-
చంద్రబాబూ.. మానవత్వం ఉందా..?
ఒంగోలు రూరల్: టీడీపీ అధినేత చంద్రబాబుకు మానవత్వం లేదని ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. అందువలనే వలంటీర్లు ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందించే ప్రక్రియను తన రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు అడ్డుకున్నారని తెలిపారు. తన మనుషులతో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించి మరీ వలంటీర్లతో పింఛన్ల పంపిణీని అడ్డుకోవడం దారుణమన్నారు. వృద్ధుల ఉసురుపోసుకుంటున్నాడని, ఈ పాపం ఊరికే పోదని బాలినేని శాపనార్థాలు పెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు మండలంలోని యరజర్ల, దేవరంపాడు, బొద్దులూరివారిపాలెం, వలేటివారిపాలెం గ్రామాల్లో శుక్రవారం బాలినేని రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పేదల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారన్నారు. పేదల కోసం సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలను ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు, పెన్షన్లు, ఇతర ప్రభుత్వ సేవలన్నింటినీ ఇంటి వద్దకే అందిస్తున్నారని వివరించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకూ పెద్ద పీట వేస్తూ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ఇవన్నీ ఇలాగే కొనసాగాలంటే మళ్లీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం ఒంగోలు ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిని వైఎస్సార్ సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. యరజర్లలో బాలినేని మాట్లాడుతూ గ్రామంలో సచివాలయ భవనం, రైతు భరోసా భవనం, వెల్నెస్ సెంటర్ భవనాన్ని నిర్మించి స్థానిక ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఒంగోలు డివిజన్లోనే వేగంగా యరజర్లలో అన్ని భవన నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. గ్రామంలో అంతర్గత రోడ్లు, అభివృద్ధి పనులు సైతం పూర్తి చేశామన్నారు. ఇంకా పూర్తి కావాల్సిన పనుల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఐదేళ్ల జనరంజక పాలన గురించి ప్రజలకు వివరించారు. సచివాలయ వ్యవస్థ, వలంటీర్ వ్యవస్థలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు అందించడం, ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాల నగదు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. ఒంగోలులో ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని బాలినేని వివరించారు. టీడీపీ నాయకులు ఎన్నో కుట్రలకు పాల్పడినప్పటికీ నిరుపేదలకు 25 వేల ఇళ్ల పట్టాలు అందించామన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన వెంటనే అందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. ఇంకా ఇళ్ల స్థలాలు రాని నిరుపేదలు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని, వారికి కూడా పట్టాలు ఇస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో కూడా టీడీపీకి గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. యరజర్లలో బాలినేని రోడ్ షోలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చుండూరి రవి, పొగాకు బోర్డు ఉత్పత్తిదారుల చైర్మన్ వాకా బసివిరెడ్డి, ఒంగోలు ఎంపీపీ పి.మల్లికార్జునరెడ్డి, సచివాలయాల కన్వీనర్ సోమశేఖర్, యరజర్ల సర్పంచ్ తమ్మిశెట్టి రాములమ్మ, శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ జాజుల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ పందిర్ల రాధా అంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఉలిచిలో సాయంత్రం బాలినేని శ్రీనివాసరెడ్డికి ఘనస్వాగతం లభించింది. పార్టీ మండల అధ్యక్షుడు చుంచు రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోలో బాలినేని మాట్లాడుతూ గ్రామంలో నిరుపేదలకు ఇళ్ల స్థల పట్టాలు అందజేశామన్నారు. సచివాలయ భవనాలు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, నాయకుడు ఆదిశేషయ్య కరవది ఎంపీటీసీ శ్రీనివాసరావు, సర్పంచ్ మురళి, పలు గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. బొద్దులూరిపాలెంలో సర్పంచ్ కవిత, దేవరంపాడులో సర్పంచ్ మహాలక్ష్మి, వైఎస్సార్ సీపీ నాయకులు సోము, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సూటి ప్రశ్న వలంటీర్లతో పింఛన్ల పంపిణీ ఆపించి వృద్ధుల ఉసురుపోసుకుంటున్నావంటూ మండిపాటు సీఎం జగన్ పేదల పక్షపాతి అని కితాబు -
మంచి చేసే నాయకుడికి అండగా నిలుద్దాం
● సీఎం వైఎస్ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం ● ఎన్నికల ప్రచారంలో మంత్రి మేరుగు నాగార్జున నాగులుప్పలపాడు: ఎల్లప్పుడూ ప్రజల బాగోగుల గురించి ఆలోచించి ఎంత వరకు మేలు చేయగులుగుతామా అని తపనపడే నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, ఆయనకు అందరూ అండగా నిలవాలని వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి మేరుగు నాగార్జున కోరారు. గడపగడపకు మన నాగార్జున కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాగులుప్పలపాడు మండలంలోని మద్దిరాలపాడు, ఒబన్నపాలెం, మాచవరం, రాపర్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ సచివాలయ, వలంటీర్ వ్యవస్థల ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ నిరంతరం పాటుపడుతున్నారని తెలిపారు. అందులో భాగంగానే 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేశారని తెలిపారు. ప్రతి ఇంటికి ఏదో మంచి చేసిన నాయకుడిగా జగనన్న నిలిచారన్నారు. ఆర్థికంగా, సామాజికంగా ఇంకా వెనుకబడి ఉన్న ప్రజలను వృద్ధిలోకి తీసుకెళ్లాలని సీఎం జగన్ తాపత్రయపడుతుండటం చూస్తే నిజంగా ఇలాంటి నాయకుడు ప్రజలకు కావాలనిపిస్తుందన్నారు. 2019–24 మధ్య కాలంలో లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల రూపంలో నేరుగా లబ్ధిదారులకు అందించారన్నారు. అంతకుముందు చంద్రబాబు హయాంలో చేసిన లక్షల కోట్ల అప్పులు ఏ ఒక్కరికీ పథకాలుగా అందించకుండా ఏం చేశారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. అవన్నీ గమనించి జగన్ను మళ్లీ సీఎంను చేసుకునేందుకు ఎమ్మెల్యేగా తనను, బాపట్ల ఎంపీగా నందిగం సురేష్ను వైఎస్సార్ సీసీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ముందుగా నాగులుప్పలపాడులో వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని మంత్రి మేరుగు నాగార్జున ప్రారంభించారు. అనంతరం నాగులుప్పలపాడు గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాదిగ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, లిడ్ క్యాప్ స్టేట్ డైరెక్టర్ కాకుమాను రాజశేఖర్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇనగంటి పిచ్చిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ మారెళ్ల బంగారుబాబు, పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలమలపు కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ దంపతులు యాదాల అశోక్బాబు, రత్నకుమారి, పార్టీ మండల కన్వీనర్ పోలవరపు శ్రీమన్నారాయణ, తుమ్మల బ్రహ్మానందరెడ్డి, వెంకట్రామిరెడ్డి, ఎంపీటీసీ మారెళ్ల మహాలక్ష్మి, కోటమ్మ, శాలివాహన, హౌసింగ్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్లు పేరాల చెన్నకేశవులు, కొలకలూరి విజయ్కుమార్, సర్పంచ్ మందా హెప్సీరాణి, ఇనగంటి సీతారావమ్మ రమణారెడ్డి, డాకా అనసూర్యమ్మ రమణారెడ్డి, మాదాసు రాంబాబు, కొంజేటి సురేష్, ప్రసన్న, వజ్రంబాబు పాల్గొన్నారు. -
కారు బీభత్సం
వైఎస్సార్ సీపీలోకి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడుమార్కాపురం: బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కంభం వెంకట రమణారావు శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేసి తన అనుచరులతో కలిసి వైఎస్సార్ సీపీలో చేరారు. స్థానిక పార్టీ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే అన్నా రాంబాబు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, టీటీడీ, జనసేన పొత్తుతో మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరారన్నారు. అన్నా రాంబాబుతో పాటు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి గెలుపుకు కృషిచేస్తానని తెలిపారు. ఆయనతోపాటు మాజీ టీడీపీ కౌన్సిలర్లు నందిగం శ్రీనివాసులు, జలుకూరి సత్యవతీతోపాటు వేముల పెద్దరంగడు, పారుమంచాల చిన్నకృష్ణయ్య, దండూరి కోటయ్య, సయ్యద్ ముజీబ్, ఎస్కే కరీముల్లా, ఎస్కే గౌస్ మొహిద్దీన్, గంగిరెడ్డితోపాటు 9,10 వ బ్లాక్ టీడీపీ బ్లాక్ నాయకులు వైఎస్సార్ సీపీ లో చేరారు. కార్యక్రమంలో రఘుపతి శివ, పెంచికల కాశయ్య, నజీర్, ఉప్పు బాబు, మొగిలి ఇస్మాయిల్ బేగ్, బెల్లంకొండ గోపి పాల్గొన్నారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే రాంబాబు పార్టీలోనికి ఆహ్వానించారు. ఏ సమస్య వచ్చినా కార్యకర్తలు తన దృష్టికి తేవాలని, వెంటనే పరిష్కరిస్తానని ఆయన తెలిపారు.గిద్దలూరు రూరల్: అతివేగంగా వస్తున్న కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మమూడు బైక్లు ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన నంద్యాల రోడ్డులోని స్వదేశీ రెస్టారెంట్ సమీపంలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. నంద్యాల నుంచి గిద్దలూరు వైపుగా వస్తున్న కారు రెస్టారెంట్ వద్ద ఆగి ఉన్న మూడు బైక్లను, వ్యక్తిని, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో కేఎస్పల్లెకు చెందిన గాలిరెడ్డి (63) రెస్టారెంట్ వద్ద తన బైక్ పక్కన నిలబడి ఉండగా కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కారు నడుపుతున్న రాజేష్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. కారు ఢీకొట్టడంతో బైక్లు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది గాయాలైన రాజేష్ను చికిత్స నిమిత్తం గిద్దలూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకరు మృతి, మూడు బైక్లు ధ్వంసం -
పసలేని పవన్ ప్రసంగం
గిద్దలూరు రూరల్: పవన్ కల్యాణ్ ప్రసంగం పసలేకుండా సప్పగా సాగడంతో కూటమి పార్టీల శ్రేణుల్లో నీరసం కనిపించింది. శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ప్రధాన కూడలి వద్ద జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బహిరంగ సభ ప్రసంగంలో క్లారిటీ లేకపోవడంతో వచ్చిన వారంతా ప్రసంగం మధ్యలోనే వెనుదిరిగారు. సినిమా హీరోగా ఆయనను అభిమానించే కొంతమంది మాత్రమే హాజరవడంతో ఆశించిన స్థాయిలో జనాలు కనిపించలేదు. మూడు పార్టీల కూటమి నాయకులు మద్యం, డబ్బు ఇచ్చి పవన్ బహిరంగ సభకు తరలించేందుకు ప్రయత్నించారు. మద్యం మత్తులో ఊగుతూ ఒకే బైక్పై ముగ్గురునలుగురు ఎక్కి రోడ్లపై చక్కర్లు కొట్టారు. ఓటు లేని వారితో కూడా పార్టీ జెండాలు చేతపట్టించి కేకలు వేయించారు. ఒంగోలు–నంద్యాల ప్రధాన రహదారిపై పవన్ ప్రసంగం ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కువ మంది జనాలు కనిపించాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. జనసేన పార్టీ జెండాలు చేత పట్టి మద్యం షాపుల వద్ద నిలుచుని పూటుగా మద్యం సేవించే వారు అధికంగా కనిపించారు. ఇంత పెద్ద స్టార్ వస్తే.. తక్కువ మంది హాజరవడంపై విమర్శలు వినిపించాయి. -
దళితులపై దర్శి టీడీపీ అభ్యర్థి లక్ష్మి అక్కసు
దర్శి: టీడీపీ ప్రచారంలో భాగంగా దేవవరం పంచాయతీలో గల తమ కాలనీకి రావాలని ఎస్సీకాలనీ వాసులు టీడీపీ అభ్యర్థి లక్ష్మీని ఆహ్వానించారు. లక్ష్మీ మాత్రం పల్లెలోకి రానని చెప్పి తిరస్కరించారు. దీంతో మీరు వస్తేనే ఓట్లేస్తాం.. లేకుంటే ఓట్లేయమని మహిళలు తేల్చి చెప్పారు. లక్ష్మి మాత్రం మీరు ఓట్లేయకపోతే పోండి.. నేను మాత్రం రానంటూ అసహనం వ్యక్తం చేసి వెనుదిరిగారు. దీంతో స్థానిక టీడీపీ నేతలు తీవ్ర అవమానానికి గురయ్యారు. ఎన్నికల సమయంలోనే ఇలా ఉంటే.. ఇక మామూలు రోజుల్లో ఆమె ఎలా ఉంటారోనంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కట్టుబడిపాలెంలో కూడా నెలకొంది. లక్ష్మి ప్రచార రథం దిగకపోవడంతో అక్కడ కూడా ఇదే సీన్ రిపీట్ అయింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు
పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
Viral Video: స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్పై ప్రిన్సిపాల్ దాడి
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
తప్పక చదవండి
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
Advertisement