-
జిల్లాలను కుదిస్తే ఊరుకోం
● కుమురంభీం స్ఫూర్తితో ఉద్యమిస్తాం ● ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆసిఫాబాద్అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో జిల్లాల కుదింపు చర్యలకు పాల్పడితే ఊరుకోమని ఎమ్మెల్యే కోవ లక్ష్మి హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆరు అబద్ధపు గ్యారంటీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలను కుదించే యోచనలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాను రద్దు చేస్తే ఆదివాసీ యోధుడు కుమురంభీం స్ఫూర్తితో మరో పోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు. ప్రత్యేక జిల్లా ఏర్పాటు తర్వా త ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. జిల్లాను తొలగిస్తే అభివృద్ధి కుంటుపడి ఆదివాసీలు అవస్థలు పడే అవకాశం ఉందన్నారు. కుమురంభీం ప్రాజెక్టు నిర్మాణం కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని, నాణ్యత లోపానికి ఆ పార్టీయే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాలువలు పూర్తి కాకముందే అప్పటి సీఎం కిరణ్కుమార్ రెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రజలను ఇబ్బంది పెడితే సహించేంది లేదన్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన సీఎం జిల్లా ఏ హామీలు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటేనే అభివృద్ధి చేస్తారా.. లేకుంటే పట్టించుకోరా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు 40వేల మెజారిటీ సాధించనున్నారని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిలువేరు వెంకన్న, నాయకులు జీవన్, తారీఖ్, హైమద్, రవికుమార్, నిసార్, రాపర్తి కార్తీక్, యాదగిరి, రవి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
No Headline
న్యూస్రీల్అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి ఆసిఫాబాద్రూరల్: అందివచ్చిన అవకాశాల ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్(జీజేఎల్ఏ) రాష్ట్ర కోశాధికారి శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని చైతన్య కళాశాలలో శుక్రవారం జీజేఎల్ఏ, ఇంపాక్ట్ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్ పూర్తయిన విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ సంస్థలో ఉద్యోగాల కల్పనతోపాటు డిగ్రీ ప్రవేశాలపై జీజేఎల్ఏ జిల్లా అధ్యక్షుడు నవీన్రెడ్డి అధ్యక్షతన అవగాహన కల్పించారు. 80 మందికి ఇంటర్వ్యూ లు నిర్వహించగా.. 14 మంది ఉద్యోగాలకు ఎంపికై నట్లు ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ ఉషారా ణి, ఇంపాక్ట్ సంస్థ ప్రతినిధులు వెంకటేశ్వర్లు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగులు ఓటుహక్కు వినియోగించుకోవాలి
ఆసిఫాబాద్అర్బన్: లోక్సభ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. ఆదిలాబాద్ పార్లమెంటరీ పరిధిలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగుల కోసం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం నుంచి ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 3 నుంచి 8 వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోగా ఉద్యోగులు ఓటు వేయొచ్చన్నారు. ఆసిఫాబాద్లోని ఫెసిలిటేషన్ కేంద్రంలో మొత్తం 2,420 మంది ఉద్యోగులు ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఏర్పాట్ల గురించి అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ దాసరి వేణు, ఆర్డీవో లోకేశ్వర్రావు తదితరులు ఉన్నారు. విద్యార్థులకు అభినందన ఆసిఫాబాద్రూరల్: ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ చూపిన జైనూర్ మండలంలోని గిరిజన ఆశ్రమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులను జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అభినందించారు. గిరిజన ఆశ్రమానికి చెందిన విద్యార్థినులు శ్రీవేణి 9.7, దివ్యావాణి 9.3 జీపీఏ సాధించడం అభినందనీయమన్నారు. జిల్లాలో 37 గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పది పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీటీడీవో రమావేవి, జీసీడీవో శకుంతల, ఏసీఎం ఉద్దవ్, ఏటీడీవో పురుషోత్తం తదితరులు ఉన్నారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే -
అమిత్షా సభ విజయవంతం చేయాలి
ఆసిఫాబాద్: కాగజ్నగర్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా బహిరంగ సభకు నాయకులు, ప్రజలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి అలిజాపూర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో రాష్ట్ర నాయకుడు బోనగిరి సతీశ్బాబు, జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు, బీజేపీ జిల్లా కోకన్వీనర్ మయూర్ చంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదినాథ్, రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు సిద్దంశెట్టి సుహాసినితో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆదివారం ఉదయం 11 గంటలకు కాగజ్నగర్లోని ఎస్పీఎం గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్షా పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. పదేళ్ల నరేంద్ర మోదీ పరిపాలనపై దేశ ప్రజలు అమితమైన విశ్వాసంతో ఉన్నారన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు బూటకమని, ప్రజలను నయవంచన చేశారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు, సీఎం రేవంత్రెడ్డికి ప్రజలు సరైన గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో కేవలం నాలుగు నెలల్లో ఏ పార్టీ ప్రజాగ్రహానికి గురికాలేదన్నారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పదేళ్ల బీఆర్ఎస్ నియంత పాలనను భరించలేక ఆ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. నిరాష్ట్రంలో బీజేపీ 12 స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు సత్యనారాయణ, ప్రసాద్గౌడ్, బొమ్మెన శ్రావణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘సంకల్ప సభ’ పోస్టర్ ఆవిష్కరణ
కౌటాల/కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ ప ట్టణంలోని ఎస్పీఎం మైదానంలో ఆదివారం నిర్వహించే వికాస సంకల్ప సభ పోస్టర్ను శు క్రవారం కాగజ్నగర్లో ఆదిలాబాద్, సిర్పూ ర్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్బాబు ఆవిష్కరించారు. స్థానిక సంతోష్ ఫంక్షన్ హాల్లో వికాస సంకల్ప సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఈ నెల 5న వికాస సంకల్ప సభకు కేంద్రహోం మంత్రి అమిత్షా హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ కుమురంభీం, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్, అంజుకుమార్ రెడ్డి, బ్రహ్మానందం, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి శ్రీనివాస్, కన్వీనర్ భూమయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ, కిరణ్, వీరభద్రచారి, అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement