-
రాజకీయ ప్రకటనలకు అనుమతి తప్పనిసరి
ఏలూరు (మెట్రో): పోలింగ్ రోజు, పోలింగ్కు ముందు రోజు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియాలో ప్రచురించే రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ కమిటీ ముందస్తు అనుమతి తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ సూచించారు. అనుమతులు లేకుండా ఎలాంటి రాజకీయ ప్రకటనలను ప్రచురించరాదన్నారు. ఎన్నికల సందర్భంగా ఆవేశపూరితమైన, తప్పుదోవ పట్టించే లేదా ద్వేషపూరిత ప్రకటనల కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు, వార్తాపత్రికలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రాజకీయ ప్రకటనల విషయంలో ఎలక్షన్ కమిషన్కు సహకరించాలని కోరారు. కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ -
వైఎస్సార్ సీపీలో చేరికలు
నూజివీడు: అమలుకు సాధ్యం కాని మోసపూరిత హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి వైఎస్సార్సీపీని రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తనయుడు మేకా వేణుగోపాల అప్పారావు(చంటినాయన) అన్నారు. ముసునూరు మండలం గోగులంపాడు కొత్తూరుకు చెందిన టీడీపీ మాజీ ఎంపీటీసీ గంగుల పంగిడయ్య ఆధ్వర్యంలో 100 కుటుంబాలు గురువారం అర్ధరాత్రి చంటినాయన సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరారు. పల్లగాని రంగారావు, ఆకుల వెంకట్రావు, నల్లిబోయిన గోపి, తాళ్ల శివనాగరాజు, సాయల శివయ్య, జోనుబోయిన వెంకటేశ్వరరావు, గంగుల రాజగోపాల్, పాలా వడ్డీకాసులు, పటాపంచల గోపాలస్వామి, చిన్ను శివనాగరాజు తదితరులు చేరారు. వీరందరికి చంటినాయన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలన్నారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు మూల్పూరి నాగవల్లేశ్వరరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. వాసుబాబు సమక్షంలో జనసేన కార్యకర్తల చేరిక నిడమర్రు/గణపవరం: బువ్వనపల్లి, గణపవరం గ్రామాల్లోని జనసేనకు చెందిన 100 మంది కార్యకర్తలు శుక్రవారం బువ్వనపల్లి గ్రామంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో శుక్రవారం వైఎస్సార్ సీపీలోకి చేరారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి సంకు నాగశేషు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. వీరిని ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పార్టీ కండువాతో సాదరంగా వైఎస్సార్ సీపీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో సంకు ఏసుబాబు, చోడవరపు హరి ప్రసాద్, చేగోండి మహేంద్ర, ఎల్వీఎస్ ప్రకాష్, దూలం రాధాకృష్ణ, పిల్లా సాయిరామకృష్ణ, సంకు యశ్వంత్, స్వామి, కాస్యం బీబీ, ఆళ్ల డానీదుర్గ, సంకు చంద్రకళ తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల చాంబర్ అధ్యక్షుడు పుప్పాల మేరీ, గ్రామ పార్టీ అధ్యక్షుడు కాన్వెంట్ శ్రీను, సర్పంచ్ కిలారి సత్యవతి రవి, ఉప సర్పంచ్ వెల్లంకి నరేష్, కొట్టు నరేష్, సంకు శ్రీను, సంకు కొండలరావు నాయుడు తదితరులున్నారు. ఆళ్లనాని సమక్షంలో టీడీపీ నాయకులు, కార్యకర్తల చేరిక ఏలూరు (టూటౌన్): నగరంలోని 49వ డివిజన్కు చెందిన 50 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు పరసా శశిధర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆళ్ల నాని సమక్షంలో శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. శ్రీరామ్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వీరందరికీ ఎమ్మెల్యే ఆళ్ల నాని వైఎస్సార్ సీపీ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ ఒకటో డివిజన్ నాయకులు బోడ దుర్గారావు, ఆరేపల్లి సత్తిబాబు ఆధ్వర్యంలో వీరు పార్టీలోకి చేరారు. ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ చంద్రబాబు కూటమి కుట్రలు తిప్పికొట్టి వైఎస్సార్ సీపీని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ప్రతాప్ సమక్షంలో.. ఆగిరిపల్లి: మండలంలోని బొద్దనపల్లికి చెందిన 10 కుటుంబాలు వారు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరారు. టీడీపీ మండల క్లస్టర్ ఇన్చార్జి, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు నక్కన బోయిన సాంబశివరావు, ఒకటో వార్డు సభ్యుడు దొడ్ల నాగయ్య, చాగంటిపాటి శ్రీను, కందుల శ్రీనివాసరావుతో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలకు ఎమ్మెల్యే ప్రతాప్ కండువాలు కప్పి వైఎస్సార్ సీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ సీపీ మండల అధ్యక్షులు పల్లగాని నరసింహారావు, జిల్లా కార్యదర్శి మచ్చా హరిబాబు, గోళ్ళ ఇస్సాకు పీఏసీఎస్ అధ్యక్షులు బోయపాటి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ నాయకులు రావి విష్ణువర్దన్రావు, డీవీ రామారావు, గ్రామ పార్టీ అధ్యక్షులు మల్లవల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. టీడీపీ, జనసేన పార్టీల నుంచి వైఎస్సార్ సీపీలో చేరిక -
అనుమానాస్పద స్థితిలో బాలుడి మృతి
నూజివీడు: పట్టణంలోని జంక్షన్ రోడ్డులో ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని అమరావతి ఫర్నిచర్స్ యజమాని అయిన కొవ్వూరు రామారెడ్డికి ఇద్దరు కుమారులు. వీరిద్దరూ గురువారం రాత్రి ఇంట్లో ఒకే బెడ్రూమ్లో నిద్రించారు. అయితే తెల్లారేసరికి చిన్న కుమారుడు కొవ్వూరు యశ్వంత్ నవీన్రెడ్డి (15) మృతదేహం ఇంటి పక్కన పడి ఉండటాన్ని శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో గుర్తించారు. మృతుడు యశ్వంత్ నవీన్రెడ్డి ఇటీవలే 542 మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. తండ్రి ఫిర్యాదు మేరకు సీఐ వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అలాగే ఏలూరు నుంచి వచ్చిన క్లూస్ టీం సాక్షాధారాలను సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. యానాం మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్టు నూజివీడు : యానాం మద్యంను ద్విచక్రవాహనంపై తరలిస్తున్న వ్యక్తిని ఎస్ఈబీ నూజివీడు స్టేషన్ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ వెంకటరమణ మీర్జాపురంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా బాపులపాడు మండలం పాత మల్లవల్లికి చెందిన బొల్లిగర్ల కొటేశ్వరరావు ద్విచక్ర వాహనంపై యానాంకు చెందిన 36 మద్యం ఫుల్బాటిళ్లను తీసుకెళుతుండగా అతనిని అదుపులోకి తీసుకుని మద్యం బాటిళ్లను, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సాఽధీనం చేసుకున్న వాటిలో మాన్షన్హౌస్ బ్రాందీ సీసాలు 24, రాయల్స్టాగ్ సీసాలు 12 ఉన్నాయి. వీటి విలువ మొత్తం రూ.19 వేలు ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టుకు తరలించినట్లు పేర్కొన్నారు. యూటీఎఫ్ స్వర్ణోత్సవాలు విజయవంతం చేయాలి ఏలూరు (ఆర్ఆర్పేట): యూటీఎఫ్ ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ సంబరాలను విజయవంతం చేయాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు కోరారు. ఏలూరు జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం జిల్లా అధ్యక్షులు షేక్ ముస్తాఫా అలీ అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం జిల్లాలో పదవ తరగతి పరీక్షల్లో ఉన్నత ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్రాక్షి రవికుమార్ విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. వీరికి ఏ విధమైన సహాయం అవసరమైనా అండగా ఉంటామని భరోసానిచ్చారు. రాష్ట్ర కార్యదర్శులు బీ.సుభాషిణి, ఎస్. కిషోర్ కుమార్ జిల్లా కార్యదర్శులు పీవీ సాగర్ బాబు ఎస్. సుధారాణి పాల్గొన్నారు. ఎర్రకాలువలో పడి వ్యక్తి మృతి కొయ్యలగూడెం: ఎర్రకాలువలో పడి ఒక యువకుడు మృతి చెందాడు. రాజవరం సర్పంచ్ ఏలేటి చిన్న తుక్కయ్య తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పోతిన సత్యనారాయణ (44) అనే వ్యక్తి పొలం పనులు నిమిత్తం ఉదయం వెళ్ళాడు. రాజవరం వద్ద ఎర్రకాలువ దాటే సమయంలో గుండంలో పడి ప్రాణాలు కోల్పోయాడు. నీటి గుండంలో తేలియాడుతున్న శవాన్ని స్థానిక రైతుల మధ్యాహ్నం గుర్తించి బయటికి తీసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రెవెన్యూ అధికారులు విచారణ నిర్వహించినట్లు సర్పంచ్ పేర్కొన్నారు. -
పండుటాకులు విలవిల
●టీడీపీ నాయకుల వల్లే ఈ దుస్థితి టీడీపీ నాయకుల నీచమైన చర్యతో పింఛను తీసుకోవడానికి, తీవ్రమైన ఎండలో బ్యాంకులు చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. బ్యాంకులు రద్దీగా ఉండటంతో ఇక్కడ నిలబడలేక ఇంటికి తిరిగి వెళుతున్నా. ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. దీనికి టీడీపీ నాయకులే కారణం. – వై.ఏసుబాబు, కామవరపుకోట, వై. కాలనీ మా ఉసురు తగులుతుంది ప్రతినెలా వలంటీర్లు ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చేవారు. పింఛను సొమ్ముతో మందులు, నిత్యావసరాలు కొనుక్కునే దాన్ని. మూడో తేదీ వచ్చినా ఇంకా పింఛను అందలేదు. నా పింఛన్ సొమ్ము ఏ బ్యాంకులో వేశారో తెలియక, కాగితాలు పట్టుకుని మూడు రోజుల నుంచి మండుటెండలో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా. మాకు వలంటీర్ ద్వారా పింఛను ఇప్పించాలి. వృద్ధులను ఇబ్బంది పెట్టిన టీడీపీ నాయకులకు మా ఉసురు కచ్చితంగా తగులుతుంది. – దారిమిల్లి కన్నమ్మ, వృద్ధురాలు, కామవరపుకోట ఎండలో నడుచుకుంటూ వచ్చా పింఛన్ సొమ్ము తీసుకునేందుకు ఎండలో నడుచుకుంటూ బ్యాంకుకు వచ్చాను. ఇక్కడ చాలా క్యూలైన్ ఉంది. తీరా కౌంటర్ వద్దకు వెళ్లేటప్పటికి నా ఖాతా మనుగడలో లేదని, దానిని పునరుద్ధరించాల్సి ఉందని, సోమవారం మళ్లీ రావాలని బ్యాంకు అధికారులు చెప్పారు. బ్యాంకులో పింఛన్ సొమ్ము ఉన్నా, తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు పుణ్యమా అంటూ రెండు నెలలుగా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నా. – ఎం.మాణిక్యం, పింఛన్ లబ్ధిదారు, ఉప్పలమెట్ట, జంగారెడ్డిగూడెం ‘ముసలోళ్లను ముప్పతిప్పలు పెడుతున్నావు.. మా ఉసురు నీకు తగులుతుంది.. మామీద ఎందుకు నీకు ఇంత పగ.. ఆ దేవుడే నీకు శిక్ష వేస్తాడు’ అంటూ అవ్వాతాతలు చంద్రబాబును శాపనార్థాలు పెడుతున్నారు. జగన్ బాబు ఇంటి గుమ్మంలోకే పింఛను ఇచ్చారని, చంద్రబాబు ముసలోళ్లను ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేసి తమను రోడ్డుపాలు చేశాడంటూ అవ్వాతాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడో తేదీ వచ్చినా ఇంకా పింఛను చేతికి అందక బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సి రావడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. శుక్రవారం జిల్లాలోని పలు బ్యాంకుల వద్ద అవ్వాతాతలు పింఛను సొమ్ము కోసం మండుటెండలో నిరీక్షిస్తూ అష్టకష్టాలు పడుతూ ఇలా విలవిల్లాడుతూ కనిపించారు. విలపింఛెన్ ● చంద్రబాబు పగబట్టాడంటున్న అవ్వాతాతలు ● తమ ఉసురు తగులుతుందంటూ శాపనార్థాలు ● వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు తప్పని అవస్థలు ● మండుటెండలో బ్యాంకుల వద్ద గంటల తరబడి పడిగాపులు ● కేవైసీ, ఆధార్ అప్డేట్ లేక ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు ఏలూరు (మెట్రో)/నూజివీడు/కామవరపుకోట/జంగారెడ్డిగూడెం : ప్రతి నెలా ఒకటో తేదీనే తెలవారకముందే ఇంటి వద్దే ఠంచన్గా వలంటీర్ల ద్వారా పింఛను సొమ్ము అందుకునే అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులు ఇప్పుడు తమను రోడ్డు పాలు చేశారంటూ ప్రతిపక్ష పార్టీలను దుమ్మెత్తిపోస్తున్నారు. శుక్రవారం జిల్లాలోని పలు బ్యాంకుల వద్ద పింఛను సొమ్ము కోసం గంటల తరబడి పడిగాపులు పడుతూ పింఛను లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అధికారులు బ్యాంకులో వేసిన సొమ్ములను ఎలా తీసుకోవాలో తెలియక బ్యాంకులో కనిపించిన వారిని డబ్బుతీసిపెట్డండంటూ ప్రాధేయపడ్డారు. వలంటీర్ల వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి టీడీపీ, జనసేన అధినాయకులు చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్ చులకన భావంతో వలంటీర్ల వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి తరుణంలోనే దేశవ్యాప్తంగా వలంటీర్ల వ్యవస్ధకు ప్రశంసలు లభించడంతోపాటు ప్రభుత్వానికి మంచిపేరు వచ్చింది. ఎన్నికల సమయంలో కోర్టుల్లో కేసులు వేయించడం ద్వారా చంద్రబాబునాయుడు వలంటీర్ల సేవలను అడ్డుకున్నారు. దీంతో ఇంటి వద్దే పింఛను పొందే లబ్ధిదారులకు అవస్ధలు ప్రారంభమయ్యాయి. గత నెలలో సచివాలయాల వద్ద పంపిణీ చేయగా, ఈ నెల బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ చేశారు. మండుటెండలో.. పింఛను సొమ్ము బ్యాంకు ఖాతాలకు జమ చేయడంతో ఈ నెల 1వ తేదీ నుంచి వృద్ధులు, విలాంగులు, ఒంటరి మహిళలు బ్యాంకుల చుట్టూ తిరగక తప్పలేదు. ఎండతీవ్రత, వడగాల్పులు అధికంగా ఉన్నా పింఛను సొమ్ము చేతికి అందకపోతే పూట గడిచేదెలా, మందులు కొనుక్కునేది ఎలా అంటూ ఉదయాన్నే బ్యాంకుల వద్ద క్యూలు కడుతున్నారు. ప్రధానంగా బ్యాంకు సౌకర్యం లేని గ్రామాల ప్రజలు దూరప్రాంతాలకు వెళ్లడం మరింత ఇబ్బందికర పరిస్థితిలో వ్యయప్రయాసలకు గురవుతున్నారు. చాలా చోట్ల బ్యాంకుల్లో నిరీక్షించేందుకు కూడా జాగా లేక బ్యాంక్ కార్యాలయాల బయటే అవ్వాతాతలు నిలబడి ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది బ్యాంక్ ఖాతాలు యాక్టివ్గా లేక.. జిల్లాలో బ్యాంకులకు 2,54,029 మందికి చెందిన పెన్షన్ల సొమ్మును డిపాజిట్ చేయగా, వాటిలో కనీసం 50 శాతం మంది ఇప్పటికి పెన్షన్లు తీసుకోలేకపోయారు. జిల్లాలో 35 ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించిన 301 శాఖలు ఉన్నాయి. పింఛనుదారుల్లో చాలా మంది బ్యాంక్ ఖాతాలు యాక్టివ్లో లేక, ఆధార్ కార్డు అప్డేట్ కాలేదనో, పింఛను పడిందో లేదో తెలియక లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. పింఛన్ సొమ్ము బ్యాంకులో జమ అయినా అవి తీసుకునేందుకు ఖాతాలు యాక్టివ్లో లేకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. గత ప్రభుత్వ కాలంలో పడిన కష్టాలు ఐదేళ్ల తరువాత మళ్లీ మొదలయ్యాయి అంటూ అవ్వా తాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల సచివాలయాల చుట్టూ తిరగాల్సి వస్తే, ఈ సారి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోయారు. -
తొలిరోజు 579 మంది ఓటేశారు
ఏలూరు (మెట్రో): దేశంలోనే తొలిసారిగా ఇంటి వద్దే ఓటు వేసే అవకాశాన్ని కల్పించిన క్రమంలో ఏలూరు జిల్లాలో శుక్రవారం హోం ఓటింగ్ విజయవంతంగా ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 85 సంవత్సరాలు పైబడిన వారు, 40 శాతం కన్నా ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ఎన్నికల సంఘం హోమ్ ఓటింగ్ సౌకర్యాన్ని కల్పించింది. దీనిలో భాగంగా తొలిరోజు శుక్రవారం జిల్లాలో 579 మంది హోం ఓటింగ్ వినియోగించు కోగా, పోలవరం నియోజకవర్గంలో 90 మంది, ఉంగుటూరులో 113, ఏలూరులో 54, చింతలపూడిలో 63, దెందులూరులో 87, కై కలూరులో 113, నూజివీడులో 59 మంది ఓటు వేశారు. పోలింగ్ అధికారులు, వీడియోగ్రాఫర్ సమక్షంలో ఓటింగ్ ప్రక్రియ జరిగింది. 10 నుంచి శ్రీవారి సేవా రుసుముల పెంపు ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో జరిగే నిత్య సేవలలో ముఖ్యమైన మూడు రకాల సేవల రుసుములను పెంచినట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం రూ.200లుగా ఉన్న సుప్రభాత సేవా టికెట్ రుసుము రూ.300లకు, అష్టోత్తర శతనామార్చన టికెట్ రుసుము రూ.300 నుంచి రూ.500లకు, దీపారాధన సేవా టికెట్ను రూ.10 నుంచి రూ.20లకు పెంచినట్టు చెప్పారు. పెరిగిన ధరలు ఈనెల 10 నుంచి అమలులోకి వస్తాయని, భక్తులు గమనించాలని ఈఓ కోరారు. 10 నుంచి కాలువలకు నీటి విడుదల బంద్ ఏలూరు (మెట్రో): గోదావరి డెల్టా పరిధిలోని ప్రధాన కాలువలకు నీటి విడుదలను ఈ నెల 10వ తేదీ నుంచి నిలిపివేస్తున్నట్లు ధవళేశ్వరం, గోదావరి డెల్టా సిస్టం చీఫ్ ఇంజనీర్ సతీష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గోదావరి తూర్పు, మధ్యమ, పశ్చిమ డెల్టా ప్రధాన కాలువల పరిధిలో సాగు, తాగునీటి అవసరాలకు సరిపడా ఇప్పటికే పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేశామన్నారు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి కాలువలకు నీటిసరఫరా నిలిపివేయాలని నిర్ణయించామన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement