-
చెప్పుతో కొడతా!
రాజమహేంద్రవరం రూరల్: ‘జోడిచ్చుకుని కొడతా’నంటూ ఓ మహిళపై రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి విరుచుకుపడ్డారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్ దుర్గాలమ్మ గుడి వీధిలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ డివిజన్లో తన పెద్ద కుమార్తె కంఠంనేని శిరీష, టీడీపీ శ్రేణులతో కలిసి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దుర్గాలమ్మ గుడి వీధిలో ప్రచారం చేస్తున్న సమయంలో పిల్లల నాగమణి అనే మహిళ ‘ఎన్నికలప్పుడే మీకు ప్రజలు గుర్తొస్తారా?’ అని మహిళ నిలదీసింది. ‘ఓయ్ అమ్మాయ్.. ఆగు’ అంటూ గోరంట్ల ఆమెను అడ్డుకోబోయారు.అయినా.. నాగమణి నిలదీయడం ఆపకపోవడంతో నిగ్రహం కోల్పోయిన గోరంట్ల ఒక్కసారిగా కోపోద్రిక్తుడై ‘జోడిచ్చుకుని కొడతాను’ అంటూ రెచ్చిపోయారు. దీంతో అక్కడున్న మహిళలంతా ఒక్కసారిగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడి నుంచి పార్టీ శ్రేణులతో కలసి బుచ్చయ్య వెనుతిరిగారు.ఓటమి భయంతోనే ఫ్రస్ట్రేషన్పదేళ్లుగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రజల సమస్యలు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజల నుంచి స్పందన కరువవుతోంది. దీంతో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులందరినీ తాను తిరిగే గ్రామం లేదా డివిజన్కు తీసుకుని వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు ప్రజల నుంచి స్పందన లేకపోగా.. ప్రచారంలో మహిళలు నిలదీస్తుండటంతో గోరంట్ల ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.అడుగడుగునా నిలదీతలేఅంతకు ముందు కూడా ఓ ఇంటివద్ద నలుగురు వ్యక్తులు.. ‘ఎన్నికల సమయంలోనే తమరికి ప్రజలు గుర్తొస్తారా’ అంటూ గోరంట్లను నిలదీశారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా పట్టించుకోలేనప్పుడు ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. దీంతో కోపోద్రిక్తుడైన గోరంట్ల.. తమకు ఓట్లు వెయ్యవద్దని నోరు పారేసుకున్నారు. అలాంటప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారని అక్కడి వారు అడగడంతో గోరంట్ల, ఆయన అనుచరుడు కురుకూరి కిషోర్ ప్రజలపై దౌర్జన్యానికి దిగారు. వారిని స్థానిక నేతలు, టీడీపీ నాయకులు పక్కకు తీసుకుని వెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. గోరంట్ల కుమార్తె శిరీష 27వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పుడు అక్కడి మహిళలు నిలదీయడంతో ఆమె అక్కడి నుంచి జారుకున్నారు. -
అవ్వాతాతలపాలిట యముడు చంద్రబాబు
తణుకు అర్బన్: అవ్వాతాతలపై చంద్రబాబు పగబట్టి వారి పట్ల యముడిలా ప్రవర్తిస్తున్నాడని రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. తణుకులో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు దుష్ట్రగహంలా దాపురించాడని, పేదలు, వృద్ధులు సుఖంగా ఉంటే చూడలేకపోతున్నాడని విమర్శించారు. గత ఐదేళ్లుగా వలంటీర్ వ్యవస్థ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటి గుమ్మంలోకే ఇచ్చిన పింఛన్ పంపిణీ విధానాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోయాడని, పరిపాలన ఎన్నికల అధికారి చేతుల్లోకి వెళ్లిన వెంటనే తన కుట్ర రాజకీయాన్ని బయటకు తీశాడని దుయ్యబట్టారు. తన హయాంలో ఎన్నికల అధికారి వేషంలో తొత్తుగా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ ద్వారా అవ్వాతాతలు, మహిళలపై యమపాశంలాంటి పిటిషన్ను వేసి ఇంటి గుమ్మంలోకి అందించే పింఛను విధానాన్ని అడ్డుకున్నాడని ఎద్దేవా చేశారు. ఎన్నికల కోడ్ అమలైన రోజు నుంచి తనలోని దుష్టచతురతను బయటకు తీసి పేదలను ఎలా ఇబ్బంది పెట్టాలా అని ఆలోచిస్తూ పదే పదే పిటిషన్లు వేస్తూ అవ్వాతాతల ఉసురు తీస్తున్నాడని అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రచార ఆర్భాటం కోసం గోదావరి పుష్కరాల్లో 39 మంది అమాయక ప్రజల్ని పొట్టనపెట్టుకున్నాడని, ఈ ఏడాది ఏప్రిల్లో పింఛను కోసం సచివాలయాలకు రప్పించి రాష్ట్రవ్యాప్తంగా 30 మందికి పైగా అవ్వాతాతలను బలితీసుకున్నాడని, ఈ నెలలో ఇంకెంత మందిని బలి తీసుకుంటాడోనని ఆందోళన వ్యక్తం చేశారు. మొదటి పిటిషన్తో పింఛనును సచివాలయాలకు వచ్చి తీసుకోవాలని ఆదేశాలు ఇప్పించాడని, రెండో పిటిషన్ ద్వారా పింఛను సొమ్మును బ్యాంకులకు జమచేసేలా సఫలీకృతుడై శునకానందం పొందుతున్నాడన్నారు. అవ్వాతాతలపై చంద్రబాబు చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారని, ఇంతకింత అనుభవించే రోజు తొందరలోనే ఉందని గుర్తుచేశారు. పింఛను సొమ్ము తీసుకుని మందులు, వెచ్చాలు కొనుక్కునే క్రమంలో బ్యాంకులకు వచ్చిన అవ్వాతాతలు తాము పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా చంద్రబాబుపై శాపనార్థాలు పెడుతున్నారని, వలంటీర్లు ఇస్తే నీ ఆస్తేమైనా కరిగిపోతుందా అంటూ నిప్పులు చెరుగుతున్నారని మంత్రి కారుమూరి స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో మంత్రి కారుమూరి మండిపాటు -
కనీవినీ ఎరుగని అభివృద్ధి
నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు రాష్ట్రంలో వినూత్న పాలనను సీఎం జగన్ మన ముందుకు తెచ్చారు. గతంలో దళారులు, అవినీతి, పక్షపాతం వల్ల పథకాలన్నీ కొందరు జేబుల్లోకే వెళ్లిన పరిస్థితి. కానీ ఈ ఐదేళ్లలో వలంటీర్, సచివాలయ వ్యవస్థల ద్వారా ప్రతి ఇంటికీ నేరుగా సంక్షేమ ఫలాలను పారదర్శకంగా అందించాం. నరసాపురం నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని అభివృద్ధి చేశాం. ఆర్టీసీ బస్టాండ్, వంద పడకల ఏరియా ఆస్పత్రి, కాటన్ పార్క్, ఆక్వావర్సిటీ తదితర ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్, వశిష్ట గోదావరిపై వంతెన పనులకు మోక్షం కలిగించాం. రానున్న ఐదేళ్లలో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తాం. ప్రజల జీవితాల్లో ఎంతో మార్పు ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాజకీయాలతో పాటు ప్రజల జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది. గతంలో ఎవరూ సీఎం జగన్లా ప్రజలకు సంక్షేమాన్ని అందించలేక పోయారు. గతంలో రాజకీయాలు అంటే ధనబలం ఉన్న వ్యక్తులకు మాత్రమే పరిమితం అయ్యేవి. తొలిసారి సీఎం జగన్ పాలనలో బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు వచ్చా యి. ఓసీలు మాత్రమే పోటీ చేసే నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ స్థానాన్ని మొదటిసారిగా బీసీలకు అవకాశం ఇచ్చిన జగనన్నకు కృతజ్ఞతలు. సామాన్యులకూ సీట్లు పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతం మేర అమలుచేశారు. నవరత్నాలతో పాటు నవరత్నాల ప్లస్ను మనమంతా అందుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎన్నడూ లేనివిధంగా అతి సామాన్యులకూ సీట్లు కేటాయించిన గొప్ప వ్యక్తి సీఎం జగన్. మనమంతా కష్టపడి పార్టీ కోసం పనిచేసి సీఎం జగన్ని మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను, ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకుని సీఎం జగన్కు బహుమతిగా ఇవ్వాలి. కూటమి మేనిఫెస్టో బూటకం ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ ప్రతిపక్ష పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో అంతా అబద్దాల పుట్ట. బడ్జెట్కు సరిపోల్చని, ఆచరణ సాధ్యం కాని హామీలను ఇస్తున్నారు. కానీ సీఎం జగన్ మాట ఇచ్చారంటే అమలుచేసి చూపిస్తారన్న విషయం అందరికీ తెలుసు. నరసాపురంలో బస్టాండ్ను అభివృద్ధి చేశారు, 100 పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చారు. కాపునేస్తం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించారు. ఇలా అన్నివర్గాలను అభివృద్ధిలోకి తీసుకువచ్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుంది. ● -
అభిమాన సంద్రం
తీరం పోటెత్తిందా.. గోదావరి ఉప్పొంగిందా అన్నట్టు నరసాపురం జన సునామీని తలపించింది.. జై జగన్.. జయహో జగన్ నినాదాలతో హోరెత్తింది.. తమ అభిమాన నేతను చూసేందుకు.. సంక్షేమ సారథికి మద్దతు ఇచ్చేందుకు ప్రజలు అశేషంగా తరలివచ్చారు.. మండుటెండలోనూ సీఎం జగన్ కోసం వేచి ఉన్నారు.. ఆయన ప్రసంగానికి ఆద్యంతం జయజయధ్వానాలు పలికారు. కూటమి నేతలను తిప్పికొడతామంటూ నినాదాలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం నరసాపురం స్టీమర్ రోడ్డులో నిర్వహించిన ప్రచార సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సాక్షి, భీమవరం: నరసాపురంలోని స్టీమర్ రోడ్డులో వైఎస్సార్సీపీ ఏర్పాటుచేసిన బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చారు. ఎటుచూసినా జన సమూహంతో పండగ వాతావరణం కనిపించింది. ఉదయం 10.30 గంటలకు సభ కాగా 8 గంటల నుంచే నరసాపురం, పరిసర నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేరుకోవడం కనిపించింది. చెంతకు వస్తున్న అభిమాన నేతను చూసేందుకు చిన్నాపెద్దా తేడాలేకుండా వృద్ధులు, మహిళలు, యువత, చిన్నారులు సభకు పోటెత్తారు. తీన్మార్ వాయిద్యాలు, మోటార్ సైకిల్ ర్యాలీలతో యువత హోరెత్తించారు. నిర్ణీత సమయానికి స్టీమర్ రోడ్డు లోని సభాప్రాంగణం అంతా జనంతో నిండిపోయింది. వెల్లువలా తరలివచ్చిన జనాన్ని కట్టడి చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మండుటెండనూ లెక్కచేయక.. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు ప్రతాపం చూపించడం ప్రారంభించాడు. ఉక్కపోతతో చెమటలు కారుతున్నా, ఎండ తీవ్రత తాళలేకున్నా అభిమాన నేత రాక కోసం ప్రజలు బారులుతీరి ఎదురుచూశారు. గంటన్నర పాటు సీఎం జగన్ రాక ఆలస్యమైనా అంతటి మండుటెండలోనూ చెక్కుచెదరకుండా వేచి ఉండటం విశేషం. వైఎస్సార్సీపీ గీతాలకు జెండాలు ఊపుతూ యువత నృత్యాలు చేస్తూ అందరిలో ఉత్సాహం నింపారు. ప్రచార రథం పక్కనే ఆస్పత్రి భవనం వద్ద ప్రచార గీతాలకు లయబద్ధంగా యువతి చేసిన నృత్యం చూసి పార్టీ నేతలు అభివాదం చేస్తూ అభినందించారు. ఉదయం 11.40 గంటల సమయంలో సభా ప్రాంగణం మీదుగా టేలర్ హైస్కూల్ గ్రౌండ్లోని హెలీప్యాడ్కు చేరుకుంటున్న సీఎం జగన్ హెలికాప్టర్ను చూసి చేతులు ఊపుతూ ప్రజలు స్వాగతం పలికారు. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పార్టీ శ్రేణుల ద్వారా సభలోని వారికి విరామం లేకుండా మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లు అందించారు. ఉదయం 11.55 గంటల సమయంలో సీఎం జగన్ కాన్వాయ్లో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. పార్టీ శ్రేణులు, యువకులు కాన్వాయ్ వెంట ర్యాలీగా వచ్చారు. సభలోని వారికి బస్సులోంచి చేతులు ఊపుతూ సీఎం జగన్ సభాస్థలిలోని ప్రచారం రథంపైకి చేరుకున్నారు. అలసటను దూరం చేసిన ఆప్యాయత ‘నరసాపురం సిద్ధమా?.. సమయం 12.15 మిట్ట మధ్యాహ్నం. ఇంతటి ఎండలో ఏమాత్రం కూడా ఎండను ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతలు పంచుతున్న నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ.. మీ అందరి ఆప్యాయతలకు మీ బిడ్డ, మీ జగన్ రెండు చేతులు జోడించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు..’ అంటూ ప్రసంగం ప్రారంభంలో సీఎం జగన్ చెప్పిన మాటలు అప్పటివరకు ప్రజలు పడిన అలసటను దూరం చేశాయి. సీఎం జగన్ ప్రసంగంతో నయా జోష్ దాదాపు అరగంట పాటు సాగిన సీఎం జగన్ ప్రసంగం ఆద్యంతం ప్రజల్లో ఉత్సాహం నింపింది. జై జగన్.. సీఎం.. సీఎం అంటూ సభా ప్రాంగణమంతా నినాదాలతో హోరెత్తింది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని ఈ పెద్దమనిషి అంటుంటాడు, ఆ యన పాలనలో ఏనాడైనా ఇన్ని స్కీములు ఇచ్చా డా? ఇప్పటి మాదిరిగా ఏనాడైనా అవ్వాతాతలకు ఇంటింటికీ పింఛన్ ఇచ్చాడా? రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? ఈ పెద్దమనిషి చంద్రబాబు పేరు చెబితే పేదలకు చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా? అంటూ ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నలకు లేదూ.. లేదూ.. అంటూ రెండు చేతులు ఊపుతూ ప్రజలు మద్దతు తెలిపారు. ఈ ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో తెచ్చిన పథకాలు గురించి వివరిస్తున్నప్పుడు అవునూ.. అవునూ.. అంటూ ప్రజలు పెద్దఎత్తున మద్దతు పలికారు. జయజయధ్వానాలు సీఎం జగన్కు ప్రజలు బ్రహ్మరథం మండుటెండనూ లెక్కచేయని వైనం స్టీమర్ రోడ్డులో సభకు పోటెత్తిన జనం కూటమిని తిప్పికొడతామంటూ మద్దతు -
తొలిరోజు 213 మంది ఓటేశారు
భీమవరం(పకాశం చౌక్): దేశంలోనే తొలిసారిగా ఇంటి వద్దే ఓటు వేసే అవకాశాన్ని కల్పించిన క్రమంలో జిల్లాలో తొలిరోజు శుక్రవారం 213 మంది హోం ఓటింగ్ ప్రక్రియలో భాగంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 85 సంవత్సరాలు పైబడిన వారు, 40 శాతం కన్నా ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ఎన్నికల కమిషన్ హోమ్ ఓటింగ్ సౌకర్యాన్ని కల్పించింది. దీంతో జిల్లాలో 85 ఏళ్లు దాటిన వారు, దివ్యాంగులు కొందరు ఇంటి వద్దే ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 8 తేదీ వరకు ఇంటి వద్దే ఓటింగ్ వేసే అవకాశం దక్కింది. హోమ్ ఓటింగ్కు సంబంధించి పోలింగ్ అధికారి, సహాయ పోలింగ్ అధికారి, సూక్ష్మ పరిశీలకుడు, వీడియోగ్రాఫర్, ఆర్మీ కానిస్టేబుల్ సమక్షంలో పగడ్బందీగా ఓటింగ్ పక్రియ నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పోలింగ్ కంపార్ట్మెంట్ల్లో ఓటును వేయించి సీల్డు కవర్లో అధికారుల సమక్షంలోనే సీల్డ్ డ్రమ్ములో భద్రపరుస్తున్నారు. జిల్లాలో 85 ఏళ్లు దాటిన వారు 7,050 మంది ఉండగా వారిలో 562 మంది హోమ్ ఓటింగ్కు దరఖాస్తు చేసుకోగా, వీరిలో తొలిరోజు 98 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే జిల్లాలో దివ్యాంగులు 18,807 మంది ఉండగా, వీరిలో 591 మంది హోమ్ ఓటింగ్కు ధరఖాస్తు చేసుకున్నారు. వారిలో మొదటి రోజు 115 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వృద్ధులు, దివ్యాంగుల్లో హర్షం ఎన్నికల కమిషన్ మొటమొదటిగా ఇంటి వద్దే ఓటింగ్ వేసుకునే సౌకర్యాన్ని కల్పించడంపై 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కదల్లేని స్థితిలో ఉన్న వృద్ధులకు, పోలింగ్ బూత్లకు వెళ్లడానికి ఇబ్బందులు పడే దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ సౌకర్యం బాగుందని అంటున్నారు. పోలింగ్ విధానంలో ఇలాంటి మార్పులు రావడం మంచి పరిణామం అంటున్నారు. దీని వల్ల ఓటు వేయడానికి పడే ఇబ్బందులు తొలగాయని చెబుతున్నారు. గందరగోళంగా కూటమి న్యాయవాదుల ఆత్మీయ సమావేశం భీమవరం: ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో శుక్రవారం నిర్వహించిన కూటమి న్యాయవాదుల ఆత్మీయ సమావేశం గందరగోళంగా మారింది. సమావేశానికి బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ గైర్హాజరు కాగా, జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావును వేదికపైకి పిలవకపోవడం గమనార్హం. అతిథిగా హాజరైన టీడీపీ ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు న్యాయవాదులను అగ్రహానికి గురిచేశాయి. చాలా మంది న్యాయవాదులు ప్రాక్టీసు చేయరని రెగ్యులర్గా కోర్టులకు హాజరుకారని, తాను మాత్రం కోర్టు పక్షినని, వివిధ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతూ పెద్దమొత్తంలో ఖర్చుచేశానని చెప్పడం గమనార్హం. ఓట్లు కోసం వచ్చి తమకు ఓట్లు వేయాలని అడగడం గాకుండా న్యాయవాదులను కించపర్చే విధంగా మాట్లాడడం ఏమిటని, ఇటువంటివారికి ఓట్లు ఎలా వేయాలంటూ గుసగుసలు విన్పించాయి. 8వ తేదీ వరకు కొనసాగనున్న హోం ఓటింగ్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement