానగర్: ఈడబ్ల్యూఎస్ ద్వారా అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించిన బీజేపీనే గెలిపించాలని కరీంనగర్ రెడ్డి సంఘం నాయకులు కోరారు. శుక్రవారం కరీంనగర్ ప్రెస్భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం ప్రతినిధులు రేకులపల్లి రవీందర్ రెడ్డి, కాసర్ల మధుకర్ రెడ్డి మాట్లాడారు. రిజర్వేషన్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాటలను వక్రీకరించారని తెలిపారు. రాజ్యాంగాన్ని సవరించి, రిజర్వేషన్లు తొలిగిస్తారన్నది అపోహ మాత్రమేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజానీకానికి సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు రావుల కిరణ్ రెడ్డి, కాల్వ పూర్ణచందర్ రెడ్డి, కూర మైపాల్ రెడ్డి, న్యాలకొండ ప్రసన్న కుమార్రెడ్డి, వర్ణ పెద్దిరెడ్డి, దారం జగన్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీలో చేరిక
కరీంనగర్టౌన్: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఆయా నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు శుక్రవారం బీజేపీలో చేరారు. జిల్లా రైస్మిల్లర్స్ అసోసియేషన్ కోశాధికారి గుర్రం ఆనందరెడ్డి, యాదవ సంఘం పట్టణ అధ్యక్షుడు గాలి రవి యాదవ్, పలువురు మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, కుల సంఘాల అధ్యక్షులు, వార్డు మెంబర్లకు ఎంపీ బండి సంజయ్ కరీంనగర్లోని తన కార్యాలయంలో కండువాలు కప్పి, ఆహ్వానించారు. నేటి ‘ఎమర్జింగ్ భారత్’కు తరలిరండి కరీంనగర్టౌన్: ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 6 గంటలకు కరీంనగర్లో నిర్వహిస్తున్న ఎమర్జింగ్ భారత్ కార్యక్రమానికి మేధావులు తరలివచ్చి, విజయవంతం చేయాలని సంస్థ చైర్మన్ డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్లోని ప్రజ్ఞాభారతి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో మన దేశం ప్రపంచానికి మార్గనిర్దేశం చేస్తూ విశ్వ గురువుగా ఎదిగిందని పేర్కొన్నారు. అభివృద్ధిలో దూసుకుపోతోందని, దీనికి కారణం బలమైన నాయకత్వమేనని తెలిపారు. ఎమర్జింగ్ భారత్ కార్యక్రమంలో సమగ్ర సమాచారం తెలియజేయడానికి ప్రముఖ కాలమిస్ట్, పొలిటికల్ అనలిస్టు, రచయిత శంతను గుప్త వస్తున్నారని అన్నారు. ప్రజ్ఞాభారతి ప్రధాన కార్యదర్శి మందల నగేశ్రెడ్డి, జె.సత్యనారాయణ రెడ్డి, దేశిని శ్రీనివాస్, వెచ్చ మురళి, తుమ్మల రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఈడీ పరామర్శవిద్యానగర్: ఆర్టీసీ గ్రాండ్ హెల్త్ చాలెంజ్లో భాగంగా కాల్ హెల్త్ సంస్థచే తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు గుర్తించిన, కరీంనగర్ ప్రతిమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉద్యోగులను కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.వినోద్కుమార్, రీజినల్ మేనేజర్ ఎన్.సుచరిత శుక్రవారం పరామర్శించారు. ఆర్టీసీ అన్ని విధాలా ఆదుకుంటుందని బాధితుల కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. వైద్యులతో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కరీంనగర్–1 డిపోకు చెందిన హెల్పర్ శ్రీనివాస్కు బైపాస్ సర్జరీ కాగా, 2 డిపో డ్రైవర్ యూసుఫ్కు స్టంట్లు వేశారు. వీరితోపాటు మరో నలుగురు ఉద్యోగులు ఇన్పేషెంట్స్గా చికిత్స పొందుతుండగా అందరి ఆరోగ్యం మెరుగ్గా ఉందని డాక్టర్లు తెలిపారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సెక్రటరీ కె.యుగంధర్ రెడ్డి, కరీంనగర్–1 డిపో హెల్త్ వలంటీర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. -
మద్దతు ధర పెంచి, బోనస్ ఇవ్వాలి
కరీంనగర్: పంటలకు మద్దతు ధర పెంచి, బోనస్ ఇవ్వాలని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి కె.విశ్వనాథ్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో ఆయన రైతులను కలిసి మాట్లాడారు. ఏ–గ్రేడ్ వరి ధాన్యానికి క్వింటాల్కు రూ.2,203, బీ–గ్రేడ్ ధాన్యానికి రూ.2,183 ఎటూ సరిపోవని, రూ.3,500 ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరి పంటకు రూ.500 బోనస్, రైతు రుణమాఫీ, రైతు బీమా, సబ్సిడీ ఎరువులు వెంటనే అమలు చే యాలని డిమాండ్ చేశారు. మార్కెట్లో రైతుల కు తాగునీరు, బాత్రూం, మరుగుదొడ్లు, విశ్రా ంతి గదులు తదితర సౌకర్యాలు వెంటనే కల్పించాలని కోరారు. వారికి నష్టం చేసే మిల్ల ర్లు, దళారులపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తేమ, మట్టి, తాలు లెక్కలోకి తీసుకోకుండా ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు రత్నం రమేశ్, బాబు, సంతోష్, దుర్గ న్న, రాజేందర్, మల్లవ్వ, సుగుణ, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు. -
లెక్క దాటితే పదవికే గండం
కరీంనగర్రూరల్: కరీంనగర్ లోక్సభ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. ఇప్పటికే ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, అధికారులు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అభ్యర్థుల రోజువారీ ఖర్చుల వివరాలను పక్కాగా నమోదు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఒక్కొక్కరు రూ.95 లక్షలకు మించి ఖర్చు చేయరాదు. ఒకవేళ పరిమితి దాటితే ఎన్నికైనా సరే పదవి కోల్పోయే ప్రమాదముంది. గతంలో ఎన్నికల ఖర్చు రూ.70 లక్షలుండగా ప్రస్తుతం పెంచారు. ప్రచార సరళి, సభలు, సమావేశాలు, వాహనాల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. నామినేషన్ నుంచే లెక్క షురూ.. అభ్యర్థులు నామినేషన్ వేసినప్పటి నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతీదానికి లెక్క చూపెట్టాల్సి ఉంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ ర్యాలీలతో నామినేషన్ వేయగా మిగతా పార్టీలవారు సాదాసీదాగా ఐదుగురితో కలిసి వేశారు. నామినేషన్ వేయడానికి ముందు అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరిచి ఎన్నికల లావాదేవీలను నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రలోభాల నియంత్రణకు నిఘా ఎన్నికల్లో డబ్బు, ఇతర ప్రలోభాలను నియంత్రించేందుకు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక స్టాటిక్ సర్వైలెన్స్, వీడియో సర్వైలెన్స్, వీడియో వీవింగ్, ఎంసీసీ బృందాల ఆధ్వర్యంలో నిఘా పెట్టారు. అభ్యర్థులకు సంబంధించిన ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. సభల్లో ఏర్పాటు చేసిన టెంట్లు, కుర్చీలు, వాహనాలు ఇతర సామగ్రితోపాటు ప్రచార కార్యక్రమాలను వీడియో తీస్తున్నారు. వ్యయ పరిశీలకులు.. ఎన్నికల్లో ధన ప్రవాహం కట్టడికి ఎన్నికల సంఘం ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ అధికారులను వ్యయ పరిశీలకులుగా నియమించింది. కరీంనగర్కు అశ్వినీకుమార్ పాండేను నియమితులయ్యారు. అభ్యర్థుల ఖర్చును వ్యయ బృందాలు మూడుసార్లు తనిఖీ చేస్తాయి. నామినేషన్ మొదలుకొని చివరివరకు, ఉపసంహరణ తర్వాత ఓట్ల లెక్కింపు వరకు నియోజకవర్గం పరిధిలోనే ఉంటారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన 27 రోజులకు మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. అభ్యర్ధుల వ్యయాలను ఖర్చులను పరిశీలించి, వ్యత్యాసం ఉంటే ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన 30 రోజుల్లోపు అభ్యర్థులు ఖర్చు వివరాలను బిల్లులతో సహా అధికారులకు సమర్పించాలి. పరిమితికి మించి ఖర్చు చేసినా, వ్యయానికి సంబంధించిన లెక్కలను నిర్దేశించిన సమయంలో చూపకున్నా అనర్హత వేటు పడుతుంది. తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతారు. గెలిచినా, ఓడినా ఖర్చు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈసీ నిర్ణయించిన ధరలు రోజువారీగా.. టెంట్కు రూ.2,500, జనరేటర్ రూ.7 వేలు, ఫంక్షన్హాల్ రూ.20 వేలు, ప్రచార రథం రూ.3 వేలు, పోస్టర్లు రూ.5 వేలు, హోర్డింగ్లు రూ.6 వేలు, డప్పులు ఒకరికి రూ.700, కళాబృందాలు ఒకరికి రూ.1000, ఎల్ఈడీ స్క్రీన్ రూ.5 వేలు, ఎయిర్ కూలర్ రూ.1,500, ఇన్నోవా రూ.3,500, ఆటో రూ.1,500, వ్యాన్ రూ.7 వేలు, టీ రూ.10, స్నాక్స్ రూ.15, సాదాభోజనం రూ.40, హోటల్ చార్జీలు రోజుకు రూ.2 వేలు, వీడియో నెలకు రూ.45 వేలు ఖర్చు చేయాలి. ఎంపీ అభ్యర్థి ఖర్చు రూ.95 లక్షలు గతంలో రూ.70 లక్షలే ఎలక్షన్ కమిషన్ నిఘా
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే: సీఎం జగన్
భార్యాభర్తలిద్దరూ స్టార్ క్రికెటర్లే.. అతడు కాస్ట్లీ.. ఆమె కెప్టెన్!(ఫొటోలు)
టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు.. తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
నాకు జాబ్ ఇవ్వండి.. నేనే రూ.40 వేలిస్తా!
రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement