-
వసతులు కల్పించాలని కలెక్టర్కు వినతి
కై లాస్నగర్: పార్లమెంట్ ఎన్నికల విధులు ని ర్వహించే ఉద్యోగులు, సిబ్బందికి ఇబ్బందులు కలుగకుండా తగు వసతులు కల్పించాల ని రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈమేరకు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముజఫ ర్ హుస్సేన్, సూర్యకాంత్లు శుక్రవారం కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున మే 13న ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నా రు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల్లో కూల ర్లు, చల్లని తాగునీరు, ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఆ ముగ్గురి చేరిక నిలిపివేత!
ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆరేళ్లపాటు పార్టీ బహిష్కరణకు గురైన జిల్లా కేంద్రానికి చెందిన పీసీసీ మాజీ జనరల్ సెక్రెటరీ గండ్రత్ సుజాత, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజీద్ఖాన్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సంజీవ్రెడ్డిల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.ఇటీవల జగ్గారెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న ఈ ముగ్గురు ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్రెడ్డిని కూడా కలిశారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించి పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన ఈ ముగ్గురు నాయకులను తిరిగి పార్టీలో చేర్చుకోవద్దంటూ కంది శ్రీనివాసరెడ్డి మద్దతుదారులు ఆందోళన చేపట్టారు.వెంటనే వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముగ్గురు నాయకుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ దహనం చేయడంతో పాటు నోటికి నల్లగుడ్డలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను గమనించిన పార్టీ నాయకత్వం వారి చేరికలను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. దీంతో కంది వర్గీయుల పోరాటం ఫలించినట్లైందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షి ఆదేశాల మేరకు ఆ నాయకుల చేరికలను నిలిపివేస్తున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, చేరికల కమిటీమెంబర్ జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా నాయకత్వంతో చర్చించి త్వరలోనే తగు నిర్ణయం తీసుకుంటామని అప్పటి వరకు వారి చేరిక నిలిపివేస్తున్నట్లుగా అందులో పేర్కొన్నారు.ఇవి చదవండి: ప్రచారంపై ఫోకస్ పెంచిన ప్రధాన పార్టీలు.. -
ప్రచండమే!
● జిల్లాలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు ● బేలలో 44.9 డిగ్రీలుగా నమోదు ● నిర్మానుష్యంగా రహదారులు ● ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరిఆదిలాబాద్టౌన్: మే రాకతో జిల్లా నిప్పుల కుంపటిగా మారింది. ఇప్పటికే 44 డిగ్రీల మార్కు దాటింది. భానుడి ప్రతాపానికి జనం విలవిల్లాడుతున్నారు. బాబోయ్ ఇవేం ఎండలు అంటూ బెంబేలెత్తుతున్నారు. ఉదయం 10 దాటిందంటే గడప దాటేందుకు జంకుతున్నారు. అవసరం ఉంటే తప్పా మధ్యాహ్న సమయంలో బయటకు రావడం లేదు. జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో ముఖ్య కూడళ్లు పగటి పూట నిర్మానుష్యంగా మారుతున్నాయి. అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. సాయంత్రం వరకూ ఎండ తీవ్రత తగ్గడం లేదు. శుక్రవారం బేలలో 44.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవడం గమనార్హం. ఉపశమనం కోసం ఆరాటం..జిల్లాలో ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఎండ వేడిమి తట్టుకోలేక జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉక్కపోత నుంచి ఉపశమ నం పొందేందుకు కూలర్లు, ఏసీలకు అతుక్కుపోతున్నారు. తప్పనిసరిగా బయటకు వెళ్లే వారు తలకు రక్షక కవచాలు ధరిస్తున్నారు. మరోవైపు శీతల పానియాలు, కొబ్బరి బోండాలకు గిరాకీ పెరిగింది. రాజకీయ నాయకుల తంటాలు..పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయా పార్టీల నాయకులు ప్రచారం ముమ్మరం చేశారు. ఎండలు సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో వడదెబ్బకు గురైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరో వైపు ఉదయం, సాయంత్రం వేళల్లోనే ప్రచారం చేపట్టేందుకు నేతలు మొగ్గుచూపుతున్నారు. అయితే సాయంత్రం కూడా వడగాలులు వీస్తున్నాయి. అయినా తమ పార్టీ గెలుపు కోసం శ్రేణులంతా గడప గడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. జర పదిలం..జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా వడదెబ్బకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎండలో పని చేసే, తిరిగే వారు వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు. అత్యవసరం అయి తే తప్పా ఎండలో బయటకు వెళ్లకూడదని చెబుతున్నారు. ఎక్కువ సమయంలో ఎండలో తిరిగితే శరీరంలో ప్రొటీన్ స్థాయి తగ్గిపోయి అవయవాలు పనిచేయడం ఆగిపోతాయని, శరీర ఉష్ణోగ్రతలు మామూలు స్థితిలో ఉండేలా చూసుకోవాలని పేర్కొంటున్నారు. వృద్ధులు, చిన్నారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. జిల్లాలో మూడు రోజులుగా నమోదైన కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు (డిగ్రీ సెల్సియస్లో)అప్రమత్తంగా ఉండాలి జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలి. అవసరం ఉంటే తప్పా ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, వృద్ధుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు కనీసం 5 లీటర్ల నీటిని తాగడం మంచిది. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలి. – జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ తేది కనిష్ట గరిష్ట మే 1న 26.2 42.8 2న 23.7 42.3 3న 20.2 44.9 -
న్యూస్రీల్
డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలి ఆదిలాబాద్రూరల్: ఈనెల 6 నుంచి నిర్వహించనున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మల్లెల మనోజ్ ప్రకటనలో కోరారు. జిల్లాలో ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 46 డిగ్రీలకు చేరువైనట్లు పేర్కొన్నారు. ఈ మేరకు విద్యార్థులు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ పరీక్షలను వాయిదా వేసి జూన్లో నిర్వహించాలని కోరారు.పోలింగ్ సమయం గంట పెంపు కై లాస్నగర్: ఈనెల 13న నిర్వహించనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పొలింగ్ సమయాన్ని ఒక గంట పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జా రీ చేసినట్లు ఎన్నికల అధికారి రాజర్షి షా తెలిపారు. ప్రతి సాధారణ ఎన్నికల్లో పోలింగ్ సమయం ఉదయం 7నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండగా, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పోలింగ్ సమయాన్ని ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. పోలింగ్ సమయం పెంపుతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముధోల్, ఖానాపూర్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు, ఆసిఫాబాద్, సిర్పూర్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని వివరించారు. ఈ అవకాశాన్ని ఆయా ప్రాంతాల ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బాల్య వివాహాలు నేరం నార్నూర్: బాల్య వివాహాలు చట్ట ప్రకారం నేరమని డీసీపీవో టి రాజేంద్ర ప్రసాద్ అన్నా రు. గాదిగూడ మండలంలోని లోకారి కే గ్రా మ రైతు వేదికలో బాల్య వివాహాలపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. చిన్నతనంలో వివాహాలు చేయడం ద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. బాల్య విహహాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇందులో ఎంపీడీవో రమేశ్, ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రదీపిక, ఉమ, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. -
ప్రచారంపై ఫోకస్ పెంచిన ప్రధాన పార్టీలు..
సాక్షి,ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల సంగ్రామంలో ఆయాపార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నా యి. సీఎం రేవంత్రెడ్డి ఈ సెగ్మెంట్ పరిధిలో ఆది లాబాద్, ఆసిఫాబాద్లలో జరిగిన సభల్లో వ్యూహా త్మకంగా బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు గొడం నగేశ్, ఆత్రం సక్కును విమర్శించడం ద్వారా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.ఎంపీ సోయం బాపూరావు ప్రస్తావన కూ డా ఇందులో భాగమేనని చర్చించుకుంటున్నారు. మరోపక్క బీజేపీలో ఇటీవల ఎమ్మెల్యేలకు ఆయా పార్లమెంట్ ఇన్చార్జి బాధ్యతలు తొలగించిన తర్వాత వారంతా తమ నియోజకవర్గాల్లో ప్రచారంలో దూకుడు పెంచారు. ఒక విధంగా ఈ నిర్ణయం విభేదాలకు చెక్తో పాటు ప్రచారంలో స్పీడ్ పెంచేందుకు ఉపయోగపడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ మైనార్టీ ఓట్లపై దృష్టి సారించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.సీఎం ప్రసంగంలో ఎంపీ సోయం ప్రస్తావన..సీఎం రేవంత్రెడ్డి ఆసిఫాబాద్ బహిరంగ సభలో ఎంపీ సోయం బాపూరావు ప్రస్తావన తీసుకురావడం వ్యూహాత్మకమేనన్న చర్చ సాగుతుంది. సిట్టింగ్ ఎంపీ సోయంకు టికెట్ ఇవ్వకుండా బీజేపీ ఆయనను అవమానించిందన్నారు. అంతేకాకుండా పార్లమెంట్ నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలని కేంద్ర మంత్రుల చుట్టూ సోయం తిరిగినా వారు పట్టించుకోలేదని చెప్పారు. ప్రధానంగా సోయంకు ఆదివాసీ ఓటర్లలో పట్టు ఉంది.ఈ నేపథ్యంలో సీఎం వ్యూహాత్మకంగానే సోయం ప్రస్తావన తీసుకువచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతేకాకుండా బీజేపీ అభ్యర్థి నగేశ్, బీఆర్ఎస్ అభ్యర్థి సక్కు ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ జిల్లా అభివృద్ధికి పాటుపడింది లేదని చెప్పడం ద్వారా విమర్శలు ఎక్కుపెట్టారు. ఇదిలా ఉంటే ఇటీవల మంత్రి సీతక్క, ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ నార్నూర్ మండలం కొత్తపల్లి–హెచ్లో బంజారా దీక్షభూమి వేదిక వద్ద ప్రసంగిస్తూ తాము లంబాడాలకు వ్యతిరేకం కాదని చెప్పడం ద్వారా ఆ ఓటర్లను ఆకట్టునే ప్రయత్నం చేశారు.అంతే కాకుండా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి పార్టీ పరంగా కో ఇన్చార్జీలను నియమించారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్తో పాటు ఏఐసీసీ సభ్యుడు నరేశ్ జాదవ్ నియామకం ఇందులో భాగమేనని తెలుస్తోంది. తద్వారా ఆ సామాజిక వర్గ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నమే ఈ చర్య అన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతుంది.బీజేపీలో విభేదాలు సమసినట్టేనా..బీజేపీలో ఎంపీ అభ్యర్థిగా నగేశ్ను ప్రకటించిన త ర్వాత పార్టీ ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదన్న విమర్శలు జోరుగా సాగాయి. ఎమ్మెల్యేలకు పార్లమెంట్ ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చిన తర్వాత వారి నియోజకవర్గాల్లో ఇతర నేతల జోక్యం పెరిగిందన్న భావం వ్యక్తమైందన్న ప్రచారం జరిగింది. పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లడంతో నష్ట నివారణ చర్యలకు దిగింది.ఇందులో భాగంగానే పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఆయా పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి బా ధ్యతల నుంచి తొలగించారు. ఈ పరిణామం తర్వా త ఆయా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రచార స్పీడ్ పెంచారు. ఒకవిధంగా ఇది పార్టీకి మంచి జరిగిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతేకాకుండా నగేశ్ ఇటీవల ఖానాపూర్ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్తో కలిసి విస్తృతంగా తిరిగారు. ఇది లంబాడా ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాత్మక చర్య అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.ఎంఐఎం నేతను కలిసిన బీఆర్ఎస్ నాయకులు..బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుకు సంబంధించి ఈ పార్లమెంట్ సెగ్మెంట్లోని నియోజకవర్గాల్లో ఆయా నేతలు, కార్యకర్తలు విస్తృతంగా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.ఇటీవల మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్సీ దండే విఠల్తో కలిసి భైంసాలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ జాబిర్ అహ్మద్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా మైనార్టీ ఓటర్లను రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఆదివాసీ, లంబాడా ఓటర్లతో పాటు గిరిజనేతర ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
నాకు ఓటు వేస్తే మోదీకి వేసినట్టే..
జమలాపురం ఆలయంలో ప్రత్యేక పూజలు
దేశంలోనే అత్యధిక మెజారిటీ..
● హైలైట్స్..
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
చింతపండు బస్తాల మధ్య గంజాయి రవాణా..
చికిత్స పొందుతున్న సీపీఎం నాయకుడు మృతి
బీజేపీ మళ్లీ గెలిస్తే ప్రమాదంలో రాజ్యాంగం
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement