-
సర్వేజనా సుఖినో ‘భవంతి’
ఉప్పలగుప్తం: అన్ని సేవలూ అందుబాటులోకి వస్తే.. ఏ పనైనా సకాలంలో పూర్తయితే.. ఇంకేం కావాలి. రైతులు, ప్రజలు, అన్ని వర్గాలకూ ఒకేచోట నుంచి సేవలు అందితే, ఆ సేవా కేంద్రాలూ చూడముచ్చటగా కనిపిస్తే ఆ ఊరే మారుతోంది. ప్రగతి చాటుతోంది. అచ్చం అలానే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి గ్రామ పంచాయతీ పరిధి సూదాపాలెంలో నిర్మించిన ప్రభుత్వ భవనాలు ఒకేచోట ముచ్చట గొలుపుతున్నాయి. ము ఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు ఒకేచోటకు రావటంతో ఈ పల్లె ప్రగతి చాటుతోంది. ప్రతి రెండు వేల మంది జనాభాకు చేరువగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలనే దృక్పథంతో ఈ భవనాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చింది. రూ.43.60 లక్షలతో సచివాలయ భవనం, రూ.23.94 లక్షలతో రైతు భరోసా కేంద్రం, రూ.20. 80 లక్షలతో వైఎస్సార్ విలేజ్ క్లినిక్లను నిర్మించారు. ఇద్దరు జమీందార్లను ఓడించిన పిన్నమనేని కొవ్వూరు తొలి ఎమ్మెల్యే రికార్డు కొవ్వూరు: కొవ్వూరు మొట్టమొదటి ఎమ్మెల్యేగా సీపీఐ అభ్యర్థి పిన్నమనేని రామచంద్రరావు గెలుపొందారు. 1952 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అన్నదేవరపేట జమీందారు అల్లూరి బాపినీడు, ప్రజాపార్టీ అభ్యర్థిగా దొమ్మేరు జమీందారు పెండ్యాల వెంకట కృష్ణ రంగారావు(మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు తండ్రి)తో పిన్నమనేని రామచంద్రరావు పోటీ పడ్డారు. ఇద్దరు ఉద్దండులైన జమీందార్లతో తల పడిన ఆయన ఆ ఎన్నికల్లో 6,681 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇద్దరు జమీందార్లను ఓడించిన వ్యక్తిగా పిన్నమనేని కొవ్వూరు ఎన్నికల చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. కమ్యూనిస్టు భావాలు కలిగిన నాయకుడిగా ఆయన ఈ ప్రాంత వాసులకు సుపరిచితుడు. బూత్ క్యాప్చరింగ్ అంటే.. రాయవరం: ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకోవడం, పోలింగ్ను అడ్డుకునేందుకు ప్రయత్నించడాన్ని బూత్ క్యాప్చరింగ్ అంటారు. ఎవరైనా కావాలని బ్యాలెట్ పేపరు గానీ, ఈవీఎంలను గానీ పాడు చేయడం, విరగ్గొట్టడం, ఎన్నికల గుర్తులపై సిరా పోయడం వంటి చర్యలకు పాల్పడటం ఇందులో భాగంగా ఉంటాయి. పోలింగ్ కేంద్రంలో ఓటర్లను భయపెట్టడం, పోలింగ్ను అడ్డుకోవడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఇలా చేస్తే ప్రభుత్వ సిబ్బంది అయితే ఐపీసీ 1951 సెక్షన్ 135ఎ, 136 ప్రకారం మూడు నుంచి ఐదేళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఇతరులైతే ఒకటి నుంచి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. 05కెవీఆర్01: -
గోపాలపురం నియోజకవర్గంలో మండలాలు
గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల, ద్వారకాతిరుమల జనాభా : 2,99,710 పురుషులు : 1,49,556 సీ్త్రలు : 1,50,154 ఓటర్లు : 2,41,798 పురుషులు : 1,18,783 సీ్త్రలు : 1,23,008 ఇతరులు : 07 పోలింగ్ కేంద్రాలు : 248 పంచాయతీలు : 80 గ్రామాలు : 142 -
నగదు, మద్యం స్వాధీనం
అమలాపురం టౌన్: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నిఘా బృందాలు దాడులు, తనిఖీలు నిర్వహించి మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నాయి. నగదును సీజ్ చేస్తున్నాయి. జిల్లా ఎస్పీ సుసరాపు శ్రీధర్, ఏఎస్పీ ఎస్.ఖాదర్ బాషా ఆధ్వర్యంలో జిల్లాలో గురు, శుక్రవారాల్లో పట్టుబడ్డ మద్యం, నగదు వివరాలను జిల్లా ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ● కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామంలో ప్రజలకు పోలీసు అధికారులు ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ● జిల్లాలో 17 కేసులు నమోదు చేసి 19 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 2 నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు, 115 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు, 32.95 లీటర్ల ఇండియన్ మేడ్ లిక్కర్, 64 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. 100 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. ● మండపేటలో నిఘా బృందాలు చెక్ పోస్టులో వాహనాలను తనిఖీ చేసి రూ.2.50 లక్షల నగదును సీజ్ చేశారు. ● మండపేట రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో రూ.90 వేల నగదు సీజ్ చేశారు. ● ఉప్పలగుప్తం పోలీసు స్టేషన్ పరిఽధిలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతని నుంచి 30 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు, 5.4 లీటర్ల ఇండియన్ మేడ్ లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. ● కాట్రేనికోన పోలీసు స్టేషన్ పరిధిలోని బలుసుతిప్ప నిఘా బృందాలు తనిఖీలు చేసి రికార్డులు సరిగా లేని 20 మోటారు సైకిళ్లు, ఒక ఆటో సీజ్ చేశారు. ● తాళ్లరేవు మండలంలో పోలీస్ ఎన్నికల పరిశీలకుడు ఎంవీ చంద్రకాంత్, ద్రాక్షారామ పోలీసు స్టేషన్ పరిధిలో ఎన్నికల పరిశీలకుడు పరదీప్కుమార్ సమస్మాత్మక పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ● ద్రాక్షారామ పోలీసు స్టేషన్ పరధిలో వెంకటాయపాలెం, బాపనయ్య చెరువు, పామర్రు పోలీసు స్టేషన్ పరిధిలో పేకేరు, తాళ్లపోడు, బట్లపాలిక గ్రామాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ప్రాంతాల్లో పోలీసు అధికారులు కేంద్ర బలగాలతో కలిసి శుక్రవారం సాయంత్రం కవాతు నిర్వహించారు. -
నేతన్న కుటుంబంలో వెలుగులు
తుని: కోటనందూరు మండలం బంగారయ్యపేటకు చెందిన పసగడుగుల అప్పారావుది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. కులవృత్తి చేనేత మగ్గం పనిలో వచ్చిన కొద్దిపాటి ఆదాయంతో జీవనం సాగించేవాడు. అలాంటి అప్పారావు కుటుంబంలో సీఎం జగన్ ప్రభుత్వం అండతో అనూహ్య మార్పులొచ్చాయి. ఆ నిరుపేద కుటుంబం కష్టాలను జయించి ప్రస్తుతం సంతోషంగా జీవిస్తోంది. కాగా నేత కార్మికుడు అప్పారావుకు ముగ్గురు కుమారులు. జగనన్న ప్రభుత్వం వచ్చాక అప్పారావుకు పెన్షన్ కానుకతో పాటు పెద్దకుమారుడికి రైతుభరోసా, రెండో కుమారుడికి నేతన్న నేస్తం, చిన్న కుమారుడికి గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. గత నాలుగున్నరేళ్లలో అప్పారావు పెన్షన్ కానుక ద్వారా రూ.లక్ష, పెద్ద కుమారుడికి రైతు భరోసా పథకంలో రూ. 54 వేలు, రెండో కుమారుడు పసగడుగుల త్రిమూర్తులకు నేతన్న నేస్తం ద్వారా సంవత్సరానికి రూ.24 వేలు చొప్పున 96 వేలు అందింది. రెండో కుమారుడు త్రిమూర్తులు భార్య సత్యగౌరికి జగనన్న చేదోడు రూపంలో రూ.40 వేలు, అమ్మవడి పథకం ద్వారా రూ.75 వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని పొందారు. రాజకీయ నాయకుల ప్రమేయం లేదు సీఎం జగన్ పాలనలో సంక్షేమ పథకాల కోసం రాజకీయ నాయ కుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా పోయింది. ఎవరి ప్ర మేయం లేకుండానే మాకు అన్ని పథకాలు అందు తున్నాయి. గ్రామ వలంటీర్ నేరుగా ఇంటికొచ్చి అర్హత ఉన్న పథకాలు నమోదు చేశాడు. గతంలో ఏ ప్రభుత్వాలు ఇలా చేయలేదు. ఇబ్బందుల్లో ఉన్న మాలాంటి పేదలను ఆదుకున్న దేవుడు సీఎం జగన్మోహన్రెడ్డి. ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. –సత్యగౌరీ, గృహిణి, బంగారయ్యపేట, కోటనందూరు మండలం ఆపద్భాందవుడు సీఎం జగన్ గతంలో ఎన్నో ఇబ్బందులు పడే మా కుటుంబం జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత సజావుగా సాగుతోంది. మా ఇంట్లో అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. నాకు ఏటా అందే నేతన్న నేస్తం మా కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలుస్తోంది. నా భార్యకు చేదోడు, అమ్మ ఒడి, తండ్రికి పెన్షన్ కానుక, అన్నయ్యకు రైతు భరోసా పథకాలు అందుతున్నాయి. సీఎం జగన్ అధికారంలోకి రాకపోయి ఉంటే మా కుటుంబం ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడేది. –పసగడుగుల త్రిమూర్తులు, నేతన్న నేస్తం లబ్ధిదారు, బంగారయ్యపేట, కోటనందూరు మండలం సచివాలయంలో ఉద్యోగం సామన్య కుటుంబంలో పుట్టిన నేను దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ఉన్నత చదువులు చదివాను. 2021–13 లో బీఎస్సీ, బీఈడీ పూర్తి చేశాను. గత ప్రభుత్వం డీఎస్సీ నోటిఫ్కేషన్ ఇవ్వలేదు. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక సీఎం జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడంతో పోటీ పరీక్ష రాయగా వేల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. –పసగడుగుల శివ గణేష్, సచివాలయ ఉద్యోగి, కోటనందూరు మండలం చేనేత కార్మికుడు అప్పారావు కుటుంబానికి రూ.3.65 లక్షల లబ్ధి నిరుపేద కుటుంబానికి అండగా సీఎం జగన్ ప్రభుత్వం ఆనందం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు -
పారిశ్రామిక నవోదయం
ఇంకా... ● కొవ్వూరు మండలం ఇసుకపట్ల పంగిడి గ్రామం వద్ద మరో భారీ పరిశ్రమకు నాంది పలికారు. 26.65 ఎకరాల విస్తీర్ణంలో రూ. 1,350 కోట్ల పెట్టుబడితో త్రివేణి రెన్యువబుల్స్ సంస్థ ఆధ్వర్యాన సోలార్ గ్లాస్ తయారీ పరిశ్రమ ఏర్పాటైంది. దీని ద్వారా 2,400 మందికి ఉద్యోగాలు లభించాయి. ● నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో 14 ఎకరాల్లో జాగృతి బయోటెక్ సంస్థ ఆధ్వర్యాన బయో టెక్నాలజీ కంపెనీ అందుబాటులోకి రానుంది. రూ.50 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ పరిశ్రమ ఏర్పాటు పూర్తయితే 81 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ● పెరవలి మండలం ఖండవల్లి గ్రామం వద్ద రవళి స్పిన్నర్స్ సంస్థ 16,800 స్పిండిల్స్ ఉత్పత్తి సామర్థ్యంతో కాటన్ స్పిన్నింగ్ మిల్లును అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటు చేసింది. అనంరతం 1,520 స్పిండిల్స్గా, 2,900 డ్రమ్స్కు దీనిని విస్తరించింది. సంస్థలో 1,000 మంది ఉపాధి పొందేవారు. నెలకు 10,000 టన్నుల నూలు ఈ ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అవుతోంది. సాధారణమైన నూలుతో పాటు జీన్స్కు, అన్ని రకాల వస్త్రాల తయారీకి ఉపయోగపడే నూలు ఇక్కడ తయారు చేస్తున్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ‘రవళి’ దారం మంచి పేరు పొందింది. దీని ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు ప్రభుత్వం తాజాగా అనుమతులు ఇచ్చింది. తద్వారా రూ.150 కోట్ల పెట్టుబడి వ్యయంతో 2 లక్షల స్పిండిల్స్ తయారీ సామర్థ్యానికి దీనిని విస్తరించారు. ఫలితంగా మరో 1,000 మందికి ఉపాధి లభించింది. ● జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం నగరంలోని ఆంధ్రా పేపర్ మిల్లు ఉత్పత్తి సామ ర్థ్యం పెరిగింది. రూ.2 వేల కోట్లతో మరో 2,300 మందికి ఉద్యోగాలు లభించాయి.ఇసుకపట్ల పంగిడి వద్ద సోలార్ గ్లాస్ తయారీ పరిశ్రమ సాక్షి, రాజమహేంద్రవరం: నవ్య తూర్పు గోదావరి జిల్లా సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం గడచిన ఐదేళ్లుగా కొత్త పరిశ్రమల స్థాపనకు అత్యంత ప్రోత్సాహం ఇచ్చింది. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సింగిల్విండో విధానంలో అన్ని రకాల అనుమతులూ ఇస్తున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాయితీపై భూములు కేటాయిస్తూండటం, పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉండటంతో పారిశ్రామిక దిగ్గుజాలు, బహుళజాతి సంస్థలు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయి. రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. వీటితో పాటు సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల (మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్) ఏర్పాటుకు అత్యధిక శాతం మంది ఆసక్తి చూపుతున్నారు. అధికార యంత్రాంగం చొరవతో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు కేంద్రంగా జిల్లా మారింది. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్న ప్రభుత్వ అజెండాతో వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి దక్కుతోంది. పరిశ్రమల స్థాపన.. ఉద్యోగాల కల్పన కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం నూతన తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో భారీ పరిశ్రమ స్థాపనకు అడుగులు పడ్డాయి. పారిశ్రామిక దిగ్గజ కంపెనీ ఆదిత్య బిర్లా గ్రూప్ తొలి దశలో రూ.1,000 కోట్లు, రెండో దశలో మరో రూ.1,500 కోట్లు కలిపి మొత్తం రూ.2,500 కోట్ల పెట్టుబడితో గ్రాసిమ్ కాస్టిక్ సోడా ప్లాంట్ నిర్మించింది. ఈ పరిశ్రమ రెండో దశ విస్తరణ ప్రక్రియ సైతం ఇటీవల పూర్తయింది. 2,500 మందికి ఉపాధి దక్కుతోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిరాదరణకు గురైన ఈ ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్ పట్టాలెక్కించారు. రూ.260 కోట్లతో ఇథనాల్ ప్రాజెక్టు ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’గా పేరొందిన గోదావరి తీరాన.. పెట్రో ఉత్పత్తుల్లో కలిపేందుకు ఉపయోగించే బియ్యం ఆధారిత తొలి ఇథనాల్ ప్లాంట్ మన జిల్లాలో ఏర్పాటవుతోంది. గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామంలో రూ.260 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ఏపీఐఐసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.13.50 కోట్ల విలువైన 20.07 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ పరిశ్రమ ద్వారా రోజుకు 200 కిలోలీటర్ల (2 లక్షల లీటర్ల) ఇథనాల్ ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. ప్రస్తుతం దీని పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పరిశ్రమ నిర్మాణం పూర్తయితే 210 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి దక్కుతుంది. ఎంఎస్ఎంఈలతో.. గడచిన మూడున్నరేళ్లుగా ఎంఎస్ఎంఈల అభివృద్ధికి, తద్వారా ఉపాధి కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అధికార యంత్రాంగం గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 6,000 ఎంఎస్ఎంఈలు స్థాపించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇప్పటికే 2,427 ఏర్పాటు చేసింది. చిన్న, మధ్యతరహా, పెద్ద పరిశ్రమలకు కలిపి రూ.39.557 లక్షల పెట్టుబడులు వచ్చాయి. ఫలితంగా 10,179 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం తీసుకుని వచ్చిన సింగిల్ విండో విధానం పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయోగపడుతోంది. 2019–23 మధ్య వివిధ పరిశ్రమల స్థాపనకు, పారిశ్రామిక అవసరాలకు 2,514 దరఖాస్తులు అందగా.. వాటిలో 2,431కు పరిష్కారం చూపారు. జిల్లాలో పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహం బలభద్రపురంలో రూ.2,500 కోట్లతో గ్రాసిమ్ కాస్టిక్ సోడా ఇండస్ట్రీ గుమ్మళ్లదొడ్డి వద్ద రూ.260 కోట్లతో ఇథనాల్ ప్రాజెక్టు 2,427 ఎంఎస్ఎంఈల పరిధిలో 10,179 మందికి ఉపాధి జిల్లాలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన సంవత్సరం పరిశ్రమల స్థాయి స్థాపించిన యూనిట్లు పెట్టుబడి ఉద్యోగాల కల్పన 2019–23 భారీ 1 రూ.861 కోట్లు 1,203 2024 భారీ 4 రూ.3,760 కోట్లు 5,910 ఎంఎస్ఎంఈలు 2019–22 533 రూ.245.25 కోట్లు 5,725 2022 ఏప్రిల్ – 2023 సెప్టెంబర్ 8,885 రూ.777.28 కోట్లు 19,050
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు (నెల్లూరు జిల్లా)
పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్ను ఉతికి ఆరేసిన ప్రిన్సిపాల్
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
తప్పక చదవండి
- పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
Advertisement