-
చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
చిత్తూరు జిల్లా, సాక్షి: ‘‘ఈ ఎన్నికలు.. ఐదేళ్ల భవిష్యత్.. జగన్కు ఓటేస్తే.. పథకాలు కొనసాగింపు.. పొరపాటున బాబుకు ఓటేస్తే.. పథకాలు ముగింపేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శనివారం మధ్యాహ్నం పలమనేరు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతుందన్నారు.‘‘పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. కొండచిలువ నోట్లో తలపెట్టినట్లే. చంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. రూ.2 లక్షల 70వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమం అందించాం. 59 నెలల్లోనే 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చాం. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం. పిల్లల చదువులు కోసం అమ్మఒడితో ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. మహిళల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించాం’’ అని సీఎం జగన్ చెప్పారు‘‘రైతన్నల కోసం ఆర్బీకే వ్యవస్థ పనిచేస్తోంది. ఏ గ్రామానికి వెళ్లిన గ్రామ సచివాలయం కనిపిస్తోంది. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాం. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచిపనైనా గుర్తుకొస్తుందా?. మన ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎప్పుడైనా ఇచ్చారా అని అడుగుతున్నా.. 14 ఏళ్లు సీఎంగా చేశాను అంటాడు చంద్రబాబు. ఇలాంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు అబద్దాలు, మోసాలతో వస్తున్నాడు’’ అని సీఎం జగన్ దుయ్యబట్టారు.‘‘రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?. ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా?. ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?. ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?. అర్హులకు 3 సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?. రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్ అన్నాడు.. చేశాడా?. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తానన్నాడు.. చేశాడా?. సింగపూర్ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?. ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చడా?. మళ్లీ ఈ మోసగాళ్లు సూపర్ సిక్స్, సెవెన్ అంటున్నారు. కేజీ బంగారం, బెంజ్కారు ఇస్తాననంటారు.. నమ్ముతారా?’’ అంటూ చంద్రబాబు మోసాలను సీఎం జగన్ ఎండగట్టారు.ప్రత్యేకహోదాను అమ్మేసిన బాబు లాంటి వ్యక్తిని ఎవరైనా నమ్ముతారా?• మోసగాళ్లతో మనం యుద్ధం చేస్తున్నాం• కొత్త హామీలతో మోసం చేసేందుకు మళ్లీ ముగ్గురు కలిసి వస్తున్నారు• 14 ఏళ్లపాటు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు ఒక్క మంచైనా చేశాడా?• అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు, మోసాలు• అధికారం దక్కిన తర్వాత చంద్రబాబు చంద్రముఖి మారిపోతాడు• బాబు తన హయాంలో పేద ప్రజలకు ఒక్క సెంటు భూమైనా ఇచ్చాడా? • ఈ 59 నెలల పాలనలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం• మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసే సాంప్రదాయాన్ని పూర్తిగా మార్చేశాం• మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించి 99 శాతం అమలు చేశాం• 59 నెలల పాలనలో రూ.2.70 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ• ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయిస్తాయి• చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమే• మరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది• గ్రామ సచివాలయాల్లో ప్రజలకు 600 రకాల సేవలు అందుతున్నాయి• వర్షం రూపంలో దేవుడు మనకు ఆశీస్సులు ఇస్తున్నారని భావిస్తున్నా -
వైఎస్సార్సీపీలోకి టీడీపీ నేతలు
గంగవరం : జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు భారీగా వైఎస్సార్సీపీలో చేరారు. అందులో భాగంగా శుక్రవారం గంగవరం మండలం గండ్రాజుపల్లె పంచాయతీ మార్లపల్లెలో ముస్లిం మైనారిటీకి చెందిన 6 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరాయి. ఎమ్మెల్యే వెంకటేగౌడ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో జహంగీర్, దస్తగిరి, ఉజీవుల్లా, హస్సాన్, ఎగ్బాల్, ముబారక్ తదితరులు ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే ముస్లిం మైనారిటీలకు న్యాయం జరిగిందని, చంద్రబాబు ఏనాడూ ముస్లింలను పట్టించుకోలేదని తెలిపారు. అందుకే టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరినట్టు వెల్లడించారు. కుప్పంలో.. కుప్పం : శాంతిపురం మండలం కొలమడుగు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. కుప్పంలోని పార్టీ కార్యాలయంలో వారికి ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో ముని వెంకటప్ప , సుబ్రమణ్యం, బాలాజీ ఉన్నారు. కార్యక్రమంలో వాల్మీక కార్పోరేషన్ డైరెక్టర్ సుబ్బరాజు, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, పీఏసీఎస్ చైర్మన్ మునిరత్నంగౌడ, శ్రీరాములు, మణి పాల్గొన్నారు. రొంపిచెర్లలో.. రొంపిచెర్ల: మండలంలోని బోడిపాటివారిపల్లె పంచాయతీ కేఎన్ దళితవాడకు చెందిన పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పుంగనూరు టీడీపీ నేత చల్లా సుప్రియా రెడ్డి బలవంతంగా గురువారం టీడీపీ కండువాలు వేశారు. అయితే మాకు టీడీపీ కండువాలు వేసుకోవడం ఇష్టం లేదంటే సదరు నేతలు గిరి, శేఖర్, చంటి, కవిత, సుకన్య, రాజు, ప్రసాద్, నిర్మల తెలిపారు. ఈమేరకు శుక్రవారం మళ్లీ జెడ్పీటీసీ సభ్యుడు రెడ్డీశ్వర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ప్రకాష్ రెడ్డి, చిరంజీవి, ద్వారకనాథరెడ్డి, మునస్వామి నాయుడు పాల్గొన్నారు. -
సీఆర్పీఎఫ్ జవాన్ ఆత్మహత్య
పలమనేరు : సీఆర్పీఎఫ్ జవాన్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం పలమనేరులో వెలుగుచూసింది. వివరాలు.. బంగారుపాళెం మండలం మిట్టూరు పంచాయతీ పామిరివాండ్లపల్లెకు చెందిన సురేష్(40) మణిపూర్లోని ఇంఫాల్లో సీఆర్పీఎఫ్ జవాన్గా విధులు నిర్వహిస్తునానరు. ఏప్రిల్ 26వ తేదీన గ్రామంలో తన మరదలి పెళ్లికి వచ్చారు. ఈనెల 1వ తేదీన మళ్లీ ఇంఫాల్కు బయలుదేరారు. తాను బెంగళూరు ఎయిర్పోర్ట్కు చేరుకున్నానని విమానం మిస్ అయిందని ఇక్కడే ఉండి వెళతానని కుటుంబీకులకు సమాచారం ఇచ్చాడు. అయితే ఒకటో తేదిన పలమనేరు పట్టణంలోని గుండుబావి సమీపంలో ఉన్న ఓ లాడ్జిలో ఉన్నాడు. శుక్రవారం మధ్యాహ్నం లాడ్జిలో సిబ్బంది పిలిచానా తలుపు తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన సిబ్బంది వేరే తాళంతో తలుపు తెరిచి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ సురేష్ మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాన్ని స్థాని ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడికి భార్య, ఓ కుమార్తె ఉన్నట్టు తెలిసింది. ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. భర్త వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు రొంపిచెర్ల: అనుమానంలో తన భర్త వేధిస్తున్నాడంటూ భార్య శుక్రవారం రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. స్థానిక పాళ్యెంవీధికి చెందిన ఎస్.సబీహాకు 15 ఏళ్ల క్రితం చిత్తూరు రామనగర్కాలనీకి ఎస్.బషీర్తో వివాహమైంది. వీరి కాపురం కొన్నేళ్లపాటు సజావుగా సాగింది. ఇద్దరు కుమారులు జన్మించారు. అయితే నాలుగేళ్ల క్రితం భార్యపై అనుమానంతో బషీర్ ఆమైపె చేయి చేసుకున్నాడు. దీంతో ఆమె తన పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. తర్వాత ఈ ఏడాది జనవరిలో పెద్ద మనుషులు ఇరువురికీ రాజీ కుదిర్చారు. అయితే బషీర్లో ఎలాంటి మార్పు రాలేదు. భార్యను నిత్యం అనుమానిస్తూ వేధించడం ప్రారంభించాడు. దీంతో ఆమె 15 రోజుల క్రితం పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో శుక్రవారం సబీహ భర్త బషీర్, ఆడపడుచులు షాహీనా, షబీనా, భర్త స్నేహితుడు కానిస్టేబుల్ నాగరాజా వచ్చి ఆమైపె దాడి చేసి గాయపరిచారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ సుకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సమాచారం
చిత్తూరు జిల్లాలో నిర్మాణం చేపట్టిన ఇళ్లు : 69,921 పూర్తయినవి : 44,445 వెచ్చించిన మొత్తం : రూ.948.77 కోట్లు తిరుపతి జిల్లాలో నిర్మాణం చేపట్టిన గృహాలు : 68,956 పూర్తయినవి : 21,596 ఖర్చుపెట్టిన మొత్తం : రూ.696.92 కోట్లు ప్రభుత్వ ప్రోత్సాహంతోనే.. ప్రస్తుత ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఇల్లు పూర్తి చేసుకోగలిగా. అధికారులే దగ్గరుండి ఇసుక, ఇతర సామగ్రిని తక్కువ ధరలకు ఇప్పించారు. ఇంటి పట్టా ఇచ్చినప్పటి నుంచి ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు మాకు అండగా నిలిచారు. ఈ ప్రభుత్వంలో సొంతింటి కల నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉంది. గతంలో ఎలాంటి స్థిరాస్తి లేని నాకు ప్రస్తుతం రూ.10 లక్షల ఆస్తి ఉందంటే కారణం ఈ ప్రభుత్వమే. – చంద్రలేఖ, వడమాలపేట మండలం వీళ్లకు కళ్లు కనబడలేదా గతంలో ఏ నాయకుడు మా సమస్యలను పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చాకే మాకు మేలు జరిగింది. నా భర్త మేసీ్త్ర. అందరికీ ఇళ్లు కట్టిస్తావు మనకంటూ సొంతిల్లు ఎప్పుడు కట్టుకునేది అని ఇబ్బంది పెట్టేదాన్ని. స్థలం కొందామంటే అంత స్తోమత మాకు లేదు. ఈ ప్రభుత్వమే సొంత స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయం చేసింది. గత ప్రభుత్వంలో చాలా ఏళ్లు ఇంటి స్థలం కోసమే కాళ్లు అరిగేలా తిరగాం. ప్రస్తుత ప్రభుత్వంలో పట్టా చేతికందింది. ఇల్లు కంటి ముందు కనిపిస్తోంది. తప్పులు చెప్పే వారికి కళ్లు కనబడలేదా. – ఈశ్వరి, పుత్తూరు మండలం -
హైరిస్క్ కేసుల పర్యవేక్షణ తప్పనిసరి
చిత్తూరు రూరల్(కాణిపాకం): జిల్లాలో గుర్తించిన హైరిస్క్ కేసుల నిరంతర పర్యవేక్షణ తప్పనిసరని డీఎంహెచ్ఓ ప్రభావతీదేవి ఆదేశించారు. శుక్రవారం నగరంలోని వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆశ నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. గర్భిణులకు అందించే సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వేసవి నేపథ్యంలో క్యాంపులకు రాని గర్భిణులకు ఇంటి వద్దనే వైద్యసేవలు అందించాలని సూచించారు. ఇకపై కిల్కారీ యాప్లో గర్భిణుల వివరాలను క్రమం తప్పకుండా నమోదు చేయాలని కోరా రు. సమావేశంలో డీఐఓ రవిరాజు, అధికారులు గుణశేఖర్, జానకీరావ్ పాల్గొన్నారు. 5, 6 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్కు అవకాశం చిత్తూరు కలెక్టరేట్: జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 5, 6 తేదీల్లో ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకునే అవకాశం కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ వినియోగం కోసం ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆయా నియోజకవర్గాల్లోని ఫెసిలిటేషన్ సెంటర్లలో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ వేయవచ్చని సూచించారు. ఈతకు వెళ్లి యువకుడి మృతి చౌడేపల్లె : మండలంలోని కాటిపేరి ఎస్సీ కాలనీ సమీపంలోని బావిలో శుక్రవారం ఈతకు వెళ్లి కె.జగదీష్ (16) అనే యువకుడు మృతి చెందాడు. వివరాలు.. అన్నమయ్యజిల్లా మదనపల్లె మండలం బసినికొండకు చెందిన కె.రాజా కుమారుడు జగదీష్ కాటిపేరిలోని బంధువుల ఇంటికి వచ్చాడు. స్థానిక యువకులతో కలిసి గ్రామానికి సమీపంలోని వ్యవసాయ బావికి ఈతకు వెళ్లాడు. బావిలోకి దూకిన యువకుడు ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో తోటి వారు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. పుంగనూరు నుంచి ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement