-
హామీలపై ఆశలు..
● కాంగ్రెస్ మేనిఫెస్టోలో జిల్లా అంశాల ప్రస్తావన ● ఐదు గ్రామాల విలీనంపై స్పష్టమైన హామీ ● మణుగూరు – రామగుండం రైల్వేలైన్కు చోటు ● కొత్తగా సింగరేణి పారిశ్రామిక కారిడార్సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో జిల్లాకు సంబంధించిన కీలక అంశాలకు చోటు దక్కింది. విలీన గ్రామాలు, సింగరేణి పారిశ్రామిక కారిడార్, మణుగూరు – రామగుండం రైల్వేలైన్, మైనింగ్ యూనివర్సిటీ వంటి కీలక అంశాలను మేనిఫెస్టోలో చేర్చడంతో జిల్లా వాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మహబూబాబాద్ లోక్సభ పరిధిలో.. జిల్లాలో ఇల్లెందు, పినపాక, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. ఈ నియోజకవర్గాలకు సంబంధించి పలు ముఖ్యమైన అంశాలను కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది. రాష్ట్ర విభజన నాటి నుంచి భద్రాచలం పుణ్యక్షేత్ర అభివృద్ధికి ప్రధాన ఆటంకంగా మారిన స్థల లభ్యత సమస్యను కాంగ్రెస్ పార్టీ పరిగణనలోకి తీసుకుంది. ఏపీలో కలిసిన ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తామని హస్తం పార్టీ హామీ ఇచ్చింది. పినపాక నియోజకవర్గానికి సంబంధించి మణుగూరు – రామగుండం రైల్వేలైన్ పనులు పూర్తి చేస్తామని పేర్కొంది. ఇల్లెందు నియోజకవర్గం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం – 2014లో పేర్కొన్న విధంగా బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో.. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో అశ్వారావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దీంతో పారిశ్రామికరంగానికి సంబంధించిన పలు అంశాల్లో కొత్తగూడెం నియోజకవర్గం పరిగణనలోకి వచ్చే అవకాశం ఉంది. సింగరేణి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇది కార్యరూపం దాల్చితే ఇల్లెందు – టేకులపల్లి – కొత్తగూడెం – మణుగూరు – సత్తుపల్లి మధ్య పారిశ్రామీకరణకు మరింతగా అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుత మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆచరణలోకి వస్తే.. కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 60 ఏళ్ల కిందటే కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ పేరుతో ఇక్కడ మైనింగ్ ఎడ్యుకేషన్ను ప్రారంభించారు. ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీ అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ చేసినప్పటికీ అనేక సమస్యలు ఈ కాలేజీలో తిష్ట వేశాయి. ఈ కాలేజీని మైనింగ్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేయాలని ఇప్పటికే అనేక వినతులు రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం లేదా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు యూనివర్సిటీ లేదు. ఈ నేపథ్యంలో మైనింగ్ యూనివర్సిటీ స్థాపన అంటూ జరిగితే కొత్తగూడేనికే అవకాశాలు ఎక్కువ. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం కొత్తగూడెం పర్యటనకు వస్తుండగా, ఒకరోజు ముందు ఈ మేనిఫెస్టో విడుదల కావడం తమకు లాభిస్తుందనే అంచనాలు కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నాయి.వీటికి చోటు దక్కలేదు.. తెలంగాణలోనే ఉద్యాన పంటలు ఎక్కువగా అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తరించి ఉన్నాయి. ప్రస్తుత మేనిఫెస్టోలో దీనికి సంబంధించి ఎలాంటి హామీ లభించలేదు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కీలకమైన సీతారామ ప్రాజెక్టు అంశంపైనా మేనిఫెస్టోలో ఏమీ పేర్కొనలేదు. దీంతో పాటు భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి వేడుకలను రాష్ట్ర పండుగగా గుర్తించే అంశం, ప్రత్యేక నిధుల మంజూరు వంటివి మరుగున పడిపోయాయి. అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో ప్రధానమైన పోడు భూమల సమస్య గురించి ౖపైపెనే స్పృషించారు తప్పితే లోతుల్లోకి వెళ్లలేదనే అభిప్రాయం నెలకొంది. -
నీట్కు ఏర్పాట్లు పూర్తి
● కొత్తగూడెం, పాల్వంచలో రెండు కేంద్రాలు ● హాజరు కానున్న 1,174 మంది ● సిటీ కో ఆర్డినేటర్ ఎం.వీ.ఎస్ రెడ్డి వెల్లడిపాల్వంచ : దేశ వ్యాప్తంగా వివిధ వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో ఈనెల 5న నిర్వహించే ‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పరీక్షల సిటీ కో ఆర్డినేటర్ ఎం.వి.ఎస్.రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తుండగా జిల్లా నుంచి 1,174 మంది హాజరు కానున్నారని వెల్లడించారు. కొత్తగూడెంలోని సింగరేణి డిగ్రీ, పీజీ కళాశాల కేంద్రంలో 478 మంది, పాల్వంచ నవభారత్ పబ్లిక్ స్కూల్లో 696 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని తెలిపారు. ఉదయం పరీక్ష 11.30 గంటల నుంచి మద్యాహ్నం 1.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నీట్ అడ్మిట్ కార్డు, ఒరిజినల్ ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో తీసుకుని రావాలని, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగ్లు లోనికి అనుమతించబోమని తెలిపారు. నిర్ణీత సమయం కంటే నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఎండ తీవ్రత ఉన్నందున విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. -
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
● కాంగ్రెస్వి మోసపూరిత వాగ్దానాలు ● బీఆర్ఎస్తోనే అన్ని విధాలా అభివృద్ధి ● ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామ పాల్వంచ/దమ్మపేట/అశ్వారావుపేటరూరల్: వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే పార్లమెంట్లో ప్రజల తరఫున గళం వినిపిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు అన్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి శుక్రవారం ఆయన పాల్వంచ, దమ్మపేట, అశ్వారావుపేటలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతోనే అధికారంలోకి వచ్చిందని, ఆరు గ్యారంటీల పేరుతో ప్రకటించిన మహాలక్ష్మి, రుణమాఫీ, రైతుబంధు పెంపు, తులం బంగారం తదితర పథకాల అమలులో విఫలమైందని విమర్శించారు. కేసీఆర్ పదేళ్లలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమం దిశగా పరిపాలన కొనసాగించారని చెప్పారు. ధాన్యం కొనుగోలుపై పార్లమెంట్లో కేంద్రాన్ని తాను నిలదీస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు మాట కూడా మాట్లాడకుండా ఉండిపోయారని ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే విఫలమైందని విమర్శించారు. సీఎంతో పాటు మంత్రులు అమలు చేయలేని హామీలు గుప్పిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. రైతు భరోసా, పెన్షన్, మహిళలకు నెలకు రూ.2,500, తులం బంగారం ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో ఓటడిగే హక్కు లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి నామ నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడగా అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, నాయకులు ఉప్పల వెంకటరమణ, కిలారు నాగేశ్వరరావు, మంతపురి రాజుగౌడ్, మల్లెల శ్రీరాంమూర్తి, మల్లెల రవిచంద్ర, పర్వతనేని రామకృష్ణ, వగ్గెల పూజ, సున్నం నాగమణి, భూక్యా ప్రసాద్, రావు జోగేశ్వరరావు, దారా యుగఽంధర్, దొడ్డాకుల రాజేశ్వరరావు, దొడ్డా రమేష్, అబ్దుల్ జిన్నా, బత్తుల మధుచంద్, దాసరి నాగేశ్వరరావు, కాల్వ ప్రకాశ్, చందు నాయక్, సింధు తపస్వీ, మంజుల, కొత్వాల సత్యనారాయణ, ముత్యాల ప్రవీణ్, ముత్యాల రమణమూర్తి, పరిటాల సుబ్బారావు, వీరన్న, మందపాటి మోహన్రెడ్డి, బిర్రం వెంకటేశ్వరరావు, జేకేవీ రమణారావు, సంపూర్ణ పాల్గొన్నారు. ఆనంద్, నామా నవీన్ పాల్గొన్నారు. -
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
సూపర్బజార్(కొత్తగూడెం): ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులంతా ఈనెల 6వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక ఆల సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 4,696 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, వారి కోసం జిల్లాలో ఐదు ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. పినపాక నియోజకవర్గంలో మణుగూరు ఐకేపీ కార్యాలయం, ఇల్లెందుకు సంబంధించి తహసీల్దార్ కార్యాలయం, కొత్తగూడెంలో ఆర్డీఓ కార్యాలయం, అశ్వారావుపేటలో వ్యవసాయ కళాశాల, భద్రాచలంలో ఆర్డీఓ కార్యాలయంలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటుహక్కును వినియోగించుకోవచ్చని వివరించారు. ర్యాండమైజేషన్ పూర్తి.. జిల్లాకు కేటాయించిన బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ పూర్తి చేశామని ప్రియాంక ఆల తెలిపారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాకు కేటాయించిన 1,931 బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ను రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో పూర్తి చేశామని చెప్పారు. పినపాక నియోజకవర్గానికి 312, ఇల్లెందుకు 302, కొత్తగూడేనికి 632, అశ్వారావుపేటకు 460, భద్రాచలానికి 225 బ్యాలెట్ యూనిట్లు కేటాయించామని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీఓ మధు, తహసీల్దార్ పుల్లయ్య, ఎన్నికల డీటీ రంగాప్రసాద్, నవీన్, కాంగ్రెస్, బీజేపీ, ఆప్ నాయకులు లక్ష్మణ్ అగర్వాల్, నోముల రమేష్, భాస్కర్ పాల్గొన్నారు. అత్యవసరమైతేనే బయటకు రండిఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని కలెక్టర్ ప్రియాంక ఆల కోరారు. దాహం వేయకపోయినా వీలైనప్పుడల్లా తగినంత నీరు తాగాలని అన్నారు. పార్క్ చేసిన వాహనాల వద్ద పిల్లలను, పెంపుడు జంతువులను వదలి వెళ్లొద్దని హెచ్చరించారు.ఎన్నికల సిబ్బందికి కలెక్టర్ సూచన -
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: మండల పరిధిలోని కేశవాపు రం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి శుక్రవారం పంచామృతాలతో వైభవంగా అభిషేకం నిర్వహించారు. మొదట అమ్మవారి జన్మస్థలం వద్ద పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆ తర్వాత పంచామృతాభిషేకం గావించి హారతి ఇచ్చారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతాలతో అభిషేకం, పంచహారతులు, నివేదన, నీరా జన మంత్రపుష్పం నిర్వహించారు. ఆ తర్వాత కుంకుమపూజ, గణపతి హోమం చేశారు. ఆయా కార్యక్రమాల్లో అర్చకులు, వేద పండితులతో పాటు ఈఓ సుదర్శన్ పాల్గొన్నారు. ఫిజియోథెరపీ సేవలు వినియోగించుకోండికొత్తగూడెంఅర్బన్: వేసవి సెలవుల్లో ఫిజియోథెరపీ సేవలు సద్వినియోగం చేసుకోవాలని డీఈ ఓ ఎం.వెంకటేశ్వరాచారి తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఫిజియోథెరపిస్ట్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. 18 ఏళ్ల లోపు దివ్యాంగులకు ప్రత్యేక సేవలు అందించేందుకు ఫిజియోథెరపీ డాక్టర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అన్ని మండల కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలలో ప్రతీ వారం ఈ సేవలు అందుతాయని, పిల్లల తల్లిదండ్రులు గమనించాల ని కోరారు. సమావేశంలో సమ్మిళిత విద్య కో ఆర్డినేటర్ ఎస్కే సైదులు, ఫిజియోథెరపిస్ట్లు కనక నాగు, కిషోర్బాబు, వసీమ్, ప్రభాకర్రావు, శ్రీనివాసరావు, జ్యోతి, శ్రీదేవి పాల్గొన్నారు. 5,044 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 775 మంది రైతుల వద్ద రూ.11.02 కోట్ల విలువైన 5,044.640 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీఏసీఎస్ల ఆధ్వర్యంలో 99, జీసీసీ ద్వారా 27, డీఆర్డీఏ నుంచి 10.. మొత్తం 136 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు వివరించారు. ఆయా కేంద్రాలలో మౌలిక సౌకర్యాలు కల్పించామని, రైతులు దళారుల ప్రలోభాలకు గురికాకుండా ప్రభుత్వ మద్ధతు ధరకు కొనుకోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. 17 శాతం కంటే ఎక్కువ తేమ ఉండకుండా చూడాలని కోరారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు (నెల్లూరు జిల్లా)
పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్ను ఉతికి ఆరేసిన ప్రిన్సిపాల్
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
తప్పక చదవండి
- పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
Advertisement