-
మహిళను స్తంభానికి కట్టేసి దాడి
యశవంతపుర: హావేరి జిల్లా రాణిబెన్నూరు తాలూకా అరెమల్లాపుర గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయిని యువకుడు వెంట తీసుకెళ్లగా యువతి కుటుంబ సభ్యులు ఆ యువకుడి తల్లిని కరెంటు స్తంభానికి కట్టేసి హింసించారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన హనుమవ్వ మెడ్లేరి కుమారుడు మంజునాథ్ అదే గ్రామంలోని యువతిని ప్రేమించాడు. ఇంట్లో చెబితే అంగీకరించరని భావించి ఇద్దరూ ఊరు విడిచి వెళ్లారు. ఈక్రమంలో యువతి కుటుంబ సభ్యులు చంద్రప్ప, గంగప్ప, గుత్తెవ్వలు హనుమవ్వ ఇంటివద్దకు వచ్చి ఆమెను కరెంటు స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టారు. పారిపోయిన ఆ ఇద్దరు ఎక్కడకు వెళ్లారో చెప్పాలని హింసించారు. స్థానికులు స్పందించి హనుమవ్వను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో రాణిబెన్నూరు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు హావేరి ఎస్పీ అంశుకుమార్ తెలిపారు. మహిళకు దావణగెరె ఆస్పత్రిలో చికిత్సలు అందిస్తున్నట్లు వివరించారు. -
మహిళ సాక్ష్యం..దర్యాప్తు ముమ్మరం
శివాజీనగర: లైంగిక దాడుల కేసులో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక తనిఖీ బృందం (ఎస్ఐటీ) ఏర్పాట్లు చేసుకుంటోంది. అశ్లీల వీడియో కేసు తనిఖీ జరుపుతున్న సిట్ అధికారులు వీడియోలో ఉన్న కొందరి మహిళలను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించగా ఓ మహిళ ముందుకు వచ్చింది. ఆమె ఇచ్చిన సాక్ష్యం మేరకు లైంగిక దాడుల ఆరోపణ కింద ప్రజ్వల్పై నమోదైన ఎఫ్ఐఆర్కు కొత్తగా ఐపీసీ సెక్షన్– 376ను చేర్చటం ద్వారా అత్యాచార కేసు నమోదు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ తనను ఆశపెట్టి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు న్యాయమూర్తి ముందు వెల్లడించారు. సీఆర్పీసీ 164 కింద సాక్ష్యం నమోదైంది. ప్రజ్వల్ రేవణ్ణపై సీఐడీ సైబర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. రెండవ ఎఫ్ఐఆర్లో నమోదైన సెక్షన్లు కట్టుదిట్టంగా ఉన్నాయి. ఐపీసీ 376 (2) ఎన్506, 354ఎ1, 354బీ, 354సీ సెక్షన్లు, ఐటీ చట్టం కింద ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. బెదిరించి నిరంతరం అత్యాచారం చేయడంపై 376(2) ఎన్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇది రుజువైతే పదేళ్ల జైలు లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. రెండవ ఎఫ్ఐఆర్లో ప్రజ్వల్ రేవణ్ణ నిందితుడిగా ఉన్నాడు. తొలి ఫిర్యాదులో హెచ్డీ రేవణ్ణ కూడా నిందితుడు. ప్రజ్వల్ రేవణ్ణ భారత్కు వచ్చిన తక్షణమే అరెస్ట్ చేసేందుకు ఎస్ఐటీ భావిస్తోంది. రేవణ్ణ బెయిల్ పిటిషన్ ఉపసంహరణ: లైంగిక దౌర్జన్య కేసులో అరెస్ట్ భయంతో ముందస్తు బెయిల్ కోసం బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను మాజీ మంత్రి హెచ్.డీ.రేవణ్ణ ఉపసంహరించుకొన్నారు. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిగింది. సిట్ తరఫున ఎస్పీసీబీ ఎన్.జగదీశ్ వాదనలు వినిపించారు. విచారణకు హాజరుకావాలని రేవణ్ణకు నోటీస్ ఇచ్చామన్నారు. ఇది బెయిల్ రహితం కాదని, పిటిషన్దారుడి అరెస్ట్ అవసరమనే సమస్య రాదన్నారు. ముందస్తు బెయిల్ అవసరం లేదని వివరించారు. దీంతో పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు రేవణ్ణ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఎంపీ ప్రజ్వల్ భారత్కు వచ్చిన తక్షణమే అరెస్ట్ చేసేలా సిట్ కసరత్తు -
దేశాభివృద్ధి కోసం మోదీని బలపరచండి
సాక్షి, బళ్లారి: దేశ సమగ్రాభివృద్ధి, భద్రత, రక్షణ కోసం బీజేపీని బలపరచాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆయన శుక్రవారం కర్ణాటకలోని బెళగావి జిల్లా హుక్కేరిలో ఎన్నికల బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. కుటుంబ రాజకీయాలు కావాలా? మన సంస్కృతి వారసత్వాలు కాపాడే బీజేపీ కావాలా? తేల్చుకోవాలని ఓటర్లకు సూచించారు. ప్రధాని మోదీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు ఆయన హయాంలోనే అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిందన్నారు. రాహుల్ బాబా, సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గేకు రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం పంపినా రాలేదన్నారు. ఓట్ బ్యాంక్ కోసం వారు ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇలాంటి వారికి మనం ఓటు వేయాలా అని ప్రశ్నించారు. ఆలయాల పనులు పూర్తి కాశీ కాళిదాసు, సోమనాథ మందిరం మొదలైన అసంపూర్ణ నిర్మాణ పనులను మోదీ పూర్తి చేశారన్నారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించడంలో మోదీ తీసుకున్న నిర్ణయంపై దేశ ప్రజలు హర్షిస్తున్నారన్నారు. ఆర్టికల్–370 రద్దు చేయడంతో కశ్మీరీలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఉగ్రవాదులను అణచి వేయడంతో పాటు టీఎఫ్ఐని నిషేధించామన్నారు. బెంగళూరులో బాంబు పేలుడు, నేహా హిరేమఠ హత్య సీబీఐకు అప్పగించాలని ప్రభుత్వానికి సూచించామన్నారు. హిందూ వ్యతిరేకులకు, హిందువులను అవమానం చేసిన వారికి, హిందూ సనాతన ధర్మ రక్షణ చేసే వారికి మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏటా రూ.10 వేలు వచ్చేదని, ప్రస్తుతం రైతులకు కాంగ్రెస్ సర్కారు అన్యాయం చేస్తోందన్నారు. రాహుల్ బాబా కంపెనీ నుంచి దేశాన్ని రక్షించేందుకు మోదీని బలపరచాలన్నారు. బీజేపీ అభ్యర్థి అణ్ణాసాహెబ్ జొల్లె, పార్టీ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా -
పాకిస్తాన్ జిందాబాద్ అంటే కాల్చి చంపాలి
హొసపేటె/రాయచూరు రూరల్: పాకిస్తాన్ జిందాబాద్ అని నినదిస్తే నేరుగా కాల్చిచంపేలా చట్టం తేవాలని గృహ నిర్మాణ, మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ అన్నారు. కొప్పళ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని సింధనూరులో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రచార సభలో ఆయన మాట్లాడారు. మనమంతా ఈ నేలపై పుట్టిన భారతీయులం. మనలో దేశభక్తి కూడా ఉంది. ఇక్కడ పాకిస్తాన్ జిందాబాద్ అనే వారిని కాల్చిచంపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలి. అవసరమైతే కోర్టు నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. ఇటీవల బీజేపీ కిరాయి హంతకులను పంపి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందన్నారు. అయితే పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసే వారికి ఇక్కడ ఉండే అర్హత లేదు. వారిని బహిరంగంగా కాల్చి చంపాలని అన్నారు. దేశ రక్షణ, రాజ్యాంగం పరిరక్షణ కోసం ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు మద్దతివ్వాలన్నారు. దేశం, రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయి. మతతత్వ భాజపాను ఓడించి కాంగ్రెస్ కూటమిని బలపరచాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు హామీలు అమలు చేశామన్నారు. ఈ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఏడాదికి రూ.లక్ష, యువతకు రూ.లక్ష ఇస్తామని హామీ ఇచ్చారు. హిందూ, ముస్లింల పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందన్నారు. వారికి అభివృద్ధి అవసరం లేదన్నారు. కాంగ్రెస్ సాధించిన విజయాలను చూపి ఓట్లు అడుగుతున్నామన్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజశేఖర్ హిట్నాల్కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే హంపనగౌడ బాదర్లి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అన్వర్ బాషా, నాయకులు అమ్జద్ పటేల్, ఇమాం నియాజీ తదితరులు పాల్గొన్నారు. -
దళితుల విరోధి ఆ జాతీయ పార్టీనే
సాక్షి,బళ్లారి: ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ దళితులను ఓటు బ్యాంకు కోసమే ఉపయోగించుకుంటోంది కాని సంక్షేమ, అభివృద్ధి గురించి ఆలోచించడం లేదని మాజీ మంత్రి, దళిత నాయకుడు మహేష్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. డాక్టర్ బాబాసాహేబ్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని హరిహర బ్రహ్మదేవుళ్లు వచ్చినా మార్చడానికి కాదన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి మోదీ కూడా వెల్లడించారన్నారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఇది నూటికి నూరు పాళ్లు అబద్ధం అన్నారు. ఒక దళితుడుగా చెబుతున్నా దళితులకు మోసం చేసింది, చేస్తున్నది, చేయబోయేది కాంగ్రెస్ పార్టీనే కాని బీజేపీ కాదన్నారు. దళితులకు సంబంధించిన నిధులను పక్కదారి పట్టించి, గ్యారెంటీలకు ఉపయోగించుకుని, ఆ గ్యారెంటీల్లో ఎస్సీలకు, ఎస్టీలకు, అగ్రవర్ణాలకు నెలకు రూ.2లు వేస్తోందన్నారు. దళితుల సొమ్మును పక్కదారి పట్టించి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ను ఈ ఎన్నికల్లో ఓడించాలి డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ను ఓడించిన కాంగ్రెస్ పార్టీని కూడా ఈ ఎన్నికల్లో ఓడించాలన్నారు. అంబేడ్కర్ చనిపోతే ఆయనకు ఆరు అడుగుల స్థలం ఇవ్వకుండా అవమానించిందని ధ్వజమెత్తారు. అంబేడ్కర్ను అవమానించిన కాంగ్రెస్ పార్టీలో ఒక్క క్షణం కూడా దళితులు ఉండకూడదన్నారు. అంబేడ్కర్కు ప్రధానమంత్రి కావడానికి కూడా అవకాశం వస్తే తప్పించింది ఎవరు అని ప్రశ్నించారు. దళిత వర్గాలకు ఎన్నో అన్యాయాలు చేసిన కాంగ్రెస్ పార్టీని ఓటు ద్వారా తిరస్కరించాలన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తున్న మోదీ సర్కార్ను మరోసారి కేంద్రంలో గద్దెనెక్కించాల్సిన అవసరం ఉందన్నారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్ కుమార్ మోకా, మాజీ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మురహరగౌడ, జిల్లా రైతు సంఘం బీజేపీ నాయకులు గణపాల ఐనాథరెడ్డి, బీజేపీ నాయకులు హనుమంతప్ప, రామచంద్రయ్య, సుప్రీంకోర్టు న్యాయవాది గోవిందు, మాజీ బుడా అధ్యక్షుడు మారుతీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హరిహర బ్రహ్మదేవుళ్లు కూడా రాజ్యాంగాన్ని మార్చలేరు మాజీ మంత్రి, దళిత నాయకుడు మహేష్ మండిపాటు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది
నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!
శోభిత పోస్ట్.. సమంత స్టైలిష్ట్ రిప్లై
ముంబై ఎయిర్పోర్టులో 12 కోట్ల విలువైన బంగారం, ఐఫోన్లు సీజ్
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
కాన్వాయ్ స్లో చేసి అంబులెన్స్కు దారిచ్చిన సీఎం జగన్ (ఫొటోలు)
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
ఎల్లో శారీలో హీరామండి హీరోయిన్ సంజీదా షేక్ లుక్స్.. ఫోటోలు
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement