-
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
సాక్షి, అనకాపల్లి: ఏపీలో ఓటమి తప్పదని భావించిన కూటమి నేతలు హత్యా రాజకీయాలకు తెరలేపారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి జరిగిన ఘటన మరువక ముందే తాజాగా మరో ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అనకాపల్లిలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడి హత్యకు కుట్ర జరిగినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. బూడి ముత్యాల నాయుడు ప్రస్తుతం అనకాపల్లిలోని ఆయన స్వగ్రామం తారువలో ఉన్నారు. ఈ సందర్భంగా ముత్యాల నాయుడు ఇంటి వద్ద కొందరు వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. డ్రోన్ సాయంతో విజువల్స్ తీశారు. దీంతో, అనుమానం వచ్చి స్థానికులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆరా తీశారు. విజువల్స్ తీస్తున్న వారిని పట్టుకుని ప్రశ్నించారు. ఈ క్రమంలో వారు పొంతనలేని సమాధానం ఇచ్చారు.అనంతరం దేవరపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో వారు స్థానికులు కాదని పోలీసులకు తెలిపారు. దీంతో, ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి వద్ద ఉన్న బీజేపీ కండువాలను, జెండాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, అక్కడ డ్రోన్ను ఎందుకు ఎగురవేశారని ప్రశ్నించగా వారు సమాధానం చెప్పకోవడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు మాట్లాడుతూ.. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ముత్యాల నాయుడికి లభిస్తున్న ఆదరణను ఓర్వలేకనే బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. -
బాలయ్య.. ఇదేం బాలేదయ్యా..!
కంచరపాలెం: అసలే నందమూరి నటసింహం..ఆయన సభకు జనం లేకపోతే టీడీపీ స్థానిక నేతలకు దబిడి దిబిడే. కాళ్లోవేళ్లో పట్టుకుని మనిషికి రూ.200 ఇచ్చి మరీ టీడీపీ నేతలు జనసమీకరణ చేశారు. అయితే బాలయ్య తనమార్కు డైలాగ్లతో ప్రజలను విసిగించాడు. మరీ ఆనాడు...అంటూ ప్రారంభించి తలాతోకలేని మాటలతో విసుగుతెప్పించాడు. కంచరపాలెం మెట్టు ప్రధాన రహదారిపై శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ 5.45 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా..రాత్రి 7.20 గంటలకు బాలకృష్ణ రావడంతో జనం రోడ్లపై నిలబడలేక ఊసూరుమన్నారు. మైక్ అందుకున్న బాలయ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బదులు సీఎం జీవన్ అంటూ నోరుతిరగని పదాలతో జనాన్ని అయోమయంలో పడేశాడు. స్థానిక టీడీపీ, బీజేపీ అభ్యర్థుల కోసం కాకుండా తన తండ్రి ఎనీ్టఆర్ సేవల గురించి చెప్పుకున్నాడు. చంద్రబాబు కోసం అంతంత మాత్రమే మాట్లాడగా.. ఇక పవన్ కల్యాణ్ గురించి అసలు ప్రస్తావనే లేదు. రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అర్థం కాని మాటలు, సినీ డైలాగ్లతో బాలకృష్ణ బోర్ కొట్టించాడు. ఐటీఐ కూడలిలో బాలకృష్ణకు పూలదండ వేసేందుకు భారీ క్రేన్ను టీడీపీ నాయకులు అడ్డంగా పెట్టడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సభా వేదిక వద్ద టీడీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచార రథాలపై మహిళలు సినీ గీతాలకు డ్యాన్స్ చేస్తున్నా.. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారు. బీఆర్టీఎస్ రోడ్డులో కార్యకర్తలు అడ్డంగా ఉండటంతో అంబులెన్స్ వెళ్లేందుకు దారి లేక చాలాసేపు అక్కడే నిలిచిపోయింది. -
వలస పక్షి సీఎం రమేష్ను ఓడించాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న దేవరాపల్లి: వలస పక్షి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ను ఓడించి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను కోరారు. శుక్రవారం దేవరాపల్లిలో ఆయన మాట్లాడుతూ సీఎం రమేష్ పెత్తందారు పోకడలు ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమన్నారు. ధన బలంతో ఓట్లు కొనుగోలు చేయాలని చూస్తున్నాడని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఐదు వేలకుపైగా కిరాయి వ్యక్తులను మోహరింపచేసి ఓటర్లను ప్రలోభ చేస్తున్నాడన్నారు. ఇలాంటి విష సంస్కృతి అనకాపల్లి ప్రశాంతతకు గొడ్డలి పెట్టు అన్నారు. ఇటువంటి వ్యక్తిని పార్లమెంట్లో అడుగు పెట్టనివ్వకుండా తగిన గుణపాఠం చెప్పాలన్నారు. అత్యంత కీలకమైన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేసి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిని ఓడించాలని విజ్ఞప్తి చేశారు. -
ఫార్మాసిటీలో ఐదుగురు కార్మికులకు అస్వస్థత
పరవాడ : స్థానిక ఫార్మాసిటీలోని అజినోమోటొ పరిశ్రమలో గురువారం విష వాయువుల లీకై న ఘటనలో ఐదుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. పరిశ్రమ యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా బాధిత కార్మికులను నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తోంది. శుక్రవారం ఉదయం పరవాడ పోలీసులకు సమాచారం అందడంతో ఆస్పత్రికి వెళ్లి అస్వస్థతకు గురైన కార్మికుల వివరాలను సేకరించారు. ఈ విషయాన్ని పరవాడ సీఐ ఎస్.బాలసూర్యారావు వద్ద ప్రస్తావించగా.. పరిశ్రమలో విషవాయువులు ఏ విధంగా బయటకు వచ్చాయన్న విషయంపై వివరాలు సేకరిస్తున్నామని, అస్వస్థతకు గురైన కార్మికులు సుధాకర్, సతీష్, వర్మ, రామునాయుడు, ఎస్.సాయిల పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పారు. బాధిత కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. -
మాకవరపాలెంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ
నర్సీపట్నం: తెలుగుదేశం పార్టీకి మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికలకు కొద్ది రోజులే ఉన్నప్పటికీ వైఎస్సార్సీపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. మాకవరపాలెం మండలం రాచపల్లి శివారు కొత్తపాలెం, పాపయ్యపాలెం గ్రామాల నుంచి వంద కుటుంబాల వారు వైఎస్సార్సీపీలో చేరారు. వీరంతా శుక్రవారం పార్టీ సీనియర్ నేత రుత్తల యర్రాపాత్రుడుతో కలసి వైఎస్సార్పీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్గణేష్ తన క్యాంపు కార్యాలయంలో పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరడం శుభ సూచికమన్నారు. పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఎంపీపీ రుత్తల సత్యనారాయణ, పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, నర్సీపట్నం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సన్యాసిపాత్రుడు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ భద్రాచలం, యూత్ అధ్యక్షుడు పిల్లా శ్రీను, సేవాదళ్ అధ్యక్షుడు ఇటంశెట్టి శ్రీను, రాచపల్లి, పాపయ్యపాలెం పార్టీల నేతలు పెట్ల దొరబాబు, యర్రా లోవ, పైల సత్తిబాబు, రుత్తల నాయుడు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలోకి 100 కుటుంబాలు చేరిక
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement