-
టీడీపీ చీప్ పాలిట్రిక్స్
సాక్షి రాయచోటి: సార్వత్రిక ఎన్నికల తరుణంలో టీడీపీ నేతలు ప్రజాభిమానం లేక ఓట్ల కోసం జిమ్మిక్కులకు తెరలేపుతున్నారు. ఏదో ఒక రకంగా ప్రజలను బురిడీ కొట్టించాలన్న ఆలోచనతో కొత్త రకం వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎలాగోలా తిమ్మిని బమ్మిని చేసి నమ్మిస్తే ఓట్ల కాలం కాస్త గడిచిపోతుందని భావిస్తున్నారు. ఆది నుంచి కూడా తెలుగుదేశానికి ప్రజాక్షేత్రంలో అంతంత మాత్రమే బలమున్న తరుణంలో కుట్రలు, కుయుక్తులకు పదును పెడుతున్నారు. ప్రజాస్వామ్యంలో నిబద్ధతతో గెలవాలన్న సంకల్పానికి పాతర వేసి పైశాచిక వ్యవహారాలకు తెర తీస్తుండడం విస్మయానికి గురి చేస్తోంది. సోషల్ మీడియాలో దుష్ప్రచారం అన్నమయ్య జిల్లాలో తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వైఎస్సార్సీపీపై దుష్ప్రచారానికి ఒడిగట్టారు. ప్రధానంగా ల్యాండ్ టైట్లింగ్ చట్టం సాకుగా చూపుతూ సోషల్ మీడియాలో గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. అగ్రిమెంటు పేపర్పై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటో వేసుకున్నట్లు చూపుతూ షేర్ చేస్తున్నారు. ఏదో ఒక రకంగా ఓటర్లను భయపెట్టో...ఏమార్చో ఓటును టీడీపీకి వేసేలా కుట్రలు చేయడంపై ప్రజాస్వామ్య వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రాజంపేటతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాట్సాప్ గ్రూపులతోపాటు ఇతర సోషల్ మీడియాలోనూ జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. అగ్రిమెంటు పేపర్తోపాటు మ్యాటర్ను జత చేసి దుష్ప్రచారం చేస్తుండటంపై వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అంతేకాకుండా వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ వ్యవహారం తీసుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆది నుంచి అంతే అన్నమయ్య జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నిచోట్ల బలంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏదో ఒక రకంగా ఓటర్లను తమవైపు తిప్పుకోవాలన్న ఆలోచనతో టీడీపీ ఆది నుంచి ఏదో ఒక వ్యూహానికి తెర తీస్తోంది. ఒక్క ల్యాండ్ టైట్లింగ్ యాక్టే కాకుండా ఎన్నికల సమయం కావడంతో రకరకాల ప్రచారాలను తెరపైకి తెస్తూ ప్రజలను మభ్యపెట్టే చర్యలకు ఉపక్రమిస్తున్నారు. గతంలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని మారుస్తున్నారని కూడా ఇదే తరహాలో గోబెల్స్ ప్రచారం నిర్వహించారు. దుష్ప్రరాన్ని నమ్మరాదు: తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మరాదని వైఎస్సార్సీపీ నేతలు ప్రజలకు పిలుపునిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి ప్రచారాలు మరిన్ని జరిగే అవకాశం ఉందని, వాటిని ప్రజలు విశ్వసించరాదని కోరుతున్నారు. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం టీడీపీ కుయుక్తులు దుష్ప్రచారానికి తెరతీసిన వైనం అగ్రిమెంట్ పేపర్లపై సీఎం ఫొటో కనిపించేలా చేసి అసత్య ప్రచారం -
7న ఊటీకి సమ్మర్ స్పెషల్ బస్సు
మదనపల్లె సిటీ: వేసవి సెలవులను పురస్కరించుకుని ఈనెల 7న ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఊటీకి సూపర్ లగ్జరి ప్రత్యేక బస్సు సర్వీసు నడపనున్నట్లు ఆర్టీసీ–1 డిపో మేనేజర్ మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. 7న రాత్రి మదనపల్లె డిపో నుంచి బయలుదేరి 8న ఉదయం ఊటీకి చేరుకుంటుందన్నారు. ఊటీ, కున్నూరు హిల్స్టేషన్, మైసూర్ చూసుకుని 10న ఉదయం మదనపల్లెకు చేరుకుంటుందన్నారు. రాను,ఫోను చార్జీ రూ.2800 చెల్లించాలన్నారు. ఫోన్ నంబర్లు 9346772487, 9441152934ను సంప్రదించాలని సూచించారు. మద్యం షాపుల ఆకస్మిక తనిఖీ కురబలకోట: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్నమయ్య జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎం. వినయ్బాబు శుక్రవారం కడప క్రాస్, అంగళ్లు, ములకలచెరువు మండలంలోని పెద్దపాళ్యంలోని ప్రభుత్వ మద్యం దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మద్యం స్టాకును, రికార్డులను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఈ మద్యం దుకాణాలు సెన్సిటివ్ షాపుల కింద ఉండడంతో ఎన్నికల నేపధ్యంలో అవకతవకలకు పాల్పడకుండా ఆకస్మిక సూపర్వైజర్లు, సేల్స్మెన్లు నిబంధనలకు లోబడి మద్యం దుకాణాలు నిర్వహించాలన్నారు. అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మదనపల్లె ఎకై ్సజ్ ఎస్ఐ జయనరసింహ పాల్గొన్నారు. స్మార్ట్బైక్ రూపొందించిన విద్యార్థులు మదనపల్లె సిటీ: అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుఽలు స్మార్ట్ బైక్ తయారుచేశారు. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న బి.లేపాక్షి, పి.నాగేశ్వరరెడ్డి, సాయికుమార్రెడ్డి, ఎం.శ్రీకాంత్, రాఘవేంద్ర కలిసి ఈ బైక్ తయారు చేశారు. ప్రాజెక్టు గైడ్ ప్రవీణ సహాయ,సహకారాలు అందించారు.ఈ బైక్ తయారీలో గేరింగ్ సిస్టం, బ్లూటూత్ డిజిటల్ డిస్ప్లే, జీపీఎస్ ట్రాకర్, సోలార్ సిస్టంను ఉపయోగించారు. ఈ స్మార్ట్ బైక్ను ఒకసారి చార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల నుంచి 80 కిలో మీటర్ల వరకు మైలేజీ వస్తుందని, చార్జింగ్కి 4 గంటల సమయం పడుతుందని విద్యార్థులు వివరించారు. కాలేజీ డైరెక్టర్ డాక్టర్ ఎస్.రామలింగారెడ్డి, ప్రిన్సిపాల్ సతీష్బాబు, ఈఈఈ హెడ్ వేణుగోపాల్రెడ్డి, అధ్యాపకులు తదితరులు శుక్రవారం ఈ బైక్ను ప్రదర్శించారు. -
ప్రధాని బహిరంగ సభకు పటిష్ట బందోబస్తు
కలికిరి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 8న కలికిరికి రానున్న నేపథ్యంలో కర్నూలు రేంజ్ డీఐజీ సీహెచ్ విజయరావు, అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావుతో కలిసి శుక్రవారం కలికిరిలో పర్యటించారు. ప్రధానమంత్రి పర్యటనకు ఎంపిక చేసిన హెలిప్యాడ్, అక్కడి నుంచి సభాస్థలం వరకు రోడ్డు మార్గం, బహిరంగ స్థలం ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ పీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, బందోబస్తుకు హాజరయ్యే సిబ్బంది అన్ని వేళలా అప్రమత్తంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. హెలిప్యాడ్, సభా స్థలం ఎక్కడా కూడా అనధికారికంగా డ్రోన్లు ఎగురవేయకూడదన్నారు. అలాగే ప్రధానమంత్రి హెలిప్యాడ్, రోడ్డుమార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. వైద్య బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు తగినన్ని మందులు అందుబాటులో ఉండేటట్లు చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజ్కమల్, డీఎస్పీ మహబూబ్ బాషా, సీఐలు, ట్రాన్స్కో, ఆర్అండ్బీ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బాబుది బూటకపు మేనిఫెస్టో
మదనపల్లె: ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ప్రకటించిన బూటకపు మేనిఫెస్టోను ప్రపంచ బ్యాంకు సైతం అమలు చేయలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పర్యటనకు శుక్రవారం వచ్చిన ఆయన సాక్షితో మాట్లాడుతూ.. ఓటు అడిగే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. 2014లో 100 పేజీల మేనిఫెస్టోలో 600 అబద్ధపు హామీలిచ్చి, ఏ ఒక్కటీ అమలుచేయలేదన్నారు. కేవలం క్యాపిటల్ చుట్టూ భూములను రియల్ ఎస్టేట్ చేసుకుని, లక్షల కోట్లు సంపాదించి, ఆ డబ్బులతో ఎన్నికల్లో ఖర్చుచేసి జగన్ను ఎదుర్కోవాలనే దురాలోచనతో ముందుకెళ్లారన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ నారాలోకేష్.. అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధప్రాతిపదికన క్యాపిటల్ భూములను అభివృద్ధి చేస్తామని చెబుతున్నారని, తండ్రీ, కొడుకులిద్దరికీ రాజధాని భూముల అభివృద్ధితో కోట్లు దోచేయడంపైనే ధ్యాస అధికమన్నారు. ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా మదనపల్లెను జిల్లా కేంద్రం చేస్తామన్న చంద్రబాబు.. తిరిగి రాయచోటిలో జిల్లా కేంద్రంగా కొనసాగిస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. పూర్తి నిరాశ, నిస్పృహలో కూరుకుపోయిన చంద్రబాబుకి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. మేనిఫెస్టోలోని హామీలను 99శాతం అమలుచేసి, ప్రతి పేద కుటుంబానికి మేలుచేసి, ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్సీపీ నాయకులు ఓట్లు అడిగే పరిస్థితి ఉంటే... జన్మభూమి కమిటీలు వేసుకుని, పచ్చచొక్కాలకే పథకాలు ఇచ్చే పరిస్థితి టీడీపీ పాలనదన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో ప్రతిదీ పారదర్శకంగా, అర్హతే ప్రామాణికంగా, కుల,మత, పార్టీలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి చేశాం కనుకే ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లి ఓటు అడుగుతున్నామన్నారు. 2019 నుంచి 2024 వరకు సీఎం జగన్మోహన్రెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమం ప్రజలందరికీ తెలుసన్నారు. పొరపాటున టీడీపీ అధికారంలోకి వస్తే క్యాపిటల్ భూముల అభివృద్ధి తప్ప ప్రజాసంక్షేమం, అభివృద్ధి గురించి పట్టించుకోరన్నారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, కొడుకు లోకేష్, బావమరిది బాలకృష్ణ, వదిన పురందేశ్వరి, దత్తపుత్రుడు పవన్కల్యాణ్లు పనిగట్టుకుని సీఎం జగన్మోహన్రెడ్డిపై, తనపై తిట్లపురాణం, గాలిమాటలు మాట్లాడటం చేస్తున్నారని, ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని చెప్పారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఓటుతో సరైన బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్అహ్మద్, నాయకులు ఎన్.శ్రీనాథరెడ్డి, వక్ఫ్బోర్డు చైర్మన్ ఖాదర్బాషా, మున్సిపల్ చైర్పర్సన్ జింకా వెంకటాచలపతి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ బ్యాంకు సైతం అమలు చేయలేదు జిల్లా కేంద్రాలపై బాబు ప్రకటనలు హాస్యాస్పదం అబద్ధపు హామీలివ్వడంలో బాబు దిట్ట వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి అందరికీ తెలుసు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -
బెడిసికొట్టిన జడ్జి రామకృష్ణ దాడి నాటకం
సాక్షి ప్రతినిధి, కడప: అన్నమయ్యజిల్లా బి.కొత్తకోటకు చెందిన సస్పెన్షన్లో ఉన్న జూనియర్ సివిల్ జడ్జి ఎస్.రామకృష్ణ ఇంటిపై దాడి ఘటన ఓ నాటకంగా తేలిపోయింది. దాడిచేసి ఇంటి కిటికీ అద్దాలను పగులగొట్టింది స్వయానా జడ్జి తమ్ముడు రామచంద్ర అని విచారణలో నిర్ధారించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడంతో నాటకానికి తెరపడింది. సోదరుల మధ్య కుటుంబ ఆస్తి పంపకాల విషయంలో తలెత్తిన విభేదాలను కూడా మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి ఆపాదించే ప్రయత్నం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మదనపల్లెలో గురువారం మీడియా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై జడ్జి రామకృష్ణ చేసిన ఆరోపణలు నిరాధారమని అర్థమైంది. గతంలోనూ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధం లేని వివాదంలోకి లాగడం కూడా ఇలాంటిదేనని స్పష్టమైంది. రామకృష్ణ చేసిన ఫిర్యాదులో నిందితుడు అతని తమ్ముడేనని తేల్చి ఈ మేరకు అరెస్ట్ చేసి 41 నోటీసు జారీ చేశామని బి.కొత్తకోట సీఐ సూర్యనారాయణ శుక్రవారం తెలిపారు. గతనెల 30న రాత్రి బి.కొత్తకోట కరెంట్ కాలనీలో ఉంటున్న రామకృష్ణ ఇంటివద్దకు వచ్చిన తమ్ముడు రామచంద్ర ఆస్తి పంపకాల గురించి ప్రశ్నించేందుకు ప్రయత్నించాడు, ఇంటిలో నుంచి రామకృష్ణ వెలుపలికి రాకపోవడంతో అక్కడే ఉన్న కట్టెను తీసుకుని గేటుకు కొట్టడంతో రామకృష్ణ బయటకు రాగా ఇద్దరి మధ్య ఆస్తి పంపకాలకు సంబంధించి వివాదం జరిగింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న గొడవతో రామచంద్ర కిటికీ అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ ఘటనపై గుర్తు తెలియని వ్యక్తులు తనను హతమార్చేందుకు దాడిచేశారని ఈనెల ఒకటిన రామకృష్ణ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, పరిసరాల్లో జరిపిన విచారణలో రామచంద్రే ఇంటి కిటికీ అద్దాలను ధ్వంసం చేసినట్టు తేలింది. ఈ కేసులో నిందితుడైన రామచంద్రను అరెస్టు చేశామని సీఐ తెలిపారు. రామచంద్రపై బి.కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఏడు కేసులు నమోదైనట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడైన జడ్జి తమ్ముడు రామచంద్ర అరెస్టు ప్రచారం కోసమే మంత్రి పెద్దిరెడ్డిపై ఆరోపణలు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
శోభిత పోస్ట్.. సమంత స్టైలిష్ట్ రిప్లై
ముంబై ఎయిర్పోర్టులో 12 కోట్ల విలువైన బంగారం, ఐఫోన్లు సీజ్
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
కాన్వాయ్ స్లో చేసి అంబులెన్స్కు దారిచ్చిన సీఎం జగన్ (ఫొటోలు)
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
ఎల్లో శారీలో హీరామండి హీరోయిన్ సంజీదా షేక్ లుక్స్.. ఫోటోలు
ఇంటింటి ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి (ఫొటోలు)
జగన్ పాటకే భయపడ్డారు!
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement