నెల్లూరు (బారకాసు): భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు 85 ఏళ్లు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు హక్కు కల్పించే హోమ్ ఓటింగ్ ప్రక్రియ నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో శుక్రవారం ప్రారంభమైంది. ఇందు కోసం నమోదు చేసుకున్న వారి ఇళ్ల వద్దకు ప్రత్యేకంగా కేటాయించిన పలువురు అధికారులు, సిబ్బంది వెళ్లి వారి నుంచి ఓటు సేకరించే ప్రక్రియ చేపట్టారు. మొత్తం 153 మంది హోమ్ ఓటింగ్కు దరఖాస్తు చేసుకోగా తొలి రోజు 94 మంది తమ ఓటు హక్కును ఇంటి వద్దనే వినియోగించుకున్నారు.