-
విజయ్ సేతుపతి కొత్త సినిమా.. టీజర్ చూశారా?
అభిమానుల గుండెల్లో మక్కల్ సెల్వన్గా నిలిచిపోయిన విజయ్ సేతుపతి పాన్ ఇండియా నటుడిగానూ సత్తా చాటుతున్నారు. ఆ మధ్య హిందీలో షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ చిత్రంలో విలన్గా అదరగొట్టారు. ప్రస్తుతం ఆయన నటించిన తమిళ చిత్రం మహారాజ త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇది ఆయన నటించిన 50వ చిత్రం కావడం గమనార్హం.హీరోయిన్ ఎవరంటే?తన 51వ చిత్రానికి ఏస్ అనే టైటిల్ను ఖరారు చేశారు. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా యోగిబాబు, పీఎస్. అవినాష్, దివ్యా పిళ్లై, బబ్లు, రాజ్కుమార్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఆర్ముగకుమార్ దర్శకత్వంలో 7సీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని, కరణ్ బహదూర్ చాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను శుక్రవారం విడుదల చేశారు. కలర్ఫుల్ పోస్టర్ఇందులో విజయ్ చేతిలో సిగార్, వెనుక భాగంలో స్మిమ్మింగ్ టబ్, చుట్టూ చదరంగం డైస్తో పోస్టర్ కలర్ఫుల్గా ఉంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో యోగిబాబు చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని చిత్ర యూనిట్ పేర్కొంది. Presenting the quirky Title Teaser of #ACE🔥Not just a card but a Game Changer!😎#MakkalSelvan #VijaySethupathi51 @VijaySethuOffl @7CsPvtPte @Aaru_Dir @justin_tunes @rukminitweets @iYogiBabu #BablooPrithiveeraj #KaranBRawat #Avinashbs @R_Govindaraj @rajNKPK pic.twitter.com/F2O6A0RDo1— 7Cs Entertaintment (@7CsPvtPte) May 18, 2024 చదవండి: ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది -
అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..
ఇండస్ట్రీలోకి వచ్చి చాన్నాళ్ల అవుతున్నప్పటికీ తమిళ యువ హీరోయిన్ ధన్సికకు సరైన బ్రేక్ రాలేదు. దీంతో తన పేరుని సాయి ధన్సికగా మార్చుకుంది. త్వరలో 'ది ప్రూఫ్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్న ఈమె.. ఈ చిత్ర ప్రమోషన్ల భాగంగా ముద్దు, బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: హీరోయిన్ పూజా హెగ్డేకి బంపరాఫర్.. ఏకంగా 10 ఏళ్ల తర్వాత!)'మనదోడు మళైక్కాలం' సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ధన్సిక.. పలు చిత్రాల్లో నటించింది. కానీ రజినీకాంత్ 'కబాలి'లో ఆయనకు కూతురిగా చేసిన తర్వాత పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత సినిమాలు చేస్తోంది గానీ సక్సెస్ మాత్రం రావడం లేదు. దీంతో తన పేరుని ధన్సిక నుంచి సాయి ధన్సికగా మార్చుకుంది. మరి ఈసారైనా ఆమె కోరుకున్న హిట్ వస్తుందేమో చూడాలి.ఇకపోతే తాను గ్లామర్ పాత్రల్లో నటించలేనని, ఎందుకంటే అలాంటి పాత్రలకు తాను సెట్ అవ్వనని సాయి ధన్సిక చెప్పింది. కావాలనే కొందరు దర్శకులు తనపై గ్లామర్ ముద్రని బలవంతంగా రుద్దుతారు. గ్లామర్గా నటించడం అనేది కథని బట్టి ఉంటుందని ధన్సిక చెప్పింది. తనకు బెడ్రూమ్, ముద్దు సన్నివేశాల్లో నటించడం ఇష్టం ఉండదని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: సీరియల్ నటి పవిత్రా జయరాం కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!) -
చెన్నై విమానాశ్రయంలో రూ.20 కోట్ల కొకైన్ స్వాధీనం
అన్నానగర్ (చెన్నై): దుబాయ్ నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న రూ.20 కోట్ల విలువైన కొకైన్, రూ.2 కోట్ల విలువ గల మత్తు మాత్రలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతున్న విమానంలో భారీగా మత్తు పదార్థాలు తరలిస్తున్నట్లు చెన్నై జోన్ సెంట్రల్ నార్కోటిక్స్ కంట్రోల్ యూనిట్ డైరెక్టర్ అరవిందన్కు శుక్రవారం సమాచారం అందింది. దీంతో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్, యాంటీ నార్కోటిక్స్ విభాగం అధికారులు తనిఖీ చేశారు.బొలీవియాకు చెందిన ఓ యువతి బ్యాగ్లో ఉన్ని దుస్తుల లోపల దూది మధ్య డ్రగ్స్ను దాచినట్లు గుర్తించారు. ఆమె నుంచి రూ. 20 కోట్ల విలువైన కిలో 800 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. బొలీవియా యువతితోపాటు ముంబైలో నివసిస్తున్న బ్రెజిల్కు చెందిన మహిళ సహా మరో ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. అదేవిధంగా నెదర్లాండ్స్ నుంచి బెంగళూరు, పుదుచ్చేరి చిరునామాలతో రెండు పార్సిళ్లు కస్టమ్స్ విభాగానికి చెందిన పోస్టాఫీసుకు వచ్చాయి. ఆ పార్సిళ్లను కస్టమ్స్, నార్కోటిక్స్ కంట్రోల్ యూనిట్ అధికారులు తనిఖీ చేశారు. అందులో రూ.2 కోట్ల విలువైన కిలో 400 గ్రాముల మత్తు మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి బెంగళూరులో ఉంటున్న ఇద్దరు నైజీరియన్ యువకులను అరెస్టు చేశారు. -
కనులపండువగా పుష్పపల్లకీ ఉత్సవం
వేలూరు: వేలూరు జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన గుడియాత్తం గంగమ్మ శిరస్సు జాతర ఘనంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన గురువారం రాత్రి పుష్ప పల్లకీ ఉత్సవం అతి కనులపండువగా జరిగింది. ముందుగా గుడియాత్తం గోపాలపురం యువజన సంఘం ఆధ్వర్యంలో శివలింగం, వినాయకుడి స్వామిని అలంకరించి పుష్పపల్లకీలో ఆశీనులు చేశారు. అప్పటికే పల్లకీలో ఉంచిన అమ్మవారిని పుష్పాలతో అలంకరించడంతో పాటు పల్లకీని మల్లెపూలతో అలంకరించారు. అలాగే గుడియాత్తం తండ్రాంబట్టు పూల వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో 68వ సంవత్సర పుష్పపల్లకీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ పల్లకిని 14 అడుగుల ఎత్తులో అలంకరించడంతో భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి పూర్తిగా ఐదు పుష్పరథాలు గుడియాత్తంలోని పలు వీధుల్లో విహరించాయి. ఈ పుష్పపల్లకీల ముందు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పుష్ప పల్లకీ ఉత్సవంలో పుదియ నీది పార్టీ నిర్వాహకులు ఏసీ షణ్ముగం పాల్గొన్నారు. -
క్లుప్తంగా
వైభవంగా వీరరాఘవుని పవిత్రోత్సవం తిరువళ్లూరు: పట్టణంలోని వైద్యవీరరాఘవుడి ఆలయంలో పవిత్రోత్సవం గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. వైద్యవీరరాఘవుడి ఆలయంలో ప్రతి ఏడాది వైశాఖ మాసంలో ఐదు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే గురువారం రాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలు సోమవారం వరకు జరగనున్నా యి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం ఐదుగంటలకు ఆలయం నుంచి స్వామివారు వాస్తుమండపానికి ఊరేగింపుగా వచ్చా రు. సాయంత్రం 5.30 గంటలకు తిరుమంజనం నిర్వహించారు. శ్రీదేవిభూదేవి సమేత వైద్యవీరరాఘవ స్వామివారికి విశేషాలంకరణ చేసి, భక్తులకు దర్శనం కల్పించారు. రాత్రి 7.45 గంటలకు స్వామి వారు తిరిగి ఆలయానికి చేరుకున్నారు. రూ.18 లక్షల విదేశీ కరెన్సీ స్వాధీనం అన్నానగర్: చైన్నె విమానాశ్రయంలో రూ.18 లక్షల విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. విమానాశ్రయం నుంచి శుక్రవారం అబుదాబికి వెళ్లే ప్రయాణికులను చైన్నె విమానాశ్రయ భద్రతా అధికారులు పరీక్షించారు. ఆ సమయంలో చైన్నెకి చెందిన మహ్మద్ ఫైసల్ (30) పర్యాటకుడిగా అబుదాబికి వచ్చాడు. అతని సూట్కేస్ను స్కాన్ చేయగా, ఒక రహస్య కంపార్ట్మెంట్లో యూఎస్. డాలర్ దాచినట్లు గుర్తించారు. సూట్కేస్లో దాచిన రూ.18 లక్షల విలువైన అమెరికా డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. వారు మహ్మద్ ఫైసల్ విమాన ప్రయాణాన్ని కూడా రద్దు చేశారు. అనంతరం అతడిని, స్వాధీనం చేసుకున్న రూ.18 లక్షల విదేశీ కరెన్సీని చైన్నె ఎయిర్పోర్ట్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ అధికారులకు అప్పగించారు. -
ఆక్రమణల తొలగింపునకు నోటీసులు
● తిరువేర్కాడులో రాస్తారోకో ● 105 మంది అరెస్టు తిరువళ్లూరు: నీటి ఆధారిత ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణలను తొలగించాలన్న కోర్టు ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేయడానికి వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. తిరువళ్లూరు జిల్లా తిరువేర్కాడు పెరుమాళ్ ఆలయ వీధిలో 300 కుటుంబాలు కూవంనది పరివాహక ప్రాంతాల్లో నివాసం వుంటున్నారు. ఇక్కడి నివాసాలు తరచూ ముంపునకు గురికావడంతో పాటు నీటి ఆధారిత ప్రాంతంగా గుర్తించి పీడబ్ల్యూడీ, రెవెన్యూ అధికారులు నివాసాలను తొలగించాలని నిర్ణయించారు. ఇందుకు స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఆక్రమణలను తొలగించాలని నిర్ణయించిన క్రమంలో శుక్రవారం ఉదయం పీడబ్ల్యూడీ, రెవెన్యూ అధికారులు తిరువేర్కాడులోని పెరుమాళ్ ఆలయ వీధికి వెళ్లి ఆక్రమ కట్టడాలను గుర్తించి వారికి నోటీసులు అంటించే ప్రయత్నం చేశారు. ఇందుకు స్థానికులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ నోటీసులు ఇవ్వడానికి వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. అయినా అధికారులు వెనక్కి తగ్గకుండా కట్టడాలకు నోటీసులు అంటించే ప్రక్రియను ప్రారంభించారు. దీంతో స్థానికులు తిరువేర్కాడు రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. ఏళ్ల తరబడి వుంటున్న తమను వెళ్లిపోమనడం దారుణమన్నారు. రాస్తారోకోతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలిసి సంఘటన స్థలానికి డిప్యూటీ కమిషనర్ ఐమన్ జమాల్ నేతృత్వంలోని పోలీసులు వెళ్లి ఆందోళనకారులను అడ్డుకుని ట్రాఫిక్ను పునరుద్ధరించారు. అనంతరం 105 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. అధికారులు కట్టడాలకు నోటీసులు అంటించే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. దీంతో తిరువేర్కాడులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. -
తిరుమళిసై పంచాయతీ అధ్యక్షుడు మృతి
తిరువళ్లూరు: శ్రీపెరంబదూరు జిల్లా మన్నూర్ క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చిక్సిత పొందుతున్న తిరుమళిసై మేజర్ పంచాయతీ అధ్యక్షుడు, డీఎంకే నేత వడివేల్ మృతిచెందారు. తిరువళ్లూరు జిల్లా తిరుమళిసై మేజర్ పంచాయతీ అధ్యక్షుడు వడివేలు(61) డీఎంకే సీనియర్ నేత. ఇతనికి భార్య సుమతితో పాటు ఇద్దరు పిల్లలు వున్నారు. గత ఆదివారం తన వియ్యంకుడితో కలిసి శ్రీపెరంబదూరు సమీపంలోని మన్నూరు క్రాస్రోడ్డు వద్ద వున్న మామిడితోటకు వెళ్లాడు. మధ్యాహ్నం మామిడి తోట నుంచి వలర్పురం వచ్చి భోజనం చేసి తిరిగి కారులో తన తోటకు బయలుదేరాడు. మన్నూరు క్రాస్రోడ్డు వద్ద కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో వడివేలుకు తీవ్రగాయం కాగా వియ్యంకుడికి స్వల్పగాయమైంది. వెంటనే స్థానికులు గాయపడ్డ ఇద్దరిని సమీపంలోని సవిత వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం రామచంద్ర వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వడివేలు శుక్రవారం మృతిచెందాడు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. -
చెట్లు, పక్షులను కాపాడుకోవాలని కోరుతూ..
● నేపాల్కు యువకుడి ప్రయాణంతిరువళ్లూరు: చెట్లు, పక్షులను కాపాడుకోవడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలన్న అంశంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి తిరువళ్లూరుకు చెందిన యువకుడు పాదయాత్రగా తొ మ్మిది రాష్ట్రాల మీదుగా నేపాల్కు పయనమయ్యా డు. తిరువళ్లూరు ఎడపాళ్యం ప్రాంతానికి చెందిన ఉదయకుమార్. ఇతను చైన్నె మధురవాయల్లోని ప్రైవేటు కళాశాలలో ఫిజియోఽథెరపిస్టు కోర్సులో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచే మొక్కలు, పక్షుల పెంపకంపై ఉదయకుమార్కు ఆసక్తి ఎక్కువగా ఉండేది. అయితే ఇటీవల రోడ్లు విస్తరణ పేరిట చెట్లను నరికివేయడం, వ్యవసాయభూములను ప్లాట్లుగా మార్చడం, సెల్ఫోన్ టవర్ల ఏర్పాటు వల్ల పక్షులు కనుమరుగవడంతో కలత చెంది ప్రజలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలని నిర్ణయంచాడు. ఇందులో భాగంగానే గత ఏడాది మే నెలలో తిరువళ్లూరు నుంచి ఏడు రాష్ట్రాల మీదుగా గోవా వరకు 1,200 కిలోమీటర్ల మేరకు సైకిల్ ప్రయాణం చేసి మొక్కలు నాటడడంపై అవగాహన కల్పించాడు. ఇందులో భాగంగానే రెండో విడత పాదయాత్రకు ఉదయకుమార్ శ్రీకారం చుట్టాడు. తిరువళ్లూరు నుంచి ప్రారంభమైన పాదయాత్ర నేపాల్ వరకు సాగనుంది. పాదయాత్రలో భాగంగా తిరువళ్లూరుకు వచ్చిన యువకుడిని ఎస్ఐ రవిచంద్రన్ అభినందించారు. అనంతరం అక్కడ మొక్కలను నాటి అక్కడున్న పోలీసులకు మొక్కలను పంపిణీ చేసి వెళ్లాడు. -
ఆహారశాఖ అధికారుల తనిఖీలు
కొరుక్కుపేట: పానీపూరి తయారీ కేంద్రాల్లో ఆహారశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నాసిరకం జీలకర్ర, వస్తువులను స్వాదీనం చేసుకున్నారు. తిరుపూర్ జిల్లా అవినాసిలో అపరిశుభ్రంగా తయారవుతున్న పానీపూరీలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు అందడంతో ఆయన ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా ఆహార భద్రతాశాఖ అధికారి విజయలలితాంబిక అవినాసీలో పానీపూరీ తయారుచేసే పలు ప్రాంతాల్లో ఆహార భద్రతపై ఆదేశాలు జారీ చేశారు. ఆహారభద్రతాధికారులు స్టాలిన్ బి రాబు, హెల్త్ ఇన్న్స్పెక్టర్ కరుప్పసామి మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. అవినాసి కై కటిపుత్తూరు, కోయంబత్తూరు రోడ్డు, అంచలగరోడ్ సహా 5చోట్ల పానీపూరీ తయారు చేస్తున్న వస్తువులపై పరీక్షలు నిర్వహించారు. అప్పట్లో అపరిశుభ్రంగా తయారు చేసిన120 లీటర్ల జీలకర్ర మిశ్రమం, 20 కిలోలు గోధుమ పిండి, చెడిపోయిన బంగాళదుంప, కలర్ పౌడర్ను సీజ్ చేశారు. నాసిరకం ఆహారోత్పత్తుల తయారీపై 9444042322 నంబర్కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. -
ఐసరి ఒప్పుకుంటారని అనుకోలేదు!
తమిళసినిమా: యువ సంగీతదర్శకుడు, నటు డు హిప్హాప్ ఆది కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం పీటీ సార్. చిత్రానికి ఆయనే సంగీతం అందించారు. సంగీత దర్శకుడిగా హిప్హాప్ ఆదికి ఇది 25వ చిత్రం కావడం గమనార్హం. కాగా నటి నక్షత్ర పరదేశీ నాయకిగా నటించిన ఇందులో అనికా సురేంద్రన్, కే.భాగ్యరా జ్, ప్రభు, త్యాగరాజన్, పాండ్యరాజన్, మదువంతి, దేవదర్శిని ముఖ్య పాత్రలు పోషించారు. వేల్స్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై డా.ఐసరి కే.గణేశ్ నిర్మించిన ఈ చిత్రానికి కార్తీక్ వేణుగోపాలన్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న పీటీసార్ ఈనెల 24న తెరపైకి రానుంది. గురువారం సాయంత్రం చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని స్థానిక ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించారు. దర్శకుడు కార్తీక్ వేణుగోపాలన్ మా ట్లాడుతూ కథ విన్న వెంటనే నటించడానికి స మ్మతించిన హిప్హాప్ ఆదికి ధన్యవాదాలు అ న్నారు. ఇది చాలా జాలీ చిత్రం అని చెప్పా రు. నిర్మాత ఐసరి గణేశ్ మాట్లాడుతూ వేల్స్ ఫిలింస్ సంస్థలో ఒక మంచి చిత్రాన్ని నిర్మించిన సంతృప్తి పీటీసార్తో కలిగిందన్నారు. హిప్హాప్ ఆది మాట్లాడుతూ 4 ఏళ్ల తరువాత సంగీతాన్ని అందించిన అరణ్మణై 4 చిత్రానికి అందరూ అభినందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక ప్రేక్షకుడిగా చెబుతున్నా నని ఈ చిత్రం తొలి భాగం అట్టహాసంగా ఉంటుందని, రెండో భాగం ఎమోష నల్గా సాగుతుందని, క్లైమాక్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పారు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఐసరి గణేశ్ ఒప్పుకుంటారని తాను అనుకోలేదన్నారు. అయితే కథ విన్న తరువాత ఇది మనం చేయాల్సిన చిత్రం అని ఆయన అన్నారన్నారు. సంగీత దర్శకుడిగా 25 చిత్రాలను పూర్తి చేసిన సందర్బంగా చిత్ర యూని ట్ ఆయనకు పూలమాల వేసి సత్కరించింది. పీటీ సార్ చిత్ర యూనిట్ -
తిరుత్తణిలో వర్షం
తిరుత్తణి: పట్టణ పరిసర ప్రాంతాల్లో ఎండల తీవ్రతతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో శుక్రవారం కురిసిన వర్షంతో ప్రజలకు ఉపశమనం కలిగింది. దీంతో జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరువళ్లూరు జిల్లా తిరుత్తణిలో మూడు నెలలుగా ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచే చల్లని గాలి వీయడంతో పాటు ఎండ తీవ్రత తగ్గి, సాయంత్రం తిరుత్తణి, పళ్లిపట్టు, ఆర్కేపేట ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. దీంతో పాటు చల్లటి గాలి వీయడంతో ప్రజలకు ఉపశమనం కలిగింది. -
వైవిధ్యభరిత కథల్లో వెట్రి
పగలరియాన్ ఆడియోను ఆవిష్కరించిన చిత్ర యూనిట్ తమిళసినిమా: 8 తూట్టాక్కల్ చిత్రం ఫేమ్ వెట్రి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం పగలరియాన్. నటి అక్షయ కందముదన్ నాయకిగా నటించిన ఇందులో సాయిదీనా కీలక పాత్రలో నటించారు. రిషీకేష్ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై లతామురుగన్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా మురుగన్ దర్శకుడిగా పరిచయమై ప్రధాన పాత్రలో నటించారు. వివేక్ సారో సంగీతం, అభిలాష్ పీఎంవై చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. గురువారం చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించారు. ఇందులో దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్వీ ఉదయకుమార్, కార్యదర్శి పేరరసు, సుబ్రమణియన్ శివ పాల్గొన్నారు. దర్శకుడు మురుగన్ మాట్లాడుతూ పలు రకాల సమస్యలను ఎదుర్కొని ఎంతో శ్రమించి ఈ చిత్రాన్ని నిర్మించినట్లు చెప్పారు. ఈ చిత్రం తన పలు ఏళ్ల కల అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఆర్థికసాయం చేసిన సడైయాండి గజేంద్రన్, విశ్వైకరుప్పసామిలకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని చెప్పారు. అలాగే చిత్రం చూడకుండానే తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేయడానికి ముందుకు వచ్చిన డిస్ట్రిబ్యూటర్లు కాశీనాథన్, కన్నన్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ పగలరివాన్ అంటే పగలే తెలియని వాడు అని అర్థం అన్నారు. సంగీత దర్శకుల కు పగలు తెలియడం లేదన్నారు. వాళ్లు ఎక్కువగా రాత్రి వేళల్లోనే పని చేస్తుంటారన్నారు. ఇది ఒక రాత్రిలో జరిగే కథాంశంతో రూపొందించిన చిత్రం అని దర్శకుడు తెలిపార న్నా రు. వెట్రి మాట్లాడుతూ రచయిత కిశోర్ ద్వా రానే తనకు ఈ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందన్నారు. ఈ చిత్ర నేపథ్యసంగీతం బాగా వచ్చిందని, ఈ చిత్ర కెమెరామెన్కు మంచి భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు. -
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. కార్మికుడి మృతి
అన్నానగర్: కడంబూర్ సమీపంలో గురువారం ప్రైవేట్ బాణాసంచా ఫ్యాక్టరీలో సంభవించిన పేలుడులో ఓ కార్మికుడు మృతి చెందాడు. ఇద్దరు మహిళ లు తీవ్రంగా గాయపడ్డారు. భవనం నేల మట్టమైంది. వివరాల్లోకి వెళితే.. సేలం జిల్లా కడంబూర్ పశ్చిమ కనుమలలో నివసిస్తున్న ధనశేఖరన్ పదేళ్లు గా తన పొలంలోని తోటలో చిన్నస్థాయి 4 గదులు నిర్మించి బాణసంచా తయారీ కర్మాగారాన్ని నడుపుతున్నాడు. గురువారం బాణసంచా ఫ్యాక్టరీ మొద టి భవనంలో ధనశేఖరన్, కూలమేడు గ్రామం కడంబూర్ ప్రాంతానికి చెందిన రాజమాణికం (45), సత్య, విజయ అనే కార్మికులు పనిస్తున్నారు. సా యంత్రం 4 గంటల సమయంలో రాజమాణికం బాణసంచా కోసం ముడిసరుకులను సేకరించేందుకు మూడో భవనంలోని గోడౌన్కు వెళ్లాడు. అ ప్పుడు ఊహించని రీతిలో పేలుడు పదార్థాలు పేలడంతో భవనం నేలకూలింది. గోడౌన్లోకి వెళ్లిన రాజమాణిక్కం మృతదేహం సుమారు 100 అడుగుల దూరంలో ఉన్న మొక్కజొన్న తోట లో చెల్లాచెదురుగా పడింది. అదే సమయంలో మొదటి భవనంలో బయట పని చేస్తున్న సత్య, విజయ అనే ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి సహాయక చర్యలు ప్రారంభించారు. పేలుడు ప్రమాదంపై గెంగవల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేస్తూ, బాధితులకు అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తుందని హామీ ఇచ్చారు. -
పగటి కలలు కంటున్న కాంగ్రెస్
వేలూరు: డీఎంకే భుజంపై నుంచి కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి మాట్లాడగలదా అని తెలంగాణ, పుదుచ్చేరి మాజీ గవర్నర్ తమిళసై సౌందర్రాజన్ ప్రశ్నించారు. శుక్రవారం ఉదయం ఆమె వేలూరు శ్రీపురంలోని బంగారుగుడిని సందర్శించి పీఠంలోని స్వర్ణలక్ష్మికి ప్రత్యేక అభిషేకం చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తమిళనాడు పూర్తిగా మత్తు రాష్ట్రంగా మారిందని రానున్న రోజుల్లో శాంతి భద్రతలకు సమస్య వచ్చే పరిస్థితి ఉందన్నారు. గంజాయి విక్రయంలో రాజకీయ నాయకులకు సంబంధాలున్నాయని వీటిని అరికట్టలేని డీఎంకే ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తమిళనాడులో పూర్తిగా గంజాయి సంప్రదాయం లేకుండా చేయాలన్నారు. పోలీసులకు, గంజాయి విక్రయదారులకు సంబంధాలున్నాయని పలు సర్వేలు చెపుతున్నాయని అయితే వీటిలో అధికార పార్టీకి సంబంధం లేదా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ప్రవేశ పెట్టిన పథకాలు పూర్తిగా ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయని ఈ పథకాల వల్ల దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో లబ్ధిపొందారన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు డీఎంకే భుజంపై కూర్చొని బీజేపీ పార్టీని విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుందన్నారు. తమిళనాడులో కామరాజర్ పాలనను తీసుకొస్తామని కాంగ్రెస్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా డీఎంకే పార్టీ వద్ద తాకట్టు పెట్టి కామరాజర్ పాలనను ఏ విధంగా తీసుకొస్తారని ప్రశ్నించారు. తాము ద్రావిడ మోడల్ పార్టీలకు దూరంగా ఉన్నామని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ అఖండ మెజారిటీతో అధిక సీట్లు సాధించి అధికారాన్ని చేపట్టడం ఖాయమని అయితే కాంగ్రెస్ పగటి కలలు కనడం మానుకోవాలన్నారు. ముందుగా బంగారుగుడికి వచ్చిన ఆమెకు పీఠం సంప్రదాయం ప్రకారం ఆమెకు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం పీఠాధిపతి శక్తిఅమ్మ ఆశీస్సులు అందుకున్నారు. -
రెడ్ అలర్ట్!
● పలు జిల్లాల్లో కుండపోత వాన ● కుట్రాలంలో జల హోరు.. ●బాలుడి మృతి ● పలువురికి గాయాలు ● నీలగిరికి రావొద్దు: కలెక్టర్ విజ్ఞప్తి సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు క్రమంగా తీవ్రతరం దాల్చుతున్నాయి. పశ్చిమ కనుమల్లో కురిసిన అతి భారీ వర్షానికి కుట్రాలం జలపాతం శుక్రవారం ఉప్పొంగింది. పలువురు సందర్శకులు కొట్టుకెళ్లగా అతి కష్టంపై రక్షించారు. ఇందులో ఓ బాలుడు మృతిచెందాడు. రానున్న రోజుల్లో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలకు అవకాశాలు ఉండడంతో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో అగ్నినక్షత్రం వేళ భానుడి ప్రతాపం అధికంగా ఉంటుందని భావించినా, చివరకు అకాల వర్షం రూపంలో రాష్ట్రం చల్లబడుతోంది. పలు జిల్లాల్లో గత నాలుగు రోజులుగా తేలిక పాటి వర్షం పడుతూ వచ్చింది. గురు వారం నుంచి వర్షం తీవ్రత క్రమంగా పెరిగింది. ఈనెలాఖరులో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశాల నేపథ్యంలో రాష్ట్రంలోని కేరళ సరిహద్దులలో ఉన్న పశ్చిమ కనుమలలో వాతావరణం ఆహ్లాదంగా మారింది. పశ్చిమ కనుమలలోని కొండ కోనల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఇక్కడి జలపాతాలు, జలాశయాలలోకి నీటి రాక పెరిగింది. శుక్రవారం మధ్యాహ్నం కుట్రాలం జలపాతంలో ఒక్కసారిగా నీటి ఉధృతి పెరిగింది. ఉప్పెన వలే ఉప్పొంగిన నీటిలో సందర్శకులు కొట్టుకెళ్లారు. కొందరు అక్కడి ఇనుపరాడ్లను పట్టుకోవడంతో అతి కష్టంపై వారిని రక్షించారు. తిరునల్వేలికి చెందిన అశ్విన్(17) బాలుడు నీటి ఉధృతిలో కొట్టుకెళ్లి మృతిచెందాడు. పశ్చిమ కనుమల వెంబడి ఉన్న నగరాలు, పట్టణాలలో ఆకాశం మేఘావృతంగా ఉన్నప్పటికీ కొండ కోనల్లో భారీ వర్షాలు పడుతుండడంతో ఉత్కంఠ తప్పడం లేదు. విస్తారంగా వర్షాలు.. ఇప్పటికే పశ్చిమ కనుమల వెంబడి ఉన్న జిల్లాలలో విస్తారంగా పడుతూ వచ్చిన వర్షాలు మరింతగా పుంజుకున్నాయి. అదే సమయంలో శనివారం నుంచి నాలుగు రోజుల పాటు కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్కాశి జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు. 20న డెల్టాలలోని తంజావూరు, తిరువారూర్, పుదుకోట్టై, శివగంగై జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ ప్రకటించారు. 20 సెంమీ పైగా వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం ప్రకటనతో ఆ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తలను విస్తృతం చేశారు. నీలగిరులలో వర్షాల నేపథ్యంలో సందర్శకులకు విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్ అరుణ ప్రకటన చేశారు. మూడు రోజుల పాటు నీలగిరుల వైపుగా(ఊటీ)కి రావొద్దు అని కోరారు. కళ్లకురిచ్చిలో వర్షాలకు కల్వరాయన్ మలై కొండుకల్పేడై నదిలో నీటి ఉధృతి పెరిగింది. కెరటాలు సైతం సముద్ర తీరంలో ఎగసి పడుతుండడంతో జాలర్లు తమ పడవలను సురక్షితం చేసుకుంటున్నారు. తూత్తుకుడి, తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాల జాలర్లు ఐదు వేలకు పైగా పడవలను ఒడ్డుకు చేర్చారు. కర్ణాటక పరిసరాలలో, నీటి పరివాహక ప్రాంతాలలో వర్షాల నేపథ్యంలో కావేరి నదిలోకి నీటి రాక క్రమంగా పెరుగుతోంది. హొగ్నెకల్ జలపాతం వద్ద క్రమంగా నీటి రాక పెరగడంతో మేట్టూరు జలాశయం నిండాలని ఎదురుచూపులలో రైతులు ఉన్నారు. ప్రస్తుతం ఈ జలాశయంలో నీటి మట్టం 50 అడుగులలోపే ఉంది. వంద అడుగులు దాటిన పక్షంలో సాగుకు నీటిని విడుదల చేస్తారన్న విషయం తెలిసిందే. తాజా వర్షాలు, నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్ 12 నాటికి మేట్టూరు డ్యాంలోకి సమృద్ధిగా నీళ్లు రావాలని రైతులు వేడుకుంటున్నారు.కుట్రాలం జలపాతం -
నేతలతో స్టాలిన్ భేటీ
సాక్షి, చైన్నె: అన్నాఅరివాలయంలో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ పార్టీ ముఖ్యనేతలతో శుక్రవారం సమావేశమయ్యారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఇప్పటికే పూర్తయిన ఎన్నికలు, చివరి విడతగా జరగనున్న ఎన్నికలు అంశాల గురించి ఈ భేటీలో చర్చించారు. తమిళనాడులో క్లీన్ స్వీప్ చేస్తామన్న ధీమాను ఈసందర్భంగా నేతలు వ్యక్తంచేసినట్టు తెలిసింది. సమావేశంలో స్టాలిన్తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్, కోశాధికారి టీఆర్బాలు పాల్గొన్నారు. ఉన్నత విద్యకు ఆర్థిక సాయం తిరువళ్లూరు: ఆవడి పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీసుల పిల్లల ఉన్నత విద్య కోసం 70 మందికి రూ.10.78 లక్షల ఆర్థికసాయాన్ని కమి షనర్ శంకర్ పంపిణీ చేశారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి పోలీసు కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్స్, ఏఆర్ సిబ్బంది, ఎస్ఐ స్థాయి ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి కుటుంబంలో ఉన్నత విద్యను అభ్యసించే వారి కోసం తమిళనాడు ప్రభుత్వం ప్రతి ఏటా ప్రత్యేక నిధులను కేటాయిస్తూ వుంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఉన్నత విద్యకు ఆవడి కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీసుల కుటుంబం నుంచి ఐదుగురు మెడికల్, 17 మంది ఇంజినీరింగ్, 43 మంది ఆర్ట్స్ అండ్ సైన్సు కోర్సులు సహా 70 మంది చేరనున్నారు. వీరికి ఆవడి పోలీసు కమిషనర్ ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఉన్నత విద్యకు వెళ్లే వారు బాగా చదివి రాష్ట్రానికి, తల్లిదండ్రులకు మంచిపేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాలని కమిషనర్ సూచించారు. -
పేలుళ్లలో ముగ్గురి మృతిపై విచారణ
కొరుక్కుపేట: కారియాపట్టి సమీపంలోని జరిగిన పేలుళ్లలో ముగ్గురు మృతి చెందడంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది. వివరాల్లోకి వెళితే.. విరుదునగర్ జిల్లా కారియాపట్టి సమీపంలోని అవియూర్ కీళిఉప్పిల్కిగుండు రోడ్డులోని క్వారీలో రాజపాలయం ప్రాంతానికి చెందిన రాజ్కుమార్ అనే వ్యక్తి పేలుడు పదార్థాల నిల్వ షెడ్డును నడుపుతున్నాడు. ఈ నెల ఒకటో తేదీన ఇక్కడ జరిగిన పేలుడులో ముగ్గురు మరణించారు. ఈ విషయమై అవియూర్ పోలీసులు, షెడ్ యజమాని రాజ్కుమార్, భాగస్వాములు సేతు, రామ్జీ రామమూర్తి తదితరులపై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గిడ్డంగి లైసెనన్స్ను తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ స్థితిలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్య కార్యదర్శి కన్నదాసన్ నేతృత్వంలోని బృందం పేలుడు సంభవించిన గోడౌన్ను పరిశీలించింది. అనంతరం సమీపంలోని గ్రామస్తులు విచారించగా, క్వారీలో పే లుడు పదార్థాల నిల్వ గిడ్డంగిని అక్రమంగా నిర్వహించడంతో ప్రమాదం సంభవించింది. పేలుడు పదార్థాలు పేలడంతో రాత్రి పూట నిద్ర పట్టడం లేదని, రాతి క్వారీ, నిల్వ గోడౌన్ శాశ్వతంగా మూసివేయాలన్నారు. ఈ విషయమై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుడు కన్నదాసన్ మాట్లాడుతూ పేలుడు ఘటనపై విచారణకు హాజరైన అన్ని శాఖల అధికారులతో సమగ్ర విచారణ జరిపి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు నివేదిక అందజేస్తామని తెలిపారు. -
కులశేఖరపట్నంలో స్పేస్ పార్క్
● 1,500 ఎకరాలలో రూపకల్పన ● ఇస్రో–టిడ్కో మధ్య ఒప్పందాలు ● అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాలకు ప్రణాళిక సాక్షి, చైన్నె: అంతరిక్ష ప్రయోగాలకు ఎకై క కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటకు దీటుగా తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నంలో మరో కేంద్రం ఏర్పాటు పనులు వేగవంతం కానున్నాయి. అదే సమయంలో ఇక్కడ స్పేస్ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ఇస్రో తమిళనాడు ప్రభుత్వ పరిధిలోని టిడ్కో మధ్య అవగాహన ఒప్పందం పూర్తయ్యింది అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికా, రష్యా దేశాలకు సవాలు విసిరే స్థాయిలో భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ (ఇస్రో) దూసుకెళ్లిన విషయం తెలిసిందే. చంద్రయాన్తో పాటు పలు ప్రయోగాల విజయంతో భారత ఖ్యాతి ప్రపంచ దేశాలలో మార్మోగుతోంది. అనేక అభివృద్ధి చెందిన దేశాలు తమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు భారత్ సహాయాన్ని కోరుతున్నాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీహరికోటలోని ఇస్రో అంతరిక్ష కేంద్రానికి ప్రత్యామ్నాయంగా మరొకటి నిర్మాణానికి కేంద్రం చర్యలు తీసుకుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించింది. దక్షిణ తమిళనాడులోని తిరునెల్వేలి, తూత్తుకూడి, కన్యాకుమారి జిల్లాల్లోని సముద్ర తీర ప్రాంతాలను పరిశీలన జరిపారు. చివరకు అంతరిక్ష ప్రయోగ కేంద్రం స్థాపనకు తూత్తుకూడి జిల్లా తిరుచెందూరు– ఉడన్ కుడి సమీపంలోని కులశేఖరపట్నం అనువుగా నిర్ణయించారు. అన్ని రకాల అనుమతులు దక్కడంతో కులశేఖరపట్నంలో పనులపై ఇస్రో దృష్టి పెట్టింది. రూ. 6.24 కోట్లతో ప్రహరీ, కార్యాలయం, ఒక లాంచ్ ప్యాడ్ నిర్మాణ పనులు జరిగాయి. ఈ పనులను తరచూ ఇస్రో వర్గాలు పరిశీలించి వెళ్తున్నాయి. ఈ పరిస్థితులలో లోక్సభ ఎన్నికలకు ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం పనులకు శంకుస్థాపన చేశారు. స్పేస్ పార్క్ కసరత్తులు.. తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నం 2,300 స్థల ఎకరాల స్థలాన్ని ఇస్రోకు కేటాయించారు. ఇక్కడ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిసరాలను నిషేధిత జోన్గా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. తూత్తుకుడి– తిరుచెందూరు–కన్యాకుమారి ఈసీఆర్ మార్గాన్ని ఈ నిషేధిత జోన్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ మార్గాలలోని అనేక గ్రామాలను ఈ జోన్లోకి చేర్చారు. పూర్తిస్థాయి నిఘా వలయంలోకి ఈ పరిసరాలను తీసుకొచ్చేందుకు చర్యలు విస్తృతం చేశారు. ఈ పరిస్థితులలో ఈ అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి మరింత బలాన్ని చేకూర్చే విధంగా స్పేస్ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1,500 ఎకరాల స్థలాన్ని ఈ స్పేస్ పార్క్కు ఎంపిక చేసి, కేటాయింపు జరిగాయి. ఇక్కడ కేవలం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని సంస్థలతో రాకెట్లు, ఇతర అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన అన్ని రకాల విడి భాగాల ఉత్పత్తుల ప్రక్రియలకు పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఇస్రో– తమిళనాడు ప్రభుత్వ పరిశ్రమల మండలి (టిడ్కో) మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాల మేరకు పరిశ్రమలు, పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులను ఆహ్వానించి పెద్ద ఎత్తున అంతరిక్ష సంబంధిత అంశాలు, ఉత్పత్తుల ప్రక్రియను ఇక్కడ వేగవంతం చేయబోతున్నారు. ఈ దృష్ట్యా తూత్తుకుడి, తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండగా రాబోతున్నాయి. స్పేస్పార్క్ ఒప్పందాలపై ఇస్రో మాజీ డైరెక్టర్ మైల్స్వామి అన్నాదురై స్పందిస్తూ కులశేఖరపట్నం వేదికగా ఏర్పాటు కానున్న స్పేస్ పార్క్ తమిళనాడు రూపురేఖలను మార్చేందుకు, బలోపేతానికి మరింత దోహదకరంగా ఉంటుందన్నారు. పరిశ్రమల రాకతో ఉద్యోగ అవకాశాలు, ఏరోస్పేస్ రంగంలో ఉన్న వారికి, విద్యార్థులకు భవిష్యత్తు మరింత ఉజ్వలమయం అవుతుందన్నారు. -
తిరుత్తణి హుండీ ఆదాయం రూ.1.04కోట్లు
తిరుత్తణి: తిరుత్తణి ఆలయ హుండీ ఆదాయం రూ.1.04కోట్లు లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో భక్తులు స్వామిని దర్శించుకుని హుండీల్లో చెల్లించిన కానుకలు ఆలయ జాయింట్ కమిషనర్ రమణి ఆధ్వర్యంలో దేవర మండపంలో గురువారం లెక్కించారు. ఇందులో ఆలయ సిబ్బందితో పాటు సేవకులు పాల్గొని కానుకల లెక్కపెట్టారు. లెక్కింపులో రూ.1.04కోట్ల నగదు, 382 గ్రాముల బంగారం, 6,715 గ్రాముల వెండిని 22రోజులకుగాను భక్తులు కానుకలుగా చెల్లించినట్లు ఆలయ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అనుమతి లేని హోర్డింగ్ల తొలగింపు ● తొలిరోజు 400 బోర్డుల తొలగింపు ● అన్నింటిని తొలగించేందుకు రాధాకృష్ణన్ ఆదేశాలు సాక్షి, చైన్నె : నగరంలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన హోర్డింగ్లు, బ్యానర్ల తొలగింపునకు కమిషనర్ రాధాకృష్ణన్ ఆదేశాలు జారీ చేశారు. తొలి రోజు శుక్రవారం 400 బోర్డులు, హోర్డింగ్, ఫ్ల్లెక్సీలను తొలగించారు. ముంబైలో ఈదురు గాలుల ధాటికి భారీ హోర్డింగ్ కుప్పకూలి పది మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదాన్ని పరిగణించిన చైన్నె కార్పొరేషన్ అధికారులు ముందుజాగ్రత్తలపై దృష్టి పెట్టారు. చైన్నె నగరంలో నివాసాల డాబాల మీద, బహుళ అంతస్తుల పై భాగంలో, వివిధ ప్రాంతాల్లో ప్రకటనల హోర్డింగ్లు బోర్డులు మరీ ఎక్కువ. రాజకీయ పార్టీల ఫ్లెక్సీలకే కాదు, బర్త్డేలు, వివిధ శుభాకాంక్షల బ్యానర్లకు కొదవ లేదు. ఇందులో అనుమతి పొందకుండా ఏర్పాటు చేసినవే ఎక్కువ. దీంతో వీటన్నింటిని తొలగించాలని ఉదయాన్నే కమిషనర్ రాధాకృష్ణన్ ఆదేశించారు. దీంతో చైన్నె నగరంలో రోడ్డు పక్కగా, బస్టాప్లు, పాఠశాలలు, కళాశాలలు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన హోర్డింగ్లు, ప్రమాదకరంగా ఉన్న వాటిని తొలగించే పనిలో కార్పొరేషన్ సిబ్బంది నిమగ్నమయ్యారు. తొలిరోజు 400 బోర్డులను తొలగించారు. మరింత వేగవంతం చేసిన అన్ని చోట్ల ఉన్న హోర్డింగ్, బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిరోజూ తనిఖీలు చేయాలి వేలూరు: వేలూరు కార్పొరేషన్లోని అన్ని ప్రాంతాలకు తాగునీరు సరఫరా అవుతోందా లేదా అనే దానిపై అధికారులు ప్రతిరోజూ తనిఖీలు చేయాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. వేలూరు సైదాపేటలోని వినాయకపురంలో తాగునీటి పైప్లైన్లు, పంపింగ్ ప్రాంతంతో పాటు కార్పొరేషన్లో సేకరించే చెత్తను సేంద్రియ ఎరువులుగా తయారు చేసే గిడ్డంగిని ఆమె తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం వేసవి కాలం కావడంతో నీటి సమస్య లేకుండా చూడాల్సిన బాధ్యత కార్పొరేషన్ అధికారులపై ఉందన్నారు. పైప్లైన్ మరమ్మతులుంటే వాటిని వెంటనే పూర్తిచేయాలన్నారు. అనంతరం కార్పొరేషన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆమె తనిఖీ చేశారు. కార్పొరేషన్ కమిషనర్ జానకి, జోన్ అధికారులు వెంకటేశన్, శానిటరీ ఇన్స్పెక్టర్ శివకుమార్, లూర్దుస్వామి, రవి పాల్గొన్నారు. యువకుడు దుర్మరణం అన్నానగర్: మదురైలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇంటి పైకప్పు కూలి ఓ యువకుడు మృతి చెందాడు. మదురైలో వరుసగా మూడు రోజులుగా రాత్రి వేళల్లో భారీ వర్షం కురుస్తోంది. గురువారం మదురై అన్నానగర్, పరిసర ప్రాంతాల్లో రెండు గంటలకు పైగా భారీ వర్షం కురిసింది. ఈ స్థితిలో మడిచియం చప్పాని మదురై వైగై నదికి ఆనుకొని ఉన్న కోవిల్ వీధికి చెందిన బాలసుబ్రమణ్యం (44) గురువారం రాత్రి మంచంపై పడుకుని నిద్రపోయాడు. ఆసమయంలో భారీ వర్షం కురవడంతో ఇంటి పైకప్పు కూలి అతనిపై పడింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని మదురై రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మడిచియం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సీబీసీఐడీకి జయకుమార్ హత్య కేసు
సాక్షి, చైన్నె: తిరునల్వేలి కాంగ్రెస్ నేత జయకుమార్ మృతి కేసు పోలీసులకు సవాలుగా మారింది. ఈ కేసును సీబీసీఐడీకి బదిలీ చేయడానికి సిద్ధమయ్యారు. తిరునల్వేలి తూర్పు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జయకుమార్ అనుమానాస్పద మృతి ఛేదింపు ఆ జిల్లా పోలీసులను ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఐజీ, డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారులు సంఘటన స్థలంలో పరిశీలించినా, కేసుకు సంబంధించిన సమగ్ర అంశాలను పరిగణించినా, చిన్న ఆధారం కూడా చిక్కడం లేదు. గతంలో తిరుచ్చిలో హత్యకు గురైన మంత్రి నెహ్రూ సోదరుడు రామజయం హత్యకేసు తరహాలో ఈ కేసు కూడా మిస్టరీగా మారడం తిరునల్వేలి పోలీసులకు ముచ్చెమటలు తప్పడం లేదు. దీంతో కేసును ప్రత్యేక సిట్ ద్వారా విచారించడమా లేదా సీబీసీఐడీకి అప్పగించడమా అనే నిర్ణయానికి తిరునల్వేలి పోలీసులు వచ్చేశారు. చివరకు ఈకేసును సీబీసీఐడీకి అప్పగించేందుకు సిద్ధమయ్యారు. అధికారిక ఉత్తర్వులతో రెండు మూడు రోజుల్లో సీబీసీఐడీ వర్గాలు రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. -
కొడైకెనాల్లో వేసవి పండుగ
● ఉత్సవాలకు శ్రీకారం ● బ్రహ్మాండంగా పుష్ప ప్రదర్శన ● పది రోజుల వేడుక సేలం: కొడైకెనాల్ వేసవి ఉత్సవాలకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. వివిధ రకాల పుష్పాలతో ప్రదర్శన ప్రారంభమైంది. పది రోజుల పాటు కొడైకెనాల్లో వేడుకలు మిన్నంటనున్నాయి. రాష్ట్రంలోని పచ్చదనంతో నిండిన పర్యాటక కేంద్రాల్లో యువరాణిగా దిండుగల్ జిల్లా కొడైకెనాల్ ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వేసవి సీజన్ ఇక్కడ మిన్నంటుతోంది. ఇక్కడకు వచ్చే సందర్శకులకు ఈ పాస్ తప్పనిసరి చేశారు. లక్షలాది మంది కొడైకెనాల్ వైపు వస్తున్నారు. ఇప్పటికే పర్యాటక కేంద్రాలకు రారాజుగా ప్రసిద్ధి చెందిన నీలగిరి జిల్లా ఊటీలో వేసవి పుష్ప ప్రదర్శన మిన్నంటుతోంది. దీనిని తలదన్నే విధంగా కొడైకెనాల్లో వేసవి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ ఉత్సవాల్లో భాగంగా వందలాది రకాలతో కూడిన లక్షలాది పుష్పాలతో ప్రత్యేక ప్రదర్శన గార్డెన్స్లో ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఉద్యానవన, పర్యాటక శాఖల నేతృత్వంలో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనను ఉదయం వ్యవసాయ శాఖకార్యదర్శి అపూర్వ, ఉద్యానవన డైరెక్టర్ కుమర వేల్పాండియన్, దిండుగల్ జిల్లా కలెక్టర్ పూంకొడి ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వివిధ వర్ణాలు, వివిధ ఆకృతులతో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న పుష్ప ప్రదర్శనలను పర్యాటకులు తిలకించారు. తమిళ సంస్కృతి సంప్రదాయాల్ని చాటే విధంగా ప్రతిరోజూ ఇక్కడి పార్కులలో కార్యక్రమాలు కనువిందు చేయనున్నాయి. అలాగే, బోట్హౌస్ ప్రాంతాలతోపాటు పర్యాటకంగా కనువిందు చేసే అన్ని చోట్ల సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, మరింత ఆహ్లాదాన్ని నింపే విధంగా చర్యలు తీసుకున్నారు. సుందరంగా తీర్చిదిద్దిన అన్ని పర్యాటక ప్రదేశాలలో వేసవి పండుగ పది రోజులపాటు మిన్నంటనున్నది. పడవల పోటీలకు సైతం ఏర్పాట్లు చేశారు. సంగీత, సాంస్కృతిక ఉత్సవాలతో సందర్శకులను ఉర్రూతలుగిస్తున్నారు. -
బాలుడిపై పోక్సో చట్టం
కొరుక్కుపేట: బాలికను గర్భవతి చేసిన ఓ బాలుడిపై పోలీసు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. చైన్నె రాయప్పేట ముత్తయ్య గార్డెన్ వీధికి చెందిన 16 ఏళ్ల బాలిక గత రాత్రి వాంతులు చేసుకుని స్పృహతప్పి పడిపోయింది. వెంటనే బాలికను ఆటోలో వెంటనే రాయపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు చికిత్స చేశారు. అనంతరం బాలిక ను పరీక్షించగా 2 నెలల గర్భిణి అని తేలింది. వెంటనే కిల్పాక్కం ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్చి, వైద్యం చేయిస్తున్నారు. అక్కడ బాలిక పిండాన్ని తొలగించి ఇంటికి తిరిగి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని కీల్పాక్కం ప్రభుత్వాస్పత్రి యాజమాన్యం చైన్నె జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు సమాచారం అందించింది. పిండాన్ని తొలగించిన బాలికను, ఆమె తల్లిని బాలకుమార్ విచారించారు. ఆ సమయంలో 2024 జనవరి ఒకటో తేదీన అదే ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలుడితో లైంగిక సంబంధం పెట్టుకుని బాలిక గర్భం దాల్చినట్లు తేలింది. అదే సమయంలో బాలిక తల్లి ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు చేయకపోగా కప్పిపుచ్చడంతో జిల్లా శిశు సంక్షేమ అధికారి బాల కుమార్ గురువారం రాయపేట మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చల్లంగా చూడు తల్లీ!
అమ్మా.. గంగమ్మ తల్లీ.. చల్లంగా చూడు అంటూ భక్తులు ప్రార్థించారు. జాతరలో భాగంగా మూడోరోజు శుక్రవారం తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ దర్శనానికి పోటెత్తారు. తోటి వేషాలు ధరించి మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబసమేతంగా ఆలయ ఆవరణలో పొంగళ్లు పొంగించి నైవేద్యం సమర్పించారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని సేవించుకుని తన్మయత్వం చెందారు. ఈ క్రమంలో నాలుగోరోజు శనివారం కై కాల, రజక కులస్తులు అనువంశిక వేషాలతో పురవీధుల్లో సంచరిస్తూ పూజలందుకోనున్నారు. అనంతరం గంగమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకోనున్నారు. – తిరుపతి కల్చరల్ -
నటుడు కార్తీక్ కుమార్పై విచారణకు ఆదేశాలు
తిరువొత్తియూరు: ఎస్టీలను తక్కువ చేసి మాట్లాడిన నటుడు కార్తీక్ కుమార్పై విచారణ చేపట్టాలని జాతీయ ఎస్టీ వర్గ కమిషనర్ డైరెక్టర్ ఎస్ రవివర్మన్ ఆదేశాలు జారీ చేశారు. నటుడు కార్తీక్ కుమార్ తన మాజీ భార్యతో మాట్లాడిన సమయంలో ఎస్సీలను తక్కువ చేసి మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డాక్టర్ అంబేడ్కర్ ప్రజా సంఘం కార్యదర్శి, పుదుకోటకు చెందిన ఇలా మురుగ ముత్తు జాతీయ ఎస్టీ కమిషనరేట్ తమిళనాడు– పుదుచ్చేరి డైరెక్టర్ ఎస్ రవివర్మన్కు ఫిర్యాదు చేశారు. ఆయన మాటలు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారి మనోభావాలను దెబ్బతీసే రీతిలో ఉన్నాయని అతనిపై చర్య తీసుకోవడానికి కమిషనర్ ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదును జాతీయ ఎస్టీ వర్గ కమిషనర్ డైరెక్టర్ ఎస్ రవివర్మన్ సైబర్ క్రైం ఏడీజీపీకి పంపించారు. సుమారు 15 రోజుల్లో ఈ ఘటనపై విచారణ జరిపి తగిన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. -
రూ.కోటి మోసం
● ఫైనాన్స్ కంపెనీపై ఫిర్యాదు వేలూరు: అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి రూ.కోటి మోసం చేసిన ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వేలూరు జిల్లా గుడియాత్తంకు చెందిన బాధితులు శుక్రవారం వేలూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఫిర్యా దులో గుడియాత్తంలో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నడుస్తోంది. ఇక్కడ పెట్టుబడి పెడితే ప్రతినెలా అధిక వడ్డీ వస్తుందని ఏజెంట్ల ద్వారా ఆశ చూపించారు. నమ్మిన కొందరు రూ. కోటి దాకా పెట్టుబడులు పె ట్టారు. వడ్డీని కొన్ని నెలల వరకు ఇచ్చారు. జనవరి నుంచి వడ్డీ ఇవ్వకుండా నిలిపి వేశారని బాధితులు పలుమార్లు ఫైనాన్స్ కంపెనీ వద్దకు వెళ్లి నిలదీశారు. అయినా ఇవ్వకపోవడంతో చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మందు కలిపిన పాలు తాగి బాలుడి మృతి కొరుక్కుపేట: మాత్రలు కలిపి పాలు తాగి బాలుడు మృతి చెందిన సంఘటన విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే.. ఈరోడ్ జిల్లా బాగోదల్ ప్రాంతానికి చెందినవారు పళనిస్వామికి గౌతమ్ (16) కుమారుడు ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం గౌతమ్ని అత ని స్నేహితులు తీసుకెళ్లారు. అనంతరం పాలలో మత్తు మాత్రలు కలిపి ఇచ్చారు. దీంతో స్పృహ తప్పిన గౌతమ్ను చికిత్స నిమిత్తం ఈరోడ్ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి చికిత్స నిమిత్తం ఈనెల 11వ తేదీన సేలం ప్రభుత్వాస్ప త్రిలో చేర్పించారు. గత రాత్రి గౌతమ్ ఇంటెన్సివ్ కేర్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పక్ కూడల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధుల కోసం క్యాథ్ ల్యాబ్ సాక్షి, చైన్నె: ఆదంబాక్కలోని గెరికేర్ ఆస్పత్రిలో సీ నియర్ సిటిజన్ల కోసం సరికొత్త క్యాథ్ల్యాబ్ను ఏ ర్పాటు చేశారు. దీనిని శుక్రవారం గెరికేర్ హెల్త్ సర్వీసెస్ ఎండీ డాక్టర్ లక్ష్మీపతి రమేష్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండీ పీఎన్ వాసుదేవన్ ప్రా రంభించారు. వారు మాట్లాడుతూ వృద్ధులకు అబ్లేషన్, యాంజియోగ్రామ్, యాంజియో ప్లాస్టి, పేస్ మేకర్స్ పరిశోధనల కోసం క్యాథ్ ల్యాబ్ను ప్రారంభించామని వివరించారు. దేశంలోనే ఇది తొలి ల్యా బ్ అని, దీన్ని చైన్నెలోని వృద్ధులకు అంకితం చేస్తున్నామన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల : శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు అన్ని నిండిపోవడంతో భక్తుల క్యూ శిలాతోరణం వరకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 76,369 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 41,927 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి కి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.63 కో ట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భ క్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లే ని వారికి 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనమవుతోంది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్మెంట్ డే 4th June (ఫొటోలు)
మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
ఉత్తర భారతానికి హీట్వేవ్ అలర్ట్
రూ.45 లక్షల బీఎండబ్ల్యూ బైక్ - పూర్తి వివరాలు
మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
తొక్కుతూ నడిపే మూడు చక్రాల కారు!
అప్పుడు చెత్త కుప్పలో దొరికింది...ఇపుడు ఘనత కెక్కింది!
పాలరాతి శిల్పంలాంటి స్టయిల్, కళ్లతోనే కనికట్టు: ఎవరీ ముద్దుగుమ్మ (ఫొటోలు)
యాపిల్ కొత్త ఫీచర్.. కంటి చూపుతోనే ఆపరేటింగ్
తప్పక చదవండి
- ఉత్తర భారతానికి హీట్వేవ్ అలర్ట్
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- 'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
- 47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
- కిర్గిజిస్తాన్లో ఘర్షణ: భారతీ విద్యార్థులకు కేంద్రం అలెర్ట్
- BCCI: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఐపీఎల్-2025లో..
- ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
Advertisement