-
సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
గద్వాల రూరల్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ అపూర్వ్చౌహాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 24వ తేదీ నుంచి జూన్3వ తేదీ వరకు సంప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు, ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2:30గంటల నుంచి సాయంత్రం 5:30గంటల వరకు జరుగనున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 3,664మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నట్లు, జిల్లాలో 9 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఆర్డీవో రాంచందర్, డీఎస్పీ సత్యనారాయణ, హృదయరాజు, డీప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సిద్దప్ప తదితరులు పాల్గొన్నారు. -
రోజు రూ.2 కోట్లకుపైగానే..
ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా కనిపించింది. ఈ నెల 12 మినహాయించి మిగతా రోజుల్లో మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ నిత్యం రూ.2 కోట్లపైగా ఆదాయం వచ్చింది. ఆర్టీసీ రీజియన్ అధికారులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవడంతో బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా అన్ని డిపోల నుంచి హైదరాబాద్ రూట్లో అధిక ఆదాయం సమకూరింది. ఈ మార్గంలోని బస్సులు ప్రయాణికులతో కనిపించాయి. మహాలక్ష్మి పథకం ప్రయాణికులతోపాటు ఇతరులు అధిక సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారు. ఈ రోజుల్లో ఆర్టీసీ రీజియన్ మెరుగైన ఆక్యుపెన్షి రేషియోను పొందింది. ఈ ఐదు రోజుల్లో రీజియన్లోని పది డిపోలు 100కుపైగా ఓఆర్ను సాధించింది. -
పకడ్బందీగా ధాన్యం కొనుగోలు
గద్వాల రూరల్: ప్రభుత్వం ధాన్యానికి ఇచ్చే మద్దతు ధరను రైతులు సద్వినియోగం చేసుకుని కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించాలని కలెక్టర్ బీఎం సంతోష్ రైతులను కోరారు. శుక్రవారం ఆయన గద్వాల మండలం బీరెల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. ఎక్కడైన ఇబ్బందులు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని రైతులకు సూచించారు. ఇప్పటి వరకు ఎన్ని క్వింటాళ్ల మేర ధాన్యం సేకరించారంటూ వివరాలు తెలుసుకున్నారు. తర్వాత అదనపు కలెక్టర్ ముసిని వెంకటేశ్వర్లు లత్తిపురంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఎంత మేర ధాన్యం కొనుగోలు చేశారో వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో నర్సింగ్రావు, సివిల్సప్లై డీఎం విమల తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి జిల్లా వ్యాప్తంగా అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక సదుపాయాలను ఆయా పాఠశాలల కమిటీల ద్వారా పూర్తి చేస్తున్నామని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పాఠశాలలో మరుగుదొడ్లు, తాగునీరు సదుపాయంతో పాటు ఇతర మౌళిక వసతులు త్వరగా పూర్తి చేసి వాటికి సకాలంలో బిల్లులు చెల్లింపులు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి సకాలంలో రైస్మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అపూర్వ్చౌహాన్, ముసిని వెంకటేశ్వర్లు, ఆర్డీవో రాంచందర్, డీఆర్డీవో నర్సింగ్రావు, డీఈవో ఇందిరా, పీఆర్ ఈఈ విజయ్, సివిల్సప్లై డీఎం విమల తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధితో ఊరట
ఆర్డీఎస్ లింక్ కెనాల్ పనుల్లో ఉపాధి కూలీలు ఆయకట్టుకు మేలు.. ఉపాధిహామీ పథకం ద్వారా కూలీలు చేస్తున్న పనితో రైతులకు మేలు జరగుతుంది. ప్రధాన కాల్వకు అనుబంధంగా ఉన్న పిల్ల కాల్వల ద్వారా వందల ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. దానికి నీరందించే పిల్ల కాల్వల్లో మట్టి, సిల్ట్ తొలగించడం రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. దాంతో పాటుగా కూలీలకు ఉపాధి లభిస్తుంది. పనులు చేసే కూలీలు కూడా స్థానికులే కాబట్టి దాని ఆవశ్యకతను బట్టి పనులు చేస్తున్నారు. – వెంకటేశ్వర్రావు, రైతు, అశోక్నగర్ క్యాంపు సాఫీగా నీరు దిగువకు.. ఆర్డీఎస్ కెనాల్లో ప్యాకేజీ ద్వారా మరమ్మతులు జరగుతున్నాయి. సబ్ డిస్ట్రిబ్యూటర్లలో కూడా రైతులకు మేలు జరిగే విధంగా ప్రస్తుతం ఉపాధి హామి పనులు జరుగుతున్నాయి. కెనాల్లో జరుగుతున్న మరమ్మత్తులకు, ఈ పనులు కూడా తోడు కావడం వల్ల నీరు సాఫీగా దిగువకు వెళ్లడంతో పాటు కెనాల్ పటిష్టంగా ఉంటుంది. – విజయ్భాస్కర్ రెడ్డి, ఆర్డీఎస్ ఈఈ రాజోళి: జిల్లాలో ఉపాధి హామీ పనులతో ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఉపాధి హామీ పనులు గ్రామాల్లో రెగ్యులర్గా జరుగుతున్నప్పటికీ, జిల్లాలోని ఆర్డీఎస్ కెనాల్ పరిదిలో జరుగుతున్న పనులతో ఎక్కువగా రైతులకు ప్రయోజనం చేకూరేవిగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆర్డీఎస్ ఆయకట్టుకు అనుబంధంగా ఉన్న వనరుల నుంచి కెనాల్కు వచ్చి, అక్కడి నుండి లింక్ కాల్వలకు నీరు అందుతుంది. ఈ క్రమంలో నీరు సాఫీగా ప్రవహించకుండా ఉండటంతో దిగువన ఉన్న రైతులకు నీరు సక్రమంగా అందడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ కాల్వలల్లో పనులు చేపట్టేందుకు కూడా అందరూ కలిసి రాకపోవడం వల్ల పలు సమస్యలు రైతులను వేధించేవి. ప్రస్తుతం ఉపాధి హామి పనులతో కూలీలు ఈ కాల్వల గుండా పనులు చేస్తుండటంతో ఆయకట్టుకు బలం చేకూరే విదంగా నీరు అందించేందుకు కాల్వ తయారవుతుందని రైతులు అంటున్నారు. ఆర్డీఎస్ కెనాల్కు ఊతం.. ఉపాధి హామీ పనులతో ఆర్డీఎస్ కెనాల్లోని చిన్న పిల్ల కాల్వల్లో కూలీలతో పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం ఆర్డీఎస్ పరిదిలో ప్రారంభమైన పనులన్నీ దాదాపు ఆర్డీఎస్ కెనాల్కు ఊతమిచ్చేలే సాగుతుండంటతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఆర్డీఎస్ కెనాల్ ప్రవహించే, అయిజ, రాజోళి, వడ్డేపల్లి, మానవపాడు, అలంపూర్, ఉండవెళ్లి, ఇటిక్యాల మండలాల్లోని గ్రామాల్లో ఉన్న లింక్ కెనాల్ పరిదిలో ఈ పనులు చేపట్టడం వల్ల వందల ఎకరాల్లో ఆయకట్టుకు నీరు సాఫీగా ప్రవహిస్తుందని రైతులు అంటున్నారు. గత కొన్ని ఏళ్ల నుండి కాల్వల్లో అంతంత మాత్రంగానే పనులు చేపట్టడంతో మట్టి, సిల్ట్, పిచ్చి మొక్కలు నిండిపోయాయని ఉపాధి హామీతో అవన్ని పూర్తిగా తొలగిపోతున్నాయని పేర్కొన్నారు. ప్యాకేజీ పనులతో పాటు.. ప్రస్తుతం ఆర్డీఎస్ ప్రధాన కాల్వలో రూ.కోట్లతో ప్యాకేజీతో మరమ్మతు చేపట్టారు. కాగా ఈ పనులు ప్రధాన కాల్వ గుండా చేస్తుండగా.. ఆ మరమ్మత్తులు పూర్తయి సబ్ డిస్ట్రిబ్యూటర్లో పనులు చేయకపోవడం వల్ల నీటి ప్రవాహానికి ఇబ్బందులు ఉంటాయి. దీంతో సబ్ డిస్ట్రిబ్యూటరీ కింద ఉన్న రైతులకు నీటి లభ్యతలో ఆటంకాలు తప్పవు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఉపాధి హామి పనులు సబ్డిస్ట్రిబ్యూటరీ పరిదిలోనే జరుగుతుండటంతో, వాటి ఆయకట్టు రైతులకు ఊరట లభించినట్లేనని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం చేసిన పనులకే కాల్వలకు కొత్త శోభ వచ్చిందని, లేకపోతే నీరు దిగువకు వెళ్లలేక, పిచ్చి మొక్కలతో నిండిపోయి, కెనాల్ ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి ఉండేదని రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముమ్మరంగా పనులు వందల ఎకరాలకు నీరందే అవకాశం ఇటు కూలీలకు ఉపాధి.. అటు రైతులకు ప్రయోజనం 3 ఫీట్ల వరకు మట్టి, సిల్ట్ తీసివేత.. పిచ్చిమొక్కల తొలగింపు మండలాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో ప్రతి గ్రామంలో ప్రతి రోజు ఎక్కువ మంది కూలీలు పనుల్లో పాల్గొంటున్నారు. అందులో కెనాల్ పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రతి గ్రామంలో వేర్వేరుగా చేస్తున్న పనుల్లో కాల్వల్లో 3 ఫీట్ల లోతు వరకు మట్టి సిల్ట్ తొలగింపు, కాల్వకు ఇరువైపులా పిచ్చి మొక్కలు, ముళ్ల కంపల తొలగింపు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంత మేరలో పని చేయడం వల్ల ప్రస్తుతమున్న ప్రవాహం కంటే అదనంగా నీరు దిగువకు సాఫీగా పారుతుందని రైతులు అంటున్నారు. మొత్తానికి ఉపాధి హామీ ద్వారా చేస్తున్న ఈ పనులతో ఇటు కూలీలకు ఉపాధి లభిస్తూ, రైతులకు ప్రయోజనం చేకూరుతుందని రైతులు పేర్కొంటున్నారు. -
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..
● నాగర్కర్నూల్ నియోజకవర్గంలో 264 పోలింగ్ కేంద్రాల్లో 2,36,094 మంది ఓటర్లు ఉండగా.. 1,60,394 మంది ఓటేశారు. 75,700 మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. దీంతో 67.94 శాతం పోలింగ్ నమోదైంది. ● అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో 339 పోలింగ్ కేంద్రాల్లో 2,47,729 మంది ఓటర్లు ఉండగా.. 1,61,301 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇంకా 86,428 మంది ఓటుకు దూరంగా ఉండిపోవడంతో 65.11 శాతంగా నమోదైంది. ● కల్వకుర్తి అసెంబ్లీ పరిఽధిలో 271 పోలింగ్ కేంద్రాల్లో 2,44,405 మంది ఓటర్లు ఉండగా.. 1,77,226 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 67,179 మంది ఓట్లకు దూరంగా ఉన్నారు. 72.51శాతం మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. ● కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 282 పోలింగ్ కేంద్రాల్లో 2,39,463 మంది ఓటర్లుండగా.. 1,55,917 మంది ఓటింగ్ వేశారు. 83,546 మంది ఓటింగ్లో పాల్గొనలేదు. దీంతో ఇక్కడ 65.11శాతం నమోదైంది. ● వనపర్తిలో 307 పోలింగ్ కేంద్రాల్లో 2,73,863 మంది ఓటర్లుకు గాను 1,82,552 ఓట్లు పోల య్యాయి. 91,311 మంది పోలింగ్ కేంద్రాలకు రాలేకపోయారు. 66.66శాతం నమైదెంది. ● అలంపూర్లో 291 పోలింగ్ కేంద్రాల్లో 2,40,063 మంది ఓటర్లకు గాను 1,77,780 మంది తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోగా.. 62,283 మంది ఓటుకు దూరంగా ఉండిపోయారు. దీంతో అక్కడ 74.06శాతం నమోదైంది. ● గద్వాల నియోజకవర్గ పరిధిలో 303 పోలింగ్ కేంద్రాల్లో 2,56,637 మంది ఓటర్లకు 1,92,300 మంది ఓటు వేశారు. ఇంకా 64,337 మంది ఓట్లు వేయలేదు. 74.93 శాతం నమోదు కావడంతో పార్లమెంట్ పరిధిలో భారీగా ఓటింగ్ శాతం తగ్గింది. ● మధ్య వయస్కులు, వృద్ధుల కంటే యువతే తక్కువగా ఓటింగ్లో పాల్గొన్నట్లు కనిపిస్తోంది. అంతే కాక గ్రామీణ, గిరిజన తండాల్లో ఓటర్లు అధికంగా పాల్గొన్నప్పటికీ పట్టణాల్లో తగ్గింది. పట్టణ ఓటర్లలో చాలా మంది ఓటేసేందకు ఇష్టపడలేదు. దీంతో పట్టణ ఓటు బ్యాంకుపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థులు గెలుపుపై ప్రభావం చూపనుంది. తగ్గిన పోలింగ్ ఏ అభ్యర్థి విజయావకాశాలను దెబ్బతీస్తుందనే అసక్తి నెలకొంది. -
ఫలించిన ఎన్నికల సంఘం చర్యలు..
లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు. ఓటుహక్కు వినియోగంపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సామాజిక మధ్యమాల ద్వారా కొత్త ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారం చేపట్టారు. ఎన్నికల విధుల్లో ఉండి ఓటుకు దూరమయ్యే వారు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు మరిన్ని వర్గాలకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించారు. వైద్యులు, మెడికల్ సిబ్బంది, జర్నలిస్టులు, ఇతర ఎమర్జెన్సీ విభాగాల వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం అందించారు. మారుమూల ప్రాంతాలు, గిరిజన ఆవాసాలు, చెంచు గూడెల్లోని ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగం కోసం అదనంగా 113 పోలింగ్ ఉపకేంద్రాలను ఏర్పాటుచేశారు. ప్రధానంగా చెంచుపెంటల్లోనూ తాత్కాలిక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నికల్లో చెంచులు, గిరిజనులు, వృద్ధులు భాగస్వామ్యమయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా గత లోక్సభ ఎన్నికలకన్నా ఈసారి ఓటింగ్ పెంచడంలో ఎన్నికల యంత్రాగం సఫలీకృతమైంది. -
వేరుశనగ క్వింటా రూ.6,410
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు గురువారం 133 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6410, కనిష్టం రూ.4511, సరాసరి రూ.5440 ధరలు పలికాయి. అలాగే, 4 క్వింటాళ్ల ఆముదం రాగా గరిష్టం రూ.5511, కనిష్టం రూ.4600, సరాసరి రూ.5511 ధరలు వచ్చాయి. 317 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ. 2419, కనిష్టం రూ. 1769, సరాసరి ధర రూ. 2189 ధరలు వచ్చాయి. 4 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ. 10256, కనిష్టం రూ. 10119, సరాసరి ధర రూ. 10119 ధరలు వచ్చాయి. ముగిసిన శేషదాసుల వారి ఆరాధనోత్సవాలు మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్న శేషదాసుల వారి ఆరాధనోత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా శేషదాసుల వారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే వేదపండితులు రమేషాచారి, రవిచారి సంస్థానపూజలు నిర్వహించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు చెడు అలవాట్లకు దూరమై సన్మార్గంలో నడుచుకోవాలని, ప్రతి ఒక్కరూ భక్తిమార్గంలో నడుచుకోవాలని భక్తులకు వారు సూచించారు. అనంతరం సంగీతకచేరి, హరినామ సంకీర్తనలు వినిపించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లదరావు, దీరేంద్రదాసు, రాఘవేంద్రదాసు, శశాంక్, విష్ణు, అరవిందరావు, చంద్రశేఖర్రెడ్డి, బాబురావు, భీంసేన్రావు , మనోహర్రావు పాల్గొన్నారు. అయిజ పీఏసీఎస్ ఆదర్శంగా నిలవాలి అయిజ: జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు అయిజ పీఏసీఎస్ ఆదర్శంగా నిలవాలని ఉమ్మడి మహబూబ్నగర్ నాబార్డ్ డీడీఎంలు (డిస్టిక్ డెవలప్మెంట్ మేనేజర్లు) షణ్ముగచారి, మనోహర్ రెడ్డి అన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయాన్ని డీడీఎంలు సందర్శించారు. అదేవిధంగా సింగిల్విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్ను పరిశీలించారు. నాబార్డ్ ద్వారా గతంలో కేవలం గోదాముల నిర్మాణానికి రూ.కోట్ల నిధులు విచ్చించారని, ప్రస్తుతం సేవలతో కూడిన వ్యాపారం చేయడం హర్షించతగ్గ విషయం వారు అన్నారు. అయిజ పీఏసీఎస్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే పెద్ద సూపర్ మార్కెట్ ఏర్పాటు చేశారని పీఏసీఎస్ ప్రసిడెంట్ని మధుసూదన్రెడ్డిని అభినంధించారు. కార్యక్రమంలో సొసైటీ సెక్రటరీ మల్లేష్, సూపర్ మార్కెట్ ఇంచార్జ్ భీమార్జున్ రెడ్డి, సిబ్బంది భక్త ప్రహ్లాద, రాజు తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ నిర్మాణం తొలగింపు
శుక్రవారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2024వివరాలు 8లో u● మరిన్ని తొలగింపులకు రంగం సిద్ధం ● పావులు కదుపుతున్న మున్సిపల్ అధికారులు మాజీ మున్సిపల్ నేతపై నజర్ అదేవిధంగా తొలగించిన అక్రమ కట్టడానికి సంబంధించి క్రయవిక్రయాలకు జరిపిన డాక్యుమెంట్ను కూడా పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నట్లు, నకిలీ డాక్యుమెంట్ సృష్టించి అక్రమాలకు పాల్పడిన సదరు మాజీ మున్సిపల్ నేతపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇదివరకే సదరు మాజీ మున్సిపల్ నేతపై గద్వాల టౌన్ పోలీసుస్టేషన్లో చీటింగ్ కేసు నమోదు కావడం, మరోసారి మున్సిపల్ స్థలాన్ని అక్రమంగా విక్రయించడాన్ని జిల్లా ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. వీటిపై పూర్వపరాలు పరిశీలించి సదరు నేతపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా పకడ్బందీగా అధికారులు పావులు కదుపుతున్నట్లు సమాచారం. గద్వాల రూరల్: గద్వాల మున్సిపాలిటీ పరిధిలో రూ.కోట్ల విలువైన మున్సిపాలిటీ స్థలాలను కొందరు పలుకుబడి కలిగిన అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. ఇదే విషయాన్ని ‘సాక్షి’ పలుదఫాలుగా వరుస కథనాలతో వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఎట్టకేలకు వీటిపై మున్సిపల్ అధికారులు స్పందించారు. పాతబస్టాండ్లోని తేర్ల వద్దనున్న ఆజాం మెడికల్ స్టోర్ ముందు భాగంలో మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేసి షాపు నిర్మాణం చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ శంకర్సింగ్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నడుమ అక్రమ షాపు పిల్లర్లను తొలగించారు. నాటకీయ పరిణామం.. స్థానిక పాతబస్టాండ్లోని తేర్ల వద్ద చేపట్టిన అక్రమ షాపింగ్ నిర్మాణం తొలగించే క్రమంలో పలునాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రూ.కోట్లు విలువ చేసే మున్సిపల్ స్థలంలో అక్రమంగా షాపు నిర్మాణం చేపడుతున్న సదరు యజమానికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే దీనిపై సదరు యజమాని ఏకంగా మున్సిపల్ ఽఅధికారులకే నోటీసులు ఇచ్చారు. దీనిపై రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చట్టపరంగా అవసరమైన చర్యలు తీసుకునేలా అనుమతులు పొంది అనంతరం గురువారం అక్రమ కట్టడాన్ని కూల్చివేశారు. మిగిలిన వాటిపై చర్యలకు సిద్ధం ఇదిలా ఉండగా కుంటవీధిలో పదిశాతం స్థలంలో ఓ పలుకుబడి నేత డూప్లెక్స్ ఇంటి నిర్మాణం, అదేవిధంగా బీరెల్లి చౌరస్తాలో షాపింగ్ నిర్మాణం, కొత్తహౌసింగ్ బోర్డు కాలనీలో పదిశాతం స్థలంలో అక్రమంగా వెలసిన ప్లాట్లను కూడా తొలగించేందుకు అన్ని రకాల అనుమతులు పొందినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. -
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో గురువారం డిగ్రీ 2, 6వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 49 కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఉదయం జరిగిన రెండో సెమిస్టర్ పరీక్షకు 11,848 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 11,227 మంది హాజరయ్యారు. ఇక మధ్యాహ్నం జరిగిన ఆరో సెమిస్టర్ పరీక్షకు 11,448 మందికిగాను 11,108 మంది హాజరైనట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, కొండనాగులలో ఇద్దరు, నాగర్కర్నూల్లో ఒక విద్యార్థి మాల్ ప్రాక్టిస్కు పాల్పడుతూ అధికారులకు పట్టుబడగా.. డీబార్ చేసినట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాజ్కుమార్ తెలిపారు. -
మెరుగైన ఫలితాలు సాధించాలి
● ఈ విద్యా సంవత్సరం నుంచే పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి ● కలెక్టర్ బీఎం సంతోష్ గద్వాల రూరల్: పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించని పాఠశాలలు వాటికి గల కారణాలను గుర్తించి వచ్చే ఏడాది మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్లాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతిలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫలితాలల్లో జిల్లా అట్టడుగు నుంచి రెండవ స్థానం రావడంపై అధికారులపై అసంతృప్తి వ్యక్త పరిచారు. ఇందుకు కారణాలు చెప్పాలని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల కొరత, విద్యార్థుల గైర్హాజరు కారణాలను వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జూన్ నెలలో మొదలయ్యే విద్యా సంవత్సరం నుంచే జిల్లా, మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా విద్యార్థులలో ఇప్పటి నుంచే నైపుణ్యం పెంచేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు అవసరమైతే ఎన్జీవోల సాయం తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా నిబద్ధతో పనిచేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థుల ఫలితాలకు అవసరమైన బలోపేతమైన చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో పాటు ప్రభుత్వ హాస్టళ్లలో చదివే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సమావేశంలో డీఈవో ఇందిరా, ఎస్సీ, బీసీ సంక్షేమా శాఖ జిల్లా అధికారి శ్వేతాప్రియదర్శిని, శ్రీనివాసులు, ప్రతాప్రెడ్డి, ఎస్తేర్రాణి, అంపయ్య తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ను కలిసిన నాబార్డ్ డీడీఎండీ.. నాబార్డ్ జిల్లా ఇంచార్జ్ అధికారిగా నియమితులైన డీడీ ఎండీ మనోహర్రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్ బీఎం సంతోష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
ఈ– పాస్ ద్వారానే ఎరువులు విక్రయించాలి
ఎర్రవల్లిచౌరస్తా: రైతులకు ఈ–పాస్ ద్వారానే ఎరువులను విక్రయించాలని ఏడీఏ సక్రియ నాయక్ అన్నారు. బుధవారం ఎర్రవల్లి మండల కేంద్రంలోని వెంకటరమణ ట్రేడర్స్, బీకేఎస్ ట్రేడర్స్, జింకలపల్లి ఏఆర్ఎస్కే కేంద్రం, వల్లూరులోని మహాలక్ష్మి ఎరువుల దుకాణాలను ఆయన సందర్శించారు. ఆయా షాపులలో వానాకాలానికి అవసరమైన యూరియా, పొటాష్, ఎస్ఎస్పి వంటి ఎరువుల నిల్వలను తనిఖీ చేసి ఈ–పాస్ యంత్రాల ద్వారా ఆన్లైన్లో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రైతులకు కావాల్సిన అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎరువులను ఖచ్చితంగా ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రతి రైతుకి ఆధార్ ద్వారానే ఎరువులను విక్రయించాలని, ఇన్వాయిస్లను ఈ–పాస్లో పొందుపర్చిన తర్వాతనే విక్రయించాలని సూచించారు. వేరుశనగ క్వింటా రూ.6,314 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు బుధవారం 125 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6314, కనిష్టం రూ.2219, సరాసరి రూ.5789 ధరలు పలికాయి. అలాగే, 12 క్వింటాళ్ల ఆముదం రాగా గరిష్టం రూ.5514, కనిష్టం రూ.2100, సరాసరి రూ.5541 ధరలు వచ్చాయి. దీంతోపాటు 420 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ. 2359, కనిష్టం రూ. 1700, సరాసరి ధర రూ. 2179 ధరలు వచ్చాయి. 6 క్వింటాళ్ల వరి (హంస) రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి రూ. 1719 ధర పలికింది. కంది గరిష్టంగా రూ. 10176 ధర వచ్చింది. -
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ సందర్శన
గద్వాల క్రైం: జిల్లాలో శిశు మరణాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. తొమ్మిది నెలలు కడుపులో పెరిగిన ఆ బిడ్డ బయటకు వస్తుందని ఎంతో ఆశతో గర్భిణులు ఎదురుచూస్తారు. కాగా.. సకాలంలో మెరుగైన వైద్యం అందించాల్సిన వైద్యుల నిర్లక్ష్యం మూలంగా.. కడుపులోనే పసికందు మృతిచెందడం లేదా.. పుట్టిన కొద్ది క్షణాలకే కన్నుమూస్తుండడంతో కన్నపేగు తల్లడిల్లుతోంది. జిల్లా ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం వస్తే సకాలంలో వైద్యులు అందుబాటులో లేకపోవడం, పైగా కొంత మంది వైద్యుల మధ్య బేధాబిప్రాయాలతో మెరుగైన వైద్యం అందడం లేదు. దీనికితోడు అత్యవసర పరిస్థితుల్లోనూ ఇతర జిల్లా ఆస్పత్రులకు రెఫర్ చేస్తూ.. చేతులు దులుపుకోవడం ఇక్కడి వైద్యుల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రైవేట్ ల్యాబ్లకు రెఫర్ వైద్యం కోసం వచ్చే గర్భిణుల పరిస్థితి దయనీయంగా మారింది. టీ హబ్ ఉన్నప్పటికి వివిధ రక్త పరీక్షలు కోసం ప్రైవేటు ల్యాబ్లకు రెఫర్ చేయడం పరిపాటిగా మారింది. ప్రభుత్వం రూ.కోట్ల నిధులు మంజూరు చేస్తున్నప్పటికి సరైన వైద్యం అందడం లేదని పలువురు పేర్కొన్నారు. ఏ పరీక్షలు చేయించాలన్నా ప్రైవేటు ల్యాబ్లకు రెఫర్ చేయడం తప్పా మారే ప్రయత్నం చేయరన్నారు. అన్ని మౌలిక వసతులు ఉన్నప్పటికి సరైన టెక్నీషియన్స్, వైద్యుల కొరత ఉందని ప్రజలకు చెబుతున్నారన్నారు. ప్రైవేట్ ల్యాబ్లకు రెఫర్ చేయడం వెనుక వారి నుంచి కమీషన్ వస్తుందనే అత్యశతో రోగుల నుంచి డబ్బులు దండుకొనే ప్రయత్నం, వారి సొంత క్లినిక్లో వైద్యం చేయించుకునేలా వారిని ప్రేరేపించడంగా ఉందని పలువురు ఆరోపించారు. త్వరలో వేటు సమావేశం అనంతరం కమిషనర్ అజయ్కుమార్ విలేకర్లతో మాట్లాడారు. విధుల నిర్వహణలో వైద్యులు, సిబ్బంది అవలంభిస్తున్న దానిపై విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. గర్భిణులకు చికిత్స అందించే క్రమంలో తప్పిదాలకు పాల్పడిన వైద్యులకు షోకాజ్ నోటీసులు, శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సొంత క్లినిక్లు నిర్వహిస్తున్న వారి వివరాలు, ఇక్కడి ఓపీలో ఎంత వరకు ఉంటున్నారనే అంశాలపై నివేదికలు ఇవ్వల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు ల్యాబ్లకు పరీక్షల కోసం రెఫర్ చేసిన సిబ్బంది జాబితాను సైతం అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఆస్పత్రి సూపరింటెండెంట్ను సైతం త్వరలో తొలగించి మరొకరిని నియామకం చేస్తామన్నారు. ప్రభుత్వ విభాగంలో సేవలు అందించలేని పరిస్థితి ఉంటే సొంత క్లినిక్లకే పరిమితం అవ్వాలన్నారు. పలు విభాగలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పని తీరును సైతం సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో వైద్య సిబ్బంది కిషోర్కుమార్, వృశాలి, నవిన్క్రాంతి, శోభారాణి, వరలక్ష్మీ, శ్యాం, దివ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఆస్పత్రిలో వైద్యసేవలపై ఆరా తీస్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ అజయ్కుమార్ బుధవారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ అజయ్కుమార్ జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలు, సిబ్బంది వ్యవహార తీరు, సమయ పాలన తదితర అంశాలపై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు, వైద్యులు, సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఫిర్యాదులు అందించారు. సకాలంలో వైద్యులు వచ్చిన దాఖాలాలు లేవని తెల్చి చెప్పారు. ఇక్కడి రోగులకు అందుతున్న వైద్య సేవలు, వ్యవహరిస్తున్న తీరుపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. -
No Headline
● అత్యవసర పరిస్థితుల్లోనూ వైద్యుల నిర్లక్ష్యం ● వేరే ఆస్పత్రులకు రెఫర్ చేస్తూ చేతులుదులుపుకొంటున్నారని ఆవేదన ● వరుస ఘటనలు.. వైద్యుల నిర్లక్ష్యంపై పలువురి ఆందోళనలు ● జిల్లా ఆస్పత్రిని సందర్శించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ● వైద్యులు, సిబ్బంది తీరుపై ఫిర్యాదుల వెల్లువ -
కొత్త కోర్సులు...
పీయూ పరిధిలో సుమారు 31 వేల సీట్ల భర్తీకి ప్రతి సంవత్సరం ప్రభుత్వం అనుమతి ఇస్తున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో భర్తీ కావడం లేదు. గత సంవత్సరం 50 శాతం కూడా సీట్లు భర్తీ కాలేదు. ఈక్రమంలో సీట్ల భర్తీని పెంచేందుకుగాను ప్రభుత్వం వృత్తి ఆధారిత కోర్సులను తీసుకువచ్చింది. అందులో భాగంగా మహబూబ్నగర్ ఎంవీఎస్, ఎన్టీఆర్ కళాశాలలతో పాటు జడ్చర్లలోని బీఆర్ఆర్ కళాశాలల్లో కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. బీఏ (హెచ్ఈపీ) స్పెషల్ కోర్సులో జర్నలిజం, అంతర్జాతీయ రాజకీయాలు, పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సిలబస్లో మార్పులు తెచ్చారు. ఇక బీఎస్సీలో ఫార్మారంగంలో సేల్స్, మార్కెటింగ్లో సులభంగా ఉద్యోగాలు పొందేవిధంగా కొత్త కోర్సు ఉంది. బీకాం విభాగంలో ఫైనాన్స్ కోర్సు తీసుకువచ్చారు. బీబీఏలో రీటేయిల్ ఆపరేషన్ వంటి కోర్సులు ఉన్నాయి. వీటిలో వారానికి మూడు రోజుల పాటు విద్యాబోధన, మూడు రోజులు ఇంటర్న్షిప్ ఉండనుంది. -
ముఖ్యనేతల పనితీరుపైనా..
కొడంగల్ నియోజకవర్గంలో 50వేల మెజార్టీ ఇవ్వాలని సభావేదికగా ప్రజలకు విజ్ఞప్తి చేసిన రేవంత్రెడ్డి.. ఆ నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో పోలింగ్కు నాలుగైదు రోజుల ముందు హైదరాబాద్లో సమావేశమై అనుసరించాల్సి వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. అయితే పోలింగ్ అనంతరం కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు, కోస్గి, దౌల్తాబాద్తో పాటు ఇతర నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో సైలెంట్గా క్రాస్ ఓటింగ్ సాగినట్లు ప్రచారం చోటుచేసుకుంది. దీనిపై పార్టీలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాగా.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మండలాలు, గ్రామాలు, బూత్ల వారీగా నిశితంగా పరిశీలించి ఎక్కడెక్కడ క్రాస్ ఓటింగ్ జరిగింది? అక్కడ కాంగ్రెస్ నాయకులు ఎందుకు పసిగట్టలేకపోయారు? వారు ప్రజల మధ్య తిరిగారా..లేదా? వంటి వివరాలతో సమగ్ర నివేదిక అందజేయాలని వేగులను ఆదేశించినట్లు సమాచారం. అనుకూల, ప్రతికూల అంశాలతో పాటు కాంగ్రెస్ నియోజకవర్గ ముఖ్య నేతల పనితీరుపైనా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసినట్లు వినికిడి. ఈ బాధ్యతను తనకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న ఒకరికి అప్పగించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
No Headline
‘గట్టు మండలం బోయలగూడెంకు చెందిన నిండు గర్భిణి సుజాతకు ఈ నెల 1వ తేదీన నొప్పులు రావడంతో జిల్లా ఆస్పత్రికి వచ్చింది. అయితే, జిల్లా ఆస్పత్రిలో రేడియాలజీ సిబ్బంది లేరని.. కడుపులో బిడ్డ ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ప్రైవేట్ ల్యాబ్లో స్కానింగ్ చేయించుకురావాలని వైద్యులు చెప్పి చేతులు దులుపుకొన్నారు. తీరా గర్భిణికి 6వ తేదీన పురిటి నొప్పులు రావడం, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో తిరిగి జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షించి కడుపులోనే పసికందు మృతిచెందిందని గుర్తించి ఆపరేషన్ చేసి మృత శిశువును బయటికి తీశారు. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి పర్యాంతమయ్యారు.’ -
భక్తిశ్రద్ధలతో వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణోత్సవం
మల్దకల్: మండల కేంద్రంలో వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణోత్సవం మంగళవారం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా మహాహోమం నిర్వహించి, స్వామి వారి ఉత్సవమూర్తులకు కల్యాణం జరిపించారు. ఈ కల్యాణోత్సవ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మల్లికార్జునాచారి, పరమేశ్వర చారి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈదమ్మ దేవరకు ఏర్పాట్లు ఉండవెల్లి: మండల కేంద్రంలో ఈ నెల 21న ఈదమ్మ దేవర నిర్వహించనున్నట్లు రైతు సంఘం నాయకులు తెలియజేశారు. మంగళవారం ఊరవాకిలిలో నవధాన్యాలను పెద్దలు కుండిలో పోశారు. మొల్క రావాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 21న దేవరకు మొక్కులు చెల్లించుకుంటారని తెలియజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం సభ్యులు, పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఘనంగా శేషదాసుల ఆరాధనోత్సవాలు మల్దకల్: మండల కేంద్రం స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శేషదాసుల ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం పంచామృతాభిషేకం, ధన్వంతరి హోమం నిర్వహించారు. వేదపండితుల ఆధ్వర్యంలో సంస్థాన పూజలు నిర్వహించారు. భక్తులకు వేదపండితులు దాసుల వారి ప్రవచనాలు వివరించారు. భజన మండలి సభ్యులతో ప్రత్యేక భజన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా శేషదాసుల వంశస్తులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, శేషదాసుల వారి వంశస్తులు దీరేంద్రదాసు, రాఘవేంద్రదాసు, విష్ణుదాసు, శశాంకదాసు, శేషగిరిరావు, అరవిందరావు, చంద్రశేఖర్రావు, నాగరాజుశర్మ, బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
ఈవీఎంల మొరాయింపు..
● కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రంలోని పోలింగ్స్టేషన్ 67లో సాంకేతిక సమస్యతో ఈవీఎం మొరాయించింది. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్కు అంతరాయం ఏర్పడింది. దీంతో ఓటు వేయడానికి వచ్చిన వాళ్లు అసహనంతో తిరిగి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 12 తర్వాత మరో ఈవీఎంను ఏర్పాటు చేయగా.. పోలింగ్ తిరిగి ప్రారంభమైంది. ఇదే మండలంలోని కొత్తపల్లి పోలింగ్స్టేషన్ 101లో, 83లో సైతం ఈవీఎంలు మొరాయించాయి. కానుకుర్తిలోని 69వ బూత్లో అరగంట పాటు ఆలస్యంగా ఆరంభమైంది. ● జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్లోని పోలింగ్ స్టేషన్ 81లో ఉదయం 11:30 గంటలకు ఈవీఎం మొరాయించింది. అధికారులు వెంటనే మరో ఈవీఎంను ఏర్పాటు చేశారు. మిడ్జిల్ మండలం వేముల గ్రామంలోని 255 పోలింగ్ సెంటర్లో వీవీ ప్యాట్ మొరాయించగా.. అధికారులు సరిచేశారు. నవాబుపేట మండలంలోని లింగంపల్లి పోలింగ్ స్టేషన్ 15లో ఉదయం 7.15 గంటలకు కరెంట్ పోయింది. సుమారు 20 నిమిషాల తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. అప్పటి వరకు పోలింగ్ సిబ్బంది టార్చిలైట్ వెలుతురులో పోలింగ్ కొనసాగించారు. ● మక్తల్ నియోజకవర్గం కృష్ణా మండలం కున్సిలోని పోలింగ్స్టేషన్ 74లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈవీఎం సతాయించింది. గంట పాటు పోలింగ్కు అంతరాయం కలిగింది. ఉట్కూర్లోని 37,38 బూత్లలో అరగంట పాటు ఈవీఎంలు మొరాయించాయి. అధికారులు సాంకేతిక లోపాన్ని సరిచేయడంతో ఓటింగ్ కొనసాగింది. ● దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం కానాయపల్లిలోని పోలింగ్ స్టేషన్ 260లో ఈవీఎం మొరాయించింది. గంట తర్వాత ఆన్ కావడంతో పోలింగ్ కొనసాగింది. భూత్పూరు మున్సిపాలిటీలోని తొమ్మిదో బూత్లో కాసేపు ఈవీఎం మొరాయించింది. అధికారులు పరిద్ది వెంటనే పోలింగ్ ప్రారంబించారు. ● నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనూ పలుచోట్ల మాత్రం ఈవీఎం మొరాయింపుతో పోలింగ్ ఆలస్యమైంది. జోగుళాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం గంగన్పల్లిలో, నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వెంకటేశ్వరబావిలోని రెండు పోలింగ్కేంద్రాల్లో, ఊర్కొండ మండలం రాంరెడ్డిపల్లిలో ఈవీఎం మొరాయింపుతో పోలింగ్ ఆలస్యమైంది. కొద్దిసేపటి తర్వాత అధికారులు ఈవీఎం మిషన్లను పునరుద్ధరించడంతో పోలింగ్ ప్రారంభమైంది -
నాగర్కర్నూల్లో 69.01 %, మహబూబ్నగర్లో 71.66 %
● గత ఎన్నికలతో పోలిస్తే రెండు స్థానాల్లోనూ పెరిగిన ఓటింగ్ శాతం ● బ్యాటరీ పరిశ్రమ వద్దంటూ ఎదిరలో గ్రామస్తుల ఎన్నికల బహిష్కరణ ● గుట్ట మైనింగ్ అనుమతులు నిలిపియాలని మైలారం వాసులు సైతం ● అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ సైలెంట్గా క్రాస్ ఓటింగ్..! ● పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు ● భారీ భద్రత మధ్య స్ట్రాంగ్రూమ్లకు ఈవీఎంల తరలింపు ● గెలుపుపై ఎవరి ధీమా వారిదే.. జూన్ 4న ఓట్ల లెక్కింపు -
No Headline
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి నాగర్కర్నూల్ లోక్సభ ఎన్నికల పోరు ముగిసింది. ఓటర్లు తమ తీర్పును ఇచ్చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో సోమవారం ఉదయం ఏడు గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ క్రమక్రమంగా పుంజుకుంది. నిర్దేశిత సమయం సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసే నాటికి మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో 71.66 శాతం, నాగర్కర్నూల్లో 69.01 శాతం పోలింగ్ నమోదైంది. మహబూబ్నగర్ పరిధిలో పోలింగ్ ముగిసిన వెంటనే సిబ్బంది ఈవీఎంలు, వీవీప్యాట్లతో పాటు ఎన్నికల సామగ్రిని పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య జిల్లాకేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలోని పరీక్షల విభాగంలో, నాగర్కర్నూల్ పరిధిలో జిల్లాకేంద్రంలోని నెల్లికొండలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూంలకు తరలించారు. జూన్ నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. రెండు లోక్సభ సెగ్మెంట్లలో సైలెంట్గా క్రాస్ ఓటింగ్ కొనసాగినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్వల్ప తోపులాట.. మక్తల్ నియోజకవర్గ పరిధిలోని ఉట్కూరు మండలం మల్లెపల్లి, నారాయణపేట సెగ్మెంట్లోని కోయిల్కొండ మండలం మల్కాపూర్, పెర్కివీడు గ్రామాల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. ఎదిర వాసుల పోలింగ్ బహిష్కరణ మహబూబ్నగర్ అర్బన్ మండలంలోని నాలుగో వార్డుకు చెందిన ఎదిర వాసులు పోలింగ్ను బహిష్కరించారు. ఈ వార్డు సమీపంలో అమరరాజా బ్యాటరీ పరిశ్రమకు కొన్ని నెలల క్రితం శంకుస్థాపన చేశారు. కాలుష్యంతో తమ బతుకులు ఆగమవుతాయంటూ అమరరాజా బ్యాటరీ పరిశ్రమ వ్యతిరేక పోరాట సమితి పేరిట స్థానికులు కొన్ని రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటును విరమించుకోవాలంటూ తీర్మానించుకున్న వారు సోమవారం పోలింగ్ను బహిష్కరించారు. అధికారులు వచ్చి సముదాయించినా.. సాయంత్రం వరకు స్పందించలేదు. ఇక్కడ మొత్తం 3,300 ఓట్లు ఉండగా.. 130 ఓట్లు పోలైనట్లు సమాచారం. -
పెరిగిన పోలింగ్ శాతం..
● మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, కొడంగల్, షాద్నగర్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 16,82,470 మంది ఓటర్లు ఉండగా, సాయంత్రం ఆరు గంటల వరకు 71.66 శాతం ఓట్లు పోయ్యాయి. గత ఎన్నికల్లో 65.38 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ సారి 6.28 శాతం ఓటింగ్ పెరిగింది. ● నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో అచ్చంపేట. నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, గద్వాల, అలంపూర్, వనపర్తి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 17,38,254 మంది ఓటర్లు ఉండగా, 69.01 శాతం ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో 62.23 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ సారి 6.78 శాతం ఓటింగ్ పెరిగింది. -
జిల్లాలో..
●●● కలెక్టర్ బీఎం సంతోష్ తన ఓటుహక్కును గద్వాల వేణుకాలనీలోని 215పోలింగ్ కేంద్రంలో, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఆయన భార్య మాజీ సర్పంచ్ బండ్ల జ్యోతి ఽవారి సొంత గ్రామం బూరెడ్డిపల్లెలో, గద్వాల మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ గద్వాలలో, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు బండ్ల చంద్రశేఖర్రెడ్డి, ఆయన సతీమణి మాజీ మార్కెట్యార్డు చైర్పర్సన్ లక్ష్మీదేవి, బండ్ల రాజశేఖర్రెడ్డి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉండవెల్లి మండలం పుల్లూరులో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మానవపాడు మడలం జల్లాపురంలో జెడ్పీచైర్పర్సన్ సరిత కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే, అయిజ మండలం చిన్నతాండ్రపాడులో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఇటిక్యాల మండలంలో కొండేరులో మాజీ ఎంపీ మందా జగన్నాథం, ఆయన కుమారుడు మందా శ్రీనాథ్ ఓటు వేశారు. అలాగే, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కుమార్తె స్వేచ్ఛ అమెరికా నుంచి అలంపూర్కు చేరుకొని మొ దటి సారి ఓటు హక్కు వినియోగించుకుంది. ● జెడ్పీ చైర్పర్సన్ సరిత సోమవారం నల్లకుంటలోని పోలింగ్కేంద్రాన్ని సందర్శించారు. అయితే పోలింగ్ కేంద్రంలో బీజేపీ పార్టీ గుర్తుతో కూడిన పోల్చీటీ కనిపించడంతో విషయాన్ని కలెక్టర్ బీఎం సంతోష్కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ● అయిజ పట్టణం 69పోలింగ్ కేంద్రంలో ఉదయం అర గంట వరకు ఈవీఎం మిషన్ మొరాయించింది. మరమ్మతు చేయడంతో అనంతరం ప్రారంభించారు. ● జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్పీ రితిరాజ్ పర్యవేక్షించారు. జిల్లాలోని సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు అక్కడి సిబ్బందికి సూచనలు ఇస్తూ పటిష్ట చర్యలు తీసుకున్నారు. ● పోలింగ్ ముగిసిన అనంతరం ఓటర్ల తీర్పుతో నిక్షిప్తమైన ఈవీఎంలు, వీవీప్యాట్ కంట్రోల్ యునిట్స్ను ఎన్నికల నిర్వహణ అధికారులు తిరిగి పంపిణీ కేంద్రానికి తరలించారు. కేంద్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లో పీఓలు, ఏపీఓలు, సేక్టోరియల్, తహశీల్దార్ల సమక్షంలో ఆర్డీఓ రామచందర్ పర్యవేక్షణలో వాటిని అందజేశారు. -
సైలెంట్గా ‘క్రాస్’ ఓటింగ్ !
జనరల్ స్థానమైన మహబూబ్నగర్తో పాటు ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని దాదాపు అన్ని అసెంబ్లీ స్థానాల్లో సైలెంట్ ఓటింగ్ కొనసాగినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి 31 మంది, నాగర్కర్నూల్లో 19 మంది బరిలో ఉన్నారు. ఈ రెండు స్థానాల్లోనూ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యే పోరు కొనసాగింది. ఉదయం మందకొడిగా.. తొమ్మిది తర్వాత కొంత పుంజుకోవడం.. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి తగ్గడం.. చివరి రెండు గంటల్లో అధిక సంఖ్యలో ఓటర్లు బారులుదీరిన క్రమంలో సైలెంట్ ఓటింగ్ కొనసాగినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు మహబూబ్నగర్ పార్లమెంట్లోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో క్రాస్ఓటింగ్ జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా రెండు పార్టీల అభ్యర్థుల మధ్యే పోరు కొనసాగింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పడ్డ పార్టీకి చెందిన ఓట్లు వేరే పార్టీ అభ్యర్థికి క్రాస్ అయినట్లు తెలుస్తోంది. ఇదే పరిస్థితి నాగర్కర్నూల్ పార్లమెంట్లోని అసెంబ్లీ సెగ్మెంట్లలో సైతం చోటుచేసుకున్నట్లు జిల్లాలో చర్చ జోరుగా సాగుతోంది. -
పోలింగ్ అంచనాలు (శాతాల్లో)..
నాగర్కర్నూల్మహబూబ్నగర్9.81%10.33%27.74%26.99%45.15%45.84%58.92%57.17%68.04%66.21%71.66%69.01% -
ఓటేసిన ప్రజాప్రతినిధులు..
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం గుండూరులో బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ప్రసాద్, ఎంపీ రాములు కుటుంబసభ్యులతో కలసి ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలంపూర్ నియోజకవర్గకేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. కొల్లాపూర్ పట్టణంలో మంత్రి జూపల్లి కృష్ణారావు,వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండలం తిర్మలాపూర్లో రాష్ట్ర ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లా తూడుకుర్తిలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి, తెలకపల్లి మండలం గౌరారంలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, అమ్రాబాద్ మండలం ఎల్మపల్లిలో ఎమ్మెల్యే వంశీకృష్ణ, తలకొండపల్లి మండలం ఖానాపూర్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, గద్వాల పట్టణంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఉండవెల్లి మండలం పుల్లూరులో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు ఓటువేశారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- దాడిచేసింది వారు.. మాపై కేసులా?
- అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
- Rahul Gandhi: మోదీ నాతో చర్చకు రారు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- Lok Sabha elections 2024: ఐదో దశకు ముగిసిన ప్రచారం
- బిభవ్ కుమార్ అరెస్ట్
- డిగ్రీకి డిగ్నిటీ...పీజీకి ఫుల్ పవర్
- Delhi Chief Minister Arvind Kejriwal: బీజేపీ ఆఫీస్కొస్తాం
Advertisement