-
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఐదుగురు నామినేషన్లు
నల్లగొండ: నల్లగొండ – వరంగల్– ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి శుక్రవారం ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న రెండు సెట్లు, స్వతంత్ర అభ్యర్థులుగా మాధవపెద్ది వెంకట్రెడ్డి ఒక సెట్, చంద్రశేఖర్ రెండు సెట్లు నామినేషన్ పత్రాలను నల్లగొండ కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అందజేశారు. అదేవిధంగా అలియన్స్ డెమొక్రటిక్ రీఫామ్స్ పార్టీ అభ్యర్థి ఈడ శేషగిరిరావు ఒక సెట్, తెలంగాణ సకల జనుల పార్టీ అభ్యర్థి నందిపాటి జానయ్య ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. 8న లక్ష్మీపురంలో ప్రధాని మోదీ బహిరంగ సభ ● లక్ష మందితో బీజేపీ ఆశీర్వాద సభ ● సభా స్థలం పరిశీలన..ఏర్పాట్లు ప్రారంభంమామునూరు: ఈ నెల 8న దేశ ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్కు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖిలా వరంగల్ మండలం తిమ్మాపురం రోడ్డు లక్ష్మీపురం మైదానంలో జరిగే బీజేపీ ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం సభాస్థలాన్ని ఆ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు, నాయకులు రావు పద్మ, రాజేశ్వర్రావు, వన్నాల శ్రీరాములు, కొండేటి శ్రీధర్, ఎర్రబెల్లి ప్రదీప్రావు కీర్తిరెడ్డి, దశమంతరెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా రమేశ్ కొబ్బరికాయ కొట్టి సభప్రాంగణ పనులను ప్రారంభించారు. అంతకుముందు స్థానిక కార్పొరేటర్ జలగం అనిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. బీజేపీతోనే వరంగల్ అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఆశీర్వాద సభకు దేశ ప్రధాని మోదీ రానున్నారని, లక్ష మందికిపైగా జనం స్వచ్ఛందగా తరలివచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ నెల 8న ఉదయం 11.30 గంటలకు ప్రధాని మోదీ మామునూరు ఎయిర్పోర్ట్కు చేరుకుంటారని తెలిపారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో 11.50గంటలకు లక్ష్మీపురం సభాస్థలికి చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. మధ్యాహ్నం 12.45 నిమిషాలకు తిరిగి మామునూరు ఎయిర్ పోర్ట్నుంచి కరీంనగర్ బహిరంగ సభకు తరలివెళ్లనున్నారని తెలిపారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నేతలు మల్లాడి తిరుపతిరెడ్డి, దేవేందర్రెడ్డి, గజ్జెల శ్రీరాములు, బన్న ప్రభాకర్, సంపత్రెడ్డి, సాంబయ్యయాదవ్, అర్చన, గందె నవీన్ పాల్గొన్నారు. డిగ్రీ పరీక్షలు యథాతథం ● వాయిదా పుకార్లు నమ్మవద్దు కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ కోర్సులు బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ కోర్సుల 2, 4, 6 సెమిస్టర్ల పరీక్షలు ఈనెల 6వ తేదీ నుంచి యథావిధిగా కొనసాగుతాయని వాయిదా వేసినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు నమ్మొద్దని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచా ర్య ఎస్.నర్సింహాచారి శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. -
సరెండర్ చేసినా కుర్చీ వదలరు
● 13 ఏళ్లుగా ఎంజీఎంలోనే తిష్ట ● కోర్టు స్టేతో తిరిగి జాయినింగ్ ఎంజీఎం : ఎంజీఎం ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ కుర్చీని వదలడం లేదు. 13 ఏళ్లుగా ఇక్కడే ఉన్నా ఇంకా ఎంజీఎంను వదలడం లేదు. పరిపాలన పరమైన కారణాలతో ఇటీవల ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి.చంద్రశేఖర్ సదరు అధికారిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సుదీర్ఘకాలం పాటు ఆయన ఇక్కడే తిష్ట వేసిన ఆయనకు ఇక్కడ ఏం దొరికిందో ఏమో కానీ..? సరెండర్ ఉత్తర్వులకు కోర్టు నుంచి స్టే తెచ్చుకుని తిరిగి దర్జాగా తన సీటును అలంకరిస్తున్నాడు. అసలు ఇక్కడ ఏముంది.? పరిపాలన విభాగంలో పనిచేసే ఈ విభాగం అధిపతి అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి మొదలుకొని జూనియర్ అసిస్టెంట్ వరకు దశాబ్దాలు ఎంజీఎంను వీడడంలేదు. ఇటీవల ఆస్పత్రిలో అంతర్గత బదిలీలు నిర్వహించారు.అయితే కొత్తగా కేటాయించిన స్థానాల్లో చేరిన కొందరు ఉద్యోగులు కేవలం మూడు రోజుల్లోనే తిరిగి ఎవరి స్థానాల్లో వారు జాయిన్ అయ్యారు. ఎంజీఎంలో బదిలీలకు విలువ లేకుండా పోయిందని, ఉన్నతాధికారుల ఆదేశాలు పట్టించుకునే నాథుడే కరువయ్యాయని విమర్శలు వినిపిస్తున్నారు. సమగ్ర విచారణ చేపట్టాలి.. ఎంజీఎం పరిపాలన విభాగంలో సుదీర్ఘంగా తిష్ట వేసిన జూనియర్ అసిస్టెంట్ నుంచి మొదలుకొని ఏడీ వరకు వారు నిర్వహించిన సెక్షన్లపై ఏసీబీ ఉన్నతాధికారులచే సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తే వైద్యారోగ్య శాఖ ఉద్యోగులను బదిలీలు చేసే ప్రభుత్వం ఎంజీఎంను ఎందుకు విస్మరిస్తుందో అర్థం కావడం లేదని వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు సమూల మార్పుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
జీవాలను కాపాడుకుందాం..
చెన్నారావుపేట : భానుడు భగభగ మండుతున్నాడు.. వాతావరణం నిప్పుల కొలిమిలా మారుతుంది.. ఉక్కపోతతో మానవులతో పాటు జంతుజాలం తల్లడిల్లుతోంది.. ఎండల తీవ్రత, అధిక ఉష్ణోగ్రత, వేడిగాడ్పులు, వడదెబ్బతో పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు అనారోగ్యానికి గురవుతాయి. మారుతున్న వాతావరణ మా ర్పులకు అనుగుణంగా వాటిని శాసీ్త్రయ యాజ మాన్య పద్ధతిలో పెంచడం వల్ల వాటి ఉత్పాదక శక్తి తగ్గకుండా రైతు ఆశించిన ఫలితాలను పొందవచ్చని డాక్టర్ మంజీలాల్ పలు సూచనలు చేశారు. పశువులలో వడదెబ్బ.. అధిక ఉష్ణోగ్రత, గాలి ప్రసరణ సరిగా లేకపోవడం, షెడ్లలో అధిక సంఖ్యలో కిక్కిరిసి ఉండటం, ఉక్కపోత, నీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడం వల్ల పశువులు, గొర్రెలు, మేకలు వడదెబ్బకు గురవుతాయి. వడదెబ్బకు గురైన పశువులు క్రమంగా నీరసించి, బలహీనంగా మారుతాయి. పశువులు సరిగా నడవలేక తూలుతూ పడుకోవడానికి ప్రయత్నిస్తాయి. జీవక్రియ తగ్గిపోవడం, ఆకలి మందగించడం, ఆహారం తక్కువగా తీసుకుంటాయి. వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల ఇతర వ్యాధులు, పరాన్న జీవులు ఆశించే అవకాశం పెరుగుతాయి. కొన్ని సమయాల్లో దాహంతో ఉన్న పశువులు మురికి గుంటల్లో నీటిని తాగడం వల్ల పారుడు వంటి జీర్ణకోశ వ్యాధులు సంక్రమిస్తాయి. చూడి పశువులలో గర్భస్రావాలు సంభవించే అవకాశాలు ఉంటాయి. వడదెబ్బకు గురైన వాటిలో దాహం పెరిగి, శ్వాస కష్టమవడంతో ఒక్కోసారి అపస్మారక స్థితికి వెళ్లి మరణించే అవకాశం ఉంటుంది. పశువులను మేపడం.. ఉష్టతాపంతో జీర్ణక్రియ సన్నగిల్లుతుంది. అందువల్ల సులువుగా జీర్ణించుకునే పిండి పదార్థాలు ఇవ్వడం మంచిది. ఎక్కువ శాతం పచ్చిగడ్డి ఇవ్వాలి. ఒకవేళ మాగుడు గడ్డి సమృద్ధిగా ఉంటే అందించవచ్చు. పచ్చిగడ్డిని ఉదయం, ఎండుగడ్డిని రాత్రి వేళలో విభజించి ఇవ్వాలి. అధిక పాలను ఇచ్చే పశువులకు పశుదాణాను నీటితో కలిపి ఇవ్వాలి. మినరల్ మిక్చర్, ఉప్పు కలిపిన ద్రావణం ఇవ్వడం మంచిది. పశువుల్ని మేపేందుకు ఎండవేళ కాకుండా ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు బయటకు పంపడం మంచిది. ఆరోగ్య రక్షణ.. వేసవి తాపంతో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల ఇతర వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. వ్యాధినిరోధక టీకాలు ఇది వరకు వేయించని పశువులు, గొర్రెలు, మేకలలో గాలికుంటు వ్యాధి, గొంతువాపు, జబ్బవాపు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. నట్టల నివారణకు మందులు క్రమం తప్పకుండా తాగించాలి. ప్రథమ చికిత్స.. వడదెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని గాలి వీచే ప్రదేశంలోకి తీసుకెళ్లి శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి పలుమార్లు నీటితో కడగడం, తల నుదిటి మీద మంచుముక్కలు ఉంచడం లేదా చల్లని గోనె సంచిన దానిపై కప్పాలి. వెంటనే పశువైద్యుని సంప్రదించాలి. పశువైద్యుని పర్యవేక్షణలో గ్లూకోజ్ సైలెన్, సోడియం క్లోరైడ్ అందించాలి. సూచనలు..జాగ్రత్తలు గొర్రెలు, మేకలను వీలైనంత వరకు ఉదయం, సాయంత్రం మాత్రమే బయటకి మేపడానికి తీసుకెళ్లాలి. ఎండ తీవ్రత ఉన్నప్పుడు పాకల్లోనే ఉంచాలి. పశుగ్రాస వసతి ఉంటే షెడ్లలో మేపడమే మంచిది. పగటి సమయంలో పాకలు, షెడ్లకు గోనె సంచులు కట్టి తడపడం వల్ల లోపల చల్లగా ఉంటుంది. వేసవిలో తగినంత తాగునీరు అందుబాటులో ఉంచాలి. (వేసవిలో ప్రతి పశువుకు సుమారుగా 60–70 లీటర్ల తాగునీరు అవసరం) వీలైనంత ఎక్కువగా పచ్చిమేత అందించాలి. దాణా తడిపి ఇవ్వడం మంచిది. పాడిపశువులను పెంపకం, గొర్రెల మేకల పెంపకం చేపట్టే రైతులు షెడ్లలో ఫ్యాన్లు, ఫాగర్స్ ఏర్పచుకోవడం మంచిది. కోళ్లకు వడదెబ్బ తగలకుండా షెడ్పై స్ప్రింకర్లు ఏర్పాటు చేయాలి. వడదెబ్బ, ఎండ నుంచి రక్షించుకుందాం.. పశువులను మేపే విధానం, ఆరోగ్య రక్షణ, చికిత్సపై పశువైద్యాధికారి సూచనలు -
రేపే నీట్
విద్యారణ్యపురి : వైద్యవిద్యలో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్–2024( నేషనల్ ఎల్జిబులిటి ఎంట్రెన్స్ టెస్టు) ఈనెల 5న(ఆదివారం) నిర్వహించనున్నారు. ఆఫ్లైన్లోనే ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించనుంది. ఉమ్మడి వరంగల్జిల్లా కేంద్రంలో నీట్కు సర్వసిద్ధం చేశారు. ఈ పరీక్షకు 5,205మంది విద్యార్థులు రాయనుండగా, ఇందుకు తొమ్మిది పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. 9మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించగా, 19మంది అబ్జర్వర్లు పర్యవేక్షించబోతున్నారు. స్క్వాడ్ బృందాలు కూడా ఉంటాయని సమాచారం. నీట్ పరీక్ష ఈనెల 5న(ఆదివారం) మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం5 గంటల 20 నిమిషాల వరకు జరగనుందని ఉమ్మడి వరంగల్ జిల్లా సిటీ కోఆర్డినేటర్, హనుమకొండలోని గ్రీన్వుడ్ హైస్కూల్ ప్రిన్సిపాల్ సి.మంజులా దేవి శుక్రవారం తెలిపారు. ఉదయం 11:30గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1:30గంటలకు మెయిన్ గేట్లోకి వెళ్లేందుకు చివరి సమయం అనంతరం విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోరు. నిర్దేశించిన సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు. పరీక్ష కేంద్రాలు ఇవే.. మాస్టర్జీ డిగ్రీ అండ్ పీజీ కాలేజి, వరంగల్ పబ్లిక్ స్కూల్ , సేయింట్ పీటర్స్ పబ్లిక్ స్కూల్, చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ(హనుమకొండ) ఎస్ఆర్ ప్రైమ్ (వరంగల్), హనుమకొండ హంటర్రోడ్డులోని అల్లూరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంటు సైన్సెస్, గ్రీన్వుడ్ హైస్కూల్ (హసన్పర్తి), ఎస్వీఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ (భీమారం) ఉన్నాయి. పలు నిబంధనలు.. పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబోరు. విద్యార్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్ ప్రీస్కింగ్ ఉంటుంది. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. షూస్తో పాటు ఎలాంటి ఆభరణాలను ధరించకూడదు. విద్యార్థినులు ఆభరణాలతోపాటు మెహందీ కూడా పెట్టుకొని రాకూడదు. సంప్రదాయ దుస్తులు వేసుకొని రావాల్సింటుంది. ప్రతి పరీక్ష కేంద్రంలోను ఎన్టీఏ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. పరీక్ష కేంద్రంలో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లోనూ సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. అంతేగాకుండా ఎవరూ కూడా సెల్ఫోన్లు తీసుకుపోకూడదు. సెల్ఫోన్లు పనిచే యకుండా పరీక్షాకేంద్రాల్లో జామర్లను కూడా ఏర్పాటుచేశారు. మొత్తంగా ఎన్టీఏ పర్యవేక్షణలోనే నీట్ పరీక్ష పకడ్బందీగా జరగనుంది. పకడ్బందీగా ఏర్పాట్లు నీట్ పరీక్ష నిర్వహణకు ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలోని తొమ్మిది పరీక్ష కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. ఎన్టీఏ చేసింది. అభ్యర్థులు హాల్టికెట్తో పాటు ఏదైనా ఒక ఐడెంటిటీ ఫ్రూప్ వెంట తీసుకు రావాల్సి ఉంటుంది. ముందుగానే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 11:30గంటల నుంచే పరీక్ష కేంద్రాలకు అనుమతిస్తారు. నిర్దేశించిన సమయానికి నిమిషం ఆలస్యమైతే పరీక్ష కేంద్రాల్లోనికి అనుమతించబోరు. – సి.మంజులాదేవి, నీట్ ఉమ్మడి వరంగల్ జిల్లా సిటీ కోఆర్డినేటర్నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ పరీక్షకు హాజరుకానున్న 5,205 మంది విద్యార్థులు ఉమ్మడిజిల్లా కేంద్రంలో 9 పరీక్ష కేంద్రాలు ఉదయం 11:30గంటల నుంచే అనుమతి సీసీ కెమెరాల నిఘాలో పరీక్ష నిర్వహణ -
అద్భుతం.. ప్రాజెక్టు ఎక్స్పో
హసన్పర్తి : ఎక్స్పో ప్రాజెక్టు (ఎక్స్ పో–యంత్రం 2.0) అద్భుతమని ఏషియా యూనివర్సిటీ రిక్యూటింగ్ డాక్టర్ మహ్మద్ ఫహద్ అన్నారు. హసన్పర్తి మండలం అన్నాసాగరం శివారులోని ఎస్సార్ యూనివర్సిటీ తన రెండో వెర్షన్ ప్రాజెక్టు ఎక్స్ పో–యంత్రం 2.0ను శుక్రవారం ప్రదర్శించింది. ఈ కార్యక్రమానికి ఫహద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అనేక విషయాలను తెలుసుకునేందుకు ఇంటర్న్షిప్లు సరైన వేదిక అన్నారు. ఎస్సార్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ దీపక్గార్గ్ మాట్లాడుతూ.. ఔట్పుట్ సాంకేతికతను బదిలీ చేయడం తదితరాలకు ఎక్స్పో యంత్ర 2.0 ప్రారంభించామన్నారు. స్కూల్ ఆఫ్ బిజినెస్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ విద్యార్థులు తాము రూపొందించిన ప్రాజెక్టును ప్రదర్శించారు. ఈసందర్భంగా అతిథులను మెమొంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ అర్చనారెడ్డి, వివిధ విభాగాలకు చెందిన అధ్యాపకులు, యంత్ర సమన్వయ కర్తలు, ఆర్గనైజింగ్ బృంద సభ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఏిషియా యూనివర్సిటీ రిక్యూటింగ్ డాక్టర్ ఫహద్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement