తిరుమల: తిరుమలలో ఆదివారం మధ్యాహ్నం గంటపాటు కుంభవృష్టిగా వర్షం కురిసింది. ఈ భారీ వర్షం కారణంగా ఆలయ పరిసర ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ముఖ్యంగా శ్రీవారి ఆలయం చుట్టుపక్కల రహదారులు, క్యూలైన్లు, పార్కింగ్ ప్రాంతాల్లో నీరు చేరడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా క్యూలైన్లలో నిలబడి ఉన్న భక్తులు తడిసి ఇబ్బంది పడ్డారు. రహదారులు ముంచెత్తడంతో వాహనాల రాకపోకలు కూడా అంతరాయం కలిగాయి. 
ADVERTISEMENT
ADVERTISEMENT