-
‘నన్నోడించిన వాడ్నే పెళ్లి చేసుకుంటా’
‘‘బరిలో దూకండి. నన్ను ఓడించండి. ఆ దమ్మున్న మగవాడినే నేను పెళ్లి చేసుకుంటా’’.. పురుషాధిపత్యం కొనసాగుతున్న రోజుల్లో ఓ మహిళ విసిరిన సవాల్ ఇది. సాధారణ మహిళ అయితే చర్చకు అంతగా ఆస్కారం ఉండేది కాదు. కానీ, ఆ సవాల్ విసిరింది హమీదా బాను. ఇంతకీ ఇవాళ గూగుల్ హోం పేజీని గమనించారా?.. అందులో ఉంది ఆమెనే.1940-55 మధ్య.. కుస్తీ పోటీల్లో వందల మందిని ఓడించానని తనకు తానుగా ప్రకటించుకుంది హమీదా బాను. కళ్లారా ఆమె పాల్గొన్న పోటీలు చూసి అప్పటి మీడియా పొగడ్తలతో ఆమెను ఆకాశానికి ఎత్తేసింది. భారతదేశంలో తొలి మల్ల యోధురాలిగా హమిదా బాను పేరు చరిత్రకెక్కింది. ఇప్పుడు.. డూడుల్ రూపంలో ఆ యోధురాలికి గౌరవం ఇచ్చింది గూగుల్.సంప్రదాయ కుటుంబంలో పుట్టి.. హేతుబద్ధమైన పెద్దల్ని ఎదురించి.. ఇంటి నుంచి బయటకు వచ్చేసింది హమీదా. ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ ఆమె స్వస్థలం. అక్కడి నుంచి ఆమె అలీఘడ్ వలస వెళ్లింది. అక్కడే సలాం పహిల్వాన్ ఆమెకు పరిచయం అయ్యాడు. ఆయన దగ్గర కుస్తీ శిక్షణ తీసుకుంటూ పలు పోటీల్లో పాల్గొందామె. అయితే 1954 ఫిబ్రవరిలో ఆమె ఇచ్చిన ఒక బహిరంగ ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనను ఓడించిన వాళ్లను వివాహం చేసుకుంటానని ప్రకటించి అటు ప్రజలు, ఇటు మీడియా దృష్టిని ఆకర్షించింది.ఛాలెంజ్లో భాగంగా.. పంజాబ్లో ఒకరిని, కోల్కతాలో ఒకరిని బాను ఓడించింది. ఆ తర్వాత గుజరాత్ బరోడాకు చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం లభించింది. అప్పటికి ఆమె వయసు 34 ఏళ్లు. ఆ సవాల్ విసిరిన నాటికి ఆమె 300 మ్యాచ్లు పూర్తి చేసుకుందట. అయితే ఆమెతో తలపడాల్సిన చోటే గామా పహిల్వాన్ ఆఖరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆమె బాబా పహిల్వాన్తో తలపడి.. కేవలం నిమిషం వ్యవధిలోనే ఆమె నెగ్గింది.బాను పాపులారిటీ ఏ స్థాయికి చేరిందో.. 1944లో బాంబే క్రానికల్ రాసిన ఒక కథనం చూస్తే తెలుస్తుంది. బాంబేలో ఆమె పాల్గొన్న ఒక మ్యాచ్ చూసేందుకు 20 వేల మంది ప్రేక్షకులు వచ్చారట. అయితే ప్రత్యర్థి గూంగా పహిల్వాన్ అసంబంద్ధమైన డిమాండ్లతో ఆ మ్యాచ్ జరగకుండా పోయింది. దీంతో ఆగ్రహించిన ప్రేక్షకులు స్టేడియంలో బీభత్సం సృష్టించారట.అమెజాన్ ఆఫ్ అలీగఢ్.. ముద్దుగా హమీదా బానుకు అప్పటి మీడియా పెట్టుకున్నపేరు. ఐదడుగల మూడు అంగుళాలు, 108 కేజీల బరువుతో.. రోజుకు ఐదున్నర లీటర్ల పాలు, రెండు లీటర్ల పండ్ల రసేఆలు, కేజీ మటన్, అరకేజీ బటర్, ఆరు గుడ్లు, రెండు ప్లేట్ల బిర్యానీ.. ఇలా ఆమె డైట్ గురించి కూడా అప్పట్లో పేపర్లు కథనాలు రాసేవి.హమిదా బాను కెరీర్ సగానికి పైగా వివాదాలతోనే సాగింది. మగవాళ్లతో ఆమె తలపడడాన్ని పలువురు బహిరంగంగానే వ్యతిరేకించారు. మొరార్జీ దేశాయ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె పోటీలపై నిషేధం విధించారు. అందుకు ఆమె బహిరంగంగానే ఆయనపై విమర్శలు గుప్పించింది. అలాగే.. ఆమె పాల్గొన్న పోటీల్లోనూ ప్రేక్షకుల నుంచి దాడులు తప్పలేదట. 1954 దాకా దేశ, విదేశీ రెజ్లర్లతో ఆమె తలపడింది. అయితే అదే ఏడాది విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చినా.. ఆర్థిక స్తోమత లేకపోవడం, స్పానర్లు ఎవరూ ముందుకు రాలేదన్న కారణాలతో ఆమె ఆగిపోయింది. అయితే ఆ ఆగిపోవడం.. బరికి శాశ్వతంగా హమిదా బానును దూరం చేసింది కూడా. 1987లో మహేశ్వర్ దయాల్ అనే రచయిత ఆమె జీవితం మీద రాసిన పుస్తకంలో సంచలన విషయాల్ని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్లో ఆమె కుస్తీ పోటీల్లో పాల్గొందని, మగ పోటీదారులతో మాత్రమే ఆమె తలపడేదని, అయితే కొన్ని చోట్ల ఆమె రహస్య ఒప్పందాలు కూడా చేసుకునేదని ఆయన రాశారు.రెజ్లింగ్ కెరీర్ మాత్రమే కాదు.. వ్యక్తిగత జీవితం కూడా ఒడిదుడుకుల నడుమ సాగింది. కోచ్ సలాం పహిల్వాన్తో కలిసి అప్పటిదాకా ప్రొఫెషనల్ రిలేషన్ సాగించిన ఆమె.. ఆ తర్వాత ఆయనతో సహజీవనం చేసింది. ఈ క్రమంలోనే ఆమెను విదేశీ పోటీలకు వెళ్లకుండా సలామే అడ్డుకున్నాడనన్న ఆరోపణ ఒకటి ఉంది. ఇంకోవైపు ఉత్తర భారతం నలుమూలల పోటీల్లో పాల్గొన్న హమిదాను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ముంబై కల్యాణ్ ప్రాంతంలో ఉంటూ.. సలాంతో కలిసి పాల వ్యాపారం మొదలుపెట్టింది.సలాం కూతురు సహారా, బానును పినమ్మగా చెబుతుంటుంది. అయితే సలాం ఆమెను శారీరకంగానూ ఎంతో వేధించేవాడని బాను మనవడు ఫిరోజ్ షేక్(ఆమె దత్తపుత్రుడి కొడుకు) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. యూరప్కు వెళ్లకుండా బానును నిలువరించిన సలాం.. ఆమెను చిత్రహింసలకు గురి చేశాడని, ఈ క్రమంలోనే ఆమె కాళ్లు, చేతులు విరిగియాని ఆరోపించారాయన. కొన్నాళ్లకు సలాం, బానులు విడిపోయారు. సలాం కల్యాణ్లోనే ఉంటూ పాల వ్యాపారం కొనసాగించింది. డబ్బు సరిపోని సమయంలో పిండి వంటలు చేసి రోడ్ల మీద అమ్ముకునేది. అలా మల్లు యోధురాలిగా పేరున్న హమీదా బాను.. చివరి రోజులు మాత్రం కష్టంగానే గడిచాయని పలు కథనాలు వెల్లడించాయి. -
లోకం చెడ్డదేం కాదు బాస్.. హార్ట్ టచింగ్ వీడియో
ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే... అయ్యో అనడం మనిషి సహజ లక్షణం. సహానుభూతి అంటారు ఈ ఫీలింగ్ను. ఇంకొంతమంది ఆయ్యో అనడంతో ఆగిపోరు. తమకు చేతనైన సాయం చివరకు మాటసాయమైనా చేసే ప్రయత్నం చేస్తారు. ‘‘నేను ఉన్నాను’’.. ‘‘నువ్వు ఒంటరి కాదు’’ అన్న భరోసా... నిలువెత్తు డబ్బు, బంగారం పోసి కూడా కొనలేము. ఇదంతా ఇప్పుడెందుకు అంటే... ఎక్స్లో (గతంలో ట్విట్టర్) కనిపించిన ఈ ట్వీట్ను చూడండి. మనసులను కదిలించే చిన్ని గాథ! జర్మనీలోని ఆరేళ్ల బాలుడి కథ ఇది! మోటర్సైకిళ్లంటే మహా పిచ్చి! పెద్దయ్యాక రేసుల్లో పాల్గొనే వాడేనేమో కానీ... కేన్సర్ మహహ్మారి అంత ఎదిగేందుకు అవకాశం ఇచ్చేలా లేదు. అందుకే... ఈ కుర్రాడి తల్లిదండ్రులు ఆన్లైన్లో పోస్ట్ పెట్టారు! ‘‘మా వాడికి బైక్లంటే బాగా ఇష్టం. వీలున్న వారు ఎవరైనా మోటర్సైకిల్పై మా ఇంటి ముందు నుంచి ప్రయాణించగలరా?. మా వాడి కళ్లల్లో ఆనందం ఇంకోసారి చూసుకోగలం’’ అని అభ్యర్థించారు. అందరివీ బిజి బిజీ బతుకులు. ఎవరు పట్టించుకుంటారు దీన్ని? అని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ... 20, 30 మంది వరకూ వస్తారనునన వారి అంచనాలు తల్లకిందులయ్యాయి. ఓ సముద్ర కెరటంలా ‘మనీషి’ కదిలాడు. వేయి.. రెండు వేలు కూడా కాదు.. ఎకాఎకిన ఇరవై వేల మంది మోటర్ సైకిళ్లపై ఆ కుర్రాడి ఇంటి ముందు నుంచి వెళ్లారు. వాళ్లలో పొరుగు దేశాల నుంచి వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. ఆ కుర్రాడి ముఖం చంద్రబింబంలా మెరిసి పోయి ఉంటుందా? కచ్చితంగా మెరిసిపోయే ఉంటుంది. వీడియో మూడు నాలుగేళ్ల కిందటిదే అయినా.. ఆ చిన్నారి తుదిశ్వాస విడిచి నెలలు గడుస్తున్నా.. మానవత్వం ఈ భూమ్మీద మిగిలే ఉందని, లోకం మనం అనుకునేంత చెడ్డదేం కాదని నిరూపించింది ఈ ఘటన. In Germany, a 6 year old boy who loved Motorcycles was diagnosed with cancer. His family posted online asking if someone can ride pass their house to cheer him up. They expected 20-30 people. But in the end, nearly20,000 bikers showed up. pic.twitter.com/ZX2Gqpw74m— Restoring Your Faith in Humanity (@HumanityChad) April 30, 2024 -
పానీ పూరీ: ఈ అనిల్ భాయ్ లెక్కే వేరు: వైరల్ వీడియో
పానీ పూరీ అంటే ప్రాణం లేచి వస్తుంది చాలామందికి. అయితే పానీ పూరి బండి నడిపే 71 ఏళ్ల వృద్ధుడితో సెల్ఫీల కోసం జనం ఎగబడుతున్నారు. ఆయన పేరే గుజరాత్కు చెందిన అనిల్ భాయ ఠక్కర్. ఈ పానీ పూరీ వాలా ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాడు. స్టోరీ ఏంటంటే.. మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారట. అది ఎంతవరకు నిజమోగానీ, గుజరాత్కు చెందిన అనిల్ భాయ్ ఠక్కర్ మాత్రం తన సైడ్ ప్రొఫైల్, హెయిర్స్టైల్, తెల్లటి గడ్డం, ఆఖరికి డ్రెస్సింగ్ స్టయిల్ కూడా అచ్చం ప్రధాన మంత్రి మోదీ పోలికలతో కస్టమర్లను కట్టిపడేస్తున్నాడు. ఈయన గుజరాత్లోని ఆనంద్లో ‘తులసి పానీ పూరీ సెంటర్’ను నడుపుతున్నాడు. అచ్చం మోదీలా ఉన్న అనిల్ భాయ్నును స్థానికులంతా పీఎం మోదీ అని పిలుచుకుంటారు. ప్రధాని మోదీతో ఉన్న పోలిక కారణంగా స్థానికులు, పర్యాటకుల నుండి తనకు చాలా ప్రేమ, గౌరవం లభిస్తోంది అంటాడు ఆనందంగా అనిల్ భాయ్. అంతేకాదు ప్రధాని తనకు ఎంతో స్ఫూర్తి పొందానని, పరిశుభ్రతకు ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తారో, అలాగే తన స్టాల్ను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటారని అనిల్ భాయ్ చెప్పుకొచ్చాడు. అనిల్ భాయ్ వాస్తవానికి జునాగఢ్కు చెందినవాడు. తన తాత ప్రారంభించిన 'తులసి పానీ పూరీ సెంటర్'ను 18 ఏళ్ల వయస్సునుంచే నడిపిస్తున్నాడు. కాగా ముంబైలోని మలాడ్కు చెందిన వికాస్ మహంతే కూడా ప్రధాని పోలికలతో ఇటీవల వార్తల్లో నిలిచాడు. గర్భా వాయిస్తున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
Viral Video: జాబ్ మానేసి.. మేనేజర్ ముందు తీన్మార్ డ్యాన్స్లు
ఈ రోజుల్లో ఉద్యోగం రావడం అంటే చాలా కష్టం.. కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నా.. దానిని నిలబెట్టుకోవాలంటే కత్తిమీద సాము లాంటిది. ఉద్యోగంలో ఒత్తిడి, సరిపోని జీతం, సమయ వేళలు ఇలా అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది వీటిని భరించలేక ఉద్యోగం మానేస్తుంటారు. ఉన్న ఉద్యోగం పోయినప్పుడు చాలా మంది బాధపడుతుంటారు. కానీ మహారాష్ట్రలో ఓ కంపెనీలో పని చేస్తున్న వ్యక్తి జాబ్ మానేసి, ఆఫీసు ఎదుట డ్యాన్స్ చేసి మరి ఎంజాయి చేశాడు. ఈ ఆశ్యర్యకర ఘటన పుణెలో వెలుగుచూసింది. ఉద్యోగానికి రాజీనామా చేసిన ఓ వ్యక్తి తన మాజీ మేనేజర్కు విచిత్రంగా విడ్కోలు పలికారు. బ్యాండ్ను ఆఫీస్ వద్దకు పిలిపించి బాస్ ముందు తీన్మార్ స్టెప్పులు వేశారు. తోటి ఉద్యోగులకు విచిత్రంగా తన రాజీనామా విషయాన్ని తెలియజేశాడు. దీనికి సంబంధించిన వీడియోను కంపెనీ ఉద్యోగి సోషల్ మీడియాలో పోస్టుచేయగా వైరల్గా మారింది. పూణేకు చెందిన అనికేత్ అనే వ్యక్తి గత మూడేళ్లుగా ఓ కంపెనీలో సేల్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. అయితే ఆ జాబ్లో ఒత్తిడి, సీనియర్ల నుంచి వచ్చే వేధింపులు, సరిపడని జీతంతో తీవ్రంగా సతమతం అయ్యాడు. చివరికి ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇక తన చివరి వర్కింగ్ డే రోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిర్వహించాలనుకున్నాడు. తన స్నేహితులతో కలిసి సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేశాడు.ఆఫీస్ వద్దకే బ్యాండ్ను తీసుకువచ్చి.. డ్యాన్స్ చేశాడు. మేనేజర్ బయటకు వచ్చే దాకా అక్కడే ఉండి, అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి ‘సారీ సర్ బాయ్ బాయ్’ అంటూ ఆనందంగా స్టెప్పులేశాడు. ఊహించని పరిణామానికి ఆ కంపెనీ మేనేజర్ అలా చూస్తూ ఉండిపోయాడు. ఈ వీడియో వైరలవ్వడంతో చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. తాము కూడా ఉద్యోగంలో ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. అనికేత్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఉద్యోగం మానేసిన అనికేత్ జిమ్ ట్రైనర్ కావాలని ప్రయత్నిస్తున్నట్లు అతని స్నేహితుడు భగత్ తెలిపారు. View this post on Instagram A post shared by Anish Bhagat (@anishbhagatt) -
ఎక్కడా తగ్గేదే లేదండీ..పల్లె టు పాపులర్ జోన్ జోరుగా హుషారుగా
యూత్ పల్స్: కంటెంట్లో సత్తా ఉండాలేగానీ కాలు కదపకుండా, కడుపులో చల్ల కదలకుండా సొంత ఊళ్లోనే ఉంటూ తగినంత డబ్బు సంపాదించవచ్చు అని నిరూపిస్తున్నారు గ్రామీణ యువ కంటెంట్ క్రియేటర్లు. హాస్యం నుంచి వ్యవసాయం వరకు రకరకాల సబ్జెక్ట్లను వైరల్ చేయడంలో నేర్పు సాధించారు.ఉత్తర్ప్రదేశ్లోని ఆరియారి గ్రామానికి చెందిన శివానీ కుమారికి సోషల్ మీడియాలో వేలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. గ్రామీణ జీవితాన్ని పాటలు, కామెడీతో కూడిన స్కెచ్ల ద్వారా ఆవిష్కరిస్తూ సోషల్ మీడియాలో పేరు తెచ్చుకుంది. తనతో సమానంగా ఫాలోవర్లు ఉన్న ఇంగ్లీష్ క్రియేటర్లు కుమారి కంటే ఎక్కువ సంపాదిస్తున్నటికీ డబ్బుల గురించి చింత ఆమెకు లేదు. డబ్బుల కంటే కంటెంట్ క్రియేషన్ గురించే ఎక్కువ దృష్టి పెడుతుంది కుమారి.ఒడిశాలోని చిత్రకూట్కు చెందిన ధీరజ్ టక్రీకి గతంలో ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడడం వచ్చేది కాదు. తడబడుతూ మాట్లాడేవాడు. దీంతో యూట్యూబ్ వీడియోలు చూసి ధీరజ్ అమెరికన్స్లా ఫ్లూయెంట్గా మాట్లాడడం నేర్చుకున్నాడు. అమెరికన్ యాక్సెంట్తో మాట్లాడే నైపుణ్యం ధీరజ్ను ‘ఇన్స్టా ఫేమ్’ చేసింది. 2023లో ధీరజ్ ఫాలోవర్ల సంఖ్య 160 మాత్రమే. హ్యాండ్సమ్ అనే మాటను ఫారిన్ యాక్సెంట్లో ఎలా పలకాలి అనే రీల్ వైరల్ కావడంతో ధీరజ్ టక్రీ ఫాలోవర్ల సంఖ్య వేలకు చేరింది. మధ్యప్రదేశ్లోని బిరాఖేడీ గ్రామానికి చెందిన 23 సంవత్సరాల రామ్ పారమార్ 17 సంవత్సరాల వయసులో యూట్యూబ్ చానల్ మొదలు పెట్టాడు. తన చానల్ ద్వారా వ్యవసాయానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడేవాడు. ఏడు, ఎనిమిది వేలతో యూట్యూబ్లో అతడి సంపాదన మొదలైంది. ఇప్పుడు బ్రాండ్ కొలాబరేషన్ ద్వారా లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నాడు.పది లక్షలు వెచ్చించి తన గ్రామంలో ఆఫీస్ నిర్మించుకున్నాడు. కారు కొన్నాడు. ఇద్దరు సభ్యులతో ఉన్న టీమ్ను విస్తరించే పనిలో ఉన్నాడు. గుజరాతీ, తమిళ భాషల్లో కూడా కంటెంట్ను విస్తరించే ఆలోచనలో ఉన్నాడు.‘మన దేశంలో చాలా ప్రాంతాల్లో రైతులు హిందీ భాషను అర్థం చేసుకోలేరు. వారిని దృష్టిలో పెట్టుకొని ఇతరుల సహకారంతో ప్రాంతీయ భాషల్లో కంటెంట్ను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కంటెంట్ను చేరువ చేయాలనుకుంటున్నాను’ అంటున్నాడు ధీరజ్.ఇరవై ఏడు సంవత్సరాల మయూరి పాటిల్కు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా డబ్బు సంపాదించాలనేది లక్ష్యం కాదు. ‘పశ్చిమ కనుమలను కాపాడుకుందాం’ అనే నినాదంతో రీల్స్ చేస్తొంది. పశ్చిమ కనుమల అందాలను కళ్లకు కట్టేలా ఉండే ఆ రీల్స్ ఎంతోమందిని ఆకట్టుకుంటున్నాయి. ఆలోచించేలా చేస్తున్నాయి. కొండపై ఉన్న ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న ఒక వృద్ధురాలి జీవనశైలిపై పాటిల్ చేసిన రీల్ వైరల్ అయింది. ఎలాంటి కమర్శియల్ ఎలిమెంట్స్ లేని ఈ రీల్ సూపర్ సక్సెస్ కావడమే కాదు అది పాటిల్కు ఎంతో ఉత్సాహాన్నీ ఇచ్చింది.మహారాష్ట్రలోని పులగామ్ గ్రామానికి చెందిన నేహా తాంబ్రేది సూపర్ పవర్ గ్రామీణ యాస. కామెడీ దట్టించి వివిధ సామాజిక సమస్యలపై తమ ప్రాంత మాండలికంలో నేహా చేసే వీడియోలు సోషల్ మీడియాలో ΄ాపులర్ అయ్యాయి. తన గ్రామం నుంచి వెళ్లి పుణెలో ఇంజనీరింగ్ చేయడం నేహాకు కల్చరల్ షాక్.‘నా గ్రామీణ మరాఠీ యాసను వెక్కిరించేవారు’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది నేహా.ఎంతోమంది వెక్కిరించిన ఆ యాస కంటెంట్ క్రియేషన్లో ఆమె బలం అయింది. నేహా సృష్టించిన ‘తోంబ్రే బాయి’ క్యారెక్టర్ బాగా పాపులర్ అయింది.స్థూలంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంత క్రియేటర్లు సోషల్ మీడియాలో కొత్త దృశ్యం ఆవిష్కరిస్తున్నారు. కర్నాటకాలోని చిన్న పల్లెల నుంచి ఈశాన్యప్రాంతాలలోని మారుమూల గ్రామాల వరకు కంటెంట్ క్రియేషన్ ద్వారా వైవిధ్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. ప్రతి క్రియేటర్ తనదైన ప్రత్యేకతను కంటెంట్కు జోడిస్తున్నారు.‘ఇన్స్టాగ్రామ్ ఉద్దేశాన్ని చాలా బ్రాండ్స్ మరిచి΄ోయాయి. ఇన్స్టాగ్రామ్ అనేది ఫన్, స్టోరీ టెల్లింగ్కు వేదిక’ అంటుంది ముంబైకి చెందిన కంటెంట్ సొల్యూషన్స్ ఫర్మ్ ‘అప్పర్కేస్’ డైరెక్టర్ నిఠషా భర్వానీ. ఇన్స్టాగ్రామ్కు కీలకమైన ఫన్, వైవిధ్యాన్ని జోడిస్తూ తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు గ్రామీణ ప్రాంత యువ కంటెంట్ క్రియేటర్లు.ఎక్కడా తగ్గేదే లేదండీగ్రామీణ్ర ప్రాంత జీవనశైలికి అద్దం పట్టే వీడియోలతో ΄ాపులర్ అయింది ఉత్తర్ప్రదేశ్కు చెందిన శివానీ కుమారి. ఆడంబరాల కంటే సహజత్వమే కంటెంట్కు అందాన్ని తీసుకువస్తుంది అనేది కుమారి నమ్మే థియరీ. అందుకే ఆమె చేసే వీడియోల్లో ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయంతో ఊళ్లో సొంత ఇళ్లు కట్టుకుంది. సోషల్ మీడియాలో కుమారి ΄ాపులారిటీని దృష్టిలో పెట్టుకొని వ్యక్తుల నుంచి మొదలు ఆర్గనైజేషన్స్ వరకు ప్రశంసపూర్వకమైన ఈ–మెయిల్స్ వస్తుంటాయి. అవి ఆమెకు బలమైన టానిక్లా పనిచేస్తాయి. ‘ఇంగ్లిష్లో గడగడా మాట్లాడితేనే కంటెంట్ హిట్ అవుతుంది’ అనే భావనను కుమారిలాంటి వాళ్లు తప్పని తేల్చేస్తు్తన్నారు. ఇంగ్లీష్–స్పీకింగ్ అర్బన్ క్రియటర్స్ కంటే తాము తక్కువ కాదని నిరూపిస్తున్నారు శివాని కుమారి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement