-
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి
సిరిసిల్ల: జిల్లాలోని ఉద్యోగులందరూ పార్లమెంట్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి కోరారు. సిరిసిల్ల గీతానగర్ హైస్కూల్లోని ఫెసిలిటేషన్ సెంటర్ను శుక్రవారం సందర్శించారు. ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా 3,628 ఓటర్లు ఉండగా, సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలో 1,066 మంది, వేములవాడ నియోజకవర్గం పరిధిలో 631 మంది, ఈడీసీ (ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్)లో 1,931 మంది ఉన్నారని కలెక్టర్ వెల్లడించారు. ఈనెల 3వ తేదీ నుంచి 8 వరకు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ పి.గౌతమి, సిరిసిల్ల ఆర్డీవో ఎల్.రమేశ్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సిరిసిల్ల తహసీల్దారు షరీఫ్ మొహినొద్దీన్, తదితరులు పాల్గొన్నారు. ● కలెక్టర్ అనురాగ్ జయంతి -
పర్యటన హైలైట్స్..
● సాయంత్రం 5.35గంటలకు హెలికాప్టర్ ద్వారా రామగుండం కమిషనరేట్ హెలిపాడ్కు చేరుకున్న కేసీఆర్ ● 5.36గంటలకు హెలిపాడ్ వద్ద నాయకులు ఘనస్వాగతం పలికారు ● సాయంత్రం 5.45గంటలకు సింగరేణి ఇల్లెందు గెస్ట్హౌస్ చేరుకున్నారు. ● రాత్రి 8.30గంటలకు ఇల్లెందు గెస్ట్హౌస్ నుంచి ప్రధాన చౌరస్తాకు బస్సులో బయలుదేరిన కేసీఆర్ ● రాత్రి 8.35గంటలకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ టీ జంక్షన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు, టీబీజీకేఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ● రాత్రి 9.00గంటలకు ప్రధాన చౌరస్తాకు చేరుకుని బస్సుపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేసిన కేసీఆర్.. ఆ తర్వాత ప్రసంగం ప్రారంభించారు ● రాత్రి 9.30గంటలకు ప్రసంగం పూర్తి చేశారు. తిరిగి బస్సులో సింగరేణి ఇల్లెందు గెస్ట్హౌస్కు చేరుకున్నారు. ● రాత్రి గోదావరిఖనిలోనే బస చేస్తారు. ● శనివారం సాయంత్రం మంచిర్యాలలో బస్సుయాత్ర చేపడతారు. -
సూరీడు భగ భగ
శనివారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 202446.0745.05కరీంనగర్ (రామడుగు)సిరిసిల్ల (ఇల్లంతకుంట) పెద్దపల్లి (మంథని) జగిత్యాల (నేరెళ్ల) ఉమ్మడి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు46.0న్యూస్రీల్ -
ఇంటి వద్దే ఓటు వినియోగం
సిరిసిల్ల: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం నుంచి ఈనెల 6వ తేదీ వరకు అధికారులు ఈ హోమ్ ఓటింగ్ అవకాశాన్ని కల్పించారు. 80ఏళ్లు దాటిన వృద్ధులు, 40 శాతానికి పైబడిన దివ్యాంగులు తమ ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం సైతం అవసరమైన ఏర్పాట్లు చేసింది. శుక్రవారం సిరిసిల్ల నియోజకవర్గంలో 9 మంది దివ్యాంగులు, 51 మంది వయోవృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వేములవాడలో 215 మంది దివ్యాంగులు, 62 మంది వృద్ధులు ఓటు హక్కును ఇంటినుంచి వినియోగించుకున్న వారిలో ఉన్నారు. -
పర్యవేక్షకులు లేక పరేషాన్
● ప్రసాదాల విభాగంలో ఇబ్బందులు ● సిబ్బంది కొరతతో అధికారులకు తలనొప్పివేములవాడ: ఎములాడ రాజన్నను దర్శించుకున్న భక్తులు అధిక శాతం స్వామి వారి ప్రసాదాలను కొనుక్కుని ఇంటికి తీసుకెళ్తారు. అయితే ప్రసాదాల తయారీ, ప్రసాదాలకు కావాల్సిన సరుకులిల్చే గోదాంలలో పని చేసే పర్యవేక్షకులు లేకపోవడంతో పనులు ముందుకు సాగక మిగతా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వేసవి సెలవులు ప్రారంభం కావడంతో రద్దీ విపరీతంగా పెరుగుతోంది. రద్దీకి తగినట్లుగా ప్రసాదాల తయారీ, గోదాంలలో పనులు పర్యవేక్షించే వారు లేకపోడవంతో పైస్థాయి అధికారులు ఇబ్బంది పడుతున్నారు. గోదాంలో పనిచేసే పర్యవేక్షకులు డిప్యూటేషన్పై ఎమ్మెల్యే పీఎస్గా వెళ్లారు. ప్రసాదాల తయారీ విభాగంలో విధులు నిర్వహించే పర్యవేక్షకులు ఇటీవలే రిటైర్డ్మెంట్ పొందారు. దీంతో ఆలయానికి అత్యంత కీలకమైన రెండు విభాగాల్లో పర్యవేక్షుకులు లేకపోడవంతో పనుల పర్యవేక్షణ ఇబ్బందిగా మారింది. సిబ్బంది కొరత, రిటైర్డ్మెంట్ పొందిన వారి స్థానాల్లో నూతన నియామకాలు చేపట్టకపోవడంతో ఆలయంలో పాలన అస్తవ్యస్తంగా మారుతోంది. ఔట్సోర్సింగ్ సిబ్బందితో ఉన్నతాధికారులు పనులు చేయిస్తున్న క్రమంలో పలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవాదాయశాఖ అధికారులు సిబ్బంది కొరతపై ప్రత్యేక దృష్టిసారించి సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement