-
కార్మికుల కార్ఖానా
కాకినాడ రూరల్● ఉపాధికి నెలవైన నియోజకవర్గం ● సుందర సాగరతీరం ● సందర్శకుల స్వర్గధామం ● ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయం కాకినాడ రూరల్: పరిశ్రమలకు నెలవుగా, కార్మికులకు ఉపాధి నిలయంగా, మత్స్యకారుల వేటకు భరోసాగా, ఆధ్యాత్మికతకు చిరునామాగా కాకినాడ రూరల్ నియోజవర్గం ఖ్యాతి గడించింది. నియోజకవర్గ పరిధిలోని నాగార్జున ఎరువులు, పురుగు మందుల తయారీ కర్మాగారం, కోరమండల్ డీఏపీ ఎరువుల తయారీ కర్మాగారాలతో కాకినాడకు ఎరువుల నగరంగా పేరొచ్చింది. కాకినాడ సీ పోర్టు ద్వారా విదేశాల నుంచి భారీగా వంట నూనెలు దిగుమతి చేసుకుని శుద్ధి చేసుకునేందుకు నియోజకవర్గ పరిధిలోని సూర్యారావుపేట, వాకలపూడి తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున వంట నూనెల శుద్ధి పరిశ్రమలు నియోజకవర్గంలో ఏర్పాటు కావడంతో వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వంట నూనెలను ఇతర ప్రాంతాలకు లారీ ట్యాంకర్లతో రవాణా చేయడంతో డ్రైవర్లు, క్లీనర్లు, ట్యాంకర్ల యజమానులు ఎందరో ఉపాధి పొందుతున్నారు. సీజనల్గా వేసవిలో లభించే మామిడికాయలను పండూరు, సర్పవరం గ్రామాల్లో దిగుమతి చేసుకుని పచ్చళ్లు, తాండ్ర తయారీ చేసి వందల సంఖ్యలో మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ తయారు చేసే తాండ్ర, పచ్చళ్లకు ఒడిశా, మధ్యప్రదేశ్, ముంబై తదితర ప్రాంతాల్లో మంచి గిరాకీ ఉంది. సూర్యారావుపేట బీచ్ పర్యాటకంగా అభివృద్ధ్ది చెండడంతో ఆదివారం, సెలవు దినాల్లో వేలాదిగా సందర్శకులు వస్తూంటారు. సూర్యారావుపేట లైట్ హౌస్, బీచ్, బీచ్ పార్కు, శిల్పారామం హైలైట్గా నిలుస్తాయి. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులు రూ.9 కోట్లతో బీచ్ పార్కు అభివృద్ధితో పాటు యుద్ధ విమాన మ్యూజియం ఏర్పాటు చేశారు. ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అలాగే, భారత నావికాదళంలో సుమారు 30 ఏళ్ల పాటు సేవలందించిన యూటీ–142ఎం యుద్ధ విమాన మ్యూజియం ఇక్కడ ఏర్పాటు చేశారు. దీని ద్వారా యువతకు వినోదం, విజ్ఞానం లభిస్తున్నాయి. ఆధ్యాత్మికంగా కూడా రూరల్ నియోజకవర్గానికి పేరుంది. సర్పవరం గ్రామంలో నారద మహర్షి స్వయంగా నిర్మించిన రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే ఎంతో ప్రసిద్ధి గాంచింది. తూర్పున నేమాం గ్రామంలో పురాతన శివాలయం ప్రసిద్ధి చెందగా, తూరంగి, రేపూరు శివాలయాలు సైతం ఎంతో పేరొందినవే. నియోజకవర్గ స్వరూపం కాకినాడ రూరల్ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. గతంలో తాళ్లరేవు నియోజవర్గంలోని కరప మండలం, సంపర నియోజకవర్గంలోని కాకినాడ రూరల్ మండలం, కాకినాడ అర్బన్లోని 8 డివిజన్లతో ఈ నియోజకవర్గం ఏర్పడింది. దీనికి తూర్పున బంగాళాఖాతం, మధ్యలో కాకినాడ సిటీ, పశ్చిమాన అనపర్తి, ఉత్తరం వైపు పిఠాపురం, దక్షిణాన రామచంద్రపురం, ముమ్మిడివరం నియోజకవర్గాలు సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయ పోరు కాకినాడ రూరల్ నియోజకవర్గం ఏర్పడిన తరువాత తొలిసారిగా 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కురసాల కన్నబాబు విజయం సాధించారు. 2014లో పిల్లి అనంతలక్ష్మి టీడీపీ నుంచి గెలుపొందారు. 2019లో కురసాల కన్నబాబు వైఎస్సార్ సీపీ నుంచి రెండోసారి విజయం సాధించారు. 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన వ్యవసాయ, సహకార, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా పని చేశారు. రెండున్నరేళ్ల పాటు ఆయన మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో 8,786 ఓట్ల మెజార్టీ సాధించారు. మరికొన్ని విశేషాలు.. ● సర్పవరంలోని రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో మాఘమాసం నాలుగో ఆదివారం తిరునాళ్లకు ప్రసిద్ధ్ది. ఇక్కడ మహిళలు పాలు పొంగించి, పొంగలి తయారు చేసి, సూర్యభగవానుడిని పూజించి నైవేద్యం సమర్పిస్తారు. ● రమణయ్యపేటలో పరిపూర్ణానంద స్వామి పర్యవేక్షణలో ఐశ్వర్యాంబికా సమేత సుందరేశ్వరస్వామి కొలువైన శ్రీపీఠం ఉంది. ● వేలాది మంది మత్స్యకారులు తమ బోట్లు లంగరు వేసుకునేందుకు, చేపలు, రొయ్యల విక్రయానికి వాకలపూడి ఫిషింగ్ హార్బర్ ప్రసిద్ధి. ● కాకినాడ డీప్ వాటర్ పోర్టు ద్వారా బియ్యం ఎగుమతులు, సీ పోర్టు ద్వారా వంట నూనెల దిగుమతులు జరుగుతాయి. ● ఓడలకు కాకినాడ ల్యాండ్ మార్కు తెలియజేసే దిక్సూచిగా సూర్యారావుపేట లైట్ హౌస్ ఉంది. ● నియోజకవర్గ పరిధిలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ – కాకినాడ) ఎంతోమంది విద్యార్థులను ఇంజినీర్లుగా తీర్చిదిద్దింది. కాకినాడలోని కోరమాండల్ కర్మాగారంజనాభా వివరాలు మొత్తం జనాభా 3,11,503 పురుషులు 1,55,519 మహిళలు 1,55,964 ఇతరులు 20 నియోజకవర్గంలో ఓటర్ల వివరాలు మొత్తం ఓటర్లు 2,69,330 పురుషులు 1,33,475 మహిళలు 1,35,847 ఇతరులు 8నియోజకవర్గ ప్రత్యేకతలు ● సందర్శకులను కట్టి పడేసే సాగర అందాలు ● ఎరువులు, వంట నూనెలు శుద్ధి పరిశ్రమలు ● పండూరులో పచ్చళ్ల తయారీ.. సర్పవరంలో చవులూరించే మామిడి తాండ్ర ● సందర్శకులను ఆకట్టుకుంటున్న ● యుద్ధ్ద విమాన మ్యూజియం ● సర్పవరంలో నారద మహర్షి నిర్మించిన భావనారాయణ స్వామి ఆలయం సూర్యారావు పేట వద్ద లైట్ హౌస్ 2019–24 మధ్య వివిధ పథకాల ద్వారా లబ్ధి పథకం లబ్ధిదారులు లబ్ధి (రూ.కోట్లలో) జగనన్న అమ్మ ఒడి 30,220 134.29 జగనన్న విద్యా దీవెన 20,549 72.77 జగనన్న వసతి దీవెన 16,000 27.53 వైఎస్సార్ రైతు భరోసా 22,716 106.96 డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా 16,790 64.43 వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు 9,919 4.85 రైతులకు ఇన్పుట్ సబ్సిడీ 15,900 16.70 వైఎస్సార్ మత్స్యకార భరోసా 4,993 11.86 వైఎస్సార్ పింఛన్ కానుక 38,823 348.86 వైఎస్సార్ చేయూత 15,073 63.29 వైఎస్సార్ ఆసరా 48,501 156.73 సున్నా వడ్డీ పథకం(డ్వాక్రా మహిళలకు) 59,666 13.89 వైఎస్సార్ కాపు నేస్తం 8,331 43.05 ఈబీసీ నేస్తం 1,334 5.92 వైఎస్సార్ కల్యాణ మస్తు/షాదీ తోఫా 70 3.24 వైఎస్సార్ ఆరోగ్య శ్రీ 12,584 52.92 హౌసింగ్ లబ్ధిదారులకు నేరుగా చెల్లింపులు 8,241 10.31 వైఎస్సార్ ఆరోగ్య ఆసరా 6,052 46.52 వైఎస్సార్ బీమా 659 9.65 వైఎస్సార్ వాహన మిత్ర 3,040 8.78 వైఎస్సార్ నేతన్న నేస్తం 99 0.91 జగనన్న చేదోడు 1,921 4.21 తెల్ల కార్డుదారులకు ప్రత్యేక కోవిడ్ సహాయం 70,493 8.17 జగనన్న తోడు(వడ్డీ) 4,599 22.64 మొత్తం 4,12,775 1200.87 నాన్ డీబీటీ లబ్ధి ఇంటి స్థలాలు(భూసేకరణ అభివృద్ధికి పరిహారం) 28,423 1542.25 విద్యా కానుక 14,215 12.57 ట్యాబ్ల పంపిణీ 2,727 7.01 జగనన్న తోడు రుణాలు 8,240 14.52 జగనన్న గోరుముద్ద 14,778 15.00 వైఎస్సార్ సంపూర్ణ పోషణ 18,728 34.45 వైఎస్సార్ కంటి వెలుగు 72,059 156.99 ఇంటింటికీ రేషన్ (79.8 లక్షల మిలియన్ టన్నులు) 7,620 16.21 మొత్తం 1,66,790 1,798.61 డీబీటీ, నాన్ డీబీటీ మొత్తం 5,79,565 2,999.47 నియోజకవర్గ సమాచారం నియోజవర్గంలో డివిజన్లు, మండలాలు నగరపాలక సంస్థ కాకినాడ (8 డివిజన్లు) మండలాలు కాకినాడ రూరల్, కరప మొత్తం పంచాయతీలు 41 (కాకినాడ రూరల్ 18, కరప – 23) మేజర్ పంచాయతీలు 13 మైనర్ పంచాయతీలు 28 సచివాలయాలు 79 (కాకినాడ రూరల్ – 41, కరప – 21, అర్బన్ – 17) రైతు భరోసా కేంద్రాలు 32 (కాకినాడ రూరల్ – 13, కరప – 19) ఆర్బీకేలలో వెంటర్నరీ కేంద్రాలు 22 వెటర్నరీ ఆస్పత్రులు 7 విలేజ్/అర్బన్ క్లినిక్లు 75 -
ఆరోగ్యమస్తు
● ప్రభుత్వ వైద్య రంగం అభివృద్ధి ● కొత్తగా ఆరోగ్య కేంద్రాల నిర్మాణం ● ప్రగతి బాటలో ప్రభుత్వాసుపత్రులు ● ఆరోగ్యశ్రీ పరిధి విస్తరణ ● వినూత్నంగా ఫ్యామిలీ డాక్టర్ సేవలు ● ‘ఆరోగ్య సురక్ష’తో అందరికీ వైద్య పరీక్షలు కాకినాడ క్రైం: కానరాని వైద్యులు.. చాలీచాలని సిబ్బంది.. అరకొరగా మందులు.. కానరాని సౌకర్యాలు.. తుప్పు పట్టిపోయిన మంచాలు.. దుర్భరంగా ఉండే పడకలు.. ఏ వైద్య పరీక్ష కావాలన్నా బయటి ల్యాబ్ల వద్దకు వెళ్లక తప్పని దుస్థితి.. గత్యంతరం లేక ప్రైవేటు ఆసుపత్రులనే ఆశ్రయించాల్సిన పరిస్థితి.. ఇదీ ఒకప్పుడు ప్రభుత్వ వైద్యరంగం తీరు. నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వ వైద్య రంగం ముఖచిత్రం గడచిన ఐదేళ్లలో సమూలంగా మారిపోయింది. ఎంతలా అంటే.. కేవలం సాధారణ వైద్య సేవలకే ఆరోగ్య కేంద్రాల ఆవరణల్లో పడిగాపులు కాసే దుస్థితి నుంచి.. స్పెషలిస్టులే నేరుగా ఇంటి వద్దకు వెళ్లి మరీ వైద్య సేవలు అందించేంతలా మార్పు వచ్చింది. జిల్లా కేంద్రం కాకినాడలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్) నుంచి.. సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్సీ), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) ప్రభుత్వం పెద్ద ఎత్తున సౌకర్యాలు కల్పించింది. చివరకు ప్రభుత్వ వైద్య సేవలను గ్రామ స్థాయికి సైతం తీసుకుని వచ్చేందుకు పల్లెల్లో విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసింది. అవసరమైన సిబ్బందిని నియమించింది. అత్యవసర మందులన్నీ అందుబాటులో ఉంచింది. అంతే కాదు.. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా వినూత్న రీతిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకుని వచ్చింది. దీని ద్వారా పల్లె ముంగిట్లో అవసరమైన వారందరికీ ఇంటి వద్దనే వైద్య సేవలు అందిస్తోంది. 424 కొత్త ఆరోగ్య కేంద్రాలు జిల్లావ్యాప్తంగా ఐదేళ్ల వ్యవధిలో కొత్తగా 430 ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉన్న ఆరోగ్య కేంద్రాలను మరింత బలోపేతం చేశారు. ఐదు పీహెచ్సీలు, తొమ్మిది అర్బన్ పీహెచ్సీలు (యూపీహెచ్సీ), 410 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం జిల్లాలో 42 పీహెచ్సీలు, 23 యూపీహెచ్సీలు, 9 సీహెచ్సీలు, 410 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, ఒక ఏరియా ఆసుపత్రి ద్వారా ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు అందుతున్నాయి. ఆరోగ్య కేంద్రం స్థాయి పెరుగుతున్నకొద్దీ అందని చికిత్స లేని రీతిలో వైద్య సేవలను విస్తరించారు. తల్లీబిడ్డల ఆరోగ్యానికి.. తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) పర్యవేక్షణలో టాస్క్ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశారు. గర్భిణులు, బాలింతలు, శిశువుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మాతాశిశు మరణాలను నియంత్రించడమే టాస్క్ఫోర్స్ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం. కాన్సెప్ట్ అదిరింది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా జిల్లాలో వివిధ పీహెచ్సీల నుంచి ప్రత్యేక మెడికల్ మొబైల్ యూనిట్ వాహనాలు గ్రామ గ్రామానికీ వెళ్తున్నాయి. జిల్లాలో మొత్తం 35 వాహనాలు నిరంతరాయంగా ఆయా గ్రామాల్లో సంచరిస్తున్నాయి. ఈ వాహనాలతో వైద్య, ఆరోగ్య సిబ్బంది, మందులు, వైద్య ఆరోగ్య పరికరాలతో గ్రామాలకు వెళ్తున్నారు. స్థానిక ఆరోగ్య కేంద్రంలో సేవలు అందిస్తున్నారు. జనరల్ ఓపీతో పాటు గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, ఆరోగ్యశ్రీలో చికిత్స పొంది, ఇంటికి చేరిన పేషంట్లకు ఉదయం వేళల్లో ఇంటి వద్దనే సేవలు అందిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ వసతి గృహాలను సందర్శిస్తూ, బాలల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నారు. గ్రామాల్లో మంచినీటి సరఫరా తీరుతెన్నులను పరిశీలిస్తున్నారు. అలాగే, పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారించి, ఎక్కడైనా లోపాలుంటే సంబంధిత శాఖను తక్షణమే అప్రమత్తం చేసి, సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆరోగ్య రథ చక్రాలు 108, 104, తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్, నియోనేటల్ అంబులెన్సుల ద్వారా బాధితులు లేదా రోగులకు తక్షణ ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. గడచిన ఐదేళ్లలో సంఖ్యాపరంగానే కాకుండా సదుపాయాలపరంగా ఈ వాహన సేవలను ఎంతో వృద్ధి చేశారు. గర్భిణులకు అత్యవసర సమయాల్లో ఈ వాహనాల్లో ఉండే వైద్య, ఆరోగ్య సిబ్బంది సురక్షిత ప్రసవాలు చేసిన సందర్భాలు కోకొల్లలు. ఆరోగ్య సిరి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వేలాది మంది రోగులకు కార్పొరేట్ స్థాయి చికిత్స ఉచితంగా అందిస్తున్నారు. చికిత్స వ్యయం రూ.వెయ్యి దాటినా ఆరోగ్యశ్రీ పరిధిలోకి సదరు వైద్య సేవలను తీసుకుని వచ్చేలా నూతన మార్పులు చేశారు. తద్వారా ఈ పథకాన్ని నిజంగానే ఆరోగ్య సిరిగా తీర్చిదిద్దారు. ఆరోగ్యశ్రీ చికిత్స పరిధిని దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఏకంగా రూ.25 లక్షల కు పెంచడమే కాకుండా సుమారు 3,300 రోగాలు, చి కిత్స విధానాలను ఈ పథకం పరిధిలో చేర్చారు. ఆరో గ్యశ్రీ పథకం ద్వారా గడచిన రెండేళ్లలో 80,445 మంది లబ్ధి పొందగా వారికి రూ.189.38 కోట్లు వెచ్చించారు. అలాగే, ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్రచికిత్స చేయించుకుని, ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న వారి జీవనోపాధి కోసం ‘ఆసరా’ పథకం ద్వారా 45,454 మందికి రూ.26.3 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. శిబిరాలతో సురక్షితం జిల్లాకు గతంలో ఏనాడూ తెలియని రీతిలో వై ద్యపరంగా కీలక ముందడుగు వేస్తూ ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించారు. వీటి ద్వారా ఆ యా సచివాలయాల పరిధిలోని ప్రజలకు స్పెషలిస్టు వైద్యుల ద్వారా ఓపీ సేవలు అందించారు. అంతే కాకుండా అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో అవసరమైన చికిత్సలు ఉచితంగా అందించారు. రెండు విడతల్లో నిర్వహించిన 468 ఆరోగ్య సురక్ష శిబిరాల్లో 1,60,132 మంది వైద్య సేవలు పొందారు.కంటికి ఆపరేషన్ చేయించుకున్నా.. వృద్ధాప్యంలో ఉన్న నాకు ఆరోగ్య సురక్ష శిబిరాల ద్వారా ఎంతో ప్రయోజనం కలిగింది. స్పెషలిస్టు దగ్గరకు వెళ్లి కంటి సమస్యను చూపించుకునే పరిస్థితి లేదు. మా ప్రాంతంలో నిర్వహించిన ఆరోగ్య సురక్ష శిబిరాల్లో కంటి పరీక్షలు చేయించుకున్నా. తక్షణమే సర్జరీ అవసరమని కంటి వైద్య నిపుణుడు సూచించి జీజీహెచ్కు సిఫారసు చేశారు. స్థానిక ఆరోగ్య సిబ్బంది అక్కడకు తీసుకుని వెళ్లి శస్త్రచికిత్స చేయించారు. ఇప్పుడు స్పష్టంగా చూడగలుగుతున్నా. – డి.విజయకుమారి, కాకినాడ ఆరోగ్య కేంద్రాలు భేష్ గడచిన ఐదేళ్లలో స్థానిక ఆరోగ్య కేంద్రాలు సకల సదుపాయాలతో ఎంతో మెరుగుపడ్డాయి. ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి జేబులకు చిల్లు పెట్టుకునే దుస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అందని వైద్యం లేదు, దొరకని మందు లేదు, జరగని పరీక్ష లేదు. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. ఉన్నాయి అంటే ఉన్నాయన్నట్లుగానే హెల్త్ సెంటర్లు నడిచేవి. కనీసం సిబ్బంది కూడా ఉండేవారు కాదు. అదీ కాక, రోగి మనసుకు ఆహ్లాదం కలిగే రీతిలో ఆరోగ్య కేంద్రాలను ఆకర్షణీయంగా పచ్చదనంతో తీర్చిదిద్దుతున్నారు. – నాగం దొరబాబు, రావికంపాడు, తొండంగి మండలం -
వైద్య శాఖలో 3,156 పోస్టుల భర్తీ
కాకినాడ సిటీ: గతంలో వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు ఏళ్ల తరబడి భర్తీ చేసేవారు కాదు. రెండు మూడు పీహెచ్సీలకు ఒక వైద్యుడు సేవలు అందించే పరిస్థితి. మూడు పీహెచ్సీలకు ఒక ల్యాబ్ టెక్నీషియన్ సేవలు అందించే వారు. ఈ పరిస్థితిని పూర్తిగా మారుస్తూ ప్రభుత్వం ప్రతి పీహెచ్సీకి ఇద్దరు వైద్యులను, ముగ్గురు స్టాఫ్ నర్సులను నియమించింది. ప్రతీ పీహెచ్సీకి ఒక ల్యాబ్ టెక్నీషియన్ను నియమించారు. జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి పోస్టుల కొరత లేకుండా పోస్టులను భర్తీ చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వేలాది పోస్టులను భర్తీ చేశారు. వైద్య, ఆరోగ్య శాఖలో 2019 నుంచి ఇప్పటి వరకూ 3,156 మంది ఉద్యోగుల నియామకాలు జరిపారు. వార్డు బాయ్ దగ్గర నుంచి స్పెషలిస్టు డాక్టర్ వరకూ అన్ని కేడర్ల పోస్టులూ భర్తీ చేశారు. విలేజ్ క్లినిక్లలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల(సీహెచ్ఓ)ను నియమించారు. వీరు గ్రామ స్థాయిలో అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్నారు. 2019 నుంచి భర్తీ చేసిన పోస్టులు కేడర్ పోస్టుల సంఖ్య ప్రత్యేక వైద్యులు 28 మెడికల్ ఆఫీసర్లు 45 మెడికల్ ఆఫీసర్లు అర్బన్ 21 ఏఎన్ఎంలు 1,130 స్టాఫ్ నర్సులు 180 ఫార్మసిస్టులు 77 ల్యాబ్ టెక్నీషియన్లు 53 ఎంఎల్హెచ్పీలు 1,010 ఇతర పోస్టులు 56 క్లాస్–4 ఉద్యోగులు 120 డేటా ఎంట్రీ ఆపరేటర్స్ 25 ఎలక్ట్రీషియన్లు 4 థియేటర్ అసిస్టెంట్లు 3 ఈసీసీ టెక్నీషియన్లు 5 ఓటీ టెక్నీషియన్ 7 రేడియోగ్రాఫర్లు 10 ఫిజియోథెరపిస్ట్లు 4 డెంటల్ టెక్నీషియన్లు 2 108 సిబ్బంది 206 104 సిబ్బంది 120 102 సిబ్బంది 50 -
తొడలు కొట్టే నేత.. ప్రజాసేవలో తొండాట
‘అన్యాయం జరిగితే అరగంట లేటుగా వస్తానేమో.. కానీ ఆడపిల్లకు ఆపద వస్తే అర నిమిషం కూడా ఆలస్యం చేయను’– ఇది వెండితెరపై వీర లెవల్ డైలాగ్ కట్ చేస్తే.. ఆడది కనిపిస్తే ‘ముద్దు’ అయినా పెట్టాలి లేదా కడుపైనా చేయాలి – ఇది రియల్ లైఫ్లో ముసుగు తొలగించిన మన నాయకుడి ముతక డైలాగ్ ‘నీకు బీపీ వస్తే నీ పీఏ వణుకుతాడేమో.. నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది’రాజకీయాల్లో మాత్రం తనదాకా ఎందుకనుకున్నారేమో.. ప్రజలను వణికించడానికి నియోజకవర్గంలో పీఏలకే పెత్తనాన్ని అప్పగించేశారు. సాక్షి టాస్క్ఫోర్స్: సినిమాల్లో వీర లెవల్ డైలాగులు పలికే ఆ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో మాత్రం ఫెయి ల్యూర్ నేతగా మిగిలిపోయారు. అభివృద్ధి, ప్రతిపక్షంపైనా భారీ సంభాషణలు పలికే ఆయన ప్రజల సమస్యలు తీర్చడంలో జీరోగా మారారు. సెల్యూలాయిడ్పై తన నటనతో ఈలలు, చప్పట్లు కొట్టించుకునే ఆయన ప్రజా జీవితంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించి అభినందనలు పొందలేకపోయారు.గడిచిన పదేళ్లలో ఆయన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చర్యలు చేపట్టకపోవడం, కనీసం స్థానికంగా ఉండే లోటు పాట్లు, సమస్యలపై పదిశాతం కూడా అవగాహన లేదని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్న ఆయన తీరుపై అక్కడి ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కనీసం నెలకోసారి కూడా నియోజకవర్గంలో పర్యటించని నేత తమకెందుకని, తమ సమస్యలు తీర్చి అక్కున చేర్చుకునే స్థానిక నేతలే తమక కావాలని వారు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఈ పదేళ్లలో చాలా హామీలిచ్చినా వాటిని తీర్చలేకపోయారు.రాష్ట్రంలో ఆ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడి ప్రజలు గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఆ కుటుంబాన్ని ఆదరిస్తున్నారు. వెండి తెరపై మన్ననలు పొందిన మాజీ సీఏంతో పాటు ఆ కుటుంబానికి చెందిన మరో ఇద్దరిని ఎమ్మెల్యేలుగా గెలిపించారు. అయితే మరీ ముఖ్యంగా గడిచిన దశాబ్ద కాలంగా ఎమ్మెల్యే ఉన్న ఆయన ఆ ప్రాంతాన్ని గాలికొదిలేశారు. సినిమా షూటింగులు, కుటుంబ వ్యవహారాలు, హైదరాబాద్లో స్థిరనివాసం వెరసి ఆయన ఏడాదికి ఒకట్రెండుసార్లు పర్యటనకు మాత్రమే పరిమితమయ్యారు.పీఏలదే పెత్తనం ఎమ్మెల్యే స్థానికంగా ఉండాలనేది అక్కడి ప్రజల మనోగతం. కానీ అరిచి గీపెట్టినా ఆయన అక్కడికి వెళ్లరు. దీంతో ఆయన నియమించుకున్న ప్రైవేటు పీఏలదే పెత్తనం. అంతేకాదు షాడో ఎమ్మెల్యేగా కూడా వీళ్లే వ్యవహరిస్తుంటారు. ఆయనకు పీఏగా ఉన్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి పేరు కలిగిన వ్యక్తి గతంలో కర్ణాటకలో పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. అనంతరం రిమాండుకు వెళ్లారు. అయినా సరే మళ్లీ ఆయన్నే పీఏగా కొనసాగిస్తున్నారు.ఆ పీఏతోపాటు మరో ఇద్దరు కూడా పీఏలుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో పీఏలు అంతులేని అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా పంచాయతీలు తీర్చడం, సెటిల్మెంట్లు చేయడంలో వారు ఆరితేరారు. నియోజకవర్గంలో భూ కబ్జాలకు పాల్పడిన ఉదంతాలు ఉన్నాయి. ఈ పదేళ్లలో వారు ఎలాంటి సమస్యను తీర్చడానికి కూడా ఆసక్తి కనబరచలేదు. కేవలం అయ్యగారు చెప్పిందే వేదంగా పనిచేశారు. పచ్చ నేతలకే అందుబాటులో ఉండేవారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో తాము ఎదుర్కొనే సమస్యలు ఎవరికి చెప్పాలో తెలియక అక్కడి ప్రజలు గందరగోళానికి లోనవుతున్నారు. ప్రచార రంగంలోకి మళ్లీ ఫ్యామిలీ మరో పది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ ‘పురం’లో ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఎమ్మెల్యే ఆయన భార్య కలిసి ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే భార్య అక్కడికి వచ్చి చీరలు పంచినట్టు తెలిసింది. నియోజకవర్గంలో చుట్టిముట్టేలా ప్రచారం ముమ్మరం చేసి కొత్త హామీలు ఇస్తున్నారు. త్వరలోనే కుమారుడు, కూతుళ్లను కూడా ప్రచారానికి దించబోతున్నట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు.కానీ అవి ఒట్టి మాటలుగానే మిగిలిపోయాయని పురం ప్రజలు వాపోతున్నారు. భూగర్భ డ్రెయినేజీ సమస్య పరిష్కరిస్తానని, రోడ్ల విస్తరణ చేపడతానని ఇచి్చన హామీలు నెరవేర్చలేకపోయారు. క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తానని ఇచి్చన హామీ అలాగే ఉంది. హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకపోవడంలో బావను మించిపోయారనే విమర్శలున్నాయి. వాటిని అమలుపరచకపోగా మళ్లీ ఇప్పుడు కొత్త హామీలు గుప్పిస్తున్నారు. సెంటిమెంటును గౌరవించని తీరు 1985లో నటుడు, మాజీ సీఎం ఇక్కడ మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. అప్పటి నుంచి ఆ కుటుంబమంటే ఇక్కడి ప్రజలకు గౌరవం. ఆ గౌరవంతోనే ఆయన కుమారులను ఎమ్మెల్యేలుగా చేశారు. ఆ కుటుంబమంటే ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉండటమే ఇక్కడి ప్రజలకు శాపమైంది. దీన్ని ప్రజల బలహీనతగా భావించిన ప్రస్తుత ఎమ్మెల్యే ఇక్కడకు రావడమే మానేశారు. మేము వచి్చనా రాకపోయినా మాకే ఓటేస్తారన్న ధీమా ఆయనది. 2014లోనూ, 2019లోనూ ఇక్కడి నుంచి ఆయన్ను అసెంబ్లీకి పంపించారు. కానీ ఆయన ఇక్కడి సమస్యలను మాత్రం ‘పురం’ పొలిమేర దాటించలేకపోయారన్న విమర్శలున్నాయి. ఎప్పుడూ అక్కడి సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన పాపాన పోలేదు. వేసవి వచి్చందంటే తాగునీటితో అల్లాడే ఇక్కడి ప్రజలు తమ కష్టాలు తామే తీర్చుకోవాలన్నట్టు చెబుతుంటారు. ఇదే విషయమై ఇటీవల ఓ టీడీపీ నేత ఆయన వద్ద ప్రస్తావించగా.. ‘‘నాకు ఓటు వేయడం వాళ్ల అదృష్టం.ఆ అవకాశం అందరికీ రాదు . మీరు నోరు మూసుకుని చెప్పింది చేయండి’’ అని గర్జించారట. కేంద్రం నిధులిచి్చనా.. నియోజకవర్గ కేంద్రంలో ఎప్పటినుంచో తాగునీటి సమస్య ఉంది. 1984 నుంచి ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఎటువంటి అభివృద్ధీ లేదు. అమృత్ స్కీం ద్వారా టీడీపీ హయాంలో గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి రూ.194 కోట్లతో పైప్లైన్ వేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వకపోవడంతో మున్సిపాలిటీపై రూ.100 కోట్ల భారం పడింది. ఈ డబ్బుకు వడ్డీ చెల్లించేందుకు మున్సిపాలిటీ ఆదాయం సరిపోవడం లేదు. దీంతో పురం మున్సిపాలిటీ అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. -
తీరం మారింది
ఆ తీర ప్రాంతమంతా మత్స్యకారుల ఆవాసం.. చేపల వేట వారి జీవనాధారం అయితే వేటాడిన చేపలు వెంటనే అమ్ముకోవడం తప్ప వేరే దారి లేదు. వారి వేట సామగ్రికి రక్షణ లేదు. వారి జీవితాలే గాలి వాటంగా మారిపోయాయి. అలాంటి వారి జీవితాలలో 2019వ సంవత్సరం వెలుగులు నింపింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే వారి జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఎటువంటి సౌకర్యాలు లేని కాకినాడ జిల్లా ఉప్పాడ తీరం ఇప్పుడు దేశం గర్వించదగ్గ తీర ప్రాంతంగా మారింది. రాష్ట్రానికి మత్స్యసంపద ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని తెచ్చి పెట్టే ఒక ప్రముఖ ప్రాంతంగా ఉప్పాడ తీరం చరిత్ర సృష్టించబోతోంది. పిఠాపురం: మాకు మాట ఇచ్చారు... అన్న వచ్చారు... చెప్పినదానికంటే ఎక్కువ చేసి చూపిస్తున్నారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జాలర్లు జై కొడుతున్నారు. సుమారు 50 ఏళ్లుగా ప్రధాన సమస్యగా ఉన్న ఉప్పాడ మినీ హార్బర్ నిర్మాణం సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కార్యరూపం దాలి్చంది. రానున్న 50 ఏళ్లలో పెరగనున్న జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ హార్బర్ను నిర్వించడం విశేషం. మినీ హార్బర్ నిరి్మస్తామని చెప్పినా మేజర్ హార్బర్ నిరి్మంచడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ హయాంలో... 2014లో ఉప్పాడ మత్స్యకారుల సమస్యలు తీరుస్తామని మినీ హార్బర్ నిరి్మస్తామని చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చాక మినీ హార్బర్ ఊసెత్తలేదు. రూ.50 కోట్లు కేటాయించామని గొప్పలు చెప్పుకున్నారు. డీజిల్ సబ్సిడీ, వేట నిషేధ పరిహారం, ప్రమాదవశాత్తు మరణించిన వారికి పరిహారం పెంపు విషయాలను పక్కన పెట్టేశారు. ఐదేళ్లపాటు ఉప్పాడ తీర ప్రాంతంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు. డ్రెడ్జింగ్ పేరుతో రూ.2 కోట్లు ప్రభుత్వ సొమ్మును టీడీపీ నేతలు పంచేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 2019 తరువాత... ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కాకినాడలో నిర్వహించిన మత్స్యకార సమ్మేళనంలో సీఎం వైఎస్ జగన్ మత్స్యకారుల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. అధికారంలోకి వచి్చన వెంటనే అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తానని మాట ఇచ్చారు. అన్న మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఉప్పాడ తీరంలో మేజర్ హార్బర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రానున్న 50 ఏళ్లలో పెరగనున్న మత్స్యకారుల వేటకు వీలుగా మేజర్ హార్బర్ నిర్మాణానికి రూ.351 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించారు. 2500 బోట్లు నిలిపే సామర్థ్యంతో 1.10 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు మత్స్య సంపద సేకరించేలా, 50 వేల మత్స్యకార కుటుంబాలకు ఆసరాగా నిర్మాణం చేపట్టారు. కోల్డ్ స్టోరేజ్లు, పెట్రోల్ బంకు, జెట్టీలు, ఫిష్ హ్యాండ్లింగ్, వేలం ప్రాంగణం, చేపలు ఎండబెట్టుకునే యార్డు, ప్యాకింగ్ షెడ్లు, మత్స్యకారులకు శిక్షణా కేంద్రం, వలలు అల్లుకునే షెడ్లు, ఐస్ ప్లాంట్ పనులు 70 శాతం పూర్తయ్యాయి. తొలుత కరోనా వల్ల పనులు కొంత నెమ్మదైనా గత ఏడాది నుంచి ఊపందుకున్నాయి. ఆరు నెలలుగా పరుగులు పెట్టిన పనులతో రూ.250 కోట్లకు పైగా నిధులు వెచి్చంచి నిర్మాణాలు పూర్తి చేశారు. ఇంత అభివృద్ధి చూస్తాననుకోలేదు నా చిన్నప్పటి నుంచి ఈ ప్రాంతంలో హార్బరు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. గతంలో కాకినాడ హార్బర్కు మా బోట్లు వెళ్లేవి. కానీ పదేళ్లుగా మా బోట్లను కాకినాడ హార్బర్కు రానివ్వడం లేదు. దీంతో ఇక్కడే ఉప్పుటేరులో బోట్లు నిలుపుకుంటున్నాం. అప్పుడప్పుడు చాలా ప్రమాదాలు జరిగి ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించేవి. గతంలో టీడీపీ నేతలు ఎన్నో వాగ్దానాలు చేసినా అవేవీ నెరవేరలేదు. ఇక జన్మలో హార్బర్ చూస్తామనుకోలేదు. కానీ సీఎం వైఎస్ జగన్ మా బాధలు విని అన్న మాట ప్రకారం నిరి్మంచి,మాకు ప్రత్యక్ష దైవంగా మారారు. - కంబాల రాంబాబు, మత్స్యకారుడు,ఉప్పాడ శివారు సూరాడపేటజిల్లాలో తీరప్రాంత మండలాలు: 5 మత్స్యకార గ్రామాలు: 36 మెరైన్ ఫిషర్మెన్ జనాభా: 2,00,000 చేపల వేట ద్వారా జీవనోపాధి పొందుతున్న వారు: 36,000 మెకనైజ్డ్ బోట్లు: 467 మోటారు బోట్లు: 3,779 సంప్రదాయ బోట్లు: 399 మొత్తం బోట్లు: 4,645ఉప్పాడ మేజర్ హార్బర్ విశేషాలు∗ నిర్మాణ వ్యయం: రూ.351 కోట్లు ∗ నిర్మాణ స్థలం: 58 ఎకరాలు∗ ఉపాధి పొందే మత్స్యకారుల కుటుంబాలు: 2500 ∗ ఉపాధి పొందే మండలాలు కొత్తపల్లి,తొండంగి, కాకినాడ రూరల్ ∗ ఏటా 30 వేల టన్నుల నుంచి 1.10 లక్షల టన్నులకు పెరగనున్న మత్స్య ఉత్పత్తి ∗ చేపల ఉత్పత్తి అంచనా విలువ రూ.890 కోట్లు ∗ ఒకేసారి 2,500 బోట్లు నిలుపుకునే సామర్థ్యం.. భారీ బోట్లు నిలుపగలిగేలా నిర్మాణం ∗ 20 టన్నుల కెపాసిటీ గలశీతల గిడ్డంగులు.. భారీ ట్యూనా చేపల ఫిష్ హ్యాండ్లింగ్ ప్యాకింగ్ షెడ్లు ∗ కోల్డ్ స్టోరేజ్లు, పెట్రోల్ బంకు, జెట్టీలు, వేలం ప్రాంగణం, చేపలు ఎండబెట్టుకునే యార్డు, ∗ ప్యాకింగ్ షెడ్లు, మత్స్యకారులకు శిక్షణా కేంద్రం.. వలలు అల్లుకునే షెడ్లు, ఐస్ ప్లాంట్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement