-
నిట్లో ‘సమ్మర్ ఇంటర్న్షిప్’
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లో నెలరోజుల సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం మంగళవారం ప్రారంభమైంది. హైదరాబాద్ డీఆర్డీఓ డైరెక్టర్, జీ టెక్నాలజీ సైంటిస్ట్ డాక్టర్ జి.మల్లికార్జున్రావు ముఖ్య అతిథిగా హాజరై ఇంటర్న్షిప్ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. డిఫెన్స్ రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ముఖ్య భూమిక పోషిస్తుందని, ఆర్టిఫీషియల్ రంగంలో రాణించేందుకు ఇంటర్న్షిప్ వేదికగా నిలవాలని అన్నారు. కార్యక్రమంలో నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుది, ప్రోగ్రాం కోఆర్డినేటర్ కిశోర్కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈసెట్లో వరంగల్ పాలిటెక్నిక్కు ర్యాంకులురామన్నపేట : ఈసెట్ –2024లో వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ తెలిపారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ఎన్.దీక్షిత్ (3వ ర్యాంకు), పి.వివేక్ (4వ ర్యాంకు), బి.హేమశ్రీ (9వ ర్యాంకు), పి.నాగసాయి యశ్వంత్ (19వ ర్యాంకు) సాధించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఎం.నవ్యశ్రీ (1వ ర్యాంకు), వి.వైష్ణవ్ (2వ ర్యాంకు), వి.అర్షిత (5 ర్యాంకు), కె.హర్షిత (6వ ర్యాంకు), పి.హారిక (7వ ర్యాంకు) ఎండీ సోహైల్ (11వ ర్యాంకు) సాధించారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో టి.శ్రీవాత్సవ్ (2వ ర్యాంకు), ఎం.కౌశిక్కుమార్ (4వ ర్యాంకు), మెకానికల్ ఇంజనీరింగ్లో చందు (2వ ర్యాంకు), కె.అఖిల్ (6వ ర్యాంకు), బి.నిఖిల్ (10వ ర్యాంకు), ఓ.గౌతమ్ (12వ ర్యాంకు) సాధించినట్లు పేర్కొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న పుల్లెల గోపిచంద్హన్మకొండ కల్చరల్ : భద్రకాళి అమ్మవారిని మంగళవారం బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు వారిని ఆలయమర్యాదలతో స్వాగతించారు. అమ్మవారికి పూజలు నిర్వహించుకున్న అనంతరం గోపిచంద్ కుటుంబానికి అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. నిబంధనలు పాటించాలిరామన్నపేట : ఎమ్మెల్సీ ఉపఎన్నిక నిర్వహణ లో ఈసీ నిబంధనలు పాటించాలని జిల్లా పశువైద్యాధికారి, ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి బాలకృష్ణ అన్నారు. ఎల్బీ కళాశాలలో పీఓలు, ఏపీఓలు, ఓపీఓలకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని ఆయన మంగళవారం పరిశీలించి మాట్లాడారు. మాస్టర్ ట్రైనర్లు కట్ల శ్రీనివాస్, ఎం.పట్టాభి, ఏవీఆర్ ఆచార్యులు, శ్రావణ్కుమార్, నాగేశ్వర్రావు పాల్గొన్నారు. ఫెసిలిటేషన్ కేంద్రం ప్రారంభం.. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎల్బీ కళాశాలలో ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు బాలకృష్ణ తెలిపారు. నీటి వనరులను కాపాడుతాం వరంగల్ అర్బన్ : హైదరాబాద్లోని తాజ్కృష్ణ హోటల్లో మంగళవారం మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో ‘లేక్ ప్రొటెక్షన్ అండ్ రెజువినేషన్ ఇన్ అర్బన్ ఏరియాస్’ అంశంపై సీడీఎంఏ వర్క్షాపు నిర్వహించింది. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్వినితానాజీ వాకడే పాల్గొని మాట్లాడుతూ వరంగల్ మహా నగర పరిధిలో ఉన్న నీటి వనరులను (సరస్సులు) కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు అమలు చేస్తామని పేర్కొన్నారు. అనంతరం సీడీఎంఏ కమిషనర్కు జ్ఞాపికను అందజేశారు. ఎంజీఎంలో అంధకారంనాలుగు గంటల పాటు నిలిచిన విద్యుత్.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రోగులు ఎంజీఎం : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సాయంత్రం నాలుగు గంటలనుంచి రాత్రి 7 గంటల వరకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేసవి కావడంతో వేడి, ఉక్కపోత, దీనికితోడు విద్యుత్ సరఫరా లేకపోవడంతో వార్డులో ఉండలేక రోగులు నరకయాతన పడ్డారు. రాత్రి 8 గంటలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు. -
కేయూ ఇన్చార్జ్ వీసీగా వాకాటి కరుణ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఇన్చార్జ్ వీసీగా ఐఏఎస్ అధికారిణి వాకాటి కరుణను నియమించారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేశ్ పదవీకాలం మంగళవారంతో ముగిసింది. కొత్త వీసీ నియామకానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఇన్చార్జ్ వీసీగా కరుణను నియమించారు. ప్రస్తుతం ఆమె మహిళా శిశు దివ్యాంగుల, సినియర్ సిటిజన్ శాఖ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు జాయింట్ కలెక్టర్గా మూడున్నరేళ్లు పనిచేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక 2015–2016లో వరంగల్ అర్బన్ కలెక్టర్గా పనిచేశారు. భూముల అన్యాక్రాంతంపై అప్పట్లోనే దృష్టి కలెక్టర్గా వాకాటి కరుణ ఉన్న సమయంలో కాకతీయ యూనివర్సిటీలో భూముల అన్యాక్రాంతంపై దృష్టి సారించారు. పలుచోట్ల వర్సిటీ భూములకు సంబంధించిన హద్దుల వద్ద బోర్డులు పెట్టించారు. ఇప్పుడు ఇన్చార్జ్ వీసీగా రానుండడంతో భూముల ఆక్రమణలకు సంబంధించిన వ్యవహారంపై మళ్లీ దృష్టి సారిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. కొంతకాలం క్రితమే ల్యాండ్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి అందులో ఏముందో బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నేడు బాధ్యతల స్వీకరణ? కాకతీయ యూనివర్సిటీ ఇన్చార్జ్ వీసీగా వాకాటి కరుణ బుధవారం బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం. వీసీ తాటికొండ రమేశ్ పదవీకాలం ముగిసింది. ఆమెకు చార్జ్ అప్పగించాల్సి ఉంటుంది. ఇందుకు ఆయన హైదరాబాద్కు వెళ్తారా లేక చార్జ్ ఇచ్చినట్లు లెటర్పై సంతకం చేసి ఇస్తారా అనేది వేచి చూడాలి. ఒకవేళ చార్జ్ ఇచ్చే విధంగా లెటర్పై సంతకం రమేశ్ చేసిస్తే రిజిస్ట్రార్ పి.మల్లారెడ్డి తీసుకెళ్లి ఆమెకు అందించనున్నారు. ఈ మేరకు మల్లారెడ్డి మంగళవారం రాత్రి వీసీ రమేశ్తో మాట్లాడేందుకు వెళ్లినట్లు తెలిసింది. నేడు బాధ్యతల స్వీకరణ -
వామ్మో.. ఇదేం కంపు!
హన్మకొండ: ఆర్టీసీ, వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు నిర్లక్ష్యం, పట్టింపులేని తనంతో ఆర్టీసీ హనుమకొండ జిల్లా బస్స్టేషన్ కంపుకొడుతోంది. డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా తయారై మలమూత్ర వ్యర్థాలు నేరుగా బస్స్టేషన్ పరిసరాల్లోకి చేరడంతో పరిసరాలు దుర్గంధభరితమయ్యాయి. బస్స్టేషన్ మూత్ర శాలలు, మరుగుదొడ్ల నుంచి సెప్టిక్ ట్యాంక్లోకి చేరే వ్యర్థాలు బయటకు లీకు కావడంతోపాటు నేరుగా రోడ్డు పక్కన ఉన్న డ్రెయినేజీలోకి వెళ్లకపోవడంతోనే ఈ సమస్య తలెత్తుతోందని అంటున్నారు. బస్స్టేషన్లోకి వచ్చేదారిలో వ్యర్థనీరు అర ఫీట్ ఎత్తు మేరకు నిల్వ ఉంటోంది. దీంతో దారి మొత్తం మూసుకుపోయింది. ఆ దారిలో ఉండే దుకాణాలు పూర్తిగా మూతపడ్డాయి. కంపు భరించలేక ప్రయాణికులు ముక్కుకు చేతిరుమాలు అడ్డుపెట్టుకుంటున్నారు. రెండు రోజులుగా ఈ పరిస్థితి నెలకొన్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆటోవాలాలు, దుకాణాదారులు, ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ, వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు స్పందించి వ్యర్థనీరు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. హనుమకొండ బస్స్టేషన్కు వెళ్లే దారిలో మలమూత్ర వ్యర్థాలు సెప్టిక్ ట్యాంక్ నుంచి నేరుగా దారిలోకి వ్యర్థనీరు ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు -
ఆదర్శ పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలి
సమీక్షలో వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య కాళోజీ సెంటర్: అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు జూన్ 10నాటికి వంద శాతం పూర్తి కావాలని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య.. అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనుల ప్రగతి, మంచినీటి సరఫరా, విద్యార్థుల యూనిఫాం తయారీ అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించి, పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎంపికైన 464 అమ్మ ఆదర్శ పాఠశాలల్లో ఇప్పటివరకు 345 పాఠఽశాలల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మిగిలిన వాటిలో తక్షణమే మొదలుపెట్టి వచ్చే జూన్ 10నాటికి పూర్తయ్యేలా మండల ప్రత్యేక అధికారులు చొరవ చూపాలన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఇంకా మిగిలి ఉన్న రూ.25వేల లోపు చిన్న పనులైన మరమ్మతులు, టాయిలెట్లు, విద్యుత్ సరఫరా, బ్లాక్ బోర్డు, వెంటనే పూర్తి చేయాలన్నారు. యూనిఫాం తయారీ త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ జిల్లాలోని మండలాల వారీగా తాగునీటి సరఫరాపై అధికారులతో సమీక్షించారు. డీఈఓ వాసంతి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, డీపీఓ కల్పన, నీటిపారుదల ఈఈ వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. -
రేవంత్, తీన్మార్ మల్లన్న బ్రోకర్లు
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుహన్మకొండ: సీఎం రేంవత్రెడ్డి, తీన్మార్ మల్లన్న బ్రోకర్లు, చీటర్లు అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు అయిపోగానే సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లిస్తామని సీఎం మెలికపెట్టారని దుయ్యబట్టారు. ఎక్కువ ధర వస్తుండడంతో రైతులు బయటి మార్కెట్లోనే ధాన్యం అమ్ముకుంటున్నారని తెలిపారు. రేవంత్రెడ్డి ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని, 5 నెలలుగా కల్యాణలక్ష్మి చెల్లింపులు నిలిచిపోయాయని తెలిపారు. బకాయిలు చెల్లించకపోవడంతో ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు స్తంభించాయని తూర్పారబట్టారు. కేసీఆర్ ఇచ్చిన 30 వేల ఉద్యోగాలకు నియామకపత్రాలు అందించి తానేదో గొప్ప కార్యం చేసినట్లు చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను ఓడించాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న యూ ట్యూబ్ చానల్ ద్వారా రూ.కోట్లు సంపాదించాడని ఆరోపించారు. బ్లాక్మెయిల్, బెదిరించడంతో ఆయనపై 56 కేసులు నమోదయ్యాయని గుర్తుచేశారు. మండలికి ఫైటర్ ఏనుగుల రాకేశ్రెడ్డిని పంపిస్తే ప్రజలు, పట్టభద్రుల సమస్యలపై పోరాడుతారన్నారు. నేడు కేటీఆర్ రాక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం వరంగల్, హనుమకొండ జిల్లాలో పర్యటిస్తారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటలకు నర్సంపేటలోని పద్మశాలి ఫంక్షన్హాల్లో జరిగే పట్టభద్రుల సమావేశంలో, మధ్యాహ్నం 3 గంటలకు వరంగల్ నాని గార్డెన్స్లో జరిగే వరంగల్ తూర్పు నియోజకవర్గ పట్టభద్రుల సమావేశంలో, సాయంత్రం 4 గంటలకు హనుమకొండ హంటర్రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్స్లో జరిగే పశ్చిమ నియోజకవర్గ పట్టభద్రుల సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. సమావేశంలో దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, వొడితల సతీశ్కుమార్, రసమయి బాలకిషన్, నాయకులు రవీందర్ సింగ్, జెడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, జోరిక రమేష్, బి.వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
మండలిలో సమస్యలపై ప్రశ్నించేది బీజేపీనే
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాశిబుగ్గ/హన్మకొండ/ఖిలావరంగల్/వరంగల్ : శాసనమండలిలో సమస్యలు ప్రశ్నించేది ఒక్క భారతీయ జనతా పార్టీనేనని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం ఓ సిటీ, హరిత కాకతీయ హోటల్, వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో, రంగశాయిపేటలోని లిటిల్ఫ్లవర్ హైస్కూల్లో, కొత్తవాడ పద్మశాలి భవన్లో వేర్వేరుగా జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రచారంలో భాగంగా అనేక వర్గాలను కలుస్తున్నానని, ఆసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించామని, కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ మోదీనే ప్రధాన మంత్రి కావాలని ఓటు వేశామని తెలుపుతున్నారన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లోనూ సమస్యలు ప్రశ్నించే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డిని గెలిపిస్తామని చెప్పారన్నారు. ప్రజల భిక్షతోనే సీఎం పదవి వచ్చిందని రేవంత్రెడ్డి మరచిపోవద్దని, అదిమరిచి బెదిరింపులకు పాల్పడితే కాలగర్భంలో కలిసిపోతావని హెచ్చరించారు. ‘ఆఫ్ట్రాల్ నువ్వెంత... నీ బతుకెంత... ప్రజలు భిక్ష పెడితే ఈ పదవి వచ్చింది.. ఈ విషయం మరిచిపోద్దు... ప్రజలు దెబ్బ కొడితే మళ్లీ లేవరు... కేసీఆర్ లేస్తున్నాడా’ అంటూ సీఎం రేవంత్ వైఖరిపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయించాలని స్థానిక కాలేజీల యాజమాన్యాలను బెదిరిస్తున్నారంటా... ఏమి చేస్తారు..? కాలేజీలను మూసి వేయించగలుగుతారా అని ప్రశ్నించారు. ఆధికారంలోకి వస్తే రూ. 4 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ఆర్టీసీ కార్మికులు తమను పర్మినెంట్ చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పిన్రు అని ఇంతవరకు అది కాలేదన్నారు. వరంగల్ బిడ్డ అయినా గుజ్జుల ప్రేమేందర్రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు రావు పద్మ, గంట రవి, నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు, అరూరి రమేశ్, వి.మురళీధర్ గౌడ్, డా క్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి, డాక్టర్ కాళీ ప్రసాద్, ఎడ్ల అశోక్రెడ్డి, జనార్దన్రెడ్డి, జ్యోతిరెడ్డి, సముద్రాల పరమేశ్వర్, కందిమళ్ల మహేశ్, మార్టిన్ లూథర్, శేర్ల అనిల్కుమార్, కందిమళ్ల మహేశ్, నరేశ్, కర్నె రవీందర్, కర్నె వాసుదేవ్, అర్జున్గౌడ్, అల్లం నాగరాజు, కుసుమ సతీష్, పి.శ్రీనివాస్, సినీహీరో అభినవ్ సర్ధార్, పట్టభద్రులు పాల్గొన్నారు. -
కోణార్క్ ఎక్స్ప్రెస్లో 14 కిలోల గంజాయి పట్టివేత
కాశిబుగ్గ: భువనేశ్వర్ నుంచి ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్కు వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో తరలిస్తున్న 14.254 కిలోల గంజాయిని సోమవారం రాత్రి పట్టుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. జీఆర్పీ ఎస్సై ఐలయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా గంజామ్ బరంపూర్కు చెందిన టికిన దాస్(37), బికి బెహరా(26)లు బరంపూర్ నుంచి దాదర్కు గంజాయిని కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో రవాణా చేస్తుండగా ఆర్పీఎఫ్, జీఆర్పీ, సీపీడీఎస్ సిబ్బంది సంయుక్తంగా మహబూబాబాద్, వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్యలో తనిఖీలు చేపట్టారు. జనరల్ బోగీలో అనుమానాస్పదంగా సీట్ల కింద హ్యాండ్ బాగులతో ఇద్దరు కనిపించారు. వారిని వరంగల్ రైల్వేస్టేషన్ ప్లాట్ఫాం 2లో దించి బ్యాగులను తనిఖీలు చేయగా ఎండు గంజాయి లభించింది. వాటిని స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్పీఎఫ్ ఏఎస్ఐ ఎం.వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు పంపించామని ఎస్సై తెలిపారు. గంజాయి విలువ రూ.3,56,350 ఉంటుందని ఎస్సై తెలిపారు. -
శోభాయమానంగా పుష్పయాగం
ముగిసిన భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు హన్మకొండ కల్చరల్ : వరంగల్ శ్రీభద్రకాళి ఆలయంలో పదకొండు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీభద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు సోమవారం ముగిశాయి. ఉదయం నిత్యాహ్నికం, చతుఃస్థానార్చన, గణపతిపూజ, చండీహవనము తదితర పూజలు నిర్వహించారు. అమ్మవారి భోగబేరానికి అభిషేకాలు చేశారు. అనంతరం యాగ పూర్ణాహుతి, బలిహరణ, ధ్వజావరోహణ గావించారు. పూజా కార్యక్రమాలకు ఉమ్మడి వరంగల్, గ్రేటర్ వరంగల్ పద్మశాలిసంఘం వారు ఉభయదాతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, గుండు ప్రభాకర్, మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, జిల్లా అధ్యక్షుడు ఆడెపు రవీందర్, గోరంట్ల రాజు, పడ్నాల రవీందర్, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, శామంతుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు భద్రకాళీ తటాకంలో చక్రతీర్థోత్సవ తంతు నిర్వహించారు. తిరిగి చక్రాన్ని అమ్మవారి సన్నిధికి చేర్చారు. రాత్రి స్నపనమందిరంలో పూలతో అలంకరించిన వేదికపై శ్రీభద్రకాళి భద్రేశ్వరుల ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి వేదపండితులు రంగురంగుల పూలతో పుష్పయాగం నిర్వహించారు. పుష్పయాగం వల్ల బ్రహ్మోత్సవాల్లో తెలిసితెలియక జరిగిన దోషాలు నివృత్తి అవుతాయని భద్రకాళి శేషు తెలిపారు. -
ఎంటీపీ చట్టంపై అవగాహన కల్పించాలి
● డీఎంహెచ్ఓ సాంబశివరావు ఎంజీఎం : లింగ నిర్ధారణ, బాలికలపై వివక్ష, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టాలపై ప్రభుత్వ విభాగాలు, ఆయా స్వచ్ఛంద సంస్థ ల బాధ్యులు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని హనుమకొండ డీఎంహెచ్ఓ బి.సాంబశివరావు తెలిపారు. సోమవారం స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలో గర్భస్థ పూర్వ, పిండ లింగ నిర్ధారణ చట్టంపై జిల్లాస్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ గర్భిణులు పరీక్షల నిమిత్తం, లింగ నిర్ధారణ, అబార్షన్ కోసం అర్హత లేని వైద్యుల వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. జిల్లాలో గుర్తింపు, అర్హత లేని వ్యక్తులు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినా, ఎంటీపీ కిట్స్ ద్వారా అబార్షన్కు ప్రయత్నించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టం ఉల్లంఘించే వారి వివరాలు 104, 1098, డయల్ 100కి తెలియజేయాలన్నారు. అడ్వైజరీ కమిటీ సభ్యులు బాలి కల నిష్పత్తి తక్కువగా ఉన్న మండలాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి క్షేత్రస్థాయి సిబ్బందితో తరుచూ సమీ క్ష నిర్వహించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ ఎండీ యాకూబ్ పాషా, గైనకాలజిస్ట్లు ఉషారాణి, నిరంజని దేవి, పిడియా ట్రిస్ట్ మానస, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు శ్రీకాంత్, కవిరాజ్, ప్రసన్నకుమార్, మాధవరెడ్డి, సందీప్ పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు
కమలాపూర్: వ్యవసాయ భూమి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయడానికి రూ.30 వేలు డిమాండ్ చేసి చివరికి రూ.5వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికా రులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ధరణి ఆపరేటర్తో పాటు తహసీల్దార్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం చోటు చేసుకుంది. వరంగల్ ఏసీబీ డీఎస్పీ పి.సాంబయ్య, బాధిత రైతు కసరబోయిన గోపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపూర్ మండలం కన్నూరు గ్రామ పంచాయతీ పరిధిలోని రాములపల్లికి చెందిన గోపాల్కు అతని తండ్రి రాజయ్య 3.02 ఎకరాల భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించడానికి ఈ నెల 9న స్లాట్ బుక్ చేసుకున్నాడు. 10న కుటుంబ సభ్యులతో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. తహసీల్దార్ మాధవి వీరి ఫైల్ చూడకుండానే పక్కనపెట్టి తర్వాత రావాలని చెప్పింది. ఆ తర్వాత వీరి భూమి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయడానికి రూ.30వేలు డిమాండ్ చేయడంతో అన్ని డబ్బులు తానివ్వలేనని గోపాల్ చెప్పడంతో వారం రోజులపాటు తిప్పుకున్నారు. చివరకు రూ.6 వేలు ఇస్తే తప్ప పని కాదనడంతో అంతకూడా ఇవ్వలేనని గోపాల్ బతిమిలాడటంతో రూ.5వేలు ఇస్తే గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేస్తామని తెగేసి చెప్పారు. దీంతో చేసేదేమీ లేక ఈ నెల 18న గోపాల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు సోమవారం గోపాల్ నుంచి ధరణి ఆపరేటర్ రాకేశ్ రూ.5 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. తహసీల్దార్ మాధవి చెప్తేనే గోపాల్ నుంచి రూ.5 వేలు తీసుకున్నానని రాకేశ్ చెప్పడంతో అతనితో పాటు తహసీల్దార్ మాధవిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని వరంగల్లోని ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు రాజు, శ్యాంసుందర్, ఎల్.రాజు, సిబ్బంది పాల్గొన్నారు. అవినీతి అధికారులను ఏసీబీకి పట్టిచ్చిన గోపాల్, గుండేడుకు చెందిన అతని మిత్రుడు పేర్వాల పురుషోత్తంరావును మర్రిపల్లిగూడానికి చెందిన రైతులు సన్మానించి అభినందించారు. గిఫ్ట్ రిజిస్ట్రేషన్కు రూ.30 వేలు డిమాండ్ రూ.5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన తహసీల్దార్, ధరణి ఆపరేటర్ -
అనసూయే ‘అనురాగ దీపం’
విద్యారణ్యపురి: తెలుగు సాహితీ ప్రపంచంలో ప్రముఖ నవల రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ పేరు తెలియనివారు ఉండరు. తన సతీమణి అనసూయ అసువులు బాసి సోమవారంతో ఏడాది అవుతుంది. ఆమె పంచిన ప్రేమ, జ్ఞాపకాలు, మధుర క్షణాల దాంపత్య జీవితాన్ని చిత్రీస్తూ ఆయన ‘అనురాగ దీపం’ అనే నవల రాశారు. మంగళవారం నవలను ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో వారి దాంపత్యజీవితం, పడిన కష్టాలు.. తదితర అంశాలను నవలలో ఎలా పొందుపర్చారో, ఎందుకు ఆ నవల ఆయనకు ప్రత్యేకమో సోమవారం ‘సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. జీవితంలో ఎదురైనా కష్టసుఖాలు నా సతీమణి అనసూయ గతేడాది మే 21న మరణించారు. ఆరు పదుల వసంతాల దాంపత్యజీవితంలో మాకు ఎదురైనా కష్టసుఖాలు, కలలు, కన్నీళ్లను, అమెతో గడిపిన మధుర క్షణాలను కలగలిపి నా కలంనుంచి జాలువారిందే ‘అనురాగదీపం’ నవల. ఇప్పటివరకు 34 నవలలు రాశా. అవన్నీ ఒక ఎత్తయితే నా జీవితాన్ని అనురాగం అనే దీపంతో తేజోమయం చేసిన నా అర్ధాంగి అనసూయ ఎడబాటును తట్టుకోలేక మదన పడుతూ రాసిన నవల అని చెబుతాను. ఈ నవలలో నా సతీమణితో గడిపిన ప్రతిక్షణాన్ని వేదనాభరితంగా అక్షర బద్ధం చేశా. అనసూయ పుట్టగానే నీకు పెళ్లాం పుట్టిందని ఆమె పెద్దమ్మ అనడంతో ప్రారంభమైన ఈ నవలలో చిన్నప్పుడు కుటుంబ నేపథ్యం, దుఃఖాలు, మా పెళ్లి, ఆరు పదుల మా ఇద్దరి జీవనాన్ని పొందుపర్చాను. 14ఏళ్ల అనసూయతో వివాహం మా స్వగ్రామం పాలకుర్తి మండలం వావిలాల. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబ నేపథ్యం. నా సతీమణి అనసూయ పుట్టిన ఊరు సూర్యాపేట తాలూక మద్దిరాల గ్రామం. గ్రామీణ వాతావరణం, భూస్వామ్య కుటుంబ నేపథ్యంతోపాటు బంధువులు, ఉమ్మడి కుటుంబం. అనసూయకు నేను మేనబావను. 14 ఏళ్లవయస్సులోనే మా వివాహం చేశారు. ఆ తరువాత నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ అభ్యసించా. ఉద్యోగం సంపాదించి అనసూయను నా దగ్గరికి తెచ్చుకోవాలనే ఆరాటం ఉండేది. నల్లగొండలో అధ్యాపకుడిగా విధులను నిర్వర్తిస్తున్న సమయంలోనే సాహిత్య వాతావరణం పెరిగింది. ఓయూలో వరవరరావు, వేనరెడ్డి, గంటా రామిరెడ్డిలతో గాఢమైన స్నేహబంధాన్ని కొనసాగించా. ఈ అంశాలతో పాటు చిన్నమ్మలు, పెద్దమ్మలు, మేనమామలు, తమ్ముడు, చెల్లెలు, సత్తెన్న ఇలా సజీవమైన పాత్రలతో వాస్తవిక సంఘటనలను ఈ అనురాగ దీపం నవలలో చిత్రించా. నవలలో కథ మొత్తం నా సతీమణి అనసూయ చుట్టూ తిరుగుతుంటుంది. అనసూయ నా జీవితంనుంచి వెళ్లిపోతుంటే.. తనకు, కుటుంబ సభ్యులకు ప్రేమ ఆప్యాయతలను పంచిన అనసూయ నన్ను కంటికి రెప్పలాగా కాపాడుతుండేది. ఆమె అనారోగ్య కారణాలతో నా జీవితంనుంచి వెళ్లిపోతుంటే తట్టుకోలేక నిస్సాహాయ స్థితిలో ఉండిపోయా. అనసూయ తన మనుమరాండ్ల పెళ్లిళ్లు చూడాలని ఎంత ఆరాటపడిందో నా చిన్న కుమారుడు శశాంకకు వచ్చిన కష్టాలను చూసి ఆ మాతృ హృదయం తల్లడిల్లింది. గృహిణిగా నాతో ఆరవై ఏళ్లు ప్రాణంలో ప్రాణంగా జీవించిన ఆమె భౌతికంగా దూరం కావడం ఎంత విషాదమో నేను పడిన వేదనను అక్షరాల్లో నిక్షిప్తమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే నా కన్నీటిధారలే ఈ అనురాగ దీపం నవల ఇతివృత్తం. నేడు ఆవిష్కరణమా అన్యోన్య దాంపత్య జీవితాన్ని అక్షరబద్ధం చేసిన నవల అనురాగ దీపం మంగళవారం ఆమె ప్రథమ వర్ధంతి రోజున ఆవిష్కరించనున్నాం. హనుమకొండలోని పాపడమ్స్ బ్లూ బాక్వెట్హాల్లో ఉదయం 11గంటలకు అంపశయ్యనవీన్ లిటరరీ ట్రస్టు ఆధ్వర్యంలో ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. విశ్రాంత ఉపాధ్యాయుడు గంట రామిరెడ్డి ఆవిష్కరిస్తారు. ప్రముఖ రచయిత్రి నెల్లుట్ల రమాదేవి నవలను పరిచయం చేస్తారు. పలువురు వక్తలు ప్రసంగిస్తారు. కవులు, సాహిత్యకారులు, సాహిత్య అభిమానులు తరలిరావాలని కోరుకుంటున్నా. ఆరు పదుల మా దాంపత్య జీవితం అందులో ఉంది సాక్షితో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్యనవీన్ నేడు ‘అనురాగ దీపం’ నవల ఆవిష్కరణ -
నాలాల్లో వ్యర్థాలు తొలగించాలి
గ్రేటర్ వరంగల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వరంగల్ అర్బన్ : నగరంలోని పలు నాలాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను పూర్తిగా తొలగించాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను హెచ్చరించారు. సోమవారం ‘సాక్షి’లో ‘పూడిక’లో కాసుల వేట’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కమిషనర్ స్పందించారు. వరంగల్ పరిధిలోని బొందివాగు నాలా, దేశాయిపేట 80 ఫీట్ల రోడ్డు, లేబర్ అడ్డా, డాక్టర్స్ కాలనీ, కెనాల్ యూటీ ఏరియా, దేశాయిపేట వడ్డెపల్లి చెరువు, బాలాజీనగర్ జంక్షన్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో పూడికతీత పనుల్లో వేగం పెంచాలన్నారు. తొలగించిన పూడికను రాంపూర్ డంప్ యార్డుకు తరలించాలని ఆదేశించారు. ఈ విషయంలో కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఎస్ఈ కష్ణారావు, సీఎంహెచ్ఓ డా.రాజేష్, ఈఈ శ్రీనివాస్, డీఈలు రంగారావు, సారంగం, రవికిరణ్, ఏఈ సతీష్, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీను పాల్గొన్నారు. -
Warangal Murder: కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు
హసన్పర్తి (హనుమకొండ జిల్లా): తాగు నీటి వివాదం ఓ వృద్ధుడి ప్రాణం తీసింది. కొడుకులతో కలిసి ఓ కోడలు మామను హత్య చేసింది. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రంలో ఆదివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. హసన్పర్తికి చెందిన జల్లి సారయ్య(80)కు ఇద్దరు కుమార్తెలు తిరుమల, రజితలు, ఇద్దరు కుమారులు రమేశ్, అశోక్ ఉన్నారు. కుమారులిద్దరూ గతంలోనే మృతి చెందారు. పెద్ద కుమారుడు రమేశ్కు భార్య రమాదేవి, కుమారులు జల్లి సాయికృష్ణ, జల్లి శశికుమార్ ఉన్నారు.నల్లా వచ్చినప్పుడల్లా గొడవే...జల్లి సారయ్య దంపతులతో పాటు రమాదేవి ఒకే ఇంటిలోని వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. అయితే వీరి ఇంటికి ఒకే నల్లా కనెక్షన్ ఉంది. నల్లా వచ్చినప్పుడల్లా వారి మధ్య గొడలు జరుగుతున్నాయి. ఆదివారం నల్లా విషయంలో వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోడలు జల్లి రమాదేవి, మనవళ్లు జల్లి సాయికృష్ణ, జల్లి శశికుమార్ సారయ్యపై దాడి చేయగా నుదుటిపై బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించి విచారణ చేపట్టారు. తాగునీటి విషయంతోపాటు ఆస్తి తగదాలు కూడా ఉన్నాయని తేలింది. మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతుడి కూతురు తిరుమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
నల్లబెల్లం పట్టివేత
360 కిలోల మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని ఈదులపూసపల్లి, సీత్లాతండా, వేమునూరు, చిన్నలింగ్య తండా పరిధిలో గుడుంబా స్థావరాలపై ఎకై ్సజ్ అధి కారులు శనివారం దాడులు నిర్వహించారు. దాడుల్లో 360 కిలోల నల్లబెల్లం, 15 లీటర్ల గుడుంబా, 15 కిలోల పటిక, 3 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. 500 లీటర్ల పులియబెట్టిన బెల్లం పానకం పారబోసి ధరంసోత్ లక్ష్మణ్, అజ్మీరా ప్రవీణ్, అజ్మీరా న వీన్, బానోత్ అనిల్పై కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ సీఐ చిరంజీవి, ఎస్సై అశో క్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ మధు, కానిస్టేబుళ్లు యాదగిరి, శ్రీనివాస్, శేఖర్ పాల్గొన్నారు. చికిత్స పొందుతున్న పసికందు మృతి ● వైద్యురాలిపై పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు వర్ధన్నపేట: చికిత్స పొందుతున్న ఓ పసికందు మృతి చెందాడు. ఎస్సై కథనం ప్రకారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన కసిరెడ్డి బేబి రెండు నెలల నుంచి వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చెకప్ చేయించుకుంటోంది. ఈ నెల 16న బేబికి నొప్పులు రావడంతో ఆస్పత్రికి వెళ్లగా అడ్మిట్ చేసుకున్నారు. 17వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతలో బేబికి నొప్పులు తీవ్రం కావడంతో భర్త కసిరెడ్డి నరేష్ డ్యూటీలో ఉన్న గైనకాలజిస్ట్ మానసరెడ్డి దగ్గరికి వెళ్లి పరిస్థితిని వివరించాడు. ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరించి బయటకు వెళ్లింది. స్టాఫ్నర్స్ సునీత, ఏఎన్ఎం సుభద్ర మధ్యాహ్నం 3.30 గంటలకు గైనకాలజిస్ట్ మానసరెడ్డితో మాట్లాడి డెలవరీ రూంకు తీసుకెళ్లగా మగశిశువుకు జన్మనిచ్చింది. శిశువును చూపించకుండా వెంటనే అంబులెన్స్లో ఎంజీఎం తరలించారు. అక్కడ చికిత్స పొందు తూ పసికందు శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు. సర్జరీ చేయాలని కోరినా వైద్యురాలి నిర్లక్ష్యం వ్యవహరించారని, ఆమె కారణంగా తమ శిశువు మృతిచెందినట్లు నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
సెక్యూరిటీ గార్డా.. మజాకా!
ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో కొన్ని నెలలుగా కొంత మంది సిబ్బంది, వైద్యాధికారులు, పరిపాలనాధికారుల ఆజమాయిషీ తారస్థాయికి చేరింది. ఆస్పత్రిలో స్నేహపూర్వక పరిపాలన.. మెరుగైన సే వల కోసం సమన్వయంతో పాలన కొన్ని నెలలుగా కొనసాగడం లేదు. దీంతో కొన్ని పరిస్థితుల్లో తప్ప సూపరిండెంట్ చాంబర్కు వెళ్లేందుకు ఎవరూ వెళ్లట్లేదనేది బహిరంగ రహస్యం. ఈక్రమంలో పరిపాలనాధికారులకు అనుయాయులుగా ఉన్న కొంత మంది అధికారులు, సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. గతంలో మంత్రి పైరవీతో వచ్చిన ఓ సె క్యూరిటీ గార్డు ఏకంగా సూపరిండెంట్ చాంబర్లో వైద్యాధికారుల కుర్చీలో కూర్చొని దర్జాగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈతతంగమంతా చూసిన కొంతమందికి ఇది సెక్యూరిటీ కార్యాలయమో? సూపరింటెండెంట్ కార్యాలయమో? అర్థం కాక వెనుదిరిగి వెళ్తున్నారు. కాగా.. ఎంజీఎంలో ఏం జరిగినా.. ఏదైనా ప్రశ్నించినా? కొన్ని నెలలుగా పలు సమస్యలకు వివరణాత్మకంగా సమాధానాలు, చర్యలు కనిపించట్లేదు. దీంతో ఆస్పత్రిలో పాలన గాడిన పడేనా? ప్రభుత్వ పాలన.. ఉన్నట్లా.. లేనట్టా? అని ప్రతి ఒక్కరూ పెదవి విరుస్తున్నారు. ఎంజీఎంలో పెరిగిపోతున్న అధిపత్య పోరు కొరవడిన సమన్వయం -
ఈఏపీసెట్ ఫలితాల్లో ఎస్ఆర్ ప్రభంజనం
విద్యారణ్యపురి: టీఎస్ఈఏపీసెట్ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ ఎ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి,సంతోష్రెడ్డి తెలిపారు. ఈఏపీసెట్ ఫలితాల్లో కొతమ్ మణితేజ ఎంపీసీ విభాగంలో రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకు సాధించారని తెలిపారు. దొంతుల మనీష్ ఎంపీసీ విభాగంలో రాష్ట్రస్థాయిలో 24వ ర్యాంకు, టి తేజిస్వి ఎంపీసీ విభాగంలోరాష్ట్రస్థాయిలో 161వర్యాంకు సాధించారని తెలిపారు. మునకాల గణేష్ బీపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 199వ ర్యాంకు, కె శ్రీరాంరెడ్డి ఎంపీసీ విభాగంలో 291వ ర్యాంకు సాధించి రాష్ట్రస్థాయిలో ఎస్ఆర్ విజయపతాకాన్ని ఎగురవేశారని తెలిపారు. అలాగే, చిల్ల హర్షిత 334వ ర్యాంకు, ఆర్ దీపాంశరెడ్డి 412వ ర్యాంకు, కె వర్షిణి 494వ ర్యాంకు, ఎస్ రాహుల్ 546వ ర్యాంకు, జి రాజీవ్ 552వ ర్యాంకు, అబుతాల్హా 554వ ర్యాంకు సాధించారని వారు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ తమ విద్యార్థులకు సృజనాత్మకతతో కూడిన విద్యనందిస్తున్నామన్నారు. భవిష్యత్లో మరిన్ని అత్యుత్తమ ర్యాంకులు సాధించేలా తీర్చిదిద్దుతామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. 50 సంవత్సరాల్లో పటిష్ట ప్రణాళికతో హైస్కూల్, జూనియర్ కాలేజీ, ఎంసెట్, ఐఐటీల్లో విద్యనందిస్తూ ప్రతి సంవత్సరం, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని వివరించారు. ఈ సంవత్సరం జేఈఈ మెయిన్స్లోనూ జాతీయ స్థాయిలోఉత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు. -
ఫిర్యాదు చేసినా పట్టించుకోరు!
హసన్పర్తి: హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిలోని చింతగట్టు క్యాంప్ బ్రిడ్జికి ఆనుకుని ఓ వ్యాపారి ఎస్సారెస్పీ భూమిని ఆక్రమించుకున్నాడు. అందులో తాత్కాలిక నిర్మాణాలు కూడా చేపట్టాడు. ఐదేళ్లుగా వ్యాపారం కొనసాగిస్తున్నాడు. అదే స్థలంలో దర్జాగా ఇసుక డంప్ చేస్తున్నాడు. అయినప్పటికీ నీటి పారుదలశాఖ అధికారులు స్పందించలేదు. కబ్జాకు గురైన ప్రాంతం నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయానికి దగ్గరే ఉంది. అయినప్పటికీ తమకేమీ పట్టదన్నట్లుగా అధికారులు వ్యవహరించారు. స్థానికుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో నీటి పారుదలశాఖ అధికారులు కబ్జాదారుడిపై కేసు నమోదు చేయాలని స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. ఇందుకు పోలీసుల నుంచి స్పందన రావట్లేదనే విమర్శలు వ్యకమవుతున్నాయి. అధికారుల నుంచి ఫిర్యాదు స్వీకరించి చెత్తబుట్టల్లో వేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎస్పారెస్పీ భూములు కబ్జాకు గురవకుండా ఉండేందుకు చుట్టూ ప్రహారీ నిర్మాణానికి కార్పొరేషన్ అఽఽధికారులు ముందుకొచ్చారు. ప్రహరీ నిర్మాణానికి కొలతలు వేశారు. కానీ ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు. కాగా.. ఎస్సారెస్పీ భూముల కబ్జాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు నీటి పారుదలశాఖ వరంగల్ సర్కిల్ ఈఈ సీతారాం నాయక్ తెలిపారు. -
బీఆర్ఎస్, కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి
కాజీపేట అర్బన్: యువతను, ఉద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి తెలిపారు. హనుమకొండ హంటర్రోడ్డులోని వేద బాంక్వెట్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన బీజేపీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ స్థాయి వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి పాల్గొని మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి గెలుపునకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ తరహాలో ప్రతి ఒక్క ఓటరుతో ఓటు వేయించాలన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే ఝెండల లక్ష్మీనారాయణ, హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ, బీజేపీ నాయకులు మురళీధర్గౌడ్, ఎడ్ల అశోక్రెడ్డి, చాడ శ్రీనివాస్రెడ్డి, రావుల కిషన్, దొంతి దేవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి -
గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి
కాళోజీ సెంటర్ : జిల్లాలో జూన్ 9వ తేదీన జరగనున్న గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రూప్–1 పరీక్షల ఏర్పాట్లపై శనివారం ఆయన హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, డీసీపీల, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, పరీక్షల సమన్వయకర్త చంద్రమౌళి పాల్గొన్నారు. తొమ్మిది మంది డీబార్కేయూ క్యాంపస్: కేయూ పరిధి హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన డిగ్రీ మొదటి సంవత్సరం, బీకాం, బీఎస్సీ ఫిజికల్ సైన్స్ పరీక్షల్లో కాపీయింగ్ చేస్తూ 9మంది పట్టుబడ్డారు. వారిని డీబార్ చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. -
శివాని విద్యార్థుల విజయదుందుభి
హసన్పర్తి: ఈఏపీసెట్ ఫలితాల్లో నగరంలోని శివాని జూనియర్ కళాశాల విద్యార్థులు విజయదుందుభి మోగించారు. కళాశాలకు చెందిన వర్షిత(385 4 ర్యాంకు), చీమకుర్తి సాద్విక(4036 ర్యాంకు), వడ్డెపల్లి అశ్విత(5731 ర్యాంకు), కుసుమ శ్రీజ(6316ర్యాంకు),దాసరి శ్వేత(8917ర్యాంకు), తిప్పారపు జ్ఞానేశ్వర్(9080ర్యాంకు),అరికెళ్ల నిస్సి(9732 ర్యాంకు),రాయబోయిన తిరుపతి(9813ర్యాంకు) తోపాటు 27 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించినట్లు శివాని విద్యాసంస్థల కరస్పాండెంట్ టి. స్వామి తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ప్రిన్సిపాళ్లు, జి.సురేందర్రెడ్డి, వి. చంద్రమోహన్, డైరెక్టర్లు రాజు, ఎన్.రమేశ్, మురళీధర్, సురేష్, సంతోష్రెడ్డి పాల్గొన్నారు. -
స్ట్రాంగ్ రూంల వద్ద నిరంతర నిఘా
వరంగల్ : లోక్సభ ఎన్నికల ఈవీఎంలను భద్రపరచిన ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్ రూంల వద్ద నిరంతర నిఘా ఏర్పాటు చేశామని రిటర్నింగ్ అధికారి, వరంగల్ కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. సాధారణ తనిఖీల్లో భాగంగా శనివారం ఆమె స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతా ఏర్పాట్లు, రికార్డుల నిర్వహణ, సీసీ కెమెరాలను పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్, ఎస్సై శ్రీకాంత్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి
కాళోజీ సెంటర్ : వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఇన్నరింగ్ రోడ్డు, నేషనల్ హైవే, రైల్వే, ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణపై శనివారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టుల పనులు త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ శ్రీనివాస్, ఆర్డీఓలు సిదం దత్తు, కృష్ణవేణి, కుడా పీఓ అజిత్రెడ్డి, టీజీఐఐసీ జనరల్ మేనేజర్ సంతోష్కుమార్, ఇరిగేషన్, నేషనల్ హైవే, రైల్వే అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి ఇంటర్మీడియట్, టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి పరీక్షల నిర్వహణపై శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జూన్ 9 న గ్రూప్–1 పరీక్ష కోసం 9,168 మంది అభ్యర్థుల కు 17 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈనెల 24 నుంచి జరిగే ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష, జూన్ 3 నుంచి జరిగే టెన్త్ అ డ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు కూడా పటిష్ట ఏ ర్పాట్లు చేయాలన్నారు. ఇంటర్ పరీక్షలు 17 కేంద్రాలు, టెన్త్ పరీక్షలు రెండు కేంద్రాల్లో నిర్వహిస్తునట్లు తెలిపారు. డీసీపీ రవీందర్, ఆర్డీఓ సిదం దత్తు, డీఐ ఈఓ కాక మాధవరావు, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మధుసూదన్, గ్రూప్–1 పరీక్షల జిల్లా సమన్వయకర్త చంద్రమౌళి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. టీజీ తక్షణమే అమలు చేయాలి టీఎస్ స్థానంలో టీజీని తక్షణమే అమలు చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. జిల్లాలో ఇకపై అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఏజెన్సీలు, స్వయంప్రతిపత్తి గల సంస్థలు, వెబ్సైట్లు, ఆన్లైన్ ప్లాట్ఫాంలు, ఇతర అధికారిక కమ్యూనికేషన్లు సైతం తెలంగాణ కోడ్ టీఎస్కు బదులు టీజీని వాడాలని కలెక్టర్ కోరారు. ఈ మేరకు ఈనెల 25వ తేదీలోపు అన్ని శాఖల అధికారుల నివేదికలు పంపాలని, వాటిని క్రోడీకరించి ప్రభుత్వానికి పంపించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య -
ప్రతి గ్రాడ్యుయేట్కు ప్రశ్నించే గొంతుక అవుతా..
● పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్రెడ్డినయీంనగర్: తాను ఎమ్మెల్సీగా గెలిస్తే చట్టసభల్లో ప్రతి గ్రాడ్యుయేట్కు ప్రశ్నించే గొంతుక అవుతానని బీఆర్ఎస్ నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండ ప్రెస్క్లబ్లో ఏర్పాటుచేసిన మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడారు. తాను గెలిస్తే తన వేతనాన్ని విద్యార్థి, నిరుద్యోగ సంక్షేమ నిధిగా ఏర్పాటుచేస్తానని, ప్రభుత్వం మెడలు వంచి జీఓ 46, 317 రద్దు చేయిస్తానన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే సొంత పార్టీపై ఉద్యోగుల, పట్టభద్రుల డిమాండ్ల సాధనకు పోరాటం చేస్తాడా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ప్రతిపక్షం ఉండాలన్నారు. బీజేపీ తనని రాజకీయ హత్య చేసి రోడ్డున పడేస్తే బీఆర్ఎస్ పార్టీ ఆదుకుందన్నారు. సమావేశంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారపు సదయ్య, కోశాధికారి బోళ్ల అమర్, జర్నలిస్ట్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. చెట్టు మీదపడి కూలీ మృతి రఘునాథపల్లి: చెట్టు మీద పడి ఓ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మండలంలోని కంచనపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామంలోని వెలబోయిన యాదగిరి తన ఇంటి ఆవరణలోని చెట్టును తొలగించేందుకు అదే గ్రామానికి చెందిన ఇరుగదిండ్ల లింగయ్య (45)ను కూలీకి తీసుకెళ్లాడు. లింగయ్య ఆ చెట్టును రంపంతో కోస్తుండగా తెగి మీద పడింది. దీంతో తీవ్ర గాయాలైన లింగయ్యను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, లింగయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లే సమాచారం ఇవ్వకపోవడంపై మృతుడి కుటుంబ సభ్యులు మండిపడ్డారు. లింగయ్య మృతికి కారణమైన యాదగిరిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు. మృతుడికి భార్య ఎల్లమ్మ, కూతుళ్లు రజిత, రమ్య ఉన్నారు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దూదిమెట్ల నరేష్ తెలిపారు. భర్త వేధింపులు.. వివాహిత ఆత్మహత్య పర్వతగిరి : భర్త వేధింపులు భరించలేక మండలంలోని అన్నారం షరీఫ్ గ్రామానికి చెందిన వసంత(22) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై గుగులోత్ వెంకన్న కథనం ప్రకారం.. రాయపర్తి మండలం వెంకటేశ్వర్లపల్లికి చెందిన శ్రీకాంత్తో వసంతకు నెల క్రితం వివాహామైంది. అయితే శ్రీకాంత్ వివాహేతర సంబంధం నెరుపుతూ వసంతను తరచూ వేధిస్తున్నాడు. ఈ విషయమై శ్రీకాంత్కు తల్లి కోమల, మేనమామ అంబటి కుమార్ సహకరించేవారు. దీంతో వేధింపులు భరించలేక వసంత శనివారం మధ్యాహ్నం ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకన్న తెలిపారు. హసన్పర్తిలో చోరీ ● బంగారు, వెండి, నగదు అపహరణ హసన్పర్తి: మండల కేంద్రంలోని నల్లగట్టుగుట్ట సమీపంలో చోరీ జరిగింది. దొంగలు ఇంట్లోకి ప్రవేశించి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాధితుడు ఖురేషి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. నల్లగట్టుగుట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖురేషి ప్రైవేట్ ఉద్యోగి. శుక్రవారం రాత్రి భోజనం ముగించుకున్న అనంతరం కూలర్ డోర్కు అడ్డంగా వేసి నిద్రించారు. శనివారం ఉదయం లేచి చూసే సరికి బీరువా తీసి కనిపినించింది. అందులో ఉన్న సుమారు పదకొండున్నర తులాల బంగారం, 48 తులాల వెండి, రూ.16వేలు నగదు, రెండు మొబైళ్లు మాయమైనట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై క్లూస్ టీమ్ వేలిముద్రలు సేరించగా పోలీసు జాగీలాలతో గాలింపు చర్యలు చేపట్టారు. -
బీజేపీకి అనుకూల వాతావరణం
హన్మకొండ: బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని, ఎమ్మెల్సీ ఎన్నికలో పార్టీ అభ్యర్థి గెలుస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండ హంటర్ రోడ్డులోని సత్యం కన్వెన్షన్లో కేజీ టు పీజీ విద్యా సంస్థల యాజమాన్యాల ఆత్మీయ సమ్మేళనం, డి కన్వెన్షన్లో బీజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై దిశా నిర్దేశం చేశారు. ప్రశ్నించే గొంతుకై న బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రతీ బీజేపీ కార్యకర్త తానే అభ్యర్థిగా భావించి పని చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఓటరును కలిసి ఓటు వేసే విధానంతో పాటు బీజేపీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసేలా అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా బీజేపీ పని చేస్తుందన్నారు. కేంద్ర ప్రఽభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు చెల్లిస్తుంటే రాష్ట్రాలు వాటిని దారి మళ్ళిస్తున్నాయన్నారు. ఈక్రమంలో కేంద్రం నేరుగా విద్యార్థి ఖాతాలోనే ఉపకార వేతనాలు జమ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల వివరాలు పంపించలేదని, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సినవి రూ.వేల కోట్ల బకాయిలున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నిక ఇన్చార్జ్ రాంచందర్ రావు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఝెండల లక్ష్మీనారాయణ, మార్తినేని ధర్మారావు, కొండేటి శ్రీధర్, వన్నాల శ్రీరాములు, ఒంటేరు జయపాల్, జిల్లా అధ్యక్షులు రావు పద్మ, గంట రవికుమార్, ఎంపీ అభ్యర్థులు అరూరి రమేశ్, ప్రొఫెసర్ ఆజ్మీర సీతారాం నాయక్, వరంగల్ పార్లమెంట్ ప్రభారి వి.మురళీధర్గౌడ్, మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, విద్యా సంస్థల ప్రతినిధులు బుచ్చిబాబు, అశోక్ రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రేమేందర్రెడ్డి గెలుపునకు కృషి చేయాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి -
షైన్ విద్యాసంస్థల విజయకేతనం
కాజీపేట అర్బన్ : ఈఏపీసెట్–24 ఎంట్రన్స్ ఫలితాల్లో షైన్ విద్యా సంస్థల విద్యార్ధులు విజయకేతనం ఎగురవేశారని ఆ విద్యా సంస్థల చైర్మన్ మూగుల కుమార్యాదవ్, డైరెక్టర్లు పి.రాజేంద్రకుమార్, మూగుల రమ, మూగుల రమేష్ తెలిపారు. ఈ మేరకు షైన్ విద్యా సంస్థల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన సభలో వారు మాట్లాడారు. శనివారం వెలువడిన ఈఏపీసెట్–24 ఎంట్రన్స్ ఫలితాల్లో మెడికల్ కేటగిరీలో హూమా ప్రియ 466వ ర్యాంకు, ఎండీ . సోహెల్ 732వ ర్యాంకు, ఆర్.వైష్ణవి 7645వ ర్యాంకు, ధనస్మిత 8525వ ర్యాంకు, ఇంజనీరింగ్ విభాగంలో సరయూరెడ్డి 1370వ ర్యాంకు, సిమిరిజ 1385వ ర్యాంకు, వరుణ్ 3145వ, సీహెచ్.చరణ్ సాయితేజ 6371, ఎన్. సుధాంశ్రెడ్డి 6729వ, అక్షయ 8017వ ర్యాంకు, జయంశ్ 9103వ ర్యాంకు సాధించారన్నారు. మెడికల్ కేటగిరీలో 22 మంది విద్యార్థులు 15వేల లోపు ర్యాంకులు, ఇంజనీరింగ్ కేటగిరీలో 36 మంది 15వేల లోపు ర్యాంకులు సాధించారని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ మారబోయిన రాజుగౌడ్, కొత్తకొండ శ్రీనివాసన్గౌడ్, ప్రవళిక, తదితరులు పాల్గొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తెలంగాణలో సన్నబియ్యం రాజకీయం..
టీడీపీ అంటేనే కుట్ర కుతంత్రం.. చంద్రబాబుపై రెచ్చిపోయిన మల్లాది విష్ణు
అదిరిపోయే ఫీచర్లతో.. నయా స్మార్ట్ఫోన్ లాంచింగ్కు షావోమీ రెడీ!
కేకేఆర్ గెలుపు.. గాల్లో తేలిపోయిన షారుక్.. చూసుకోకుండా..!
ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ లేటెస్ట్ అప్ డేట్
తమిళనాడుకు రెడ్ అలర్ట్..
పాయల్ రాజ్పుత్ రక్షణ మూవీ టీమ్ నుండి వేధింపులను ఎదుర్కొంటుంది
వరంగల్లో అర్ధరాత్రి బాంబుల మోత, కారణం ఏంటంటే..
నేమ్ప్లేట్ మార్చేసిన సూపర్ మామ్ సానియా మీర్జా ఫోటోలు వైరల్
స్టార్లైనర్ క్యాప్సుల్ ప్రయోగం మళ్లీ వాయిదా..కారణం..
తప్పక చదవండి
- వరంగల్లో అర్ధరాత్రి బాంబుల మోత, కారణం ఏంటంటే..
- స్టార్లైనర్ క్యాప్సుల్ ప్రయోగం మళ్లీ వాయిదా..కారణం..
- ‘కంగనా కాలు మోపిన ఆలయాలను శుద్ధి చేయాలి’
- అమెరికాలో ముగ్గురు భారతీయ విద్యార్థుల దుర్మరణం : ఎన్ని కలలు కన్నారో..!
- సింపుల్గా పెళ్లి చేసుకున్న యంగ్ డైరెక్టర్.. అమ్మాయి ఎవరంటే?
- పోర్షే కారు ప్రమాదం: ‘పబ్లో భారీ ఖర్చు’.. వెల్లడించిన పోలీసులు
- IPL 2024: వాళ్ల వల్లే గెలిచాం.. ఫైనల్లోనూ మేమే: శ్రేయస్ అయ్యర్
- బయోపిక్లో భార్య రేప్ సీన్.. షాకైన కేన్స్ ఆడియెన్స్
- ‘కాంగ్రెస్ పాలనలో కన్నీటి దృశ్యాలివి’.. కేటీఆర్ వ్యాఖ్యలు
- పవన్ ఏ దేశానికి వెళ్లారు?
Advertisement