-
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
నారాయణపేట: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ కోయశ్రీహర్ష.. ప్రి సెడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎరగ్రుట్ట సాంఘిక సంక్షేమ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రంలోని నారాయణపేట, మక్తల్ అసెంబ్లీ సెగ్మెంట్ల పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ రిజిస్ట్రేషన్, ఓటర్స్ రిజిస్ట్రేషన్ రిజిస్టర్లను, ఓటింగ్ సరళిని కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. శుక్రవారం నుంచి 8వ తేది వరకు నిర్వహించే పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఉద్యోగులందరూ వినియోగించుకోవాలని సూచించారు. పాఠశాలలో మొదటి అంతస్తులో నారాయణపేట నియోజకవర్గానికి సంబంధించిన రెండు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ బూత్లు, రెండవ అంతస్తులో మక్తల్ నియోజకవర్గానికి సంబంధించిన నాలుగు పోలింగ్ బూత్లను పరిశీలించారు. సెంటర్ లోపలికి సెల్ ఫోన్లను అనుమతించరాదని ఆదేశించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోని ఓ గదిలో ఏర్పాటు చేయనున్న పోస్టల్ బ్యాలెట్ల స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించారు. గది బయట, లోపల సీసీ కెమెరాలను అమర్చాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్తోపాటు జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, ఉట్కూర్, ధన్వాడ, మరికల్ తహసిల్దార్లు ఉన్నారు. -
రాహుల్గాంధీ సభను విజయవంతం చేయండి
ఎర్రవల్లిచౌరస్తా: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 5న జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో చేపట్టే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంతి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఎర్రవల్లి మండల కేంద్రంలోని రాజీవ్గాంధీ సభా ప్రాంగణంలో ఏర్పాట్లను జెడ్పీచైర్పర్సన్ సరితతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ బహిరంగ సభకు కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతారని అన్నారు. కేంద్రంలో అధికారం చేపట్టాక దేశంలో చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు ఐదు గ్యారంటీలను గురించి రాహుల్ గాంధీ ప్రకటిస్తారన్నారు. అదేవిధంగా ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగెరస్ ప్రభుత్వం చేపట్టే వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను గురించి సీఎం ప్రజలకు సభ ద్వారా వివరిస్తారని అన్నారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిదిలోని గద్వాల, అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో జనసమీకరణ చేసి బహిరంగ సభను జయప్రదం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా, అలంపూర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దీపక్ ప్రజ్ఞా, జోగుల రవి, మండల అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, నాయకులు తిరుపతయ్య, ఎల్కూరు శ్రీను, జయచంద్రారెడ్డి, మానిక్యారెడ్డి, మద్దిలేటి, ఇలియాస్, తదితరులు పాల్గొన్నారు. -
మహిళలే నిరే్ణతలు
రెండు లోక్సభ స్థానాల్లో మగువల ఓట్లే అధికం మహబూబ్నగర్ డెస్క్: వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపోటములకు మహిళా ఓట్లే కీలకంగా మారాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్న నేపథ్యంలో ఎంపీ అభ్యర్థుల గెలుపును శాసించేది వీరే. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తాజా ఓటర్ల జాబితా ప్రకారం మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో 16,82,470 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 50.53 శాతంతో 8,50,172 మంది మహిళా ఓటర్లే ఉన్నారు. ఇక్కడ పురుషుల కంటే 17,916 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. నాగర్కర్నూల్ లోక్సభ స్థానంలో 17,38,254 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో కూడా 50.24 శాతంతో 8,73,340 మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ పురుషుల కంటే 8,465 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. నాగర్కర్నూల్ లోక్సభ పరిధిలోని కొల్లాపూర్, కల్వకుర్తి సెగ్మెంట్ల పరిధిలో మినహా ఉమ్మడి జిల్లాలోని మిగిలిన 12 సెగ్మెంట్లలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు తేలింది. ప్రధాన పార్టీ అభ్యర్థుల ప్రత్యేక దృష్టి ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లోనూ గత శాసనసభ ఎన్నికల మాదిరిగానే ఓటింగ్లో మహిళలు అధికంగా పాల్గొంటే పోలింగ్ శాతం భారీగా పెరుగుతుంది. దీంతో అభ్యర్థుల గెలుపోటమును వీరే ప్రభావితం చేయనున్నారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంపై దృష్టి సారించారు. ఇందుకోసం ఆయా పార్టీల నేతలను ప్రత్యేక ప్రణాళికతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. దీనితో పాటు మహాలక్ష్మి పథకంలో భాగంగా రాబోయే రోజుల్లో ప్రతి నెల రూ.2,500, రూ.500కే గ్యాస్ సిలిండర్.. తదితర వాటిని కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక బీజేపీ ఆత్మ నిర్భన్నారీ శక్తిపై ప్రత్యేక దృష్టి సారించింది. సుకన్య సమృద్ధి యోజన, ముద్ర యోజన, లఖ్పతి దీదీ, స్టాండ్ ఆఫ్ ఇండియా, మిషన్ శక్తి యోజన.. తదితర కార్యక్రమాలను మహిళలకు వివరిస్తున్నారు. ఇంటింటికి తిరిగి మహిళా మోర్చా కార్యకర్తలు వీటిపై ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ సైతం... పదేళ్లలో మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, పింఛన్లు, కేసీఆర్ కిట్లు అందించిన విషయాన్ని గడపగడపకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. మహబూబ్నగర్లో 50.53,నాగర్కర్నూల్లో 50.24శాతం మహిళా ఓటర్లు అభ్యర్థుల జాతకాలు తేల్చేది వీరే.. వారిని ప్రసన్నం చేసుకోవడానికిప్రయత్నిస్తున్న నేతలు -
సై.. అంటే సై!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: లోక్సభ ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. ఇంకా వారం రోజుల్లో ప్రచార పర్వం ముగియనుంది. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ సొంత ఇలాకా కావడంతో పార్టీ అధిష్టానం పాలమూరుపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. రెండింటిలోనూ విజయకేతనం ఎగురవేసి సత్తా చాటాలని బీజేపీ.. సిట్టింగ్ స్థానాలను తిరిగి దక్కించుకుని, పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ కదనరంగంలో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ప్రచార గడువు దగ్గరపడుతుండడంతో ఆయా పార్టీ ల అభ్యర్థులకు మద్దగా అగ్రనేతలు రంగంలోకి దింపుతున్నారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ పార్లమెంట్ల పరిధిలో జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు రోడ్షోలు, బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారం మరింత హోరెత్తనుంది. కీలక దశకు లోక్సభ ఎన్నికల పోరు ప్రచారానికి మిగిలిందిఇంకా వారం రోజులే.. 2 స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల వ్యూహాలు నేడు కొత్తకోటలో కాంగ్రెస్ కార్నర్మీటింగ్.. సీఎం రేవంత్ రాక రేపు ఎర్రవల్లి చౌరస్తాలో సభ..హాజరుకానున్న రాహుల్ గాంధీ 10న నారాయణపేటకు ప్రధాని మోదీ.. త్వరలో అమిత్షా.. -
మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం....
నియోజకవర్గం మహిళలు మొత్తం ఓటర్లు శాతం మహబూబ్నగర్ 1,30,863 2,59,260 50.47 జడ్చర్ల 1,11,779 2,22,838 50.16 దేవరకద్ర 1,21,130 2,39,745 50.52 నారాయణపేట 1,19,682 2,36,182 50.67 మక్తల్ 1,24,363 2,44,173 50.93 కొడంగల్ 1,22,933 2,41,794 50.84 షాద్నగర్ 1,19,422 2,38,478 50.07 నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం.. నియోజకవర్గం మహిళలు మొత్తం ఓటర్లు శాతం నాగర్కర్నూల్ 1,18,603 2,36,094 50.23 అచ్చంపేట (ఎస్సీ) 1,24,598 2,47,729 50.29 కొల్లాపూర్ 1,18,541 2,39,463 49.50 వనపర్తి 1,37,984 2,73,863 50.38 గద్వాల 1,30,982 2,56,637 51.03 అలంపూర్ (ఎస్సీ) 1,21,662 2,40,063 50.67 కల్వకుర్తి 1,20,970 2,44,405 49.49
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
తప్పక చదవండి
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement