-
ఇంజినీరింగ్ విద్యార్థులకు మంచి ప్లేస్మెంట్స్
● ఆర్యూ వీసీ ప్రొఫెసర్ బి.సుధీర్ ప్రేమ్ కుమార్ కర్నూలు కల్చరల్: ఇంజినీరింగ్ విద్యార్థులకు మంచి ప్లేస్మెంట్స్ చూపించాలని రాయలసీమ విశ్వవిద్యాలయం వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ బి.సుధీర్ ప్రేమ్ కుమార్ అధ్యాపకులను ఆదేశించారు. శుక్రవారం వీసీ తన చాంబర్లో వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఎన్.టి.కె.నాయక్తో కలిసి , ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకులతో సమీక్ష నిర్వహించారు. లెసన్ ప్లాన్తో పాటు అవసరమైన రికార్డులను అధ్యాపకులు తప్పనిసరిగా తయారు చేసుకోవాలన్నారు. వేసవి సెలవుల అనంతరం బయోమెట్రిక్ ద్వారా విద్యార్థుల హాజరును పర్యవేక్షిస్తామన్నారు. విద్యార్థుల స్థాయిని అనుసరించి అవసరమైన వారికి అదనపు తరగతులను నిర్వహించాలన్నారు. సైబర్ సెక్యూరిటీ అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. అధ్యాపకుల నైపుణ్యాల మెరుగుదలకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. కా ర్యక్రమంలోఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై. హరిప్రసాద్రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. స్నాతకోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేయండి రాయలసీమ విశ్వవిద్యాలయ 4వ స్నాతకోత్సవం (కాన్వకేషన్) జూన్ 21వ తేదీన నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా విశ్వ విద్యాలయ వీసీ సుధీర్ ప్రేమ్ కుమార్ వర్సిటీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వీసీ ఛాంబర్లో కాన్వకేషన్ నిర్వహణపై వర్సిటీలోని వివిధ విభాగాల ఆచార్యులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. స్నాతకోత్సవ నిర్వహణకు వివిధ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్.అంకన్న, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.వి.కృష్ణారెడ్డి, రీసెర్చ్ డైరెక్టర్ ఆచార్య సి.విశ్వనాథరెడ్డి, అకడమిక్ అఫైర్స్ డీన్ ఆచార్య ఆర్.భరత్కుమార్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై. హరిప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. -
మద్యం మత్తులో కింద పడి వ్యక్తి మృతి
ఓర్వకల్లు: మద్యం మత్తులో ఓ వ్యక్తి కింద పడి మృతి చెందిన సంఘటన గుట్టపాడు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వడ్డే గుంజల దర్గయ్య(47), శేషమ్మ దంపతులు స్థానిక స్టీల్ ప్లాంట్లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరికి నాగశేషులు అనే ఒక్కగానొక్క కొడుకు సంతానం. అయితే తాగుడు బానిసైన దర్గయ్య గత నెల రోజుల నుంచి పనులకు వెళ్లకుండా నిత్యం మద్యసేవించి కుటుంబ సభ్యులతో గొడవపడేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి కూడా మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. రాత్రి 10 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ఇంటిముందు భోజనం చేస్తుండగా భార్య శేషమ్మతో గొడవకు దిగాడు. అక్కడే ఉన్న కొడుకు నాగశేషులు తండ్రిని వారించాడు. అయినా వినిపించుకోలేని దర్గయ్య తాగిన మైకంలో ఇంటి మెట్లు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డాడు. దీంతో తలకు తీవ్ర రక్తగాయం కావడంతో కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని భార్య శేషమ్మ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్ల్లు ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు. నిలకడగా ఎండుమిర్చి ధరలు నంద్యాల(సెంట్రల్): పట్టణంలోని మిర్చి యారు ్డలో శుక్రవారం సూపర్–10 సరకు రకం జనరల్ క్వింటాలు గరిష్ట ధర రూ.13,000, మధ్యస్థ ధర రూ.10,000, కనిష్ట ధర రూ.8,000గా నమోదైంది. ఇదే రకం తాలుకాయ జనరల్ గరిష్ట ధర క్వింటాలు రూ.6,000, మధ్యస్థ ధర రూ.5,000, కనిష్ట ధర రూ.4,500గా పలికినట్లు యార్డు ఎంపిక శ్రేణి కార్యదర్శి కల్పన తెలిపారు. తెలంగాణ మద్యం స్వాధీనం పగిడ్యాల: పగిడ్యాల గ్రామానికి చెందిన సాయి అలియాస్ చాకలి సాయి అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం నుంచి బైక్లో 192 మద్య సీసాలను తరలిస్తుండగా నెహ్రూనగర్ క్రాస్ రోడ్డు వద్ద రైడ్ చేసి పట్టుకున్నామని ఎస్ఐ జయశేఖర్ శుక్రవారం తెలిపారు. నిందితుడిపై ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. -
సీఎం జగన్ పాలనపై విస్తృతంగా ప్రచారం చేయండి
కొలిమిగుండ్ల: ీసఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనపై విస్తృతంగా ప్రచారం చేయాలని, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం కొలిమిగుండ్లలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ మండల ఇన్చార్జ్ కాటసాని ప్రసాదరెడ్డితో కలిసి యువతీ, యువకులు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత పార్టీ కోసం కష్ట పడి పని చేసి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎంగా చేసేందుకు కృషి చేయాలని కోరారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను తీర్చిన ఘనత ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికే దక్కుతుందన్నారు. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన కాటసానిని గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు అంబటి గుర్విరెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి పేరం సత్యనారాయణరెడ్డి, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు లాయర్ మహేశ్వరరెడ్డి, జేసీఎస్ మండల కన్వీనర్ మొలక రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాలుగైదు రోజులు జాప్యం జరిగేతే నష్టమేమి
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. ఇందువల్ల పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వడంలో కొద్దిగా జాప్యం జరుగుతోంది. నాలుగైదు రోజులు జాప్యం కావడం వల్ల నష్టపోయేది ఏమీ లేదు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు మా వంతుగా సహకరిస్తాం. పెన్షన్ ఆలస్యం అవుతుందనే కారణంతో ప్రభుత్వంపై మాకు ఎలాంటి కోపం, ద్వేషం లేవు. ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. ప్రతిఒక్కరూ విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. – రంగారెడ్డి, కర్నూలు పెన్షనర్ల సంఘం ఉద్యోగుల పట్ల జగన్ స్నేహభావం చంద్రబాబుతో పోలిస్తే జగన్ ఉద్యోగుల పట్ల స్నేహభావంతో ఉంటారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఎన్నో కుటుంబాలు సంక్షేమ పథకాలను వినియోగించుకొని పేదరికం నుంచి బయటపడ్డాయి. సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ ద్వారా పాలన ప్రజల వద్దకే వచ్చింది. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నపుడు వేతనాలు, పెన్షన్ చెల్లింపులో కొందరికి జాప్యం జరగవచ్చు. దీనిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. – జి.రాముడు, విశ్రాంత ఉద్యోగి కష్టకాలంలో కూడా పెన్షన్ ఇచ్చారు పెన్షన్, వేతనాల చెల్లింపుల్లో కొంతమందికి నాలుగైదు రోజులు ఆలస్యమైనంత మాత్రానా ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు. మాకు ప్రతి నెలా మొదటి వారంలోనే పెన్షన్ వస్తుంది. ఏప్రిల్ నెల పెన్షన్ మే ఒకటవ తేదీనే పడింది. కరోనా వంటి కష్టమైన పరిస్థితుల్లో ఇటు సంక్షేమం, ఉద్యోగులకు, పెన్షనర్లకు వేతనాలు, పెన్షన్ సకాలంలోనే ఇచ్చారు. కష్టకాలంలో అందరికీ ప్రభుత్వం అండగా నిలిచింది. – శివరామిరెడ్డి, విశ్రాంత ఉద్యోగి -
ధాన్యం రైతుకు దన్నుగా..!
కోవెలకుంట్ల: ఖరీఫ్లో వరి సాగుతో లాభాలు గడించిన రైతులకు రబీ కూడా కలిసోచ్చింది. సీజన్లో సకాలంలో వర్షాలు కురియకపోయినా అందుబాటులో ఉన్న సాగునీటి వనరులు అన్నదాతను గట్టెక్కించాయి. పైరు వివిధ దశల్లో సాగునీరు పుష్కలంగా అందటంతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడం, మార్కెట్లో ధాన్యానికి మద్దతు ధర ఉండటంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నంద్యాల జిల్లాలోని 29 మండలాల పరిధిలో బోర్లు, బావులు, చెరువులు, కుందూనది, పాలేరు, కుందరవాగు,తదితర సాగునీటి వనరుల ఆధారంగా 32 వేల ఎకరాల్లో కర్నూలుసోనా, 555 రకాలకు చెందిన వరిని రైతులు సాగు చేశారు. ఇందులో స్థానిక వ్యవసాయ సబ్ డివిజన్లోని అవుకు మండలంలో 2,475 ఎకరాలు, ఉయ్యాలవాడ మండలంలో 630 ఎకరాలు, కోవెలకుంట్ల మండలంలో 450 ఎకరాలు, దొర్నిపాడు మండలంలో 121 ఎకరాలు, సంజామల మండలంలో 70 ఎకరాల్లో సాగైంది. ప్రస్తుతం వరిపంట చేతికందటంతో కోత నూర్పిడి పనుల్లో రైతుల్లో నిమగ్నమయ్యారు. ఊరిస్తున్న మద్దతు ధర.. ఈ ఏడాది కోటి ఆశలతో వరి సాగు చేయగా సాగునీటి వనరులు రైతులను గట్టెక్కించాయి. వరినారు, నాట్లు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపు, కోత, నూర్పిడి, తదతర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 20 వేలు వెచ్చించారు. పైరు వివిధ దశల్లో దోమ, ఎర్ర తెగులు ఆశించగా రైతులు సకాలంలో గుర్తించి క్రిమి సంహారక మందుల పిచికారితో తెగుళ్లు అదుపులోకి వచ్చాయి. వాతావరణం అనుకూలంగా మారి పంట పండి ఎకరాకు 30 నుంచి 32 బస్తాల దిగుబడులు వస్తున్నాయి. వరిసాగుకు ముందే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. గ్రేడ్–1 రకం క్వింటా 2,203, గ్రేడ్–2 రకం రూ. 2,183 ధర నిర్ణయించారు. వరికి మద్దతు ధర ఉండటంతో రైతులు ఊరట చెందుతున్నారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో వరిపైరు చేతికందటంతో రైతులు కోత, నూర్పిడి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కంబైండ్ హార్వెస్టర్ యంత్రాలతో వరి కోత. నూర్పిడి పనులు జరుగుతున్నాయి. ఎకరా వరి కోత, నూర్పిడికి రూ. 3వేలు ఖర్చు అవుతోంది. మార్కెట్లో ధర ఉండటంతో నూర్పిడి చేసిన వెంటనే వడ్లను విక్రయిస్తున్నారు. పచ్చివడ్లను బస్తా రూ. 1,500లకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దిగుబడులు ఆశాజనకంగా వస్తుండటం, ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర ఉండటంతో ఆదాయం చేకూరుతుందని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. క్వింటాకు రూ. 2,203 ధర జిల్లాలో రబీలో 32 వేల ఎకరాల్లో వరిసాగు సాగునీటి వనరులతో గట్టెక్కిన రైతు ఎకరాకు 30–32 బస్తాల దిగుబడులు ముమ్మరంగా కోత, నూర్పిడి పనులు అన్నదాతకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది
నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!
శోభిత పోస్ట్.. సమంత స్టైలిష్ట్ రిప్లై
ముంబై ఎయిర్పోర్టులో 12 కోట్ల విలువైన బంగారం, ఐఫోన్లు సీజ్
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
కాన్వాయ్ స్లో చేసి అంబులెన్స్కు దారిచ్చిన సీఎం జగన్ (ఫొటోలు)
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
ఎల్లో శారీలో హీరామండి హీరోయిన్ సంజీదా షేక్ లుక్స్.. ఫోటోలు
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement