-
నగదు జప్తు
పెద్దపల్లిరూరల్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సరైన ఆధారాలు లేకుండా నగదు, ఇతర విలువైన వస్తుసామగ్రి తరలిస్తూ పట్టుబడితే జప్తు చేస్తామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ తెలిపారు. ఇలాంటి వాటిని తగిన ఆధారాలు చూపి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ఇప్పటి వరకు రూ..1,58,46,182 నగదు పట్టుబడగా ఆధారాలు చూపిన రూ.1,57,95,182 నగదు విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆభరణాలు పట్టివేత జ్యోతినగర్(రామగుండం): శుక్రవారం రాత్రి ఎన్టీపీసీ పోలీస్స్టేషన్ పరిధిలోని మేడిపల్లి సెంటర్లో ఎస్సై ఉదయ్కిరణ్ తన సిబ్బందితో తనిఖీలు చేపట్టగా హైదరాబాద్ నుంచి మంచిర్యా వైపు వె ళ్తున్న వాహనంలో బంగారు, వెండి ఆభరణాలు క నిపించాయి. కరీనగర్కు చెందిన కొత్తకొండ నవీన్ వీటిని తరలిస్తున్నారని గుర్తించారు. ఆధారాలు చూపకపోవడంతో ఎఫ్ఎస్టీకు అప్పగించారు. ఆభరణాల విలువ సుమారు రూ. 81,02,691 వరకు ఉంటుందని ఎస్సై వివరించారు. జగిత్యాల జిల్లాలో.. జగిత్యాలక్రైం/మెట్పల్లి: జిల్లా కేంద్రంలోని తహసీ ల్ చౌరస్తాలో శుక్రవారం ఎస్సై మన్మథరావు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేశారు. ఉప్పరిపేటకు చెందిన కొక్కు రాజేందర్ ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.2 లక్షలు, విద్యానగర్కు చెందిన కంది లక్ష్మణ్ తీసుకెళ్తున్న రూ.లక్ష సీజ్ చేసి గ్రీవెన్సెల్కు పంపించారు. మెట్పల్లిలోనూ నగదు సీజ్ చేశారు. -
దొంగలను పట్టిచ్చిన సీసీ కెమెరా
మేడిపల్లి(వేములవాడ): భీమారం మండలం దేశాయిపేట ఎల్లమ్మ ఆలయంలో గురువారం రాత్రి ఇద్దరు దొంగలు చోరీకి పాల్పడ్డారు. అమ్మవారి ముక్కు పుడక, బంగారు ఆభరణాలతో పరారయ్యారు. చోరీ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో నిక్షిప్తం కాగా.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సీసీ కెమెరాలను తన సెల్ఫోన్కు అనుసంధానం చేసుకోవడంతో చోరీ దృశ్యాలను గమనించి గ్రామస్తులకు సమాచారం అందించాడు. రంగాపూర్ గ్రామ శివారులో ఇద్దరు దొంగలను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఎవరికీ తెలియకుండా దొంగతనం చేస్తామనుకున్న వారిని మూడో కన్ను అయినా సీసీ కెమెరా పట్టిచ్చింది. -
ఉద్యమనేతకు కన్నీటి వీడ్కోలు
పాలకుర్తి(రామగుండం): సుమారు 42ఏళ్ల క్రితం అడవి బాటపట్టిన మావోయిస్ట్ నేత, ఉద్యమ కెరటం చీమల నర్సయ్య ఉరఫ్ జోగన్న జీవిత ప్రస్థానం ముగిసింది. నాలుగురోజుల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎన్కౌంటర్లో అసువులు బాసిన జోగన్నకు శుక్రవారం స్వగ్రామంలో అశ్రునయనాల మధ్య అంతక్రియలు జరిపారు. ‘పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన చీమల నర్సన్న అమర్ రహే’ అంటూ చేసిన నినాదాలతో జయ్యారం మార్మోగింది. ఉదయం 8.30గంటలకు ప్రత్యేక వాహనంలో నర్సయ్య మృతదేహాన్ని గుడిపల్లి శివారులోని శ్రీచెన్నకేశవస్వామి ఆలయ సమీపంలో స్థానికుల సందర్శనార్థం ఉంచారు. చిన్నప్పుడే పెత్తందార్లు, పోలీస్పటేళ్ల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమబాట పట్టిన జోగన్న.. కడదాకా ఉద్యమంలోనే ఉండి పీడిత ప్రజల పక్షాన పోరాటం చేశారని బంధుమిత్రులు, వివిధ ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘాల నేతలు, అమరుల బంధుమిత్రుల సంఘం నేతలు, మాజీ మావోయిస్టులు, స్థానికులు గుర్తుచేసుకున్నారు. నర్సయ్య పార్థివ దేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. దాదాపు రెండు గంటల పాటు జోగన్నతో ఉద్యమ సమయంలో పంచుకున్న అనుభవాలు స్మరించుకున్నారు. ఉద్యమ చైతన్య గేయాలు ఆలపిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఉదయం 11గంటల సమయంలో వైకుంఠరథంపై జోగన్న పార్థివదేహాన్ని ఉంచి డప్పుచప్పుళ్ల మధ్య అంతిమయాత్ర ప్రారంభించారు. జయ్యారం గ్రామ శివారులోని శ్మశానవాటికలో నర్సయ్య దహన సంస్కారాలు పూర్తిచేశారు. అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పద్మకుమారి, ప్రతినిధులు శాంతక్క, భవాని, అంజమ్మ, సత్య, ఉష, పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మదన కుమారస్వామి, మహ్మద్ హుస్సేన్, శ్రీపతి రాజగోపాల్, విరసం ఉమ్మడి జిల్లా కన్వీనర్ బాలసాని రాజయ్య, తెలంగాణ ప్రజాఫ్రంట్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ గుమ్మడి కుమారస్వామి, నాయకులు పోరెడ్డి వెంకన్న, నారా వినోద్, బొడ్డుపల్లి వినోద్, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ముడిమడుగుల మల్లయ్య, ఎరుకల రాజయ్య, లక్ష్మణ్, పర్వతాలు, పుట్నూర్ ఎంపీటీసీ గంగాధర రమేశ్, నాయకులు కొప్పు రాజేశం, చింతకింది సత్యనారాయణ, ప్రభాకర్తో పాటు సమీప గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పుట్టిన ఊరులో కన్నా అడవిలోనే ఎక్కువ.. మావోయిస్టు నేత చీమల నర్సయ్య తాను పుట్టిన ఊరులో కన్నా.. అడవిలోనే ఎక్కువకాలం జీవించారు. తన 22ఏళ్ల వయసులోనే వనం బాట పట్టిన నర్సయ్య.. దాదాపు 42ఏళ్ల పాటు ఉద్యమంలో గడిపారని, కనీసం సొంత ఇంటిని కూడా నిర్మించుకోని నిస్వార్థ ఉద్యమ నేత అని స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. ‘అవ్వ చచ్చిపోతే రాకపోతివి.. చెల్లి చచ్చిపోతే రాకపోతివి.. అడవిలోనే అసువులు బాసి తివా తమ్ముడా.. మా ఇంటికి వచ్చినా.. నీ మేనల్లుడు నిన్ను సాదేటోడు కదా.. ఓ తమ్ముడా’ అని నర్సయ్య సోదరి రాజక్క రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. స్వగ్రామంలో నర్సయ్య అంత్యక్రియలు పూర్తి రోదించిన సోదరి రాజక్క, కుటుంబసభ్యులు -
అనారోగ్యంతో ఎకై ్సజ్ ఎస్సై మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయంలో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న కాళీ ప్రసాద్(58) శుక్రవారం వేకువజామున అనారోగ్యంతో మృతి చెందాడు. గ్రామస్తులు, కుటుంబీకులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కొత్తగూడెం పట్టణానికి చెందిన కాళీప్రసాద్ మల్టీజోన్ బదిలీల్లో భాగంగా గత ఫిబ్రవరి 14న ఎల్లారెడ్డిపేట సర్కిల్ కార్యాలయానికి బదిలీపై వచ్చారు. స్థానికంగా ఓ అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. కొంతకాలంగా మధుమేహం, బీపీ, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నాడు. ఇంట్లో నిద్రించే క్రమంలో అతడికి తలుపులు వేసుకునే అలవాటు లేదు. అయితే శుక్రవారం ఉదయం తన గదిలో విగతజీవిగా పడి ఉన్న ప్రసాద్ను యజమాని గమనించి ఎస్సైజ్ సీఐ శ్రీనివాస్కు సమాచారం అందించారు. అధికారులు ఘటన స్థలానికి చేరుకుని ప్రసాద్ మృతదేహన్ని పరిశీలించి, అతడి కుటుంబీకులకు సమాచారమిచ్చారు. అయితే ప్రసాద్ మృతదేహన్ని పరిశీలించిన అధికారులు అనుమానాస్పద మృతిగా భావించారు. కొత్తగూడెం నుంచి కుమారుడు సాయిరేవంత్ తన స్నేహితులతో వచ్చి మృతదేహన్ని పరిశీలించారు. తన తండ్రి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపారు. అతడి మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులకు కూడా ఫిర్యాదు చేయకుండా మృతదేహాన్ని అంబులెన్స్లో స్వగ్రామానికి తరలించారు. పక్షం రోజుల్లో భార్యాభర్తల మృతి ఎకై ్సజ్ ఎస్సై ప్రసాద్ భార్య సావిత్రి 15 రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. అంతలోనే ప్రసాద్ మృతిచెందడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. భార్య మృతిచెందిన బాధలోనే ప్రసాద్ తీవ్రంగా కుంగిపోయినట్లు పేర్కొన్నారు. అయితే ప్రసాద్ రెండురోజుల క్రితం ఏటీఎం నుంచి వేతనం రూ.40వేలు తీసుకోగా, శుక్రవారం అతడి వద్ద రూ.17వేలు మాత్రమే ఉన్నాయని కుమారుడు పేర్కొన్నాడు. ● పక్షం రోజుల వ్యవధిలో దంపతుల మృతితో కుటుంబంలో విషాదం -
12 మందిని కరిచిన కుక్కలు
రాయికల్(జగిత్యాలరూరల్): జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలోని కేశవనగర్లో శుక్రవారం వీధికుక్కల దాడిలో సుమారు 12 మంది గాయపడ్డారు. కేశవనగర్కు చెందిన శ్రీనివాస్, నవీన్, రాజిరెడ్డి, రమేశ్, లక్ష్మి, సత్యనారాయణ, నర్సారెడ్డి, విష్ణు, రాజేశ్వరి, శ్రీలేఖ మరో ఇద్దరిని వీధికుక్కలు కరిచాయి. మున్సిపల్ సిబ్బంది వెంటనే స్పందించి వీధికుక్కలను పట్టుకున్నారు. గాయపడినవారంతా రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. వ్యక్తి ఆత్మహత్య పెద్దపల్లిరూరల్: పట్టణంలోని చింతలవాడకు చెందిన షాకీర్(45) శుక్రవారం ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న వెల్డింగ్ షాపులో పనిచేసే షాకీర్.. కొంతకాలం క్రితం మద్యానికి బానిసయ్యాడని స్థానికులు తెలిపారు. ఆత్మహత్యకు గల వివరాలు తెలియాల్సి ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
ది లీడర్..!
టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు
షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం
ఇండోనేషియాలో భారీ వరదలు.. 14 మంది మృతి!
కాంగ్రెస్ అంతిమ దశకు చేరుకుంది: జ్యోతిరాదిత్య సింధియా
చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
వయ్యారి భామ నీ కళ్లు చూస్తే.. రేరాజైనా కుళ్లుకోవాల్సిందే! (ఫోటోలు)
మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement